సౌందర్య ‘సెంచరీ’ | soundarya century | Sakshi
Sakshi News home page

సౌందర్య ‘సెంచరీ’

Published Mon, Mar 9 2015 1:27 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

సౌందర్య ‘సెంచరీ’ - Sakshi

సౌందర్య ‘సెంచరీ’

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత్ తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సౌందర్య గత కొన్నేళ్లుగా భారత ఫార్వర్డ్ శ్రేణిలో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఈ ఘనతతో సౌందర్య ప్రస్తుత జట్టులో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రీతూ రాణి, పూనమ్ రాణి, వందన కటారియా, దీపికల సరసన నిలిచింది.
 
  ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటేనే గొప్ప గౌరవం. అలాంటిది 100 మ్యాచ్‌లు అడానంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. వరల్డ్ లీగ్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడంతోపాటు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడమే మా లక్ష్యం’ అని సౌందర్య వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement