
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం బీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అఖిల భారత సాంకేతిక విద్యా మండ లి (ఏఐసీటీఈ) మళ్లీ తగ్గించింది. డీమ్డ్ యూని వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, నేషనల్ అ సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఉన్న కాలేజీలు 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అమలు చేయాలని పేర్కొంది. గతంలో ఇది 1:15 ఉండగా, దాన్ని గతేడాది 1:20కి పెంచింది. ఇప్పుడు మళ్లీ 1:15కు తగ్గించింది. అలాగే పీజీ కోర్సుల్లో (ఎంటెక్) ఇప్పటివరకు ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:12 నుంచి 1:15కు పెంచింది.
2020–21 విద్యా సంవత్సరంలో దేశంలో వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ను జారీ చేసింది. అలాగే దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. యాజమాన్యాలు ఆ నిబంధనలను పాటిస్తూ అనుమతుల కోసం ఈ నెల 6 నుంచి 29లోగా ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆలస్య రుసు ముతో యాజమాన్యాలు మార్చి 5 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు ఏప్రిల్ 30లోగా అనుమతులు జారీ చేసారు. అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్లో మార్పులు కా వాలని కోరుకునే యాజమాన్యాల కోసం ఈనెల 10న ముంబైలో, 12న ఢిల్లీలో, 13 న అనంతపూర్ జేఎన్టీయూ లో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
హ్యాండ్బుక్లో ప్రధానాంశాలు
- నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం కొత్త కోర్సులకు అ నుమతి ఇస్తారు. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటికి అనుమతి ఇస్తారు.
- కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ సీట్లు భర్తీ అవుతున్నాయని, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర ఇతర కోర్సుల్లో 40 శాతమే సీట్లు భర్తీ అవుతున్నాయిని పేర్కొంది.
- ఫ్యాకల్టీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం చర్యలు చేపట్టాలి.
- కాలేజీ అడ్వైజరీ బోర్డులో పా రిశ్రామిక రంగానికి చెందిన వారు ఇద్దరిని నియమించాలి.
- 2020–21 నుంచి రెండేళ్ల పా టు కొత్త ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు (డిప్లొమా, డిగ్రీ కోర్సుల కోసం) అనుమతించబోరు.
- డీమ్డ్ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎం సీఏ, ట్రావెల్ అండ్ టూర్స్ కోర్సులను నిర్వహించవచ్చు. ఆయా కో ర్సుల నిర్వహణకు యూజీసీ అనుమతి తప్పనిసరి.
కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాల్సినవి..
- క్యాంపస్లలో గ్రీనరీకి ప్రా«ధాన్యం ఇవ్వాలి. రెయి న్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి.
- విద్యార్థుల అభిప్రాయాల స్వీకరణ, ఫ్యాకల్టీ వివరాలను కాలేజీలో డిస్ప్లే చేయాలి.
- స్టూడెంట్స్ సేఫ్టీ ఇన్సూరెన్స్ను కచ్చితంగా అమలు చేయాలి. ఉద్యోగుల కోసం గ్రూపు యాక్సిడెంట్ పాలసీ వర్తింపజేయాలి.
- ఆన్లైన్ కోర్సులకు ప్రాధాన్యమివ్వాలి.
- ఆన్లైన్ ఫిర్యాదులు, పరిష్కార విభా గం ఉండాలి. యూనివర్సిటీ తరఫున అం బుడ్స్మెన్ను నియమించాలి.
- లైంగిక వేధింపులను అరికట్టేందుకు, ఫిర్యా దులకు కాలేజీల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి.
- ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment