ఆసిస్ విజయ లక్ష్యం 143 | New Zealand set 143 target for ausies | Sakshi
Sakshi News home page

ఆసిస్ విజయ లక్ష్యం 143

Published Fri, Mar 18 2016 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

ఆసిస్ విజయ లక్ష్యం 143

ఆసిస్ విజయ లక్ష్యం 143

ధర్మశాల:
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాలలో హెచ్.పి.సి.ఎ స్టేడియంలో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆసిస్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

ఓపెనర్లు గప్టిల్ 39(27బంతులు), విలియమ్సన్ 24 (20)లు మందు నుంచే దూకుడుగా ఆడి కివీస్ స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు 61 పరుగుల భాగస్వామ్యంతో శుభారంబాన్నిచ్చారు. అనంతరం వీరిద్దరూ వెనువెంటనే ఔటవ్వడంతో రన్ రేట్ ఓక్కసారిగా తగ్గిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారిలో ఇలియట్ 27(20 బంతులు) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది.
మాక్స్ వెల్, ఫాల్కనర్‌లు తలా రెండు వికెట్లు తీయగా, వాట్సన్, మార్ష్‌లకు చెరో వికెట్ లభించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement