ఒలింపిక్స్ లో భారత రెఫరీ.. | Indian Wrestling Referee Creates History, to Officiate in 2016 Rio Olympic Games | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్ లో భారత రెఫరీ..

Published Sun, Dec 27 2015 4:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

ఒలింపిక్స్ లో భారత రెఫరీ..

ఒలింపిక్స్ లో భారత రెఫరీ..

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బ్రెజిల్ లోని జరుగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన అశోక్ కుమర్ రిఫరీగా ఎంపికయ్యాడు. దీంతో అశోక్ కుమార్ ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి భారతీయ రెజ్లింగ్ రిఫరీగా స్థానం సంపాదించాడు. యునైటెట్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్యూడబ్యూ) మ్యాచ్ ల నిర్వహణలో భాగంగా సూపర్ వైజర్లు, సలహాదారులను కలుపుకుని మొత్తంగా 50 మందిని ఎంపిక చేసింది.

 

వీరిలో తొమ్మిది మందికి ఆసియానుంచి చోటు లభించగా, వారిలో అశోక్ కుమార్ ఒకరు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వారెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఈ ఏడాది లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పనితీరును పరిగణనలోకి తీసుకుని రిఫరీల ఎంపిక జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement