ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ రజత పతకం గెలుచుకుంది.
న్యూఢిల్లీ : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ రజత పతకం గెలుచుకుంది. గురువారం జరిగిన 48 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ 2-3తో యుకీ ఇరీ (జపాన్) చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడింది. పురుషుల 74 కేజీల కేటగిరీలో నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్యం సాధించాడు. ప్లే ఆఫ్ బౌట్లో నర్సింగ్ 3-1తో జిగెర్ జకిరోవ్ (కజకిస్తాన్)పై నెగ్గాడు.