
గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి జరుగుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం నారాయణ గూడలోని తెలంగాణ డయాగ్నొసిస్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే చోట అన్ని పరీక్షలు నిర్వహించి 24 గంటల్లో ఫలితాలు ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు చాలా కష్టపడుతున్నారని, బస్తీ దవాఖానాలు బాగా నడుస్తున్నాయని అన్నారు. హెల్త్ ముఖ్యమైన శాఖ కాబట్టే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నానని తెలిపారు. అన్ని శాఖలపై దృష్టి పెడుతున్నానని అన్నారు.