రూ.12 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం
Published Fri, Sep 9 2016 2:30 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: నగరంలోని సౌత్జోన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.12 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్ చెందిన వారు కాగా..మరొకరు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement