
మా తొలి లక్ష్యం సెమీస్కు చేరడం: మిథాలీ
స్వదేశంలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్లో సెమీస్కు చేరడం భారత జట్టు తొలి లక్ష్యమని కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై సిరీస్ విజయాలు సాధించడంతో జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపింది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల కెప్టెన్లతో కలిసి మిథాలీ బెంగళూరులో మీడియా సమావేశంలో పాల్గొంది.