గుజరాత్ విజయలక్ష్యం 144 | Mumbai Indians 143/8 versus gujarat lions | Sakshi
Sakshi News home page

గుజరాత్ విజయలక్ష్యం 144

Published Sat, Apr 16 2016 9:46 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

గుజరాత్ విజయలక్ష్యం 144 - Sakshi

గుజరాత్ విజయలక్ష్యం 144

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ముంబై ఇండియన్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టు ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్లలో పార్థీవ్ పటేల్(34) మెస్తరుగా రాణించగా, రోహిత్ శర్మ(7)విఫలమయ్యాడు.

 

ముంబై మిగతా ఆటగాళ్లలో బట్లర్(16),అంబటి రాయుడు(20),టిమ్ సౌతీ(25), కృణాల్ పాండ్యా(20 నాటౌట్)లు మాత్రమే రెండంకెల మార్కును చేరడంతో  ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కులకర్ణి, తాంబేలు తలో రెండు వికెట్లు సాధించగా, బ్రేవో, జకాతిలకు చెరో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement