బస్సు, లారీ ఢీ : ఏడుగురికి గాయాలు | 7 injure in Road accident | Sakshi

బస్సు, లారీ ఢీ : ఏడుగురికి గాయాలు

Published Thu, Jul 30 2015 3:04 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

7 injure in Road accident

వరంగల్ : ప్రయాణికులు దిగడం కోసం ఆగిన బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్తోపాటు మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని చింతల్ ఫ్లైఓవర్ వై జంక్షన్ వద్ద గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి హన్మకొండ వెళ్తున్న క్రమంలో.. వై జంక్షన్ వద్ద ప్రయాణికులను దించుతుండగా.. ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, బస్సు డ్రైవర్, కండక్టర్లతోపాటు మరో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement