ఆహారం వికటించి 25 మందికి అస్వస్థత | 25 people Fall Ill with Food poisoning | Sakshi
Sakshi News home page

ఆహారం వికటించి 25 మందికి అస్వస్థత

Published Mon, Sep 21 2015 11:54 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

25 people Fall Ill with Food poisoning

ఉదయం అల్పాహారం తిని 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో 150 మంది బాలికలున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో అల్పాహారంగా ఇచ్చిన ఉప్మా తిన్న విద్యార్థులు 25 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. అధికారులు వారందరినీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని, బాలికలకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement