అంతా బూమ్రానే చేశాడు! | New Zealand would have won both the series 2-1, if Jasprit Bumrah wasn’t playing, saysStyris | Sakshi
Sakshi News home page

అంతా బూమ్రానే చేశాడు!

Published Thu, Nov 9 2017 4:08 PM | Last Updated on Thu, Nov 9 2017 4:08 PM

New Zealand would have won both the series 2-1, if Jasprit Bumrah wasn’t playing, saysStyris - Sakshi

తిరువనంతపురం:భారత్ తో జరిగిన వన్డే, ట్వంటీ 20 సిరీస్ లను కోల్పవడానికి ప్రధాన కారణం పేసర్ జస్ఫ్రిత్ బూమ్రానే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్. ఒకవేళ భారత జట్టులో బూమ్రా లేకపోతే రెండు సిరీస్ లను 2-1 తో న్యూజిలాండ్ గెలిచేదని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు.

' మాతో జరిగిన  పరిమిత ఓవర్ల సిరీస్ లో బూమ్రా ఆడకుంటే ఫలితం మరొలా ఉండేది. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన బూమ్రా.. న్యూజిలాండ్ నుంచి సిరీస్ ను లాగేసుకున్నాడు'అని ఈ సిరీస్ కు వ్యాఖ్యాతగా వ్యహరించిన స్టైరిస్ పేర్కొన్నాడు. టీ 20 సిరీస్ లో బూమ్రా తొమ్మిది వికెట్ల రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. ఆఖరి ట్వంటీ 20లో తన చివరి రెండు ఓవర్లను పూర్తి చేసే క్రమంలో బూమ్రా 2/9 తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా ఆఖరి వన్డేలో భారత్ ఆరు పరుగులతో విజయం సాధించింది. దాంతో సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ లో బూమ్రా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, పించ్ హిట్టర్ మిచెల్ సాంట్నార్ వికెట్లను ఖాతాలో వేసుకుని విజయంలో పాలు పంచుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement