సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే అంశంపై ఫిబ్రవరి 3న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేం దుకు పార్టీలు సహకరించాలన్నారు. సమావేశానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.