new zeland
-
ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(Sophie Devine) ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యారు. డొమాస్టిక్ క్రికెట్కు కొంత కాలంగా దూరంగా ఉండాలని డివైన్ నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అయితే సోఫీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది డబ్ల్యూపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలుచుకోవడంలో డివైన్ది కీలక పాత్ర.2024 డబ్ల్యూపీఎల్ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన డివైన్.. 136 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ ఏడాది సీజన్కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఇక ఈ స్టార్ ఆల్రౌండర్ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ హెడ్ లిజ్ గ్రీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు."ఆటగాళ్ల ఫిట్నెస్, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా హై పెర్ఫార్మెన్స్ యూనిట్ స్టాఫ్ నుంచి సోఫీకి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని మేము భావిస్తున్నాము. సోఫీకి ఇప్పుడు విశ్రాంతి ఎక్కువగా లభిస్తుంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్కు సానుకూల ఆంశమని" గ్రీన్ వెల్లడించారు.కాగా డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో బరోడా వేదికగాగుజరాత్ జెయింట్స్తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ టోర్నీకి వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) ఆతిథ్యమివ్వనున్నాయి.డబ్ల్యూపీఎల్-2025 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, , రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్ (యూపీ వారియర్స్ నుంచి ట్రేడ్).చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్దీప్ -
న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్కప్ తర్వాత?
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ తర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనట్లు డివైన్ ప్రకటించింది. వన్డేల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగనున్నట్లు సోఫీ తెలిపింది.తన వర్క్లోడ్ను తగ్గించుకునేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. కాగా డివైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండువ మహిళ క్రికెటర్గా ఆమె కొనసాగుతోంది. డివైన్ ఇప్పటివరకు 135 టీ20లు ఆడి 3268 పరుగులు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రంలో తన మార్క్ను డివైన్ చూపించలేకపోయింది. తన సారథ్యంలో ఇప్పటివరకు 56 టీ20లు న్యూజిలాండ్.. 25 మ్యాచ్ల్లో విజయం సాధించగా, 28 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది."రెండు ఫార్మాట్లలో వైట్ ఫెర్న్ల(న్యూజిలాండ్ మహిళల జట్టు)కు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కెప్టెన్సీతో అదనపు పనిభారం పడుతోంది. దాన్ని నేను ఆస్వాదించాను. కానీ కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా ఉంటుంది. కెప్టెన్సీ కారణంగా నా వ్యక్తిగత ప్రదర్శనలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. రెండూ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. దీంతో టీ20 కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నా ఆటపై మరింత దృష్టి సారిస్తాను.కొత్తగా ఎవరు జట్టు బాధ్యతలను చేపట్టిన వారికి అన్నిరకాలగా సపోర్ట్గా ఉంటాను. అయితే వన్డేల్లో మాత్రం సారథిగా కొనసాగుతున్నాను. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి మరి కొంత సమయం పడుతోందని" ఓ ప్రకటలో డివైన్ పేర్కొంది. -
సడెన్గా విమాన ప్రయాణం క్యాన్సిల్ : పాపం ఆ జంట!
ఓ జంట సరదాగా గడిపేందుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అనుకోని విధంగా భయానక వ్యాధి బారినపడటం సడెన్గా తిరిగొచ్చాయల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అయితే సదరు విమానయాన సంస్థ ఆ జంట నుంచి నిర్థాక్షిణ్యంగా లక్షల్లో చార్జీలు వసూలు చేసింది. వారి పరిస్థితి ఇది అని వేడుకున్న ససేమిరా అంది విమానాయన సంస్థ. పాపం ఆ దంపతులుకు ఆ వ్యాధి వచ్చినందుకు బాధపడాలో లేక ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు అయ్యినందుకు బాధపడాలో తెలియని స్థితి ఎదురయ్యింది. ఈ చేదు ఘటన న్యూయార్క్ దంపతులకు ఎదురయ్యింది. జనవరిలో టోడ్(60) ప్యాట్రిసియా కెరెక్స్(70) దంపతులు జనరిలో న్యూయార్క్ నుంచి ఆక్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ న్యూజలాండ్లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ వరకు అక్కడే ఆక్లాండ్లోనే గడపాలని అనుకున్నారు. అయితే ఆరువారాలకే ప్యాట్రిసియా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు పిత్తాశయం క్యాన్సర్ ఉందని నిర్థారణ అయ్యింది. నాలుగు నెలల కంటే ఎక్కువ బతకదన్నా విషాదవార్త ఆ దంపతులను నిలువున కుంగదీసింది. పైగా వెంటనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేయాలని ఫ్యామిలీ డాక్టర్ కూడా సూచించడంతో తిరిగి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది ఆ జంట. అందుకోసమని తాము ముందుగా బుక్ చేసిన విమాన టికెట్లను క్యాన్సిల్ చేసి రీ షెడ్యూల్ చేయామని సదరు విమానయాన సంస్థను కోరారు. అయితే సదరు విమానాయన సంస్థ రిటర్న్ టికెట్లు ధర ఏకంగా రూ. 18 లక్షలు దాక అవుతుందని స్పష్టం చేసింది. షాక్కి గురయ్యిన ఆ దంపతులు తమ పరిస్థితిని వివరించి వేడుకున్నారు. టోడ్ తన భార్య అనారోగ్య పరిస్థితి కారణంగా తమ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నామని విమానాయన అధికారులకు తెలిపారు. ఇంతటి విషాదంలో ఇంతలా ఆర్థిక భారం మోపొద్దని ఎంతలా అభ్యర్థించినా సదరు విమానయాన అధికారులు అంగీకరించ లేదు. అయినా ఒక కస్టమర్ అనారోగ్య రీత్యా లేదా అనుకోని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చేయాల్సి వస్తే ఉండే కస్టమర్ ఎమర్జెన్సీ పాలసీని వర్తింపచేయొచ్చు. అయితే అధికారులు ఆ పాలసీని ఫాలో అవ్వకపోగా వేరే విమాన టికెట్లు బుక్ చేయాలంటే కనీసం రూ. 6.5 లక్షలు చెల్లించక తప్పదని తెగేసి చెప్పేసింది ఎయిర్ న్యూజిలాండ్. పాపం ఆ దంపతులు హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా అంతమొత్తం చెల్లించి వెనక్కి వచ్చేశారు. అసలు న్యూజిలాండ్ వాసులు ఇంత కఠినంగా వ్యవహిరస్తారని మాకు తెలియదు అన్నారు ఆ దంపతులు. ఇది న్యూజిలాండ్ స్థాయికి తగని పని అని ఆవేదనగా చెప్పారు ఆ దంపతులు. ఇలాంటి విపత్కర స్థితిలో ఇంతలా వసూలు చేయడం అనేది ఏవిధంగా చూసిన సరైనది కాదన్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలుసుకున్న ఎయిర్ న్యూజిలాండ్ వెంటనే స్పందించి వారికి క్షమాపణలు చెప్పింది. వేరే విమాన టిక్కెట్లు బుక్ చేసేందుకు అయ్యిన అదనుపు టిక్కెట్లు ఖర్చులను కూడా వాససు ఇస్తామని స్పష్టం చేసింది. నిజానికి ఒక కస్టమర్కి ఏదైన విపత్కర పరిస్థితి ఎదురయ్యితే చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసి మరోక విమానంలో ప్రయాణించేలా చేసే వెసులబాటు ఉందని చెప్పడమే గాక ఆ దంపతులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాని పేర్కొంది. పైగా మరోసారి క్షమాపణలు చెప్పింది ఎయిర్ న్యూజిలాండ్. బస్, ట్రెయిన్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు పోయినా అంత భయం అనిపించదు కానీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెసులుబాటు ఉంటుందిగానీ లేదంటే ఖర్చులు తడిసిమోపడవ్వడం గ్యారంటీ. (చదవండి: బట్టతలపై జుట్టు పెరిగెలా చెయ్యొచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వ్యవసాయం చేస్తూ మోడలింగ్ చేస్తున్న మహిళ!
వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్లో ఉండే మోడల్లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు. ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్లా డ్రస్లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్లైన్లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్లైన్లో కంటంట్ క్రియటర్గా డబ్బులు కూడా సంపాదిస్తోంది. వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రాంలోనూ టిక్టాక్లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
ఎవరీమె? ఆమె స్పీచ్కి..పార్లమెంటే దద్దరిల్లింది!
పార్లమెంట్లో ఒక మహిళా రాజకీయవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచేలా శక్తిమంతంగా తన గళం వినిపించింది. అదికూడా స్థానిక భాషల కోసం పార్లమెంట్లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవ్వడమే గాక మాతృ భాషలో పార్లమెంటే దద్దరిల్లేలా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? దేని గురించి అంతలా శివంగిలా మాట్లాడింది. ఈ ఘటన న్యూజిలాండ్లో చోటు చేసకుంది. ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఆమె పేరు హనా-రౌహితీ మైపి-క్లార్క్. కేవలం 21 ఏళ్ల వయసులోనే పార్లమెంట్కి ఎన్నికై రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గతేడాది అక్టోబర్లో పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఆమె న్యూజిలాండ్లోని మావోరి కమ్యూనిటీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాదు ఆ మావోరిల కమ్యునిటీ గార్డెన్ను కూడా మైపీ క్లార్క్ నడుపుతోంది ఏం మాట్లాడారంటే.. ఆ ఉద్వేగభరిత ప్రసంగంలో..తాను ఓటర్లకు "మీ కోసమే బతుకుతాను", "మీ గురించే చనిపోతానని" వాగ్దానం చేశాను. మా మావోరి తెగ తరతరాలుగా చాలా వెనుకబడి ఉంది. వారంతా తమ మాతృభాష నేర్చుకోవడం కోసం ఆర్రులు చాచి చూస్తోన్నారు. కనీసం తమ గుర్తింపుని కూడా చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ తాము వెనకబడిపోయే ఉన్నాం. అంతేగాదు నన్ను నేను ఎప్పటికీ రాజకీయ నాయకురాలి చూడనని. కేవలం మావోరి భాష సంరక్షకురాలిగా భావిస్తాను ఎందుకంటే రాబోయే తరాలకు ఈ స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది. నిజానికి ఈ పార్లమెంట్లో ప్రవేశించే ముందు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదన్నారు. కానీ నేను ఈ ఛాంబర్లో చెప్పిన ప్రతిదాన్ని వ్యక్తిగతం తీసుకోకుండా ఉండలేను. జస్ట్ రెండు వారాల్లో ఈ ప్రభుత్వం నా ప్రపంచం(మావోరి) మొత్తంపై దాడి చేసింది. ఎంతలా అంటే ఆరోగ్యం, పర్యావరణం, నీరు, వెన్యువా, సహజవనరులు, మావోరి వార్డులు, వారి భాష, ఉనికి అన్నింటిని లాగేసుకుంది. ఈ దేశంలో మాకైనా, మీకైనా ఒక దేశ పౌరులుగా అన్ని హక్కులను సద్వినియోగించుకునే హక్కు ఉంది కదా! అంటూ తన మాతృ భాషలో పార్లమెంట్ని గడగడలాడించేలా మాట్లాడింది. దీంతో ఆమె ప్రసంగం వీడియో ఓ సంచలనంగా మారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఆమె తాతా తైతిము మైపి కూడా మావోరి కార్యకర్తే. New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke — Enez Özen | Enezator (@Enezator) January 4, 2024 (చదవండి: మహిళా భద్రతలో టాప్.... చెన్నై!! హైదరాబాద్ స్థానం...??) -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
వైఎస్సార్ 14వ వర్థంతి: న్యూజిలాండ్లో రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్), ఆనంద్ ఎద్దుల(రీజినల్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్లో ఆక్లాండ్లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో
క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్ బాగా పాపులర్ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్లోకి వస్తున్నారు. అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతుంటారు. షోయబ్ అక్తర్ లాంటి పాక్ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్ మాజీ బౌలర్ క్రిస్ మార్టిన్. క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ మార్టిన్ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్ హడ్లీ, డానియెల్ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన బౌలింగ్తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్గా క్రిస్ మార్టిన్ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్ చేసిన ఘనత క్రిస్ మార్టిన్ సొంతం. ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్ మార్టిన్ క్రికెట్లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్ మార్టిన్ తన పోస్ట్ రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేలోపే న్యూజిలాండ్లోని ఈస్ట్బోర్న్లో ''Four Square'' పేరుతో సూపర్మార్కెట్ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్స్టోర్గా మార్చాడు. ఫుడ్స్టఫ్ సహా మార్కెట్లో అవసరమైన అన్ని రకాల రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. He took 233 Test wickets for New Zealand - the third highest of all-time for the Blackcaps, but only scored 123 runs in 71 matches! Happy Birthday to Chris Martin! pic.twitter.com/WAzVuktrNO — ICC (@ICC) December 10, 2017 చదవండి: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న! SL Vs PAK 1st Test: లంక కీపర్ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్లు..
ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2023 మెగా సమరానికి మరో 99 రోజుల కౌంట్డౌన్ మిగిలి ఉంది. నాలుగోసారి వన్డే వరల్డ్కప్కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా పెవరెట్గా కనిపిస్తోంది. పుష్కరకాలం కిందట ధోని సేన స్వదేశంలో ప్రపంచకప్ను కొట్టి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తాజాగా మరోసారి వరల్డ్కప్కు మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో రోహిత్ సేన ఆ మ్యాజిక్ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మంగళవారం ఐసీసీ.. వరల్డ్కప్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం పది వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో 48 లీగ్ మ్యాచ్లు సహా రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనుంది. మొదటి సెమీఫైనల్కు ముంబై.. రెండో సెమీఫైనల్కు కోల్కతా.. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక టీమిండియా తొమ్మిది వేదికల్లో(హైదరాబాద్ మినహా) వివిధ జట్లతో మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లు ఆడేందుకు దేశం మొత్తం మీద ప్రధాన నగరాల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు(9700 కిమీ) ప్రయాణం చేయనుంది. ఇందులో చిన్నజట్లతో మ్యాచ్లు మినహాయిస్తే భారత్ ఎదుర్కొనే ఐదు ప్రధాన ప్రత్యర్థులు, ఎక్కడ మ్యాచ్ ఆడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐదు ప్రధాన జట్లతో ఆడబోతున్న మ్యాచ్ల్లో పిచ్లు టీమిండియాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో జట్టుకు ఒక్కో పిచ్ను రూపొందించనుండడం విశేషం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(అక్టోబర్ 8, చెన్నై వేదికగా) ఈ మెగా సమరంలో టీమిండియా ఆడబోయే తొలి మ్యాచ్లో ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అప్పటికి చలికాలం సీజన్ ప్రారంభం అవుతుంది. రెండో బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చాన్స్ ఉండడంతో ఇక్కడ ఏ జట్టైనా తొలి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీన్నిబట్టి చెన్నై పిచ్ కాస్త స్లగిష్గా ఉండే అవకాశముంది. ఇక 1987 నుంచి టీమిండియా చిదంబరం స్టేడియంలో 14 మ్యాచ్లాడి ఏడు మ్యాచ్ల్లో గెలిచింది. ఇందులో నాలుగు విజయాలు ఈ దశాబ్దంలో వచ్చినవే. గతేడాది ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఇక స్టేడియంలో పలు మార్పులు చేస్తున్నారు. స్టేడియం ఫ్లడ్లైట్స్ను ఎల్ఈడీ వెలుగులతో నింపుతున్నారు. ఇక మ్యాచ్కు రెండు ఎర్రమట్టి పిచ్లను తయారు చేస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్(అక్టోబర్ 15, అహ్మదాబాద్) వరల్డ్కప్లో అన్ని మ్యాచ్లు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క మ్యాచ్ మరొక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. లక్షా 30వేల మంది కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో భారత్, పాక్ జరిగే రోజున స్టేడియం సామర్థ్యానికి మించి జనం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్పీ రేటింగ్లు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మ్యాచ్లో విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ఇక పిచ్ను ప్లాట్గా రూపొందిచే ప్రక్రియలో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్లో పరుగుల వర్షం రావాలని.. బ్యాటింగ్కు అనుకూలించేలా పిచ్ను తయారు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్రమోదీ స్టేడియం స్పిన్నర్లకు అనువుగా ఉంటుంది. అయితే ఈసారి ఎర్రమట్టి బదులు నల్లమట్టిని పిచ్కు వాడనున్నారు. దీంతో కాస్త లోబౌన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువమేరకు ప్లాట్గానే రూపొందించనున్నారు. అంటే చిరకాల ప్రత్యర్థుల పోరులో పరుగుల సునామీని చూసే అవకాశం ఉంటుంది. 1984 నుంచి టీమిండియా ఇక్కడ 18 మ్యాచ్లు ఆడితే 10 విజయాలు సాధించింది. 2021లో ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు మార్చారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(అక్టోబర్ 22, ధర్మశాల) దేశంలో అతిచిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటిగా ఉంది. ఇక్కడి బౌండరీ లైన్ చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక్కడి పిచ్ పేసర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే న్యూజిలాండ్తో ఆడబోయే మ్యాచ్కు నల్లమట్టిని ఉపయోగించి పిచ్ను రూపొందించనున్నారు. బ్యాటింగ్ ట్రాక్కు అనుకూలమైనప్పటికి మ్యాచ్ రోజు ఎండ ఉంటే పరుగులు బాగానే వస్తాయి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. మన దేశంలో కొత్త స్టేడియాల్లో ఒకటిగా ఉన్న ధర్మశాలలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడితే రెండు గెలిచి.. రెండింట ఓడింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(అక్టోబర్ 29, లక్నో) ఐపీఎల్ సమయంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో పెద్దగా పరుగుల వరద పారింది లేదు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్తో మ్యాచ్కు స్పిన్ ట్రాక్నే కంటిన్యూ చేయనున్నారు. ఇక్కడ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మ్యాచ్లో ప్రొటీస్ ఓడిపోయింది. ఇక్కడి పిచ్ ప్రభావం కారణంగా జట్లు స్కోర్లు 250 నుంచి 270 మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిచ్పై నల్లమట్టిని ఉపయోగించనున్నారు. ఎక్కువగా స్పిన్నర్లు ప్రభావం చూపించే మ్యాచ్లో పేసర్లకు అనువైన బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(నవంబర్ 5, కోల్కతా) అహ్మదాబాద్ తర్వాత కెపాసిటీలో, స్టేడియం సామర్థ్యంలో రెండో అతిపెద్ద స్టేడియం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మెగాటోర్నీలు ఎప్పుడు జరిగినా నాకౌట్ మ్యాచ్ల్లో ఒక్కటైనా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. పైగా ఈడెన్ గార్డెన్స్లో టీమిండియాకు సూపర్ రికార్డు ఉంది. ఆడిన 22 మ్యాచ్ల్లో 13 మ్యాచ్లు గెలిచింది. 2011 నుంచి 2017 వరకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందితే.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్పై అటు పేసర్లకు.. ఇటు స్పిన్నర్లకు సమానపాత్ర ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చదవండి: వన్డే వరల్డ్కప్-2023 మ్యాచ్లు ఎలా జరుగుతాయంటే..? ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న ప్రపంచంలోనే తొలి పక్షి ఏంటో తెలుసా!
పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్లు వంటి ఉండవు. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా కూడా నిలిచింది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని అడ్వెంచర్ పార్క్లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఐతే ఎందువల్ల ఈ సమస్యను ఎదర్కొంటుందనేది తెయకపోవడంతో దానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్కి ఎంఆర్ఐ స్కాన్ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. ఈ పరీక్షల తదనంతరం నెమ్మదిగా బ్యాలెన్స్ అవ్వడం, మిగతా పెంగ్విన్ పక్షుల మాదిరి చకచక నడవడం వంటివి చేయగలుగుతోంది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అడ్వెంచర్ పార్క్ పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్న తొలిపక్షి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువుల తోపాటు అభయరణ్యాలు, పార్క్ల్లో పెరిగే జంతువులు వంటి వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు వైద్యులు. (చదవండి: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు) -
చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం
అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్ అంతర్జాతీయ టి20 మ్యాచ్లో ఒక మహిళ ఫీల్డ్ అంపైర్గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్కు చెందిన మహిళా అంపైర్ కిమ్ కాటన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్.. మరో అంపైర్ వేన్ నైట్స్తో కలిసి ఫీల్డ్ అంపైరింగ్ చేసింది. అయితే కిమ్ కాటన్ గతంలో న్యూజిలాండ్, భారత్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్కు థర్డ్ అంపైర్ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్లో తొలిసారి ఫీల్డ్ అంపైరింగ్ చేసిన కిమ్ కాటన్ తన పేరును క్రికెట్ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్గా కిమ్ కాటన్ పేరిట చాలా రికార్డులున్నాయి. 2020లో మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టి20 వరల్డ్కప్ ఫైనల్కు ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్గా కిమ్ కాటన్ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్కప్లతో పాటు వన్డే వరల్డ్కప్లోనూ అంపైర్గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్కప్ ఫైనల్స్లో ఫీల్డ్ అంపైర్గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్గా 2018 నుంచి కిమ్ కాటన్ 54 టి20 మ్యాచ్లతో పాటు 24 వన్డేల్లో అంపైర్గా విధులు నిర్వర్తించింది. ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. History today for umpire Kim Cotton who becomes the first female umpire to stand in a men’s international match between two @ICC full member countries 🤝#NZvSL #CricketNation pic.twitter.com/EI8C1RJt4d — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే -
సిరీస్ ఓటమి.. వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించని లంక
న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఓటమి పాలయ్యింది. హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే వర్షార్పణం అయింది. ఇక కీలకమైన మూడో వన్డేలో ఓడిన లంక సిరీస్ కోల్పోవడంతో పాటు ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో లంక నేరుగా వన్డే వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యే అవకాశం చేజార్చుకుంది. ఇక జూన్లో జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో లంక పాల్గొంటుంది. అక్కడ గెలిచే మ్యాచ్ల ఫలితాలను బట్టి వరల్డ్కప్ అర్హతకు అవకాశం ఉంటుంది. పొరపాటున క్వాలిఫయర్స్లో గనుక ఓడిపోతే లంక వన్డే వరల్డ్కప్ కథ ముగిసినట్లే. ఇక వన్డే వరల్డ్కప్ ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ సహా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించాయి. ఇక శ్రీలంక రేసు నుంచి అవుట్ అయింది. దీంతో జూన్లో వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి 41.3 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. పాతుమ్ నిస్సాంక(64 బంతుల్లో 57 పరుగులు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. చివర్లో కెప్టెన్ షనక(31 పరుగులు), కరుణరత్నే(24 పరుగులు) చేయడంతో లంక కనీసం 150 పరుగుల మార్క్ను దాటగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో డారిల్ మిచెల్, షిప్లే, మాట్ హెన్రీలు తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది. 32.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. విల్ యంగ్(113 బంతుల్లో 86 నాటౌట్, 11 ఫోర్లు), హెన్రీ నికోల్స్(52 బంతుల్లో 44 నాటౌట్, 5 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక బౌలర్లలో లాహిరు కుమారా రెండు వికెట్లు తీయగా.. దాసున్ షనక, కాసున్ రజితలు చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ 2-0తో గెలుచుకుంది. విల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకోగా.. హెన్రీ షిప్లేను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరగనుంది. తొలి టి20 మ్యాచ్ను కివీస్, లంకలు ఏప్రిల్ 2న ఆక్లాండ్ వేదికగా ఆడనున్నాయి. Henry Nicholls seals the win and a 2-0 series victory! Catch up on all scores at https://t.co/3YsfR1YBHU or the NZC app 📲 #NZvSL #CricketNation pic.twitter.com/URvebSkaBl — BLACKCAPS (@BLACKCAPS) March 31, 2023 చదవండి: IPL 2023 GT Vs CSK: అహ్మదాబాద్లో భారీ వర్షం.. మ్యాచ్ జరుగుతుందా? -
టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు
శ్రీలంక బౌలర్ లాహిరు కుమారా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. లంక తరపున టెస్టు క్రికెట్లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో లాహిరు కుమారా తొలిస్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఎకానమి పరంగా అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో లాహిరు కుమారా 25 ఓవర్లు బౌలింగ్ వేసి 164 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకముందు కాసున్ రజిత ఇదే న్యూజిలాండ్పై 34 ఓవర్లలో 144 పరుగలిచ్చి ఒక్క వికెట్ తీయకపోవడం అనేది అత్యంత చెత్త రికార్డుగా ఉంది. తాజాగా లాహిరు కుమారా దానిని సవరించాడు. లాహిరు, కాసున్ రజిత తర్వాత ఆశోక డిసల్వా 56 ఓవర్లలో 141 పరుగులు(1991, న్యూజిలాండ్పై వెల్లింగ్టన్ వేదికగా), మురళీధరన్ 46 ఓవర్లలో 137 పరుగులు(1997లో భారత్పై నాగ్పూర్ వేదికగా) ఉన్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే ► ఖాన్ మొహమ్మద్-(54-5-259-0) వర్సెస్ వెస్టిండీస్, 1958 ► నిక్కీ బోజే-(65-5-221-0) వర్సెస్ శ్రీలంక, 2006 ► యాసిర్ షా-(32-1-197-0) వర్సెస్ ఆస్ట్రేలియా, 2019 ► రే ప్రైస్-(42-2-192-0) వర్సెస్ సౌతాఫ్రికా, 2001 ► ప్రసన్న-(59-8-187-0) వర్సెస్ ఇంగ్లండ్ , 1967 ► రే ప్రైస్-(36-5-187-0) వర్సెస్ ఆస్ట్రేలియా , 2003 ఎకానమీ పరంగా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు ► జాహిద్ మహ్మద్( 33-1-235-4, ఎకానమీ 7.12) వర్సెస్ ఇంగ్లండ్, 2022 ► లాహిరు కుమారా(25-1-164-0, ఎకానమీ 6.56) వర్సెస్ న్యూజిలాండ్, 2023 ► యాసిర్ షా(32-1-197-0, ఎకానమీ 6.15) వర్సెస్ ఆస్ట్రేలియా, 2019 చదవండి: క్లబ్ మేనేజర్తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా? వయసు పెరిగినా వన్నె తగ్గలేదు.. -
పట్టు బిగించిన కివీస్.. ఫాలోఆన్ గండం తప్పేదెలా?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కివీస్ బౌలర్ల దాటికి లంక తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. తద్వారా కివీస్కు 416 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో లంకను ఫాలోఆన్ ఆడించడానికే కివీస్ మొగ్గుచూపింది. లంక ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. ఫాలోఆన్ ఆడుతున్న లంక ప్రస్తుతం వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నే 21, కుషాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన లంక ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 66.5 ఓవర్ల పాటు ఆడిన లంక 164 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కరుణరత్నే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 37 పరుగులు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైకెల్ బ్రాస్వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. సౌథీ, టింక్నర్, బ్రాస్వెల్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 580 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్(215 పరుగులు), హెన్రీ నికోల్స్(200 పరుగులు) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేసింది. నాలుగో రోజు ఉదయం సెషన్లోగా మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు -
రీల్లైఫ్లో హీరో నాని.. రియల్ లైఫ్లో కేన్ మామ
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు అసలు సిసలు టెస్టు మజాను రుచి చూపించింది. సంప్రదాయ క్రికెట్లో మ్యాచ్ గెలవాలనే తపనతో ఇరుజట్లు ఆడిన తీరు టెస్టు చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 70వ ఓవర్.. క్రీజులో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు.. అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్.. బౌలర్ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్. క్రీజులోకి నీల్ వాగ్నర్.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. న్యూజిలాండ్ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్బాల్.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్.. షాట్ ఆడేందుకు కేన్ విలియమ్సన్ ప్రయత్నం.. వాగ్నర్కు కాల్.. సింగిల్ తీసేందుకు కేన్ మామ క్రీజు వీడాడు. ఆలోపే బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్ను గెలిపించిన కేన్ విలియమ్సన్పై ప్రశంసల జల్లు. మొత్తానికి రనౌట్ నుంచి తప్పించుకొని కేన్ మామ హీరోగా నిలిచాడు. ఇదంతా రియల్ లైఫ్ మ్యాచ్లో జరిగింది. అయితే ఇది సీన్ ఒక సినిమాలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా.. అది కూడా ఒక తెలుగు సినిమాలో. ఆశ్చర్యపోయినా ఇది నిజం. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్లో నాని తన జట్టును గెలిపించడానికి పడే తపన అచ్చం కేన్ మామ ఇన్నింగ్స్ను తలపించింది. రియల్ లైఫ్ మ్యాచ్ లాగానే సినిమాలోనూ నాని ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకొని జట్టును గెలిపిస్తాడు. ఆ తర్వాత నాని పైకి లేచి బ్యాట్ను పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా విలియమ్సన్ తన బ్యాట్ను పైకెత్తి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన వీడియోలను పక్కపక్కన ఉంచి ఒక అభిమాని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by TwEETA PORADU (@tweetaporadu) చదవండి: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా' NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! -
NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్
New Zealand vs Sri Lanka, 1st Test క్రైస్ట్చర్చి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో సెషన్ సమయానికి 18 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను డారిల్ మిచెల్ 102 పరుగులతో వీరోచిత శతకంతో నిలబెట్టాడు. అనంతరం లోయర్ ఆర్డర్లో మాట్ హెన్రీ (72 పరుగులు) టెయింలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి కివీస్ ఆధిక్యం సాధించడంలో ముఖ్యపాత్ర వహించాడు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న లంక మూడో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ 20, ప్రభాత్ జయసూర్య రెండు పరుగులతో ఆడుతున్నారు. శనివారం నాటి ముగిసే సరికి లంక 65 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలి ఇన్నింగ్స్లో మెరుగ్గా ఆడటం టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఒకవేళ కివీస్, లంక మ్యాచ్ డ్రాగా ముగిసినా.. లేక లంక రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకు పరిమితమై కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచి.. వారి చేతిలో ఓడిపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టేది టీమిండియానే. అప్పుడు టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోతే మాత్రం పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. అలా జరగకుండా ఉండాలంటే కివీస్, లంక మ్యాచ్ డ్రా అయినా కావాలి లేదా లంక ఓడిపోవాలి. అదే సమయంలో టీమిండియా ఆసీస్తో మ్యాచ్ను డ్రా లేదంటే గెలవడం చేయాలి. చదవండి: Virat Kohli: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్ -
సర్జరీ విజయవంతం.. బుమ్రా రీఎంట్రీ అప్పుడే!
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలే బీసీసీఐ వెన్నునొప్పికి సంబంధించిన శస్త్ర చికిత్స కోసం బుమ్రాను న్యూజిలాండ్కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ల(న్యూజిలాండ్)కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు సర్జరీ విజయంవంతం అయినట్లు సమాచారం అందింది. సర్జరీ సక్సెస్ అయినప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కొచ్చు. ఇక గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్-2022, టి20 వరల్డ్ కప్.. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు. బుమ్రా దూరమవడం ముంబై ఇండియన్స్కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ వరకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. చదవండి: మాస్టర్మైండ్.. తెలివిగా తప్పించుకున్న ధోని -
76 పరుగులకే ఆలౌట్.. న్యూజిలాండ్పై ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం పార్ల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 76 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 5 వికెట్లతో చెలరేగగా.. స్కాట్ రెండు, బ్రౌన్, పెర్రీ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కెర్ 21 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో హీలీ (55), లానింగ్(41), పెర్రీ(40) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహు, అమేలియా కెర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్లో మంగళవారం బంగ్లాదేశ్ తలపడనుండగా.. న్యూజిలాండ్ సోమవారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. చదవండి: T20 World Cup: పాక్తో పోరుకు భారత్ ‘సై’ -
మహిళల టి20 వరల్డ్కప్: కివీస్పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023 -
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ గురువారం అనుహ్యంగా తర పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి ప్రధాని వారసుడిగా విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. ఆమె తర్వాత పార్టీ సభ్యుల్లో కొత్త ప్రధానిగా హిప్కిన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 44 ఏళ్ల రాజకీయ నాయకుడు పార్లమెంటు సభ్యుల సమావేశంలో పాలక లేబర్ పార్టీకి నాయకత్వం వహించే ఏకైక వ్యక్తిగా జెసిండా స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్కరే పోటీలో ఉండటం వల్ల దీనికోసం తొలుత పార్టీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంది. పైగా ఆ స్థానానికి పోటీపడేందుకు పార్టీలో సరైన సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో చట్ట సభ సభ్యులంతా ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిప్కిన్స్ ఆదివారం లాంఛనంగా జరిగే తన సహచరుల ఆమోదం కోసం వేచి ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ దేశ 41వ ప్రధాన మంత్రిగా హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐతే ఆమె వారసుడిగా కేవలం 48 గంటల్లో ఎన్నుకున్నందున తాను ఫిబ్రవరి 7నాటికి పదవీవిరమణ చేస్తానని జెసిండా ఆర్డర్న్ తెలిపారు. ఈ క్రమంలో హిప్కిన్స్ మాట్లాడుతూ తాను చాలా నిర్ణయాత్మకంగా ఉన్నానని, పనులు వేగవంతంగా పూర్తి చేయగలనని ధీమాగా చెప్పారు. అదీగాక హిప్కిన్స్కి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. పైగా తాను ఈ ఎన్నికలలో విజయం సాధించగలనని నమ్మకంగా చెప్పారు. అలాగే మాజీ ప్రధాని జెసిండాను అవసరమైన సమయంలో కీలక బాధ్యతలను నిర్వర్తించిన అత్యవసరమైన నాయకురాలిగా ప్రశంసించారు. ఆమె ఇక ఈ బాధ్యతలను మోయలేని స్థితిలో ఉందని అన్నారు. ఆమె ప్రకృతి వైపరిత్యాలు, కోవిడ్ మహమ్మారీ, అత్యంత ఘోరమైన ఉగ్రదాడి సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన ధైర్యవంతురాలైన నాయకురాలని కొనియాడారు. కాగా, తాను ఈ కొత్త పదవిని శక్తిమంతమైనదే గాక తనకొక కొత్త ఉత్సాహన్ని తీసుకొచ్చేదిగా భావిస్తున్నానని హిప్కిన్స్ చెప్పుకొచ్చారు. అలాగే న్యాయ మంత్రి కిరీ అల్లన్ హిప్కిన్స్ అద్భుతమైన బలమైన ప్రధాని అవుతాడని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అదీగాక కరోనా ఉధృత సమంయంలో సమర్ధవంతంగా పనిచేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా పార్టీలో సమస్య వచ్చినప్పుడూ చాకచక్యంగా పరిష్కరించి గ్రేట్ ట్రబుల్ షూటర్గా కూడా హిప్కిన్స్కు పేరుంది. ఐతే వచ్చే ఎన్నికల్లో దేశంలోని ఆర్థిక వ్యవస్థ పెద్ద సవాలుగా మారునుంది. ఆయన ఓటర్లను ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని చెప్పి ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇదిలా ఉండగా, జెసిండా పదవీవిరమణ ప్రకటన విషాదంగా అనిపించినా, ఈ ప్రకటన అనంతరం చాలాకాలం తర్వాత తొలిసారి బాగా నిద్రపోయానని ఆమె చెప్పడం విశేషం. (చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. గాల్లో ఉండగానే..) -
కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం
న్యూజిలాండ్కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ గుర్రపు పందెంలో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్బరిలోని యాష్బర్టన్ రేస్వే వద్ద గురువారం జరిగిన హార్స్ రేసులో పాల్గొంది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. రేస్ జరుగుతున్న సమయంలో మరొక జాకీ రైడర్తో జరిగిన క్లాష్లో మేఘన్ టేలర్ కిందపడిపోయింది. అయితే వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి కిందపడడంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మేఘన్ టేలర్ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మేఘన్ టేలర్ రెడ్ ఆర్కిడ్ హార్స్తో రెండో స్థానంలో ఉంది. అయితే ఆమె వెనకాలే మరో ముగ్గరు జాకీ రైడర్స్ ఒకే పార్శ్వంలో రావడమే ప్రమాదానికి కారణమైంది. మేఘన్తో పాటు మిగతా ముగ్గురు కూడా కింద పడినప్పటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మేఘన్ టేలర్ జాకీ రైడర్గా 2019లో తన కెరీర్ను ప్రారంభించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూజిలాండ్లో పలుమార్లు హార్స్ రేసింగ్లో పాల్గొంది. -
ఫైనల్ దారిలో రికార్డులు బద్దలు కొట్టిన పాక్
టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా బుధవారం న్యూజిలాండ్తో మ్యాచ్లో పాక్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్కు చేరుకున్న పాకిస్తాన్ రెండోసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక ఫైనల్కు చేరుకున్న పాకిస్తాన్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► టి20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు కివీస్ను పాకిస్తాన్ 18 సార్లు(తాజా మ్యాచ్తో కలిపి) ఓడించింది. ఆ తర్వాత వరుసగా ఇండియా వెస్టిండీస్ను 17సార్లు, ఇండియా శ్రీలంకను 17 సార్లు, ఇంగ్లండ్ పాకిస్తాన్ను 17సార్లు మట్టికరిపించాయి. ► 2009 నుంచి టి20 వరల్డ్కప్లో పాకిస్తాన్కు సెమీఫైనల్లో ఇదే తొలి విజయం. ఓవరాల్గా మూడోసారి(ఇంతకముందు 2007, 2009) కాగా.. 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం. ► ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ను పాకిస్తాన్ సెమీస్లో ఓడించడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 1992, 1999 వన్డే వరల్డ్కప్లతో పాటు 2007, 2022 టి20 ప్రపంచకప్లలోనూ కివీస్ను సెమీస్లో ఓడించింది. ► 2021 వరల్డ్కప్ తర్వాత ఆడిన టి20 మ్యాచ్ల్లో సౌథీ వికెట్ తీయకపోవడం ఇది రెండో సారి మాత్రమే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేయగా.. కేన్ విలియమ్సన్ 46 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. పాక్కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు. చదవండి: NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్ -
NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్
న్యూజిలాండ్ జట్టు టాప్ క్లాస్ ఆటకు పెట్టింది పేరు. వాళ్లు మ్యాచ్ ఆడుతున్నారంటే ప్రత్యర్థి జట్టుకు బౌండరీలు, సిక్సర్లు రావడం చాలా కష్టం. ఎందుకంటే అంత పకడ్బందీగా ఉంటుంది వారి ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్తో పాటు మంచి జట్టు అని పేరు పొందిన న్యూజిలాండ్ తాజాగా టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం నాసిరకమైన ఆటను ప్రదర్శించింది. అసలు సెమీస్ ఆడుతుంది కివీసేనా లేక మరో జట్టా అన్న సందేహం కూడా కలిగింది. ఇక ఇవాళ పాక్తో మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటతీరు క్రికెట్ ఫ్యాన్స్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 59 పరుగులే చేసింది. డెత్ ఓవర్లలో అయితే పరిస్థితి మరీ దారుణం. భీకరమైన బౌలింగ్ లైనఫ్ ఉన్న పాకిస్తాన్ బౌలర్ల ముందు కివీస్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. చెప్పాలంటే బౌండరీలు బాదడానికి తెగ ఇబ్బంది పడ్డారు. 16 నుంచి 20 ఓవర్ల మధ్య న్యూజిలాండ్ బ్యాటర్లు కొట్టింది కేవలం రెండంటే రెండు ఫోర్లు... ఈ ఐదు ఓవర్లలో 46 పరుగులు మాత్రమే వచ్చాయి. భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా పెద్ద ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కూడా సింగిల్స్, డబుల్స్ తీయడం ఆశ్చర్యం కలిగించింది. డారిల్ మిచెల్ కాస్తో కూస్తో పర్వాలేదనిపించినా.. ముఖ్యంగా విలియమ్సన్ మాత్రం టెస్టు బ్యాటింగ్ చేయడం అభిమానులను విసిగించింది. 42 బంతులెదుర్కొన్న విలియమ్సన్ 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో కేవలం ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతని బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో. బ్యాటింగ్ నీరసంగా చేశారనుకుంటే.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత దారుణ ప్రదర్శన కనబరిచారు. సాధారణంగా తమ ఫీల్డింగ్తో ప్రత్యర్థి జట్లకు పరుగులు పెద్దగా ఇవ్వదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం చేతుల్లోకి వచ్చిన క్యాచ్లను ఫీల్డర్లు నేలపాలు చేస్తే .. ఈజీ రనౌట్ చాన్స్లను మిస్ చేశారు. మొత్తానికి మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రదర్శన చూస్తుంటే... 2021లో టీమిండియా పర్ఫామెన్స్ గుర్తుకురావడం ఖాయం. న్యూజిలాండ్కి ఫైనల్ ఫోబియా చాలా ఎక్కువ. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తప్పితే 2015 వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో ఫైనల్ మ్యాచుల్లో ఇలాంటి నాసిరకమైన ప్రదర్శననే కనబరిచింది. ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికాని బ్యాడ్ లక్ వెంటాడుతుంది. న్యూజిలాండ్ కథ మాత్రం పూర్తిగా వేరు.ఫైనల్ వరకు చేరుకున్నప్పటికి ఆఖరి మెట్టుని ఎలా దాటాలో మాత్రం ఆ జట్టుకు తెలిసి రావడం లేదు. తమ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ గెలిచిన ఐకైక ఐసీసీ టైటిల్ ఏదైనా ఉందంటే అదీ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ మాత్రమే. ఇది కూడా వాతావరణం కలిసి రావడం.. టీమిండియాను బ్యాడ్లక్ వెంటాడడం వల్లేనని ఈ ఓటమితో రుజువు చేసుకుంది న్యూజిలాండ్. చదవండి: ఇది నాలుగోసారి.. పాక్ అంటే వణికిపోతున్న కివీస్! 'బ్లాక్క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం -
ఇది నాలుగోసారి.. పాక్ అంటే వణికిపోతున్న కివీస్!
క్రికెట్లో న్యూజిలాండ్ జట్టుకు పాకిస్తాన్ ఫోబియా ఇప్పట్లో వదిలేలా లేదు. ఐసీసీ మెగా టోర్నీల్లో(పరిమిత ఓవర్లు) పాక్తో సెమీస్ అనగానే న్యూజిలాండ్ వణికిపోతుంది. తాజాగా టి20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం పాకిస్తాన్తో జరిగిన మొదటి సెమీఫైనల్లో కివీస్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు పాకిస్తాన్తో ఆడిన నాలుగు సెమీఫైనల్స్లో(తాజా దానితో కలిపి) ఓడిపోయిన న్యూజిలాండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్లు నాలుగుసార్లు సెమీస్లో తలపడ్డాయి. ఇందులో రెండు వన్డే వరల్డ్కప్లు, రెండు టి20 ప్రపంచకప్లు ఉన్నాయి. 1992, 1999 వన్డే వరల్డ్కప్లో సెమీఫైనల్లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన కివీస్.. మళ్లీ 2007, 2022 టి20 ప్రపంచకప్లోనూ సెమీస్లో పరాజయాలనే మూటగట్టుకుంది. మరి సెమీస్లో పాక్తో మ్యాచ్ అనగానే న్యూజిలాండ్కు అంత భయమెందుకు వేస్తుందనేది సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. లీగ్ దశలో ఏ జట్టునైనా మట్టి కరిపించే సత్తా ఉన్న న్యూజిలాండ్ నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం ఎక్కడలేని ఒత్తిడిని కొనితెచ్చుకుంటుంది. ముఖ్యంగా పాక్తో సెమీస్ అనగానే ఆ ఒత్తిడి మరింత ఎక్కువైపోయి మ్యాచ్ మొదట్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా జరిగిన మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్లో హిట్టింగ్లు పెద్దగా కనిపించలేదు. కేన్ విలియమ్సన్ చేసింది 45 పరుగులైనా.. అతను ఆడింది టెస్టు ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్లు పూర్తిగా నిరాశపరిచారు. అనుభవజ్ఞుడైన మార్టిన్ గప్టిల్ను కీలక మ్యాచ్లో పక్కనబెట్టడం కివీస్ను మరింత ఒత్తిడిలో పడేశాయి. దీనికి తోడు పాక్ బ్యాటింగ్ సమయంలో ఫేలవ ఫీల్డింగ్, క్యాచ్లు జారవిడవడం.. బౌలింగ్లో పస లేకపోవడం అన్నీ ఒక్కసారిగా మీదపడ్డాయి. చూస్తుంటే పాక్తో మ్యాచ్లోనే ఇవన్నీ జరుగుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మూడు సందర్భాల్లోనూ కివీస్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది, కనీసం ఈసారైనా పాక్తో సెమీస్ గండం దాటుతుందనకుంటే కథ మళ్లీ మొదటికే వచ్చింది. చదవండి: నక్కతోక తొక్కిన పాక్.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్కు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. వాళ్లిద్దరి వల్లే ఇలా: విలియమ్సన్ -
నక్కతోక తొక్కిన పాక్.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్కు
టి20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్ నక్కతోక తొక్కింది. ఒక దశలో సూపర్-12లోనే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిన దశలో అనూహ్యంగా ఫుంజుకున్న పాకిస్తాన్ సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఆపై దురదృష్టానికి కేరాఫ్ అయిన ప్రొటిస్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడి పాక్ సెమీస్ వెళ్లేందుకు బాటలు పరిచింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్పై సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. గతేడాది టి20 ప్రపంచకప్లో సెమీస్కే పరిమితమైన పాకిస్తాన్ ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టలేదు. మొదట బౌలింగ్.. ఆపై బ్యాటింగ్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టడం మళ్లీ ఇదే. అలా 13 ఏళ్ల తర్వాత మరోసారి కప్ కొట్టడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇక 2007లో ఫైనల్ చేరినప్పటికి టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. 2009లో మాత్రం ఫైనల్లో లంకను చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. అయితే దాయాది పాకిస్తాన్ ఫైనల్కు చేరడంతో.. ఇప్పుడందరి కళ్లు టీమిండియాపై పడ్డాయి. గురువారం(నవంబర్ 10న) ఇంగ్లండ్తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా గెలవాలని.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడితే చూడాలని అభిమానులు దేవుడికి ప్రార్థిస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందేమో చూడాలి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ ముందు వరకు ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ల ఫామ్పై పాక్ జట్టు మేనేజ్మెంట్ ఆందోళనలో ఉంది. కానీ కీలకమైన సెమీస్లో ఈ ఇద్దరు ఫామ్లోకి రావడం పాకిస్తాన్కు శుభపరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా టోర్నీల్లో దారుణంగా విఫలమైన బాబర్ ఆజంను న్యూజిలాండ్ దగ్గరుండి ఫామ్లోకి తీసుకొచ్చినట్లు అనిపించింది. ఇద్దరు ఓపెనర్లు అర్థశతకాలతో మెరవడంతో పాకిస్తాన్ విజయం సులువుగా జరిగిపోయింది. ఏది ఏమైనా పాకిస్తాన్ ఈసారి నక్క తోక గట్టిగా తొక్కిందని.. కానీ టీమిండియా ఫైనల్కు వస్తే మాత్రం పాక్ తోక ముడవడం ఖాయమని భారత అభిమానులు కామెంట్ చేశారు. చదవండి: 'బ్లాక్క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం ఫామ్ కోల్పోయిన బాబర్తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత -
'బ్లాక్క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం
న్యూజిలాండ్ జట్టును ఇష్టపడని వారు ఉండరు. వివాదరహిత జట్టుగా పేరున్న కివీస్కు మంచి జట్టు అనే ట్యాగ్లైన్ ఉంది. ఈ ట్యాగ్లైన్ ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కానీ కివీస్ విషయంలో అలా పిలవచ్చో లేదో అనే డైలమా నెలకొనేలా చేశారు. క్రికెట్లో సౌతాఫ్రికాకు 'చోకర్స్' అనే ముద్ర ఉంది. కానీ కివీస్ను అలా పిలవాలన్న మనసొప్పదు. కారణం వారి ఆటతీరు. సౌతాఫ్రికాకు దురదృష్టం ఎక్కువగా ఉంటే.. కివీస్ విషయంలో మాత్రం కొంత దురదృష్టం.. కొంత స్వయంకృతం తోడవుతాయి. అందుకే వారికి బ్లాక్క్యాప్స్ అని ముద్ర పడింది. సైన్స్ను నమ్మేవాళ్లకు వింత అనిపించినా.. న్యూజిలాండ్ జట్టు ధరించే బ్లాక్ జెర్సీని మారిస్తేనైనా కప్ కొడుతుందేమోనన్న నమ్మకం ఈరోజుతో మరింత బలంగా తయారైంది. బ్లాక్ క్యాప్స్ అని ఊరికే అనలేదన్న విషయాన్ని కివీస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జరిగే ఐసీసీ మెగా టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు మరోసారి తేలిపోయింది. ఈసారి కప్ కచ్చితంగా కొడుతుంది అన్న తరహాలో వారి ప్రదర్శన కొనసాగడం.. తీరా నాకౌట్ మ్యాచ్ల్లో చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ 2022లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సూపర్-12 దశలో ఇంగ్లండ్ చేతిలో ఓటమి మినహా టాప్ ప్రదర్శన కనబరిచిన కివీస్ అందరూ ఊహించినట్లుగానే సెమీస్లో అడుగుపెట్టింది. సెమీస్లో మాత్రం మళ్లీ పాత కథే. గ్రూప్-1 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్.. కీలకమైన నాకౌట్(సెమీస్)లో తమకు అలవాటైన రీతిలోనే పాకిస్తాన్ చేతిలో చిత్తైంది. అందునా పాకిస్తాన్తో సెమీఫైనల్ అంటేనే చెత్త రికార్డు కలిగి ఉన్న న్యూజిలాండ్ దానిని విజయవంతంగా నిలబెట్టుకుంది. ఇప్పటివరకు ఐసీసీ మెగాటోర్నీల్లో న్యూజిలాండ్ను పాకిస్తాన్ నాలుగుసార్లు ఓడించింది. ఇందులో రెండుసార్లు వన్డే వరల్డ్కప్లో(1992, 1999).. రెండుసార్లు (2007, 2022) టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఉన్నాయి. అంతేకాదు 2015 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఐసీసీ మెగా టోర్నీల్లో(ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ మినహా) కనీసం సెమీస్ చేరిన జట్టుగా నిలిచింది న్యూజిలాండ్. అయితే నాకౌట్ ఫోబియా మాత్రం ఆ జట్టును వీడడం లేదు. ఇక వచ్చే ఏడాది 2023లో వన్డే వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో అప్పుడైనా తమపై ఉన్న బ్లాక్క్యాప్స్ ముద్ర తొలగించుకుంటారేమో చూడాలి. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం న్యూజిలాండ్ ఆటతీరు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. మంచి జట్టుగా పేరున్న కివీస్కు ఈ నాకౌట్ ఫోబియా ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ఎందరు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మారడం లేదని.. తాను కెప్టెన్సీ చేపట్టిన ఆరేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో కివీస్ను మూడుసార్లు కనీసం సెమీస్ చేర్చిన కేన్ విలియమ్సన్ కల కూడా నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు. 2019లో న్యూజిలాండ్ టైటిల్ కొట్టబోతుందంటూ ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో జోస్యం చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన కన్నుమూయడం సగటు అభిమానిని బాధపడేలా చేసింది. కనీసం ఈసారైనా టైటిల్ కొట్టి తామేంటో నిరూపించుకోవాలనుకున్న కివీస్కు మరోసారి భంగపాటే ఎదురైంది. ఇక కివీస్ ఓటమికి కొన్ని కారణాలున్నాయి. అందులో మార్టిన్ గప్టిల్ లాంటి సీనియర్ ప్లేయర్ను పక్కనబెట్టడం జట్టు సమతుల్యం దెబ్బతీసిందని చెప్పొచ్చు. అతను ఫామ్లో ఉన్నాడో లేదో తెలియదు కానీ జట్టుకు ఒక సీనియర్ ఆటగాడి సేవలు చాలా అవసరం. 2015, 2019 వన్డే వరల్డ్కప్స్తో పాటు 2021 టి20 ప్రపంచకప్ల్లో కివీస్ ఫైనల్ చేరడంలో మార్టిన్ గప్టిల్ది కీలకపాత్ర. అతనికి ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సిందని క్రీడా ఫ్యాన్స్ వాపోయారు. ఏమో గప్టిల్ ఉండి ఉంటే.. సెమీఫైనల్లో బాగా స్కోరు సాధించి జట్టును ఫైనల్ చేర్చేవాడేమో అని పేర్కొన్నారు. అయినా న్యూజిలాండ్ కథ ముగిసింది.. ఇక ఇప్పుడు ఎన్ని మాట్లాడి ఏం ప్రయోజనం. ఈ ప్రపంచకప్లో కివీస్కు సెమీస్ వరకే రాసిపెట్టి ఉన్నట్లుంది. చదవండి: NZ Vs Pak: న్యూజిలాండ్ ఓటమి.. ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్ ఫామ్ కోల్పోయిన బాబర్తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత -
PAK Vs NZ: ఫామ్ కోల్పోయిన బాబర్తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత
ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టి20 ప్రపంచకప్లో తొలిసారి మెరిశాడు. కీలకమైన సెమీస్ పోరులో బాబర్ అర్థసెంచరీతో రాణించాడు. ఈ ప్రపంచకప్లో బాబర్ తాను ఆడిన ఐదు మ్యాచ్ల్లో వరుసగా 0, 4, 4, 6, 25 పరుగులు చేశాడు. అలాంటి బాబర్ చేత ఫిఫ్టీ కొట్టించిన ఘనత న్యూజిలాండ్కే దక్కుతుంది. ఓవరాల్గా 42 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్కు ముందు బాబర్ ఆజం ఫామ్లోకి రావడం ఆ జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు. ఇక న్యూజిలాండ్కు బ్లాక్క్యాప్స్ అనే ముద్ర ఊరికే రాలేదన్న అంశాన్ని తాజా మ్యాచ్తో మరోసారి నిరూపించారు. లీగ్ దశలో టాప్ ప్రదర్శన కనబరిచే కివీస్ది మళ్లీ అదే పాత కథ. నాకౌట్ మ్యాచ్ల్లో చతికిలపడుతుందనే అపవాదును న్యూజిలాండ్ మరోసారి నిజం చేసింది. తాజాగా బుధవారం పాకిస్తాన్తో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ నిరాశజనక ఆటతీరును ప్రదర్శించింది. బ్యాటింగ్లో ఓ మెస్తరు స్కోరు సాధించిన కివీస్.. బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇద్దరి మధ్య వంద పరుగుల భాగస్వామ్యం నమోదు కావడంతో ఇద్దరే మ్యాచ్ గెలిపిస్తారా అన్న సందేహం కూడా కలింగింది. అయితే బాబర్ 53 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చదవండి: డారిల్ మిచెల్ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు! -
డారిల్ మిచెల్ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు!
టి20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు. డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు అంటే న్యూజిలాండ్ కచ్చితంగా ఫైనల్ వెళుతుంది అని అభిమానులు పేర్కొంటున్నారు. మిచెల్ సెమీస్లో అర్థసెంచరీ వెనుక ఒక చిన్న కథ దాగుంది. అదేంటంటే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లోనూ ఇంగ్లండ్తో ఆడిన సెమీఫైనల్లో డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు. ఆ మ్యాచ్లో 72 పరుగులతో నాటౌట్గా నిలిచిన మిచెల్ కివీస్ను దగ్గరుండి గెలిపించాడు. దీంతో కివీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా మిచెల్ అర్థసెంచరీ చేశాడు. దీంతో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. డారిల్ మిచెల్ మాత్రం టి20 ప్రపంచకప్లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లో రెండు అర్థసెంచరీలు సాధించిన మూడో బ్యాటర్గా మిచెల్ నిలిచాడు. గతేడాది టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై 72 పరుగులు నాటౌట్.. తాజా వరల్డ్కప్లో పాకిస్తాన్తో సెమీస్లో 53 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇంతకముందు టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 2014లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్లో 72 నాటౌట్, ఆ తర్వాత 2016 టి20 వరల్డ్కప్లో వెస్టిండీస్పై 89 నాటౌట్ చేశాడు. ఇక క్రిస్ గేల్ 2009లో శ్రీలంకతో సెమీస్లో 63 నాటౌట్, 2012లో ఆస్ట్రేలియాపై 75 నాటౌట్ రెండు అర్థసెంచరీలు సాధించాడు. చదవండి: ఐదు మ్యాచ్లుగా ఒక్క వికెట్ లేదు.. ఒక్క రనౌట్తో -
షాదాబ్ ఖాన్ సూపర్ త్రో.. కాన్వే మొహం మాడిపోయింది
టి20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ సూపర్ రనౌట్తో మెరిశాడు. హారిస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతిని కాన్వే మిడాఫ్ దిశగా ఆడాడు. డెవన్ కాన్వే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించి నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న కేన్ విలియమ్సన్కు కాల్ ఇచ్చాడు. విలియమ్సన్ పరిగెత్తగా.. కాన్వే మాత్రం సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. అప్పటికే మిడాఫ్లో ఉన్న షాదాబ్ ఖాన్ విసిరిన డైరెక్ట్ త్రోకు కాన్వే రనౌట్గా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ సూపర్ త్రోకు కాన్వే మొహం మాడిపోయింది. అలా పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ 36 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #ShadabKhan #NZvsPAK pic.twitter.com/3rNG3pYjUX — Raj (@Raj54060705) November 9, 2022 -
కెప్టెన్గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా
న్యూజిలాండ్కు బ్లాక్ క్యాప్స్ అనే ముద్ర ఉంది. ఈ ముద్ర వారికి ఊరికే రాలేదు. సైన్స్ను బలంగా నమ్మేవాళ్లకు ఇది వింత అనిపించొచ్చు. కానీ కివీస్ తమ జెర్సీ రంగు మార్చేవరకు ఐసీసీ ట్రోఫీలు కొట్టదనే అపవాదు గట్టిగా ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఐసీసీ మేజర్ టోర్నీల్లో సౌతాఫ్రికా తర్వాత దురదృష్టవంతమైన జట్టుగా న్యూజిలాండ్కు పేరుంది. ప్రతీసారి అంచనాలకు మించి రాణించడం.. ఆఖరికి ఫైనల్ మెట్టుపై బోల్తా కొట్టడం వారికి మాత్రమే సాధ్యమైంది. 2015 వన్డే వరల్డ్కప్ నుంచి కివీస్ది ఇదే తంతు. కివీస్ వరుసగా మూడు వరల్డ్కప్ ఫైనల్స్ ఆడడమంటే మాములు విషయం కాదు. 2015లో మెక్కల్లమ్ సారధ్యంలోని కివీస్ సేన ఆఖరి మెట్టుపై బోల్తా పడితే.. 2019 వన్డే వరల్డ్కప్, 2021 టి20 వరల్డ్కప్లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలో బ్లాక్క్యాప్స్ రెండుసార్లు ఫైనల్కు చేరి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే కేన్ విలియమ్సన్ నేతృత్వంలోనే న్యూజిలాండ్.. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఒక్కసారి కూడా కప్పు కొట్టలేపోయింది. ఇక 2022 టి20 ప్రపంచకప్లోనూ న్యూజిలాండ్ మరోసారి ఫేవరెట్గానే కనిపిస్తోంది. సూపర్-12 దశలో గ్రూప్-1లో ఒక్క మ్యాచ్ ఓడిపోని కివీస్ టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. ఇక సెమీస్లో నవంబర్ 9న(బుధవారం) పాకిస్తాన్తో అమితుమీ తేల్చుకోనుంది. ఒకవేళ ఈసారి కూడా న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెడితే.. కేన్ మామ సారధ్యంలో ఇది మూడోసారి.. వరుసగా నాలుగో మెగాటోర్నీ ఫైనల్ ఆడనుంది. కెప్టెన్గా హీరోగా నిలిచిన కేన్ విలియమ్సన్ ఐసీసీ ట్రోఫీ అందుకోవడంలో మాత్రం ప్రతీసారి జీరో అవుతున్నాడు. ఒకవేళ కివీస్ ఫైనల్ చేరితే.. ఈసారైనా కేన్ విలియమ్సన్ కల నెరువెరుతుందేమో చూడాలి. చూస్తుంటే ఈసారి మాత్రం కివీస్ జట్టు కప్ కొట్టేలానే కనిపిస్తుంది. పాకిస్తాన్ సెమీస్లో ఎప్పుడైనా ప్రమాదకారే. అయితే నిలకడలేమి పాకిస్తాన్కున్న బలహీనత. ఆ బలహీనతను క్యాష్ చేసుకొని న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెడుతుందేమో చూడాలి. చదవండి: ఇంగ్లండ్తో మ్యాచ్.. అడవి బాట పట్టిన టీమిండియా క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్ ఘన విజయం
భువనేశ్వర్: ఆద్యంతం అటాకింగ్తో ప్రత్యర్థిపై చెలరేగిన భారత జట్టు ప్రొ హాకీ లీగ్లో కీలక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 7–4 గోల్స్ తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. తొలి క్వార్టర్లో కివీస్ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత భారత్ జోరు ముందుకు నిలవలేకపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (7వ నిమిషం, 19వ ని.) సాధించగా, కార్తీ సెల్వమ్ (17వ ని., 38వ ని.) మరో రెండు గోల్స్ కొట్టాడు. రాజ్కుమార్ పాల్ (31వ ని.), సుఖ్జీత్ సింగ్ (50వ ని.), జుగ్రాజ్ సింగ్ (53వ ని.) భారత్కు మిగతా గోల్స్ అందించారు. న్యూజిలాండ్ తరఫున సైమన్ చైల్డ్ (2వ ని.), స్యామ్ లేన్ (9వ ని.), స్మిత్ జేక్ (14వ ని.), నిక్వుడ్స్ (54వ ని.) గోల్స్ చేశారు. -
కేన్ మామ ఇలా చేస్తావని ఊహించలేదు..
టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ జట్టు అంటేనే మంచికి మారుపేరు. క్రికెట్లో వివాదాలకు దూరంగా ఉండే జట్టు కివీస్. అందునా మంచి కెప్టెన్గా పేరు పొందిన కేన్ విలియమ్సన్ ఒక క్యాచ్ విషయంలో తొలిసారి చీటింగ్ చేయడం ఆసక్తి కలిగించింది. ఇది సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యపరిచింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మిచెల్ సాంట్నర్ వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని బట్లర్ ఎక్స్ట్రా కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్బుతంగా డైవ్ చేసి క్యాచ్ తీసుకున్నాడు. దీంతో వారెవ్వా ఏం క్యాచ్ పట్టాడురా అనుకోకుండా ఉండలేం. అందుకు తగ్గట్లే విలియమ్సన్ కూడా క్యాచ్ అందుకున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. జాస్ బట్లర్ కూడా విలియమ్సన్ పట్టిన క్యాచ్కు షాక్ అయి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. విలియమ్సన్ అందుకున్న క్యాచ్పై అంపైర్లకు అనుమానం వచ్చింది. దీంతో రిప్లేలో చూడగా.. విలియమ్సన్ బంతిని అందుకున్నప్పటికి మొదట గ్రౌండ్ తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో బట్లర్ నాటౌట్ అని అంపైర్లు ప్రకటించారు. మొత్తానికి మంచికి మారు పేరైన కేన్ మామ ఇలా చేస్తాడని ఊహించలేదు అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఆ తర్వాత బట్లర్ దగ్గరికొచ్చిన విలియమ్సన్ తన చర్యకు క్షమాపణ కోరాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: గెలుస్తే నిలుస్తారు.. న్యూజిలాండ్తో చావోరేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్ -
సెంచరీతో పాటు సిక్సర్ల రికార్డు.. అరుదైన క్రికెటర్గా ఘనత
టి20 ప్రపంచకప్లో రెండో సెంచరీ నమోదైంది. సూపర్-12లో భాగంగా గ్రూఫ్-1లో శుక్రవారం శ్రీలంకతో మ్యాచ్లో కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ శతకంతో మెరిశాడు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు. డారిల్ మిచెల్ను ఒక ఎండ్లో నిలబెట్టి ఫిలిప్స్ స్ట్రైక్ రొటేట్ చేసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్లో షనకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్లో ఫిలిప్స్ రెండో శతకం అందుకున్నాడు. ఇక టి20 ప్రపంచకప్లో నాలుగో స్థానం లేదా ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చి సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్ రికార్డులకెక్కాడు. సెంచరీయే ఒక రికార్డు అనుకుంటే దానితో పాటు సిక్సర్ల రికార్డు కూడా అందుకున్నాడు. 2021 నుంచి టి20ల్లో ఫిలిప్స్ బాదిన సిక్సర్ల సంఖ్య 149(తాజా వాటితో కలిపి). ఈ నేపథ్యంలోనే 2021 నుంచి చూసుకుంటే అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గ్లెన్ ఫిలిప్స్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఉన్నాడు. లివింగ్స్టోన్ 152 సిక్సర్లు బాదాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కివీస్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2 వికెట్ల పడగొట్టగా.. తీక్షణ, ధనంజయ, హసరంగ, లహిరు కుమార తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో భాగంగా శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసింది. భానుక రాజపక్ష (34), దసున్ శనక (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, సోధి తలో 2 వికెట్లు.. సౌథీ, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: T20 WC 2022 : కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు -
కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీశాడు. టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 గ్రూఫ్-1లో శ్రీలంకతో మ్యాచ్లో ఫిలిప్స్ సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్లో ఇది రెండో సెంచరీ.. ఇంతకముందు దక్షిణాఫ్రికా బ్యాటర్ రొసౌ ఈ టోర్నీలో తొలి సెంచరీ బాదాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ చేయడం కంటే అతను క్రీజులో ప్రవర్తించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. ఈ మధ్యనే క్రికెట్లో మన్కడింగ్ను రనౌట్గా మారుస్తూ దానిని చట్టబద్ధం చేసింది ఐసీసీ. ఇటీవలే దీప్తి శర్మ నాన్స్ట్రైక్ ఎండ్లో ఇంగ్లండ్ బ్యాటర్ను మన్కడింగ్ చేయడాన్ని కొందరు సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. ఆ విమర్శించిన వారిలో ఇంగ్లండ్కు చెందిన మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు సహా మరికొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. తాజాగా ప్రపంచకప్లో జింబాబ్వేతో మ్యాచ్లో పాక్ బ్యాటర్ మహ్మద్ వసీమ్ జూనియర్ పరుగు తీయాలనే తపనలో రూల్స్ మరిచిపోయాడు. బంతిని విడవకముందే నాన్స్ట్రైక్ ఎండ్ క్రీజు నుంచి మూడు అడుగుల దూరం రావడం విస్మయపరుస్తుంది. పాక్ క్రికెటర్ చర్యను ఎండగడుతూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఇదంతా ఒకవైపు జరుగుతున్న సమయంలోనే.. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ చర్య వైరల్గా మారింది. సాధారణంగా బంతిని విడవడానికి ముందు నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటకూడదు. కానీ గ్లెన్ ఫిలిప్స్ కాస్త కొత్తగా ఆలోచించాడు. మాములుగా అథ్లెటిక్స్లో 100 మీటర్ల స్ప్రింట్లో ఎలాగైతే అథ్లెట్స్ ముందుకు వంగి రెడీగా ఉంటారో.. అచ్చం అలాగే.. ఫిలిప్స్ కూడా తన బ్యాట్ను బయట ఉంచి.. రన్నప్కు సిద్ధం అన్నట్లుగా క్రీజులో ఉండడం ఆకట్టుకుంది. బౌలర్ బంతి విడవగానే పరిగెత్తడం ప్రారంభించాడు. ఇదంతా కివీస్ ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్లో జరిగింది. నిజంగానే క్రికెట్లో ఇదో కొత్త రకం ప్రయోగం అని చెప్పొచ్చు. అందుకే ఫిలిప్స్ చర్య సోషల్ మీడియాలో అంతగా వైరల్ అవుతుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకతో మ్యాచ్లో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఫిలిప్స్ సెంచరీ మినహాయిస్తే మరే ఇతర బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేదు. డారిల్ మిచెల్ ఒక్కడే 22 పరుగులు చేశాడు. దీంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యే చాన్స్ ఉండడంతో కివీస్ బౌలర్లు రెచ్చిపోతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంకను కష్టాల్లో పడేశారు. Further proof that this is the most him Glenn Phillips has been in his life is the 'innovation' that he has brought into running from the non-striker's end. You think these things beforehand, and then try them when you have the confidence to. Confidence allows you to be you. pic.twitter.com/M7cPQRdw7d — Abhinav Dhar (@Xanedro) October 29, 2022 చదవండి: లాల్ మంత్రం పని చేసింది.. జింబాబ్వేను మార్చేసింది పరుగు కోసం రూల్స్ మరిచాడు.. పాక్ బ్యాటర్ తప్పిదం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సౌతాఫ్రికాలో పుట్టి నెదర్లాండ్స్ తరపున ఆడి; తాజాగా కివీస్కు
న్యూజిలాండ్ క్రికెటర్ మైకెల్ రిప్పన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ సందర్భంగా రెండు దేశాల తరపున(న్యూజిలాండ్, నెదర్లాండ్స్) అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ తన ట్విటర్లో పేర్కొన్నాడు. విషయంలోకి వెళితే.. మైకెల్ రిప్పన్ సౌతాఫ్రికాలో జన్మించాడు. తన చిన్నతనంలోనే కుటుంబం నెదర్లాండ్స్కు వలస వెళ్లింది. ఇక రిప్పన్ నెదర్లాండ్స్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. 2012లో తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడిన మైకెల్ రిప్పన్ 2013లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. డచ్ జట్టు తరపున 9 వన్డేలు, 18 టి20 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇటీవలే కుటుంబంతో న్యూజిలాండ్లో స్థిరపడిన మైకెల్ రిప్పన్ స్కాట్లాండ్తో మ్యాచ్ సందర్భంగా కివీస్ తరపున డెబ్యూ మ్యాచ్ ఆడాడు. అలా ఏకకాలంలో రెండు దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా టి20 క్రికెట్లో రెండు దేశాల తరపున ఆడిన 14వ క్రికెటర్గా మైకెల్ రిప్పన్ రికార్డులకెక్కాడు. ఇక టి20 ప్రపంచకప్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్ జట్టు గ్రూఫ్-1లో ఉండగా.. గ్రూఫ్-2 తను పుట్టిన దేశం సౌతాఫ్రికాతో పాటు తాను మొదటగా ఆడిన నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. సౌతాఫ్రికాకు తమ తొలి మ్యాచ్ వర్షర్పాణం కాగా.. రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను భారీ తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక న్యూజిలాండ్ జట్టు ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో భారీ విజయం అందుకుంది. ఇక కివీస్ రెండో మ్యాచ్ మాత్రం వర్షార్పణం అయింది. చదవండి: టి20 ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న వరుణుడు.. -
ఇంకా నయం బ్యాట్ మాత్రమే విరిగింది..
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ వేసిన బంతి స్పీడుకు గ్లెన్ పిలిప్స్ బ్యాట్ విరగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ హారిస్ రౌఫ్ వేశాడు. ఆ ఓవర్ హారిస్ వేసిన నాలుగో బంతి 143 కిమీ వేగంతో గ్లెన్ పిలిప్స్ వైపు దూసుకొచ్చింది. షాట్ ఆడడానికి ప్రయత్నించిన పిలిప్స్ బ్యాట్ను అడ్డుపెట్టాడు. అంతే బులెట్ వేగంతో దూసుకొచ్చిన బంతి బ్యాట్ ఎడ్జ్ను చీల్చడంతో బ్యాట్ చివరిభాగం విరిగింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక హారిస్ రౌఫ్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి డెవన్ కాన్వే, ఇష్ సోదీల రూపంలో రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్లతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. Haris Rauf firing bullets today that was Phillips’ favourite bat apparently 😂 pic.twitter.com/8WPcVEEi1b — adi✨|| haris rauf cheerleader (@adidoescricket) October 14, 2022 చదవండి: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు 'భయపడితే పనులు కావు.. పరుగులు చేయడమే' -
సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్దే ట్రై సిరీస్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్కు ముందు ఆసియా కప్ ఫైనల్.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్ల్లో పాకిస్తాన్ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, నవాజ్లు చెరొక వికెట్ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Nawaz and Iftikhar finish it for Pakistan in the final over 🏆#NZvPAK — ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2022 చదవండి: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ -
ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం!
న్యూజిలాండ్ ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్తో ట్రై సిరీస్ ఆడడంలో బిజీగా ఉంది. టి20 ప్రపంచకప్కు మంచి ప్రాక్టీస్లా ఉపయోగపడుతున్న ఈ ట్రై సిరీస్లో ఇప్పటికే బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా బంగ్లాదేశ్, కివీస్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్లో నజ్ముల్ షాంటో ఇచ్చిన సులువైన క్యాచ్ను న్యూజిలాండ్ ఆటగాళ్లు వదిలేశారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన గుడ్లెంగ్త్ బంతిని షాంటో గాల్లోకి లేపాడు. అంతే క్యాచ్ తీసుకోవడానికి ఏకకాలంలో నలుగురు ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చారు. చూసినవాళ్లు కచ్చితంగా ఆ నలుగురిలో ఎవరో ఒకరు క్యాచ్ తీసుకుంటారని అనుకున్నారు. తీరా చూస్తే ఒక్కడు కూడా పట్టుకోలేదు. దీంతో బౌల్ట్.. ఏంటిది అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ 48 పరుగులతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్ కాన్వే(40 బంతుల్లో 64 పరుగులు), గ్లెన్ పిలిప్స్(24 బంతుల్లో 60 పరుగులు) మెరుపులు మెరిపించారు. గుప్టిల్ 34, ఫిన్ అలెన్ 32 పరుగులతో రాణించారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడిపోయింది. షకీబ్ అల్ హసన్ (44 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోవడంతో ఈ టోర్నీలోని మూడో జట్టు పాకిస్తాన్ కూడా ఫైనల్ చేరింది. నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ఉంది. No way 😂😭😂pic.twitter.com/UMIfm8zeMG — Out Of Context Cricket (@GemsOfCricket) October 12, 2022 చదవండి: తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు రక్తం కళ్ల చూసిన ఫుట్బాల్ మ్యాచ్.. వీడియో వైరల్ -
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం. న్యూజిలాండ్కు దక్షిణాన దాదాపు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్బెల్ దీవిలో ఉందిది. ఈ చిన్నదీవిలో విచిత్ర వాతావరణం ఉంటుంది. ఈ దీవిలో ఏడాదికి 325 రోజులు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఏడాదిలో చాలారోజులు రోజులో గంట సేపు మాత్రమే సూర్యుడు కనిపిస్తుంటాడు. ఇక్కడ ఏడాదిలో ఎక్కువ రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతూ ఉంటుంది. ఈ దీవిలో కొన్నేళ్ల కిందట నాటిన ‘సిట్కా స్ప్రస్’ వృక్షం 120 ఏళ్లుగా ఈ దీవిలో ఒంటరిగానే ఉంది. ఈ దీవిలో ఎటుచూసినా గడ్డి, చిన్నా చితకా మొక్కలు తప్ప మరో భారీ వృక్షమేదీ కనిపించదు. ఈ వృక్షానికి ఒక అరుదైన విశేషం కూడా ఉంది. దీనికి చేరువలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భూభాగాల నుంచి, వాటికి దక్షిణాన ఉన్న సముద్రం నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్లో పది శాతం ఉద్గారాలను ఈ ఒక్క వృక్షమే పీల్చేసుకుంటుంది. భూతాపం వల్ల తలెత్తుతున్న వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో ఈ వృక్షం కీలకంగా ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చదవండి: 1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి -
178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో
భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్-ఏ జట్టుకు భంగపాటే ఎదురైంది. న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక మూడు వన్డేల సిరీస్ను సంజూ శాంసన్ కెప్టెన్సీలోని ఇండియా-ఏ జట్టు క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన అనధికారిక మూడో వన్డేలో ఇండియా-ఏ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్-ఏ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ డానే క్లీవర్ ఒక్కడే 83 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవారిలో మైకెల్ రిప్పన్ 29, చాడ్ బోవ్స్ 20 పరుగులు చేశారు. ఇండియా-ఏ బౌలర్లలో రాజ్ బవా నాలుగు వికెట్లతో చెలరేగగా.. రాహుల్ చహర్, కుల్దీప్ యాదవ్లు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సంజూ శాంసన్(54), తిలక్ వర్మ(50), శార్దూల్ ఠాకూర్(51) అర్థ సెంచరీలతో చెలరేగారు.కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్కు రెండు, జో వాకర్కు ఒకటి, మైఖేల్ రిప్పన్కు రెండు, రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక అనధికారిక వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఇండియా-ఏ టెస్టు సిరీస్ను మాత్రం డ్రాతోనే సరిపెట్టుకుంది. చదవండి: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్లైన్! -
టి20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించిన కివీస్
అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ మంగళవారం జట్టును ప్రకటింది. 15 మందితో కూడిన జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్ అలెన్, మైకెల్ బ్రాస్వెల్లు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడనుండగా.. జట్టు సీనియర్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ రికార్డు స్థాయిలో ఏడోసారి టి20 ప్రపంచకప్ ఆడనున్నాడు. కివీస్ తరపున నాథన్ మెక్కల్లమ్, రాస్ టేలర్లు మాత్రమే ఇప్పటివరకు ఆరు టి20 వరల్డ్కప్లు ఆడారు. తాజాగా గప్టిల్ ఏడో టి20 వరల్డ్కప్ ఆడుతూ జట్టు తరపున అత్యధిక వరల్డ్కప్లు ఆడనున్న తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, షకీబుల్ హసన్లు ఎనిమిది వరల్డ్ కప్స్తో తొలి స్థానంలో ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న లోకీ ఫెర్గూసన్ తిరిగి రాగా.. ఆడమ్ మిల్నే కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఫ్రంట్లైన్ వికెట్ కీపర్గా డెవాన్ కాన్వేను ఎంపిక చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన కివీస్ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. కాగా టి20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో టి20 ట్రై సిరీస్ ఆడనుంది. ట్రై సిరీస్కు కూడా ఇదే జట్టుతో ఆడుతుందని కివీస్ బోర్డు స్పష్టం చేసింది. ట్రై సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబర్ 15న న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఇక ప్రపంచకప్లో కివీస్ తమ తొలి మ్యాచ్ అక్టోబర్ 22న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్తో పాటు క్వాలిఫయింగ్ జట్లతో మ్యాచ్లు ఆడనుంది. టి20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ. Our squad for this year's @T20WorldCup in Australia. Details | https://t.co/JuZOBPwRyn #T20WorldCup pic.twitter.com/1s4QBL5bGH — BLACKCAPS (@BLACKCAPS) September 19, 2022 చదవండి: KL Rahul: 'అలా అనుకుంటే ఎవరు పర్ఫెక్ట్గా లేరు.. ఇప్పుడేంటి?' -
ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు
న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకున్నాడు. న్యూజిలాండ్ జట్టులోని టాప్ ఆటగాళ్లకు బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుంది. విదేశీ లీగ్స్తో జరిగిన ముందస్తుగా ఒప్పందం జరగడంతోనే కివీస్ బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకున్నట్లు నీషమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే నీషమ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్క్యాప్స్ సెలెక్షన్కు మాత్రం అందుబాటులో ఉంటాడని బోర్డు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని జేమ్స్ నీషమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చాడు. ''సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకొని దేశం తరపున కాకుండా డబ్బు కోసం విదేశీ లీగ్స్ ఆడడంపై అందరూ నన్ను తప్పుబడతారని ఊహించగలను. కానీ జూలై వరకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా వదులుకునేవాడిని కాదు. అదే సమయంలో విదేశీ లీగ్స్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం నాకు శాపంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న నిర్ణయంతో బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోవాల్సి వచ్చింది. బ్లాక్క్యాప్స్కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా. అయితే భవిష్యత్తులో మాత్రం తోటి ఆటగాళ్లతో కలిసి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ తెలిపాడు. ఇక జేమ్స్ నీషమ్ న్యూజిలాండ్ తరపున 12 టెస్టుల్లో 709 పరుగులు.. 14 వికెట్లు, 71 వన్డేల్లో 1409 పరుగులు.. 69 వికెట్లు, 48 టి20ల్లో 607 పరుగులు.. 25 వికెట్లు పడగొట్టాడు. నీషమ్ ఖాతాలో రెండు టెస్టు సెంచరీలు ఉండడం విశేషం. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు -
T20 WC 2022: వార్మప్ మ్యాచ్ల్లో టీమిండియా ఆడేది ఎవరితో అంటే..
ప్రతిష్టాత్మక ఐసీసీ టి20 వరల్డ్కప్ 2022 టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జట్లకు ప్రాక్టీస్ కోసం వార్మప్ మ్యాచ్లు నిర్వహించడం ఆనవాయితీ. కాగా వార్మప్ మ్యాచ్లకు చెందిన షెడ్యూల్ను ఐసీసీ గురువారం రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 16 జట్లు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇక టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో, 19వ తేదీన కివీస్తో భారత్ తలపడనుంది. వార్మప్ మ్యాచ్లను అధికారిక మ్యాచ్లుగా గుర్తించరన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టి20 వరల్డ్కప్ అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా మధ్య జరగనుంది. ఇక గ్రూఫ్-2లో ఉన్న టీమిండియా తమ తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అక్టోబర్ 24న ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలతో పాటు మరో రెండు జట్లను ఎదుర్కోనుంది. -
అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ ఆల్రౌండర్ గుడ్బై
న్యూజిలాండ్ ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్హోమ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జింబాబ్వేలో పుట్టి పెరిగిన 36 ఏళ్ల గ్రాండ్హోమ్ 2004 వరకు జింబాబ్వే తరపున క్రికెట్ ఆడాడు. 2004లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్కప్లోనూ గ్రాండ్హోమ్ జింబాబ్వే తరపునే పాల్గొన్నాడు. ఆ తర్వాత 2006లో కుటుంబంతో కలిసి ఆక్లాండ్కు వలస వచ్చిన గ్రాండ్హోమ్ 2012లో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దాదాపు దశాబ్దం పాటు కివీస్కు ప్రాతినిధ్యం వహించిన గ్రాండ్హోమ్ మంచి ఆల్రౌండర్గా పేరు సంపాదించాడు. 29 టెస్టుల్లో 1432 పరుగులు.. 49 వికెట్లు, 45 వన్డేల్లో 742 పరుగులు.. 30 వికెట్లు, 41 టి20ల్లో 505 పరుగులు.. 12 వికెట్లు తీశాడు. గ్రాండ్హోమ్ ఖాతాలో టెస్టుల్లో రెండు సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉండగా.. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో కొలిన్ డి గ్రాండ్హోమ్ సభ్యుడు. ఇక 2019లో వన్డే ప్రపంచకప్ రన్నరప్గా నిలిచిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇక తన రిటైర్మెంట్పై గ్రాండ్హోమ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ''రిటైర్మెంట్ నిర్ణయం బాధిస్తున్నప్పటికి తప్పడం లేదు. గాయాల కారణంగా సరైన క్రికెట్ ఆడలేకపోతున్నానే ఫీలింగ్ కలుగుతుంది. ఫామ్లో లేను.. ఇలాంటి సమయంలో నేను రిటైర్ అయితే కనీసం కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. 2012లో కివీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బ్లాక్క్యాప్స్కు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. ఇన్నేళ్ల అంతర్జాతీయ కెరీర్ సాఫీగా సాగినందుకు గర్వపడుతున్నా. నా ఆట ముగింపుకు ఇదే సరైన సమయమని.. అందుకే ఈ నిర్ణయం'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లోనూ 2017 నుంచి 2019 మధ్య కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్కు ఆడిన గ్రాండ్హోమ్ 25 మ్యాచ్ల్లో 303 పరుగులు చేశాడు. చదవండి: AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్ -
మారని ఆటతీరు.. 'అదే కథ..అదే వ్యథ'
టీమిండియాతో సిరీస్లో వైట్వాష్ అయిన వెస్టిండీస్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. ఓడడానికే మ్యాచ్లు ఆడుతున్నామా అన్న చందానా విండీస్ ఆటలో 'అదే వ్యథ.. అదే కథ'గా కనిపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలోనూ వెస్టిండీస్ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కారణంగా విండీస్ టార్గెట్ను 41 ఓవర్లలో 212 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఛేధనలో ఏ మాత్రం పోరాటం చూపలేకపోయిన వెస్టిండీస్ 35.3 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో కివీస్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 2-0తో సిరీస్ను గెలిచింది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 96 పరుగులతో టాప్ స్కోరర్గా నిలచాడు. డారిల్ మిచెల్ 41, సాంట్నర్ 26 నాటౌట్ రాణించారు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో విండీస్ విజయానికి 41 ఓవర్లలో 212 పరుగుల టార్గెట్గా నిర్థేశించారు. కానీ విండీస్ టాపార్డర్, మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. టాప్ ఏడుగురు బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. చివర్లో యానిక్ కరియా 52, అల్జారీ జోసెఫ్ 49 పరుగులతో పోరాడే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. చివరికి161 పరుగులకు ఆలౌట్ అయింది. 96 పరుగులతో రాణించిన ఫిన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే రేపు(ఆదివారం) జరగనుంది. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. ఆరేళ్ల తర్వాత విండీస్ ఆటగాడు రీ ఎంట్రీ!
న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు వెస్టిండీస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు షిమ్రాన్ హెట్మైర్తో సహా ఆల్రౌండర్ కీమో పాల్, స్పిన్నర్ గుడాకేష్ మోటీ కివీస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. హెట్మైర్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్ నుంచి వైదొలగగా.. కీమో పాల్,మోటీ గాయం కారణంగా తప్పుకున్నారు. ఇక హెట్మైర్ స్థానంలో జెర్మైన్ బ్లాక్వుడ్ను విండీస్ క్రికెట్ ఎంపిక చేసింది. బ్లాక్వుడ్ టెస్టు క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నప్పటికీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతడికి గత కొన్నాళ్లుగా చోటు దక్కడం లేదు. బ్లాక్వుడ్ చివరగా 2015లో విండీస్ తరపున వన్డేల్లో ఆడాడు. ఇక గుడాకేష్ మోటీ స్థానంలో లెగ్ స్పిన్నర్ యాన్నిక్ కారియాకు చోటు దక్కింది. ఈ సిరీస్తో కారియా విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించడంతో కారియాను ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే న్యూజిలాండ్తో టీ20 సిరీస్ను కోల్పోయిన విండీస్ కనీసం వన్డే సిరీస్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. కింగ్స్టన్ ఓవల్ వేదికగా బుధవారం జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు మధ్య మూడు వన్డేలు కూడా కింగ్స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి. కివీస్తో వన్డే సిరీస్కు విండీస్ జట్టు నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, బ్లాక్వుడ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, యాన్నిక్ కారియా, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్. చదవండి: India Tour Of Zimbabwe: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్ -
వెస్టిండీస్తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్కు బిగ్ షాక్!
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు న్యూజిలాండ్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలర్ మాట్ హెన్రీ పక్కటెముక గాయం కారణంగా విండీస్ సిరీస్కు దూరమయ్యాడు. కాగా ఇటీవల ముగిసిన యూరప్ పర్యటనలో న్యూజిలాండ్ జట్టులో హెన్రీ భాగంగా ఉన్నాడు. ఇక గాయపడిన హెన్రీ స్థానంలో బెన్ సియర్స్ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. ఇక ఇప్పటి వరకు టీ20లకు మాత్రమే పరిమితమైన సియర్స్.. ఇప్పుడు వన్డేల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "గత వారం ప్రాక్టీస్ సెషన్లో ఎడమ వైపు పక్కటెముకకు గాయమైంది. దీంతో అతడు తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు.అతడి గాయం తీవ్రమైనది కానప్పటికీ.. మేము ఆడించి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. ఈ క్రమంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావించాము. అ అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాము" అని పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో విండీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి. చదవండి: WI vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన విండీస్! యువ స్పిన్నర్ ఎంట్రీ -
మారని ఆటతీరు.. మరో వైట్వాష్ దిశగా వెస్టిండీస్
వెస్టిండీస్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. ఇటీవలే టీమిండియాతో జరిగిన టి20 సిరీస్ను 0-3తో వైట్వాష్ చేసుకున్న వెస్టిండీస్.. తాజాగా కివీస్తో సిరీస్లోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే తొలి టి20లో పరాజయం పాలైన వెస్టిండీస్.. శుక్రవారం రాత్రి న్యూజిలాండ్తో జరిగిన రెండో టి20లోనూ 90 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(41 బంతుల్లో 76 పరుగులు, 4 ఫోర్లు, 6 సిక్సర్లు), డారిల్ మిచెల్(20 బంతుల్లో 48 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. కాన్వే 34 బంతుల్లో 42 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో ఒబెద్ మెకాయ్ 3, షెపర్డ్, ఓడియన్ స్మిత్ చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ బ్యాటర్లలో రోవ్మెన్ పావెల్ ఒక్కడే 20 పరుగుల మార్క్ను అందుకోగా.. మిగతావారు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఇష్ సోది, టిమ్ సౌతీ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు టి20ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలచింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆగస్టు 14న జరగనుంది. చదవండి: Andre Russell: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్ Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్గా -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన విండీస్! యువ స్పిన్నర్ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్తో వెస్టిండీస్ యువ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో విండీస్ తరపున 6 మ్యాచ్లు ఆడిన సింక్లెయిర్.. 8.33తో ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా తన లిస్ట్-ఏ కెరీర్లో 16 మ్యాచ్లు ఆడిన సింక్లెయిర్ 18 వికెట్లు సాధించాడు. మరో వైపు రోస్టన్ ఛేజ్ గాయం కారణంగా ఈ సీరీస్కు కూడా దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో విండీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి. కాగా ప్రస్తుతం విండీస్.. కివీస్తో టీ20 సిరీస్లో తలపడుతోంది. కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్పై న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో కివీస్ 1-0తో అధిక్యంలో ఉంది. కాగా స్వదేశంలో భారత్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లను విండీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కివీస్తో వన్డే సిరీస్కు విండీస్ జట్టు నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్. చదవండి: Asia Cup 2022: 'ఓపెనర్గా కేఎల్ రాహుల్ వద్దు.. అతడినే రోహిత్ జోడిగా పంపండి' -
రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్కున్న ట్యాగ్లైన్ ఉత్తదేనా!
న్యూజిలాండ్కు క్రికెట్లో ఎలాంటి వివాదాలు లేని జట్టు అనే పేరుంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లు తమ హుందాతనాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడ్డ దాఖలాలు కానీ.. కవ్వింపు చర్యలకు పాల్పడడం గానీ ఎరిగింది లేదు. ఒకవేళ జరిగినా కూడా గుర్తుంచుకునేంత పెద్దవి కావు. అలాంటి న్యూజిలాండ్కు "కూల్ జట్టు" అనే ట్యాగ్లైన్ ఉంది. ఇటీవలే కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన 16 ఏళ్ల కెరీర్కు ముగింపు పలికాడు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా న్యూజిలాండ్ క్రికెట్పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్రూమ్లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్ క్రికెట్లో సంచలనం కలిగిస్తోంది. టేలర్ వ్యాఖ్యలతో కివీస్కున్న ట్యాగ్లైన్ ఉత్తదేనా అనిపిస్తుంది. "నా 16 ఏళ్ల కెరీర్ అంతా సక్రమంగా జరిగిందనేది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ డ్రెస్సింగ్ రూమ్లో మీకు తెలియని వివక్ష ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కివీస్ క్రికెట్కు మంచి పేరు ఉంది. దానిని నేను చెడగొట్టదలచుకోలేను. కానీ సొంతజట్టుకు చెందిన కొందరు క్రికెటర్లు.. నా మొహం గురించి కామెంట్ చేసేవారు. నువ్వు న్యూజిలాండ్కు ఆడుతున్నప్పటికి నీలో ఆసియా మూలాలు కనిపిస్తున్నాయి. పొరపాటు మా దేశంలో క్రికెట్ ఆడుతున్నావనుకుంటా అని పేర్కొనేవాళ్లు. రాస్.. నువ్వు సగం మాత్రమే మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని ఒక తోటి క్రికెటర్ హేళన చేసేవాడు. ఇదంతా డ్రెస్సింగ్రూమ్ వరకు మాత్రమే పరిమితం. మళ్లీ మైదానంలోకి వచ్చామంటే అంతా మాములే. అందుకే న్యూజిలాండ్ క్రికెట్లో వివక్ష ఎక్కడా కంటికి కనబడదు.. కానీ అంతా తెరవెనుక జరుగుతుంది. అందుకే మా డ్రెస్సింగ్రూమ్ను నేను ఒక బారోమీటర్గా అభివర్ణిస్తున్నా. మొదట్లో అలా అంటుంటే ఏదో సరదాకు అంటున్నారులే అని అనుకునేవాడిని.. కొన్నాళ్లు పోయిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడడంతో వివక్షకు గురవుతున్నానని అర్థమయింది. జట్టులో నన్ను చాలా మంది భారతీయ లేదా ఆసియా మూలాలు ఉన్న క్రికెటర్గా చూసేవారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండే న్యూజిలాండ్ ప్రాంతంలో నా మూలాలున్న ఆటగాళ్లు చాలా తక్కువగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే డ్రెస్సింగ్రూమ్లో వివక్ష ఎదుర్కొన్నప్పటికి ఆ విషయాలను ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పటికి బయటికి చెప్పలేకపోయాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పాడు. టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్న్యూస్ గోల.. ఇది వారి పనేనా? SA vs ENG: టాప్ స్కోరర్గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు! -
పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్స్వీప్
నెదర్లాండ్స్తో జరిగిన రెండు మ్యాచ్ల టి20 సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన రెండో టి20లో న్యూజిలాండ్.. నెదర్లాండ్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్లు పసికూన జట్టుపై అర్థసెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నెద్లరాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బాస్ డి లీడే 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. టామ్ కూపర్ 26, స్కాట్ ఎడ్వర్డ్స్ 26 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికి ఆ తర్వాత మిచెల్ సాంట్నర్(42 బంతుల్లో 77 నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), డారిల్ మిచెల్(27 బంతుల్లో 51 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: NZ vs NED: కివీస్కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్.. -
కివీస్కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్..
నెదర్లాండ్స్ టూర్ను న్యూజిలాండ్ విజయంతో ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టి20లో కివీస్ 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం అందుకుంది. రెండు మ్యాచ్ల టి20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్టిన్ గప్టిల్ 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జేమ్స్ నీషమ్ 32 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. బాస్ డీ లీడి (53 బంతుల్లో 66, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నంతవరకు నెదర్లాండ్స్ విజయంపై ఆశలు పెంచుకుంది. ఒక సందర్భంలో ఈ డచ్ బ్యాటర్ న్యూజిలాండ్కు ముచ్చెమటలు పట్టించాడు. అయితే లీడీతో పాటు స్కాట్ ఎడ్వర్డ్స్(20 పరుగులు) ఔటైన తర్వాత డచ్ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4, బెన్ సీయర్స్ 3, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇవాళ(ఆగస్టు 8) జరగనుంది. చదవండి: Senior RP Singh: భారత్ను కాదని ఇంగ్లండ్కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
తమ టి20 చరిత్రలో అత్యధిక స్కోరు.. స్కాట్లాండ్పై భారీ విజయం
స్కాట్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టి20 సిరీస్ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం ఎడిన్బర్గ్ వేదికగా జరిగిన రెండో టి20లో కివీస్ 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఎవరు సెంచరీ మార్క్ అందుకోనప్పటికి వచ్చిన ప్రతీ బ్యాట్స్మెన్ బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు, మైకెల్ బ్రాస్వెల్(25 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్) స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోయగా.. మిగిలినవారిలో డారిల్ మిచెల్(19 బంతుల్లో 31), జేమ్స్ నీషమ్(12 బంతుల్లో 28), క్లెవర్(16 బంతుల్లో 28) రాణించారు. ఇక న్యూజిలాండ్కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా టి20ల్లో అత్యధిక స్కోరు అఫ్గనిస్తాన్ పేరిట ఉంది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అప్గానిస్తాన్ 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. క్రిస్ గ్రీవ్స్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. నీషమ్ 9 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చాప్మన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరుజట్ల మధ్య ఏకైక వన్డే మ్యాచ్ జూలై 31(ఆదివారం) జరగనుంది. చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఫీట్.. ఈ ఏడాదిలో టీమిండియా తొలి ఆటగాడిగా క్రికెట్ గ్రౌండ్లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..! -
IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్స్వీప్
బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో కివీస్ క్లీన్స్వీప్ చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(56), డార్లీ మిచెల్(48) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ రెండు వికెట్లు, యంగ్,డాక్రెల్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో స్టిర్లింగ్ 40 పరగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అడైర్ 37 పరుగులతో అఖరిలో మెరుపులు మెరిపించాడు. కివీస్ బౌలర్లలో టిక్నర్, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టగా..జాకబ్ డఫీ,మిచెల్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు వన్డే సిరీస్ను కూడా న్యూజిలాండే సొంతం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్కే వరించాయి. చదవండి: IND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు..! -
జింబాబ్వే, న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన ఆసీస్..!
స్వదేశంలో జింబాబ్వే, న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ సిరీస్లకు ఆ జట్టు స్టార్ పేసర్ పాట్ కమిన్స్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా సీనియర్ స్పిన్నర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక పర్యటనలో ఆసీస్ జట్టులో భాగమైన పలువురి ఆటగాళ్లను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లిస్, ఝే రిచర్డ్సన్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్లకు జట్టులో చోటు దక్కలేదు. ఇక రెండు సిరీస్లు నార్త్ క్వీన్స్లాండ్లో జరగనున్నాయి. ఆగస్టు 28న జింబాబ్వేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 6న న్యూజిలాండ్తో సిరీస్ మొదలుకానుంది. జింబాబ్వే, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లకు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జాంపా Rate this Aussie ODI squad out of 10 pic.twitter.com/LRJpqFL9M6 — cricket.com.au (@cricketcomau) July 18, 2022 చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! -
కివీస్ క్రికెట్లో ‘సమ’శకం.. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
క్రైస్ట్చర్చ్: ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్జెడ్సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్జెడ్సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్కే పరిమితం చేయకుండా ఎన్జెడ్సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టడం నిజంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే! ఇప్పుడు కివీస్ స్టార్లు విలియమ్సన్ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది. శాసించే చోట సమానత్వం అంతర్జాతీయ క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్. అది ప్రపంచకప్ అయినా... యాషెస్ సిరీస్ అయినా... ఆసియా కప్ అయినా పురుషాధిక్యమే మైదానంలో మెరుపుల్ని మెరిపిస్తుంది. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లను జమచేసుకుంటుంది. ఇలా శాసించే చోట సమానత్వం కొత్త ఒరవడే కాదు... ఆ బోర్డు చేసే సాహసమే! పురుషుల సిరీస్లకు వచ్చేంత రాబడి మహిళల ప్రపంచకప్కు రాదు. అయినప్పటికీ న్యూజిలాండ్ సమాన చెల్లింపుల విధానంతో ఏకంగా ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అనేది క్రికెట్లో పెద్ద సంచలనం. ఎన్జెడ్సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. -
అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్
నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ మైకెల్ రిప్పన్ అరుదైన ఘనత అందుకోనున్నాడు. క్రికెట్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఆ జాబితాలోకి మైకెల్ రిప్పన్ అడుగుపెట్టనున్నాడు. ఇంతకాలం నెదర్లాండ్స్కు ప్రాతినిధ్యం వహించిన రిప్పన్ ఇకపై న్యూజిలాండ్ తరపున ఆడనున్నాడు. యూరోపియన్ టూర్లో భాగంగా ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి అసోసియేట్ దేశాలతో కివీస్ జట్టు సిరీస్లు ఆడనుంది. దీనిలో భాగంగా ఆ టూర్లో పాల్గొనే ఆటగాళ్లను కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వచ్చే జూలై, ఆగస్టు నెలల్లో ఈ టూర్ జరగనుంది. మొదట ఐర్లాండ్తో మూడు వన్డేలు.. మూడు టి20లు ఆడనున్న న్యూజిలాండ్ ఆ తర్వాత ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో రెండు టి20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు సిరీస్లు ముగిసిన తర్వాత అమ్స్టర్డామ్ వేదికగా నెదర్లాండ్స్తో రెండు టి20 మ్యాచ్లు ఆడనుంది. కాగా ఐర్లాండ్తో వన్డేలకు టామ్ లాథమ్ కివీస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. ఐర్లాండ్తో టి20లు, స్కాట్లాండ్తో వన్డే, టి20లు, నెదర్లాండ్స్తో టి20లకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఐర్లాండ్తో వన్డే జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది నెదర్లాండ్స్, స్కాట్లాండ్తో సిరీస్లో పాల్గొననున్నారు. కాగా సౌతాఫ్రికాకు చెందిన మైకెల్ రిప్పన్ కుటుంబసభ్యులు 2013లో న్యూజిలాండ్కు వలస వచ్చారు. అయితే న్యూజిలాండ్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న రిప్పన్.. డచ్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్ తరపున 9 వన్డేలు, 21 టి20 మ్యాచ్లు ఆడిన రిప్పన్.. తాజాగా బ్లాక్ క్యాప్స్కు ఆడనున్నాడు. అయితే మైకెల్ రిప్పన్ ఐర్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక కాలేదు. కేవలం స్కాట్లాండ్, నెదర్లాండ్స్తో సిరీస్ల్లో ఆడనున్నాడు. ఇక ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఏదైనా సభ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు ఒక ఐసీసీలో పూర్తి స్థాయి జట్టుకు ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి పూర్తిస్థాయి జట్టుకు ఎంపికైతే మాత్రం మూడేళ్ల పాటు అసోసియేట్ దేశాలకు ఆడే వీలు మాత్రం ఉండదు. కాగా గతంలోనే ఇలా రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో ప్రస్తుత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్( ఐర్లాండ్, ఇంగ్లండ్), లూక్ రోంచి( న్యూజిలాండ్, ఆస్ట్రేలియా), మార్క్ చాప్మన్(హాంకాంగ్, న్యూజిలాండ్), గ్జేవియర్ మార్షల్(అమెరికా, వెస్టిండీస్),హెడెన్ వాల్ష్(అమెరికా, వెస్టిండీస్), డేవిడ్ వీస్(సౌతాఫ్రికా, నమీబియా)లు ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనలో వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్ ఐర్లాండ్ టి20, స్కాట్లాండ్ & నెదర్లాండ్స్తో కివీస్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ మైఖేల్ రిప్పన్, బెన్ సియర్స్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్ చదవండి: బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్కు హక్కు ఉంటుందా? ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్! -
మళ్లీ అదే స్టోక్స్.. 2019 వరల్డ్కప్ వివాదం గుర్తుకుతెచ్చేలా
2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓవర్ త్రో వివాదం అందరికి గుర్తుండే ఉంటుంది. ఒక్క ఓవర్ త్రో న్యూజిలాండ్ కొంపముంచగా.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. అప్పటి ఓవర్ త్రో వివాదానికి కేంద్ర బిందువు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సేమ్ అలాంటి సీన్నే రిపీట్ అయింది. ఇప్పుడు కూడా స్టోక్స్ ఉన్నాడు.. అదీ ఇంగ్లండ్ కెప్టెన్గా. అప్పుడు వివాదానికి దారి తీస్తే.. ఇప్పుడు మాత్రం నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇంగ్లండ్ గెలవాలంటే మూడు బంతుల్లో 9 పరుగులు కావాలి. చివరి ఓవర్ బౌల్డ్ వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని స్టోక్స్ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతిని అందుకున్న మార్టిన్ గప్టిల్ రనౌట్కు అవకాశం ఉండడంతో ఓవర్ త్రో వేశాడు. రెండో పరుగు కోసం వస్తున్న స్టోక్స్ బంతిని గమనించి క్రీజులోకి డైవ్ చేశాడు. ఈ క్రమంలో బ్యాట్కు తాకిన బంతి మిడ్ వికెట్ మీదుగా బౌండరీ వెళ్లింది. అయితే పైకి లేచిన స్టోక్స్.. మొకాళ్లపై కూర్చొని ''బ్యాట్కు బంతి తగిలడంతో బౌండరీ వెళ్లింది.. ఇందులో నా తప్పేం లేదని'' పేర్కొనడం వైరల్గా మారింది. ఊహించని పరిణామం చోటుచేసుకోవడంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తినగా.. అంపైర్ బౌండరీ సిగ్నల్ ఇవ్వడంతో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. ఆ తర్వాత మ్యాచ్ టై అవ్వడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఇన్నింగ్స్లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు. కాగా ఇంగ్లండ్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులోనూ అదే తరహా సీన్ మరోసారి రిపీట్ అయింది. ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్లో జో రూట్ మిడ్ వికెట్ దిశగా ఆడి స్టోక్స్ను క్విక్ సింగిల్కు పిలిచాడు. స్టోక్స్ స్పందించినప్పటికి.. అప్పటికే ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసి వెనక్కి పరిగెత్తాడు. అయితే ఈ క్రమంలో రనౌట్ చేద్దామని భావించిన ఫీల్డర్ ఓవర్ త్రో వేయడం.. అచ్చం అప్పటి తరహాలోనే స్టోక్స్ బ్యాట్ను తాకుతూ మిడ్ వికెట్ మీదుగా పరుగులు పెట్టింది. అప్పటికే క్రీజులోకి వచ్చేసిన స్టోక్స్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈసారి బౌండరీ రాలేదు. వెంటనే స్టోక్స్ బౌల్ట్ పక్కన నిలబడి బ్యాట్కు తాకి బంతి అలా వెళ్లిందని.. తన తప్పేం లేదని సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన రూట్.. నా తప్పు కూడా ఏం లేదు అన్నట్లుగా స్టోక్స్ను అనుకరించడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో ఇంగ్లండ్ బోణీ కొట్టేలానే కనిపిస్తోంది. 77 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ మరో 61 పరుగులు చేయాల్సి ఉంది.రెండో ఇన్నింగ్స్లోనూ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (110 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ENG vs NZ 2022: విజయానికి 61 పరుగుల దూరంలో ఇంగ్లండ్ Mitchell Marsh: 'భారత్లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు We've Seen This Before 😁#Cricket #ENGvNZ #2019WorldCup #TrentBoult #BenStokes #joeroot pic.twitter.com/4Aqi6FTJfK — CRICKETNMORE (@cricketnmore) June 4, 2022 -
అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మొదలైన తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలిరోజే 17 వికెట్లు కుప్పకూలాయి. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇరజట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 132 పరుగులకు చాప చుట్టేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. పిచ్ ఇలాగే ఉంటే మూడురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముంది. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు జరుగుతున్న లార్డ్స్ పిచ్ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ''లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో 17 వికెట్లు ఒకేరోజు కూలాయి.. బౌలర్ల స్కిల్ కనిపించింది. గతంలో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య అహ్మదాబాద్ టెస్టు(2021)లో మరి ఇదే స్థితి ఏర్పడింది. అప్పుడు పిచ్ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి ఇప్పుడేం మాట్లాడరా'' అంటూ చురకలంచటించాడు. అంతేకాదు లార్డ్స్ పిచ్ను ట్రోల్చేస్తూ.. సల్మాన్ నటించిన 'రెడీ' సినిమాలోని ''మైన్ కరూన్ తూ సాలా క్యారక్టెర్ దీలా హై'' అనే పాటను జతచేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ అహ్మదాబాద్ వేదికగా పింక్బాల్ టెస్టు(డే నైట్) ఆడింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజే 112 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ కూడా తొలి రోజే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 145 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా 22 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాధించింది. రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియా ముందు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలా పింక్బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు.. ఓవరాల్గా 11 వికెట్లు సాధించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ కూడా ఏడు వికెట్లు తీసి అక్షర్కు సహకరించాడు. అయితే ఈ టెస్టు ముగియగానే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ వరుస విమర్శలు సంధించాడు. ''నాసిరకం పిచ్ తయారు చేశారని.. ఇలాంటి పిచ్పై రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు'' అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. అయితే అప్పట్లో టీమిండియా అభిమానులు వాన్కు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. చదవండి: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. When 17 wkts fall in a day at Lord's, talk is about skills of the bowlers. When 17 wkts fall in a day at Ahmedabad, talk is about conditions. #ENGvNZ pic.twitter.com/2sl4n26Cn3 — Wasim Jaffer (@WasimJaffer14) June 3, 2022 -
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్తో ఇంగ్లండ్ దశ మారనుందా?
లండన్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య విఖ్యాత లార్డ్స్ స్టేడియంలో నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా వెటరన్ సీమర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వస్తున్నారు. వీళ్లిద్దరిని వెస్టిండీస్లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు నుంచి తప్పించారు. అయితే కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ మెకల్లమ్ కోరిక మేరకు ఇద్దరు అనుభవజ్ఞుల్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజి లాండ్ జట్టు తొలి రోజు నుంచే టెస్టు మ్యాచ్లో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు ఫుల్క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
భారత్పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి..
న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ మీ అందరికి గుర్తుండే ఉంటాడు. గతేడాది డిసెంబర్లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసి ఎజాజ్ పటేల్ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. తద్వారా టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఎజాజ్ పటేల్ కంటే ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఏ జెర్సీతో ఆ ఫీట్ సాధించాడో.. అదే జెర్సీని వేలం వేయబోతున్నట్లు తెలిపాడు. ఎజాజ్ పటేల్ తన టీషర్ట్ వేలం వేయడం వెనుక దాగున్న చిన్నకథను స్టఫ్ డాట్కామ్ వెబ్సైట్ రివీల్ చేసింది. గతేడాది ఎజాజ్ పటేల్ కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడింది. న్యూజిలాండ్లోని స్టార్షిప్ చిల్రన్ ఆసుపత్రిలో తన కూతురుకు చికిత్స చేయించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కొన్నిరోజులు ఉండాల్సి వచ్చింది. కొంచెం భయమైనప్పటికి ఎజాజ్ పటేల్ కూతురు తొందరగానే రికవరీ అయింది. అయితే తన కూతురును బాగు చేసిన ఆసుపత్రికి ఏదైనా చేయాలని భావించాడు. కొన్నిరోజుల క్రితం స్టార్షిప్ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగం చిన్న పిల్లల చికిత్స కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న ఎజాజ్ పటేల్ 10 వికెట్ ఫీట్ సాధించిన రోజున వేసుకున్న టీషర్ట్ను వేలానికి వేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ టీషర్ట్పై న్యూజిలాండ్ జట్టు సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎజాజ్ తన టీషర్డ్ను వేలానికి పెట్టాడు.. బుధవారం(మే 11తో) వేలం ముగియనుంది. ఇక టీమిండియాతో తొలి టెస్టులో 14 వికెట్లతో ఎజాజ్ పటేల్ మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టు ఓటమిపాలైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన భారత్ ఇన్నింగ్స్ను 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచగా.. కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మకు రెగ్యులర్ టెస్టు కెప్టెన్గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ తర్వాత జరిగిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్గా ‘టెన్’ రికార్డు -
భారత్ ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆసీస్; టి20ల్లో మనమే నెంబర్ వన్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం వార్షిక ర్యాంకింగ్స్ ప్రకటించింది. టి20ల్లో నెంబర్వన్గా టీమిండియా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా 270 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో.. 261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో.. 251పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే టెస్టుల్లో మాత్రం టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా ఐదేళ్ల పాటు టెస్టుల్లో టాప్ స్థానంలో కొనసాగిన భారత్కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఇటీవలే ఇంగ్లండ్ను 4-0తో, ఆ తర్వాత పాకిస్తాన్ను వారి గడ్డపైనే 1-0తో కమిన్స్ సేన ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా 128 పాయింట్లతో టీమిండియాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో భారత్ రెండోస్థానంలో నిలవగా.. 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. కోహ్లి నేతృత్వంలో టీమిండియా టెస్టుల్లో ఐదేళ్ల పాటు అంటే 2017 నుంచి 2022 వరకు వరుసగా ప్రతీ ఏడాది ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్లో టాప్ స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. మేజర్ టోర్నీలు గెలవలేదనే అపవాదు ఉన్న కోహ్లికి టెస్టుల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. టీమిండియా కెప్టెన్గా అత్యధిక టెస్టు విజయాలు చూసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు అందుకున్నాడు. భారత్కు 60 టెస్టుల్లో కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందించాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో రికార్డు స్థాయిలో 11 సిరీస్ విజయాలు సాధించింది. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విక్టరీ అందుకొని కోహ్లి సేన చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2021లో ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్లో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై సెంచురియన్ వేదికగా కెప్టెన్గా చారిత్రక విజయాన్ని అందుకున్న కోహ్లి.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులు ఓడిపోయి సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్ తర్వాత కోహ్లి కెప్టెన్గా తప్పుకోవడం.. రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. ఆ తర్వాత స్వదేశంలోన్యూజిలాండ్, వెస్టిండీస్లతో టెస్టు సిరీస్ను భారత్ గెలుచుకుంది. ఇక వన్డేల్లో న్యూజిలాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..ఇంగ్లండ్ 124 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడోస్థానంలో ఉండగా.. భారత్ 105 పాయింట్లతో నాలుగోస్థానానికి పరిమితమైంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. India stay on top of the ICC men's T20I team rankings 🇮🇳 South Africa, Australia, Bangladesh and Sri Lanka rise; New Zealand and Afghanistan fall in the annual points update 👀 📸: ESPNcricinfo#ICCRankings #Cricket #CricketTwitter pic.twitter.com/5RUlOURy5D — CricStats (@_CricStats_) May 4, 2022 -
ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
మెల్బోర్న్: పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. ఈ రెండు దేశాల కోసం 300 అథ్లెట్ల కోటా కింద ఒక్కో దేశానికి 150 మంది చొప్పున పంపాలని ఓసీఏ కోరింది. అయితే ఓసీఏ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీలు తిరస్కరించాయి. ఆసియా క్రీడల్లో తమ దేశాల క్రీడాకారులను పంపించలేమని తెలిపాయి. -
World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. విండీస్పై భారీ విజయం.. ఏకంగా
ICC Women ODI World Cup 2022: Updates: 1: 23 PM ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 155 పరుగుల భారీ తేడాతో విండీస్పై గెలుపొందింది. 1: 10 PM తొమ్మిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. విజయానికి అడుగుదూరంలో భారత మహిళా జట్టు. స్కోరు: 158/9 (37) 1: 05 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12: 58 PM 34 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ స్కోరు: 155/7. 12: 34 PM వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ మిడిలార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో 28 ఓవర్లకే టేలర్ బృందం 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత స్కోరు: 145/7 (28). ఇక భారత్పై విజయం సాధించాలంటే 173 పరుగులు అవసరం. 12: 21 PM: వెస్టిండీస్ మహిళా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓపెనర్లు మెరుపులు మెరిపించినా.. మిడిలార్డర్ విఫలం కావడంతో 24 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో చినెలె హెన్రీ ఆరో వికెట్గా వెనుదిరిగింది. 12: 15: వెస్టిండీస్కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే స్నేహ్ రాణా, మేఘన రెండేసి వికెట్లు తీయగా... కాంప్బెల్ను ఐదో వికెట్గా పూజా వస్త్రాకర్ పెవిలియన్కు పంపింది. 11: 55 AM: ఆరంభంలో ధాటిగా ఆడిన విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతోంది. హేలీ మాథ్యూస్ రూపంలో నాలుగో వికెట్ డౌన్ అయింది. స్నేహ్ రాణా అద్భుత బౌలింగ్లో హేలీ 43 పరుగుల వద్ద నిష్క్రమించింది. విండీస్ ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసిన ఇద్దరు ఓపెనర్లు డాటిన్, హేలీని స్నేహ్ పెవిలియన్ను పంపి భారత్కు బ్రేక్ ఇచ్చింది. 11: 52 AM: కెప్టెన్ టేలర్ రూపంలో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. మేఘనా సింగ్ బౌలింగ్లో వికెట్ కీపర్ రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 11: 49 AM: 17 ఓవర్లలో విండీస్ స్కోరు: 112/2 స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్న విండీస్ బ్యాటర్లకు భారత బౌలర్లు మేఘనా సింగ్, స్నేహ్ రాణా బ్రేకులు వేశారు. డాటిన్(62 పరుగులు)ను స్నేహ్ పెవిలియన్కు చేర్చగా.. వన్డౌన్లో క్రీజులోకి వచ్చిన నైట్ను మేఘన అవుట్ చేసింది. 11: 07 AM: దీటుగా బదులిస్తున్న వెస్టిండీస్ మహిళా జట్టు ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్లపై సంచలన విజయాలు సాధించిన విండీస్ భారత్తో మ్యాచ్లోనూ సత్తా చాటుతోంది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 10 ఓవర్లలో 81 పరుగులు చేసింది. భారత్ విసిరిన సవాల్కు దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ డియాండ్ర డాటిన్ 36బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ హేలీ 32 పరుగులు చేసింది. పది ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 81-0 స్మృతి, హర్మన్ మెరుపులు.. భారత్ భారీ స్కోరు 10: 08 AM న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో భారత మహిళా జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(123), వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(109) అద్భుత సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వాళ్లలో యస్తికా భాటియా(31 పరుగులు), పూజా వస్త్రాకర్(10) తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 10: 03 AM ఎనిమిదో వికెట్డౌన్ ఝులన్ గోస్వామి రూపంలో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 10 AM: ఆఖర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అనిసా మహ్మద్ బౌలింగ్లో పూజా వస్త్రాకర్ అవుట్ కాగా.. అలియా హర్మన్ను పెవిలియన్కు పంపింది. దీంతో 49 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. 9: 52 AM: భారత్ ప్రస్తుత స్కోరు: 296/5 (47) 9: 49 AM: విండీస్ బౌలర్ అలియా రిచా ఘోష్ను పెవిలియన్కు పంపింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిచా క్రీజు వీడింది. తద్వారా భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రిచా స్థానంలో పూజా వస్త్రాకర్ మైదానంలో దిగింది. 9: 46 AM: హర్మన్ చేసెను అద్భుతం భారత బ్యాటర్, వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత సెంచరీ సాధించింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసింది. 9: 32 AM: 44 ఓవర్లలో భారత్ స్కోరు: 268/4 (44) హర్మన్ ప్రీత్ కౌర్-83, రిచా ఘోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9: 25 AM: స్మృతి అవుట్: సెంచరీ సాధించి జోరు మీదున్న స్మృతి అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది. షమీలియా బౌలింగ్లో సెల్మాన్కు క్యాచ్ ఇచ్చి 123 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె నిష్క్రమించింది. రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 264/4 (42.5) 9: 23 AM: దంచి కొడుతున్న స్మృతి, హర్మన్ విండీస్లో మ్యాచ్లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ దంచి కొడుతున్నారు. 42 ఓవర్లలో భారత్ స్కోరు: 257-3 9: 16 AM: శెభాష్ మంధాన విండీస్తో మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శతకం సాధించింది. విండీస్ బౌలర్ హేలీ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు వైస్ కెప్టెన్ హర్మన్ కూడా అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు మీదుంది. 9: 06 AM శతకానికి చేరువవుతున్న స్మృతి మంధాన. 99 బంతుల్లో 94 పరుగులు 9: 00 AM: 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 190-3 మంధాన, హర్మన్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8: 33 AM: 30 ఓవర్లలో భారత్ స్కోరు: 160/3 స్మృతి మంధాన 65, హర్మన్ప్రీత్ కౌర్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. మంధాన హాఫ్ సెంచరీ 8: 18 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న స్మృతి మంధాన 67 బంతుల్లో 53 పరుగులు సాధించిన భారత ఓపెనర్ ధాటిగా ఆడుతున్న మంధాన 8:15 AM: 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 125-3 స్మృతి మంధాన 44, హర్మన్ప్రీత్ కౌర్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 7: 55 AM: 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు- 100-3. స్మృతి మంధాన 32 పరుగులు, హర్మన్ప్రీత్ కౌర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ల శుభారంభం.. కానీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సెడాన్ పార్కు వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్లో భారత మహిళా జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31 పరుగులు) శుభారంభం అందించారు. అయితే, కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి నిరాశ పరిచింది. కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరింది. తుది జట్లు: భారత్: యస్తికా భాటియా, స్మృతి మంధాన, దీప్తి శర్మ, మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్ వెస్టిండీస్: డియేండ్ర డాటిన్, హేలీ మాథ్యూస్, కైసియా నైట్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్(కెప్టెన్), షిమానె కాంప్బెల్, చెడాన్ నేషన్, చినెల్లె హెన్రీ, అలియా అలెన్, షమీలియా కానెల్, అనిసా మహ్మద్, షకేరా సెల్మాన్. చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్లోకి రీఎంట్రీ View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియా బౌలర్ అరుదైన ఫీట్.. చరిత్రకు అడుగుదూరంలో
మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. ఆస్ట్రేలియన్ మహిళా బౌలర్ లిన్ ఫుల్స్టన్తో కలిసి గోస్వామి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఉమెన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 9 ఓవర్లో కేటీ మార్టిన్ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ను అందుకుంది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్లు ఆడిన గోస్వామి.. కేటీ మార్టిన్ వికెట్తో కలిపి 39 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్స్టన్ 39 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గోస్వామి ఆమె సరసన చేరింది. రాబోయే మ్యాచ్ల్లో గోస్వామి ఒక వికెట్ తీస్తే చాలు.. మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కనుంది. ఇక 37 వికెట్లతో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ కరోల్ హోడ్జెస్ రెండో స్థానంలో.. క్లేరీ టేలర్(ఇంగ్లండ్) 36 వికెట్లతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ ఫిట్జ్ పాట్రిక్ 33 వికెట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాథర్వెయిట్ 75, అమిలియా కెర్ 50 పరుగులతో రాణించారు. చదవండి: Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్లు తయారు చేయకండి' -
ప్రొటిస్ పేసర్ల దెబ్బ.. న్యూజిలాండ్ తడబాటు
క్రైస్ట్చర్చ్: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు కగిసో రబడ (3/37), మార్కో జాన్సెన్ (2/48) ధాటికి రెండో టెస్టులో న్యూజిలాండ్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా స్కోరుకు కివీస్ 207 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం గ్రాండ్హోమ్ (54 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), మిచెల్ (29 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 238/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా133 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు, హెన్రీ మూడు వికెట్లు తీశారు. -
స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్ రీ ఎంట్రీ కదా!
Smriti Mandhana Catch: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్తో మెరిసింది. క్వారంటైన్ నిభందనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్లో.. సోఫియా డివైన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధాన డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. కాగా మంధాన క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(68), బేట్స్(41),డివైన్(32) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్,దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్(52), మిథాలీ రాజ్(30) పరుగలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో కేర్, జానేసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జేస్ కేర్ చెరో రెండు వికెట్లు సాధించారు. Oh YAAAS! Smriti Mandhana!!#NZvIND #CricketTwitter pic.twitter.com/0fy0JJ60BE — Krithika (@krithika0808) February 22, 2022 -
స్మృతి మంధాన రీ ఎంట్రీ.. ఇప్పటికైనా గెలిచేనా!
క్వీన్స్టౌన్లో నేడు భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. క్వారంటైన్ కారణంగా తొలి మూడు మ్యాచ్లకు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 0–3తో సిరీస్ కోల్పోయిన మిథాలీ సేన మిగిలిన మ్యాచ్లలోనైనా గెలిచి వరల్డ్ కప్కు ముందు కోలుకోవాలని భావిస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ ‘అమెజాన్ ప్రైమ్’లో ప్రసారమవుతుంది. -
రెండో వన్డేలోనూ టీమిండియా మహిళా జట్టు ఓటమి
న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా వుమెన్స్ జట్టు రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ అమిలియా కెర్ అద్భుత సెంచరీతో భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా ఐదు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్(81 బంతుల్లో 66 నాటౌట్, 3 ఫోర్లు), రిచా ఘోష్(64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించారు. ఓపెనర్ సబ్బినేని మేఘన 49 పరుగులతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో డివైన్ 2 వికెట్లు తీయగా.. అమిలా కెర్, ఫ్రాన్ జోనస్, రోస్మేరీ మెయిర్, జెస్ కెర్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్(135 బంతుల్లో 119 నాటౌట్, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మిగతావారిలో మ్యాడీ గ్రీన్(61 బంతుల్లో 52,5 ఫోర్లు), సోఫి డివైన్ 33 పరుగులతో రాణించారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో దీప్తి శర్మ 4, పూనమ్ యాదవ్, హర్మన్ప్రీత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్ తలా ఒక వికెట్ తీశారు. -
గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు
న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డెవన్ కాన్వే కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజే కాన్వే సెంచరీ బాదాడు. కాగా 2022 క్రికెట్లో డెవన్ కాన్వేది తొలి సెంచరీ కావడం విశేషం. అయితే టి20 ప్రపంచకప్ సందర్భంగా ఒక మ్యాచ్లో తాను ఔటయ్యాననే కోపంతో తన కుడిచేతిని బ్యాట్కు బలంగా కొట్టుకున్నాడు. దీంతో చేతికి గాయం కావడంతో దాదాపు ఏడు వారాలు జట్టుకు దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న కాన్వే స్వదేశంలో బంగ్లాదేశ్తో జనవరి 1న ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్లో తొలిరోజే సెంచరీ సాధించి సూపర్ కమ్బ్యాక్ ఇచ్చాడు. చదవండి: Team India Schedule 2022: బిజీ బిజీగా టీమిండియా.. 2022లో ఆడనున్న మ్యాచ్లు ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టెస్టును ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ టామ్ లాథమ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరినప్పటికి.. విల్ యంగ్(52) ఆకట్టుకోగా.. వన్డౌన్లో వచ్చిన కాన్వే 122 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 80 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ 17, టామ్ బ్లండెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. చదవండి: Kieron Pollard: కెప్టెన్గా పొలార్డ్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్ Two hundreds and two fifties in his first seven Test innings! Devon Conway returns from injury with a 💯 🙌 #NZvBAN — ESPNcricinfo (@ESPNcricinfo) January 1, 2022 -
ఒక్క వికెట్ పడగొట్టు అక్షర్.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు!
KS Bharat makes a cheeky remark to Axar Patel during Kanpur Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అద్బుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. మూడో రోజు ఆటను న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. అయితే ఆశ్విన్ బౌలింగ్లో విల్ యంగ్ను అద్బుతమైన క్యాచ్తో భరత్ పెవిలియన్కు పంపాడు. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. అంతేకాకుండా భరత్.. టామ్ లాథమ్ను స్టంప్ ఔట్ చేయగా, రాస్ టేలర్ క్యాచ్ కూడా అందుకున్నాడు. కాగా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్ను టామ్ బ్లండెల్, కైల్ జామీసన్ అదుకోనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్టంప్స్ వెనుక నుంచి భరత్.. బౌలింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ను ఉత్సాహపరుస్తూ హిందీలో సరదాగా కామెంట్ చేశాడు. 'ఏక్ గిర్నే సే లైన్ లాగేగీ పీచే'( ఒకే ఒక వికెట్ తీయు అక్షర్, తరువాత లైన్ కడతారు) అంటూ ఉత్సాహపరిచాడు. ఆ తరువాత కొద్ది సేపటికే.. అక్షర్ బౌలింగ్లో బ్లండెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అంతేకాకుండా ఆశ్విన్ బౌలింగ్లో కూడా నల్ల పోద్రియే( నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తున్నావు) అంటూ భరత్ తమిళంలో వాఖ్యలు చేశాడు. మెడ నొప్పితో మూడో రోజు ఆటకు దూరమైన వృద్దిమాన్ సహా స్ధానంలో శ్రీకర్ భరత్ సబ్స్ట్యూట్గా వచ్చాడు. చదవండి: Ind Vs Nz 1st Test Day 4: సౌథీ దెబ్బ.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ -
రోహిత్ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?
Rohit Sharma left stunned as fan Breaches Security: రాంఛీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వద్దకి వెళ్లిన ఆ అభిమాని అమాంతం పాదాలపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. అయితే ఆటగాళ్ల భద్రతపై పలువురు మాజీలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు అభిమానులు ఇలా మైదానంలో దూసుకొచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో ధాటిగా ఆడిన చివర్లో చేతులు ఎత్తేసింది. గప్టిల్(31),డారిల్ మిచెల్(31), గ్లెన్ ఫిలిప్స్ (34) రాణించడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు రాహుల్(65), రోహిత్ (55)శర్మ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తరువాత వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్.. పంత్, వెంకటేశ్ అయ్యర్ లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: IND Vs NZ 2nd T20: రెండో టి20లో విజయం.. టీమిండియాదే సిరీస్ And a fan stormed into the field!!! The fellow sitting beside me, “ab maar khaaye chahe jo ho uska Sapna poora ho gaya! Ab yeh Ranchi mein Hatia mein Jharkhand mein poore India mein famous ho gaya!!” #IndiaVsNewZealand #INDVsNZT20 #fans #CricketTwitter pic.twitter.com/6NsIQDY0fO — Sunchika Pandey/संचिका पाण्डेय (@PoliceWaliPblic) November 19, 2021 -
డెవాన్ కాన్వే స్ధానంలో స్టార్ ఆల్రౌండర్కు చోటు..
Daryl Mitchell to replace Devon Conway: టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్ భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కీవిస్ మూడు టీ20లు, రెండు టెస్ట్లు ఆడనుంది. అయితే భారత్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన ఆజట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే టీ20 ప్రపంచకప్లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ మెగా టోర్నెమెంట్ ఫైనల్కు, భారత పర్యటనకు దూరమయ్యాడు. దీంతో గాయపడిన కాన్వే స్ధానంలో ఆజట్టు ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ను భారత్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేశారు. ఇక ఆ జట్టు ఫైనల్కు చేరడంలో డారిల్ మిచెల్ కీలకమైన పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్-2021లో కివీస్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా నవంబర్17న జైపూర్ వేదికగా జరగనున్న తొలి టీ0 మ్యాచ్తో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభంకానుంది. చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్గా, కార్పెంటర్గా.. చివరకు... -
T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే
Tim Seifert Replace Devon Conway For T20 WC 2021 Final.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్కు గాయం కారణంగా స్టార్ బ్యాట్స్మన్ డెవన్ కాన్వే దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ స్టీఫెర్ట్ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగనున్న టి20 సిరీస్కు కూడా స్టీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. ఇక టిమ్ స్టీఫెర్ట్ న్యూజిలాండ్ తరపున 36 టి20ల్లో 703 పరుగులు చేశాడు. చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్ ఇక నవంబర్10న ఇంగ్లండ్తో జరిగిన తొలి సెమిఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్కు చేరడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్స్టోన్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కొంత అసహనానికి గురైన కాన్వే.. చేతితో బ్యాట్ను గట్టిగా గుద్దాడు. దీంతో అతడి కుడి చేతి ఎముక విరిగింది. దీంతో విచిత్రరీతిలో కాన్వే టి20 ప్రపంచకప్ నుంచి దూరమవ్వాల్సి వచ్చింది. చదవండి: Marnus Labuschagne: పక్కకు పోతుందని వదిలేశాడు.. మైండ్బ్లాక్; లబుషేన్ అద్భుతం -
పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్వన్ కాకపోవచ్చు
New Zeland May Not Become No1 In T20s After Winning T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో నవంబర్ 14న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ సూపర్ ఫామ్లో ఉంది. ఎంతలా అంటే అటు వన్డేల్లో.. ఇటు టెస్టుల్లో నెంబర్వన్ స్థానంలో ఉంది. ఇక టి20ల్లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ టి20ల్లోనూ నెంబర్ వన్ అయితే అన్ని ఫార్మాట్లలోనూ ఏకకాలంలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా కొత్త రికార్డు సృష్టిస్తుంది. అయితే పాపం న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ కొట్టినప్పటికీ నెంబర్వన్ స్థానానికి చేరుకోవడం కష్టమే. చదవండి: Daryl Mitchell-Marcus Stoinis: 12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు ప్రస్తుతం ఇంగ్లండ్ 278 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 264 పాయింట్లతో టీమిండియా రెండో స్థానం.. 263 పాయింట్లతో పాకిస్తాన్ మూడోస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 258 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఫైనల్లో ఓడించినప్పటికి 20 పాయింట్లు రావడం కష్టమే. కివీస్ కంటే ముందు టీమిండియా, పాకిస్తాన్లు ఉన్నాయి. ఒకవేళ విశ్వవిజేతగా నిలిస్తే కివీస్ వాటిని అధిగమించి రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. అయితే కివీస్ టి20ల్లో నెంబర్వన్ కావాలంటే టీమిండియాతో జరగనున్న మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ గెలవాలని ఆశిస్తున్న భారత అభిమానులు.. టీమిండియాతో జరిగే టి20 సిరీస్లో మాత్రం కివీస్ ఓడిపోవాలని కోరుకోవడం విశేషం. ఇక నవంబర్ 17 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ జరగనుంది. చదవండి: Virender Sehwag: హసన్ అలీని తప్పుబడుతున్నారు.. మరి అఫ్రిది చేసిందేంటి -
12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా
Daryl Mitchell, Marcus Stoinis Played Same Team Before 12 Years.. టి20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 14న జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టగా.. అటు ఆస్ట్రేలియా పాకిస్తాన్ను ఓడించి తుది సమరానికి సిద్ధమైంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ హీరోగా నిలిస్తే.. ఇటు పాకిస్తాన్తో మ్యాచ్లో వేడ్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టోయినిస్ అంతే ప్రముఖపాత్ర పోషించాడు. చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. మిచెల్, స్టోయినిస్లు ఇద్దరు 12 ఏళ్ల క్రితం ఒక టోర్నీలో కలిసి ఆడారు. కలిసి ఆడడమే కాదు.. ఏకంగా కప్ను కూడా అందించారు. విషయంలోకి వెళితే 2009లో మిచెల్, స్టోయినిస్లు ప్రీమియర్షిప్ క్రికెట్ టోర్నీలో స్కార్బరో అనే టీమ్కు ప్రాతినిధ్యం వహించారు. సెమీఫైనల్లో స్టోయినిస్ (189 పరుగులు ) సూపర్ శతకంతో మెరవడంతో స్కార్బరో ఫైనల్కు చేరింది. ఇక బేస్వాటర్-మోర్లీతో జరిగిన ఫైనల్లో డారిల్ మిచెల్ అనూహ్యంగా బౌలింగ్లో మెరిశాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. అలా ఈ ఇద్దరు కలసి స్కార్బరో కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా మిచెల్, స్టోయినిస్లు టి20 ప్రపంచకప్ ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. చదవండి: Gautam Gambhir: అనూహ్యంగా సిక్స్ కొట్టిన వార్నర్.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’ -
వారెవ్వా న్యూజిలాండ్.. దెబ్బకు దెబ్బ తీసింది
New Zeland Enters 1st Time Final In T20 World Cup History.. టి20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్ ఫైనల్కు చేరింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్కు అర్హత సాధించింది. తద్వారా 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న న్యూజిలాండ్ తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇక మ్యాచ్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్కు పెద్దగా అవకాశాలివ్వకుండా జాగ్రత్తపడింది. అయితే ఒకటి రెండుచోట్ల ఇంగ్లండ్ ఆటగాళ్లు క్యాచ్లు పట్టుకోవడంలోనూ.. ఫీల్డింగ్ మిస్ చేయడంలో విఫలమైంది. ఇక కివీస్ ఓపెనర్ డారెల్ మిచెల్ (72 పరుగులు, 47 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో నీషమ్(11 బంతుల్లో 27 పరుగులు) 3 సిక్సర్లతో హోరెత్తించి న్యూజిలాండ్ విజయానికి బాటలు పరిచాడు. -
మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది
Chris Jordan Spectacular Fielding Denies Six.. టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో క్రిస్ జోర్డాన్ అద్భుతాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టుకు సిక్స్ లభించింది. విషయంలోకి వెళితే..ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఐదో బంతిని డారిల్ మిచెల్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే లాంగాఫ్లో ఉన్న క్రిస్ జోర్డాన్ గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో దాదాపు బంతిని అందుకున్నట్లుగానే కనిపించాడు. కానీ పట్టుతప్పిన జోర్డాన్ బౌండరీలైన్ అవతల పడ్డాడు. దీంతో న్యూజిలాండ్కు సిక్స్ వచ్చింది. కాగా న్యూజిలాండ్ ఓపెనర్ డారిల్ మిచెల్ అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో చేసిన ఫీట్ అందరికి గుర్తుండే ఉంటుంది. దాదాపు ఇదే తరహాలో మిచెల్ గాల్లోకి ఎగురుతూ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే పట్టుతప్పి బౌండరీ లైన్మీద పడే అవకాశం ఉండడంతో అతను కిందపడేలోపే బంతిని బౌండరీ ఇవతలకు విసిరాడు. అలా జట్టుకు నాలుగు పరుగులు కాపాడాడు. ప్రస్తుతం క్రిస్ జోర్డాన్ ఫీల్డింగ్ మూమెంట్ వైరల్గా మారింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది. అంటూ కామెంట్ చేశారు. -
ENG vs NZ: మిచెల్ మెరుపులు.. ఫైనల్కు తొలిసారిగా న్యూజిలాండ్
మిచెల్ మెరుపులు.. ఫైనల్కు న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఓపెన్ డారెల్ మిచెల్(42 బంతుల్లో 72, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు. కాగా ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4), కెప్టెన్ కేన్ విలియమ్సన్(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన డెవన్ కాన్వే 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో జేమ్స్ నీషమ్ 11 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్తో 27 పరుగులు కొట్టి కివీస్ను ఒత్తిడి నుంచి బయటపడేశాడు. ఇక ఓపెనర్ డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ ఆధ్యంతం నిలకడైన ఇన్నింగ్స్ కొనసాగించి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్స్టోన్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. ఇక టి20 ప్రపంచకప్ల్లో న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక గురువారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న సెమీఫైనల్ 2 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. కాన్వే(46) ఔట్.. న్యూజిలాండ్ 102/3 ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ కాన్వే(46) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్, కాన్వేలిద్దరు కలసి మూడో వికెట్కు 82 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. ఈ దశలో కాన్వే లివింగ్స్టోన్ బౌలింగ్లో అనవసర షాట్కు యత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం మిచెల్ 44, ఫిలిప్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 27 పరుగులు, డెవన్ కాన్వే 26 పరుగులతో ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్(5) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన కివీస్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్(5) ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 12, డెవన్ కాన్వే 14 పరుగులతో ఆడుతున్నారు. గప్టిల్(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో గప్టిల్ మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 166/4.. న్యూజిలాండ్ టార్గెట్ 167 న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వన్డౌన్లో వచ్చిన డేవిడ్ మలాన్(42) రాణించాడు. మలాన్ ఔటైన అనంతరం వచ్చిన మొయిన్ అలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ ఓవరాల్గా 51 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఇష్ సోధీ, ఆడమ్ మిల్నే, నీషమ్ తలా ఒక వికెట్ తీశారు. 16 ఓవర్లలో ఇంగ్లండ్ 119/3 సమయం:20:52.. 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మొయిన్ అలీ 32, లివింగ్స్టోన్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 42 పరుగులు చేసిన మలాన్ సౌథీ బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డేంజర్ మ్యాన్ బట్లర్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 20:15.. ఓపెనర్ జాస్ బట్లర్(29) రూపంలో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ఇష్ సోథీ బౌలింగ్లో బట్లర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. మలన్ 10, మొయిన్ అలీ 2 పరుగులతో ఆడుతున్నారు. కేన్ మామ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 20:00.. మిల్నే బౌలింగ్లో కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్కు ఓపెనర్ బెయిర్ స్టో(13) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. బట్లర్ 29, మలాన్ 5 పరుగుతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 29/0 సమయం: 19:47.. న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. బట్లర్ 17, బెయిర్ స్టో 7 పరుగులతో ఆడుతున్నారు. అబుదాబి: టి20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్ ఫెవరెట్గా కనిపిస్తుంది. ఇక గ్రూఫ్-2లో న్యూజిలాండ్ పాకిస్తాన్పై ఓటమి మినహా మిగతా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి సెమీస్కు అర్హత సాధించింది. అబుదాబి వేదికగా ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ మాత్రం ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడిపోయింది. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 21సార్లు తలపడగా.. ఇంగ్లండ్ 13సార్లు.. న్యూజిలాండ్ 7 సార్లు గెలిచాయి. ఇక టి20 ప్రపంచకప్ల్లో ఐదుసార్లు తలపడగా.. ఇంగ్లండ్ మూడుసార్లు.. న్యూజిలాండ్ రెండుసార్లు విజయం సాధించాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో జాస్ బట్లర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అటు న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. ఇక చివరిసారి ఐసీసీ మేజర్ ఈవెంట్ పరంగా చూస్తే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ : జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్