400 కిలోల గంజాయి పట్టివేత | 400 kgs ganja caught in vishaka patnam | Sakshi
Sakshi News home page

400 కిలోల గంజాయి పట్టివేత

Published Fri, Sep 23 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

విశాఖ జిల్లాలో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం పెద్దలోతిలి పంచాయతీ కప్పలగడ్డలోని ఓ ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉండే చింద్రి శివాజీ అనే వ్యక్తి ఇంట్లో ఈ గంజాయి లభించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement