
సాక్షి, హావేరి(బొమ్మనహళ్లి): పుట్టు మూగ అయిన ఓ ప్రత్యేక జంట శుక్రవారం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన కర్టాటక రాష్ట్రంలోని హావేరి పట్టణంలో చోటుచేసుకుంది. హావేరి నగరంలోని రేణుకా కళ్యాణ మందిరంలో వివాహం ఘనంగా జరిగింది. నగరానికి చెందిన శివపుత్రప్ప కుమారుడు గంగాధర్కు పుట్టినప్పటి నుంచి మాటలు రావు. పీయూసీ వరకు చదువుకున్నాడు.
ప్రస్తుతం మేనమాక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు. అదే జిల్లా శింగాం తాలూకా బంకాపుకు చెందిన గురుసిద్దప్ప కుమార్తె పవిత్ర కూడా పుట్టుకతోనే మూగ. దీంతో ఇరువైపుల పెద్దలు మాట్లాడుకుని వీరికి వివాహం జరిపించారు. ఈ అపురూప జంటను అతిథులు పెద్ద మనసుతో ఆశ్వీరదించారు.
Comments
Please login to add a commentAdd a comment