మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు | 60-year-old man was clubbed to death by his drunk son | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు

Published Thu, May 7 2015 9:48 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

60-year-old man was clubbed to death by his drunk son

నల్గొండ: మద్యం మత్తులో కన్న తండ్రిని సొంత కొడుకే గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. గ్రామానికి చెందిన పగిల యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. అప్పటినుంచి అతను తరచుగా తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి బాగా తాగి వచ్చి తండ్రి పగిల రాములు(60)ను కాలుతో తన్నాడు.

దీంతో ఆయన మంచం మీద పడ్డాడు. ఆ సమయంలో యాదయ్య అతని గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement