
సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఏపీఎండీసీ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకృష్ణ ప్రియ, రీతుపర్ణ ఫైనల్లోకి ప్రవేశించారు. కడపలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో శ్రీకృష్ణప్రియ (తెలంగాణ) 21-15, 21-15తో నేహా పండిట్ (మహారాష్ట్ర)పై, రీతుపర్ణ దాస్ (తెలంగాణ) 21-18, 19-21, 21-15తో సారుు ఉత్తేజిత రావు (ఏపీ)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ సెమీస్లో రాహుల్ యాదవ్ (తెలంగాణ) 19-21, 21-18తో అభిషేక్ యెలిగర్ (కర్ణాటక)పై, డేనియల్ ఫరీద్ (కర్ణాటక) 26-24, 21-19తో హర్షిత్ అగర్వాల్ (కర్ణాటక)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించారు.
మహిళల డబుల్స్ సెమీస్లో అపర్ణ బాలన్ (పీఈటీ)- ఆరతి సారా సునీల్ (కేరళ) జోడీ 21-17, 21-18తో అనురా ప్రభుదేశాయ్ (ఏఏఐ)-కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్లో శ్రుతి-హరిత (కేరళ) జోడీ 21-15, 21-13తో వైష్ణవి- శ్రుతి (మహారాష్ట్ర) జంటను ఓడించి ఫైనల్కు చేరింది.