పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును తమిళనాడు గెస్ట్హౌస్లా మార్చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ అన్నారు.
ఇలా అవినీతిని, అక్రమాలను వెలుగులోకి తెచ్చే అధికారులను బదిలీ చేయడం, వేధించడం చేస్తే రాష్ట్రంలో ఏ అధికారి విధులు సరిగ్గా నిర్వహిస్తాడని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే నెల 12,13,14 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగళూరు విచ్చేయనున్నారని, రాష్ట్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే దిశలో ఏ విధంగా పనిచేయాలో దిశానిర్దేశనం చేయనున్నారన్నారు. 150 అసెంబ్లీ సీట్లు గెలిచే విధంగా ఆపరేషన్ 150 లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు హాజరయ్యారు.