
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 27 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, కాలినడకన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 77,325 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.