గిరిజన బాలికపై అత్యాచారం | raping on tribal girl | Sakshi
Sakshi News home page

గిరిజన బాలికపై అత్యాచారం

Published Thu, Oct 16 2014 10:42 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

గిరిజన బాలికపై అత్యాచారం - Sakshi

గిరిజన బాలికపై అత్యాచారం

సాక్షి, ముంబై: తల్లిదండ్రులు ఓటు వేయడానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ గిరిజన బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం జరిపాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ధులే జిల్లా, శిర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ప్రేమ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఎనిమిదేళ్ల కూతురును ఇంట్లో ఉంచి ఓటు వేయడానికి వెళ్లారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి బాలికను బలవంతంగా బయటకు తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆపై ఆమెను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు తీవ్ర గాయాలతో బాలిక బయటపడింది. భాదితురాలు ధులే జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement