సింగపూర్: మహిళల టెన్నస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్లో సానియా, కారా బ్లాక్ (జింబాబ్వే) 4-6 7-5 11-9 స్కోరుతో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్), స్రెబోట్నిక్ (స్లొవేనియా)పై విజయం సాధించారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన పోరులో సానియా జోడీ సూపర్ టై బ్రేక్ మ్యాచ్ను వశం చేసుకుంది. సానియా జంట ఫైనల్లో సు-వీ హ్సీ (చైనీస్ తైపీ), ష్వాయ్ పెంగ్ (చైనా)తో తలపడనుంది.
ఫైనల్లో సానియా మీర్జా జోడీ
Published Sat, Oct 25 2014 8:26 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement