భారత షట్లర్ అరవింద్ భట్ డచ్ ఓపెన్లో ముందంజ వేశారు.
అల్మెరె (నెదర్లాండ్స్): భారత షట్లర్ అరవింద్ భట్ డచ్ ఓపెన్లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్లో భట్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో భట్ 11-7, 11-9, 11-8 స్కోరుతో స్కాట్లాండ్ షట్లర్ కీరన్ మెరీలెస్పై విజయం సాధించాడు. భట్ 28 నిమిషాల్లో మ్యాచ్ను ముగించాడు. రెండో రౌండ్లో హాంకాంగ్ ఆటగాడు యన్ కిట్ చన్తో ఆడనున్నాడు.