ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Mon, Oct 24 2016 12:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ట్రిపుల్ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసింది. సుమియా అనే విద్యార్థిని వ్యాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సుమియాను దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసేముందు తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement