-
Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి!
మారుతున్న వేడి వాతావరణం కారణంగా చర్మ సమస్యలు రావచ్చు. పాదాల విషయానికొస్తే.. దుమ్ము, దూళితో పాదాలు నలుపెక్కే అవకాశం ఉంది. చెమటతో మరింత మందంగా చీలికలేర్పడవచ్చు. కనుక మృదువైన పాదాల సంరక్షణకై ఈ చిన్న చిట్కాలు ఏంటో చూద్దాం.ఇలా చేయండి..చేతులు, పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మతొక్కతో రుద్దితే పోతాయి.సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి.రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్తో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి.స్నానం పూర్తయిన తర్వాత పమిస్ స్టోన్తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుగా ఉంటాయి.ఇవి చదవండి: ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్ప్యాక్ -
టెక్ దిగ్గజం టీసీఎస్కు జాక్ పాట్..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు!
భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ జాక్ పాట్ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్కు అప్పగించిన ప్రాజెక్ట్ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం..ఈ డీల్ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అవివా సీఈఓ డౌగ్ బ్రౌన్ మాట్లాడుతూ..‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా మేము మా కస్టమర్లకు అందించే సేవలతో పాటు, కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. మా ఆశయాలకు అనుగుణంగా సంస్థ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తూ అటు కస్టమర్లకు, ఇటు వ్యాపారంలో గణనీయమైన ప్రయోజనాల్ని అందిస్తుందని’ అన్నారు. -
వైద్య రంగంలో పెనుమార్పులు.. మతి పోగొడుతున్న కొత్త టెక్నాలజీలు!
ఇది సాంకేతిక విప్లవయుగం. సాంకేతిక విప్లవం ప్రపంచంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వైద్యరంగంలోకి కూడా దూసుకొస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగంలో పెనుమార్పులకు దారులు వేస్తోంది. ప్రస్తుత శతాబ్దిలో ఇప్పటికే వైద్యరంగంలోకి అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏడాది కొత్త కొత్త పరికరాలు వైద్యరంగంలోకి అడుగుపెడుతూ చికిత్స పద్ధతులను మరింతగా సులభతరం చేస్తున్నాయి. జ్వరం తెలుసుకోవాలంటే థర్మామీటర్... ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవాలంటే స్టెతస్కోప్... శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి పల్సాక్సి మీటర్...ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న పరికరాలు. ఈ అన్ని లక్షణాలనూ తెలిపే పరికరం తాజాగా రూపుదిద్దుకుంది. మన అందచందాలను చూసుకోవడానికి అద్దం వాడుతుంటాం. మరి, మన మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికో? దానికి కూడా ఒక అధునాతన అద్దం అందుబాటులోకి వచ్చేసింది. తలనొప్పి వస్తే తలకు ఏ అమృతాంజనం పట్టించుకోవడమో లేదా ఒక తలనొప్పి మాత్ర వేసుకోవడమో చేస్తుంటాం. ఇక ఆ బెడద లేకుండా, తలనొప్పి తీవ్రతకు తగినంత మోతాదులో ఔషధాన్ని విడుదల చేసే హెడ్బ్యాండ్ తయారైంది. ఆరోగ్యరంగంలో పెనుమార్పులకు దారితీయగలిగిన వస్తువుల్లో ఇవి కొన్ని. ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన సాంకేతిక పరికరాలు కూడా గడచిన ఏడాదికాలంలో తయారయ్యాయి. ఈ పరికరాలను వాటి తయారీదారులు లాస్ వేగస్లో ఈ ఏడాది జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో–2024 (సీఈఎస్) వేదికపై ప్రదర్శించారు. వీటికి శాస్త్రవేత్తల నుంచి మాత్రమే కాకుండా, సామాన్య సందర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. సరికొత్త వైద్య పరికరాలపై సంక్షిప్త పరిచయంగా ఈ కథనం మీ కోసం.. ఫోర్ ఇన్ వన్ ‘బీమ్ఓ’ అరచేతిలో ఇమిడిపోయే ఈ ఒక్క చిన్నపరికరం దగ్గర ఉంటే థర్మామీటర్, స్టెతస్కోప్ వంటివేవీ అవసరం ఉండదు. ఇది ఫోర్ ఇన్ వన్ పరికరం. అమెరికాలోని శాన్హోసే స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సాయంతో ‘బీమ్ఓ’ కంపెనీ ఈ ఫోర్ ఇన్ వన్ పరికరాన్ని తయారుచేసింది. దీనిని నుదుటి మీద ఆనించి జ్వరం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఛాతీ మీద ఆనించి ఊపరితిత్తుల పనితీరును, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. అలాగే శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవచ్చు. దీనిలోని సెన్సర్లు శరీరంలోని సూక్ష్మమైన తేడాలను సైతం ఇట్టే గుర్తించి, శరీర ఆరోగ్య స్థితిగతులపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్కు చేరిన సమాచారాన్ని డాక్టర్కు చూపించి సత్వరమే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ‘బీమ్ఓ’ పరికరం విస్తృతంగా వాడుకలోకి వచ్చినట్లయితే, వైద్యరంగంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న థర్మామీటర్, స్టెతస్కోప్, పల్సాక్సిమీటర్ వంటి పరికరాలు దాదాపు కనుమరుగు కాగలవు. ‘బీమ్ఓ’ ఈ ఏడాది జూన్లో మార్కెట్లోకి రానుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,701) మాత్రమే! మనసును చూపించే అద్దం అద్దంలో ముఖం చూసుకోవడం మామూలే! ఈ అద్దం మాత్రం మన మనసుకే అద్దంపడుతుంది. మన ఒత్తిడి, చిరాకు, పరాకు, దిగులు, గుబులు వంటి లక్షణాలను ఈ అద్దం ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అమెరికాలోని సీయాటల్కు చెందిన ‘బారాకోడా’ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ స్మార్ట్ అద్దాన్ని ‘బి మైండ్’ పేరుతో రూపొందించింది. ఈ అద్దం బాత్రూమ్లో ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది టచ్స్క్రీన్గా కూడా పనిచేస్తుంది. ఇందులోని కేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మన మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇందులోని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా ఈ అద్దం మన భావోద్వేగాల్లోని మార్పులను సత్వరమే గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. భావోద్వేగాల్లో తేడాలు ఉన్నట్లయితే, ఇందులోని లైట్ థెరపీ ఆటోమేటిక్గా పనిచేసి, సాంత్వన కలిగిస్తుంది. సీఈఎస్–2024లో ప్రదర్శించిన ఈ స్మార్ట్ అద్దం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లోకి రానుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్వాచీ ఇప్పటికే ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్వాచీలను పలు కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అమెరికన్ కంపెనీ గార్మిన్ తాజాగా ‘లిలీ–2’ పేరుతో ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్వాచీని విడుదల చేసింది. దీనిని సీఈఎస్–2024 షోలో ప్రదర్శించింది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్వాచీ స్మార్ట్ఫోన్ యాప్కు అనుసంధానమై పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్వాచీలతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే కాకుండా, డిజైన్ ఆకర్షణీయంగా ఉండటం విశేషం. ‘లిలీ–2’ స్మార్ట్ వాచీలను గార్మిన్ కంపెనీ ‘క్లాసిక్’, ‘స్పోర్ట్స్’ అనే రెండు మోడల్స్లో విడుదల చేసింది. దీని డయల్పై ఉన్న టచ్స్క్రీన్ను తడితే, ఇది సమయం చూపడమే కాకుండా, శరీరంలోని ఎనర్జీ లెవల్స్ను, స్లీప్ స్కోర్ను చూపిస్తుంది. ఇది ధరించిన వారి శరీరం పనితీరును నిరంతరాయంగా గమనిస్తూ, స్మార్ట్ఫోన్కు సమాచారాన్ని చేరవేస్తుంది. గుండె పనితీరు, అలసట స్థాయి, నిద్ర తీరుతెన్నులు, ఆటలాడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఖర్చయ్యే కేలరీలు, శరీరంలో నీటి స్థాయి, శ్వాస తీరు, ఆక్సిజన్ లెవల్స్, మహిళల నెలసరి పరిస్థితుల వంటి అంశాలపై ఇది కచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. లిలీ–2 స్పోర్ట్స్ మోడల్ ధర 249.99 డాలర్లు (రూ.20,782), క్లాసిక్ మోడల్ ధర 279.99 డాలర్లు (రూ.23,276) మాత్రమే! వృద్ధుల కోసం మెడికల్ అలర్ట్ సిస్టమ్ చూడటానికి ఇది దోమలను పారదోలే పరికరంలా కనిపిస్తుంది గాని, ఇది వృద్ధులకు ఆసరగా పనిచేసే అధునాతన మెడికల్ అలర్ట్ సిస్టమ్. ఫ్రాన్స్కు చెందిన ‘జో కేర్’ కంపెనీ నిపుణులు దీనిని ‘జో ఫాల్’ పేరుతో రూపొందించారు. కాలుజారడం, రక్తపోటు పడిపోవడం, గుండెపోటు, పక్షవాతం వంటి కారణాలతో ఇళ్లలోని వృద్ధులు అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వైఫై ద్వారా ఈ పరికరంలోని సెన్సర్లు వెంటనే గుర్తించి, దీనికి అనుసంధానమైన స్మార్ట్ఫోన్కు చేరవేసి అప్రమత్తం చేస్తుంది. సీసీ కెమెరాలు, తొడుక్కోవలసిన పరికరాలతో పనిలేకుండా, దీనిని గోడకు ప్లగ్ సాకెట్కు తగిలించుకుంటే చాలు. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనిని అమర్చిన ప్రదేశానికి 800 చదరపు మీటర్ల పరిధిలో నేల మీద ఎవరు పడిపోయినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది. సీఈఎస్–2024 షోలో దీనికి సందర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ ఇవి పోషకాల గుళికలు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారైన స్మార్ట్ గమ్మీస్ ఇవి. ఏడు పోషకాలతో కూడిన ఈ స్మార్ట్ గమ్మీస్ను ఫిన్లండ్కు చెందిన ‘ఇలో స్మార్ట్ న్యూట్రిషన్’ కంపెనీ విడుదల చేసింది. సాధారణమైన విటమిన్ మాత్రలైతే, అందరికీ ఒకేలాంటివి దొరుకుతాయి. వీటిని ఎవరి అవసరాలకు తగినట్లుగా వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకునే వీలు ఉండటం విశేషం. 38.9 కోట్ల కాంబినేషన్లలోని పోషకాల మోతాదులతో కూడిన ఈ స్మార్ట్ పిల్స్ను కోరుకున్న రుచులతో త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించుకోవచ్చు. నోటికి నచ్చిన రుచుల్లో దొరికే వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, శరీరంలోని పోషక లోపాలన్నీ సత్వరమే నయమవుతాయి. పోషకాల కాంబినేషన్లను బట్టి ఈ గమ్మీస్ ఒక్కో ప్యాక్ ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (రూ.1247 నుంచి రూ.1662) వరకు ఉంటుంది. అల్ట్రాహ్యూమన్ హోమ్ వైఫై రూటర్లా కనిపించే ఈ పరికరం ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ కల్పిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అల్ట్రాహ్యూమన్’ ఈ పరికరాన్ని ‘అల్ట్రాహ్యూమన్ హోమ్’ పేరుతో రూపొందించింది. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పరికరాన్ని ఇంట్లో అనువైన చోట అమర్చుకుని, ఆన్ చేసుకుంటే చాలు. ఇది నిరంతరం ఇంటి వాతావరణంలోని మార్పులను గమనిస్తూ, యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇంట్లోని ఉష్ణోగ్రత, గాలిలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, ధూళికణాలు, కార్బన్ కణాలు వంటివి ఏ మేరకు ఉన్నాయో కచ్చితంగా చెబుతుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు ఇది అందించే సమాచారం బాగా దోహదపడుతుంది. ‘అల్ట్రాహ్యూమన్’ ఈ పరికరాన్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధర 349 డాలర్లు (రూ.29,011) మాత్రమే! స్మార్ట్ పరుపు ఇది చాలా స్మార్ట్ పరుపు. కావలసిన రీతిలో దీని మెత్తదనాన్ని లేదా గట్టిదనాన్ని మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి వీలుగా దీనికి ఒక బటన్ అమర్చి ఉంటుంది. సాధారణమైన పరుపులతో పోల్చుకుంటే దీని బరువు దాదాపు ఎనబై శాతం తక్కువగా ఉంటుంది. సాధారణ పరుపులలో వాడే స్ప్రింగులు, ఫోమ్ వంటివేవీ ఇందులో ఉండవు. దాదాపు 1.40 కోట్ల పాలీస్టర్ దారపు పోగులతో దీనిని తయారుచేయడం విశేషం. దీని బటన్ను ఉపయోగిస్తూ, పది కుషన్ లెవల్స్ను ఎంపిక చేసుకోవచ్చు. కొరియన్ కంపెనీ ‘ఆన్సిల్’ ఈ పరుపును సీఈఎస్–2024 షోలో ప్రదర్శించింది. ‘స్మార్ట్ స్ట్రింగ్ ఐ4’ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్ పరుపులో మరికొన్ని అదనపు సౌకర్యాలూ ఉన్నాయి. ఇందులోని సెన్సర్లను నిద్ర తీరుతెన్నులను గమనిస్తూ, ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు చేరవేస్తుంది. ఒంటి బరువులో మార్పులు, గురక వంటి ఇబ్బందులను కూడా ఇది గుర్తిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. మార్కెట్లోకి దీనిని ఎప్పుడు విడుదల చేయనున్నదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు ‘ఆన్సిల్’ కంపెనీ తెలిపింది. పర్సనలైజ్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ ప్రింటర్ మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో పోషకాహార అవసరాలు ఉంటాయి. ఇళ్లల్లో వండుకునే ఉమ్మడి వంటతోనో లేదా హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే వంటకాలతోనో పోషకాహార అవసరాలు పూర్తిగా తీరే పరిస్థితి ఉండదు. వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను కోరుకున్న రుచులతో అందించేందుకు అమెరికన్ కంపెనీ ‘ఆనరీ’ ఇటీవల ‘ఇనొవేటివ్ ఇండివిడ్యువలైజ్డ్ న్యూట్రిషనల్ కిట్’ (ఐఐఎన్కే) పేరుతో ఈ త్రీడీ ఫుడ్ ప్రింటర్ను రూపొందించింది. ఇందులో ముడి పదార్థాలను తగిన మోతాదులో వేసుకుని, స్విచాన్ చేసుకుంటే చాలు. కొద్ది నిమిషాల్లోనే మనకు కావలసిన ఆహారాన్ని, మనకు అవసరమైన పోషకాలు ఉండేలా ముద్రించి పెడుతుంది. ఇది దాదాపు మిగిలిన త్రీడీ ఫుడ్ ప్రింటర్లాగానే పనిచేస్తుంది. అయితే, దీని తయారీదారులు మాత్రం దీనిని 4డీ ఫుడ్ ప్రింటర్గా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం మూడు కొలతల్లో ఆహారాన్ని ముద్రించే త్రీడీ ప్రింటర్ మాత్రమే కాదని, అంతకు మించి ఇది పదార్థాల్లోని పీహెచ్ స్థాయిని, వేడిని కోరుకున్న రీతిలో, కోరుకున్న సమయానికి అందిస్తుందని, అందువల్ల ఇది 4డీ ప్రింటర్ అని చెబుతున్నారు. దీనిని సీఈఎస్–2024 షోలో ప్రదర్శించారు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. పెంపుడు జంతువులకు హెల్త్ట్రాకర్ చాలామంది ఇళ్లల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు గాని, వాటి ఆరోగ్యానికి సమస్యలు తలెత్తితే ఇబ్బందే! పెంపుడు జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ పెట్ హెల్త్ట్రాకర్ బాగా ఉపయోగపడుతుంది. ఇళ్లల్లో పెంచుకునే పిల్లులు లేదా జాగిలాలకు మెడలో దీనిని తగిలిస్తే చాలు. యాప్ ద్వారా ఇది వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. ఫ్రాన్స్కు చెందిన ఇన్వోక్సియా కంపెనీ ఈ పెట్ హెల్త్ట్రాకర్ను ‘మినిటాయిల్జ్ స్మార్ట్ పెట్ట్రాకర్’ పేరుతో రూపొందించింది. ఇది పెంపుడు జంతువుల దినచర్యపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుంది. పెంపుడు జంతువుల తినే వేళలు, నడక వేళలు, ఆట వేళలు, వాటి భావోద్వేగాలు, వాటి జీర్ణ సమస్యలు, గుండె సమస్యలను ఇది తక్షణమే గుర్తించి, యాప్ ద్వారా యజమానులను అప్రమత్తం చేస్తుంది. ఈ పెట్ట్రాకర్ శునకాల కోసం ఒక మోడల్, పిల్లుల కోసం ఒక మోడల్ రూపొందించింది. అయితే, రెండిటి ధర ఒక్కటే– 99 డాలర్లు (రూ.8,230) మాత్రమే! ఈ పెట్ట్రాకర్ ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి రానుంది. పట్టుతప్పిన చేతులకు స్మార్ట్గ్లోవ్స్ వార్ధక్యంలో కొందరు పార్కిన్సన్స్ వ్యాధి బారినపడతారు. ఈ వ్యాధికి లోనైనవారిలో కీళ్లు బిగుసుకుపోయి, వణుకు పెరిగి, చేతులు పట్టుతప్పుతాయి. పట్టుతప్పిన చేతులతో టీ కప్పు వంటి తేలికపాటి వస్తువులను పట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్కు చెందిన ‘గైరోగేర్’ కంపెనీ ఈ ‘గైరోగ్లోవ్’ను రూపొందించింది. దీని పనితీరును ఇటీవల సీఈఎస్–2024 షోలో ప్రదర్శించినప్పుడు దీనికి నిపుణుల ప్రశంసలు లభించాయి. ఇది మాగ్నటిక్ కనెక్టర్తో రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని చేతికి తొడుక్కుని, ఆన్ చేసుకున్న వెంటనే ఇది చేతి వణుకును నియంత్రిస్తుంది. చేతికి పట్టునిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడేవారు దీనిని తొడుక్కుని తమ పనులను తామే స్వయంగా చేసుకునేందుకు దోహదపడుతుంది. దీని ధర 550 డాలర్లు (రూ.45,726). వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు ఈ వస్తువులు తాజా ఉదాహరణలు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్ వాచీలు, నొప్పి నివారణ కోసం వాడే స్మార్ట్ పట్టీలు, ఇన్సులిన్ ఇంజక్షన్ల బదులుగా వాడే స్ప్రేలు వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ పరిజ్ఞానాలు శస్త్రచికిత్సలను మరింతగా సులభతరం చేస్తున్నాయి. ఈ సాంకేతికత ఆరోగ్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయగలదని, మానవాళి ఆరోగ్యానికి మరింత భరోసా ఇవ్వగలదని భావించవచ్చు. -
పిల్లల సైకాలాజికల్ సెషన్స్ ఎక్కడ తీసుకుంటే మంచిది..?
-
బ్రెయిన్ లో ఏ కెమికల్ తేడా ఉన్నాయో చెప్పే టెక్నాలజీ
-
పిల్లలు చదవలేక, రాయలేక పోతున్నారు అంటే కారణాలు..!
-
స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే: సాజిదా ఖాన్
-
పిల్లల బిహేవియర్ ఇష్యూస్ ని అడ్రస్ చేసే విధానం..!
-
ఒక మదర్ గా చెబుతున్న... పిల్లలు వాళ్లే మారతారు లే అని వదిలేస్తే..!
-
పిల్లల మెదడు విశ్లేషణ గురించి యండమూరి వీరేంద్రనాథ్
-
చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోతే... పేరెంట్స్ ఇలా చెయ్యండి
-
డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనో ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్లో భాగమైన మెనోల్యాబ్స్ను దివాలా కోడ్ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. మెనోల్యాబ్స్ పోర్ట్ఫోలియోలో ఏడు బ్రాండెడ్ ఉత్పత్తులు, యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్ కికుచి తెలిపారు. మెనోల్యాబ్స్ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్తో పాటు అమెజాన్, వాల్మార్ట్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు!
'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.' బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు! -
ఉద్యోగుల ఆరోగ్యంపై రాజీ ప్రసక్తే లేదు: APSRTC
సాక్షి, ఎన్టీఆర్: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల్ని సమానంగా చూస్తోందని.. పైగా వైద్య సదుపాయాలు అందించే విషయంలో ప్రత్యేక చొరవ కనబరుస్తోందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ చెబుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కార్ చెలగాటం పేరిట ఇవాళ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఖండిస్తూ.. పూర్తి వివరాలను తెలియజేసింది. ‘‘ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిఫర్ చేయబడిన ఆసుపత్రులలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స, ఓపీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లాకొక లైజనింగ్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా.. .. ఇటీవల కాలంలో ఉద్యోగులకు తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కార్డియాక్ కేర్ Try-cog మెషీన్ల ద్వారా ఉద్యోగులకు ఏర్పడే హృద్రోగ సమస్యలను ముందుగానే పసిగట్టి వైద్యం అందిస్తున్నాం. అలా ఇప్పటి వరకూ 149 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముందస్తు పరీక్షల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాం’’ అని తెలిపింది. వైద్య సేవల విషయానికొస్తే.. అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తద్వారా సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్నిడిస్పెన్సరీలలో నిరంతరం వైద్యం.. ఔషధాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో వైఎస్సార్ జిల్లాలో డా.వైఎస్సార్ ఏరియా ఆర్టీసీ ఆసుపత్రి ఏర్పాటైంది. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలో ఉద్యోగుల కోసం శరవేగంగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
Swachhata Hi Seva: స్వచ్ఛ భారత్.. స్వాస్థ్ భారత్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్వచ్ఛతా కీ సేవాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. గంటపాటు శ్రమించారు. తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మార్కెట్లు, జల వనరులు, బస్ స్టాండ్లు, టోల్ వసూలు కేంద్రాలు, గోశాలలు, జంతు ప్రదర్శనశాలలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల్లోనూ శ్రమదానం చేశారు. 4 నిమిషాల నిడివి గల తన శ్రమదానం వీడియోను ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను, అంకిత్ బైయాన్పూరియా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాదు, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జతకలిపాం. ఇదంతా స్వచ్ఛ భారత్, స్వాస్థ్ భారత్ కోసమే’’ అని మోదీ ఉద్ఘాటించారు. 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో.. స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు చీపుర్లకు పనిచెప్పారు. ఇళ్ల చుట్టుపక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఊడ్చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ధార్మిక సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శ్రమదానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని ఝండేవాలన్ ఏరియాలో శ్రమదానంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలో స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్లో ‘స్వచ్ఛతా పఖ్వాడా’ నిర్వహించారు. ‘చెత్త రహిత భారత్’ను సాధిద్దాం దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రప్రభుత్వం తీర్మానించుకుందని, ఇదొక పెద్ద సవాలు అయినప్పటికీ చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. స్వచ్ఛతా యజ్ఞంతో మహాత్మా గాం«దీకి నివాళులర్పిద్దామని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కీ సేవాలో పాల్గొన్ని, కొత్త చరిత్ర సృష్టిద్దామని ఉద్బోధించారు. ‘చెత్త రహిత భారత్’ అనే కలను నెరవేర్చుకుందామని సూచించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొనాలంటూ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఇచి్చన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును ప్రజలు అందిపుచ్చుకుంటారని తాము ఆశిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ చెప్పారు. -
ఒక టెకీ హెల్త్కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కొత్త ఒరవడి సృష్టించింది!
సౌమ్యంగా సాధించింది సౌమ్య ఈ తరం టెకీ. సాంకేతికతను ఆరోగ్యానికి అద్దింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో వైద్యరంగంలో కొత్త ఒరవడి తెచ్చింది. వైద్యరంగం, ఔషధాల తయారీ రంగాలు సాంకేతికతను అందుకోవాల్సినంత వేగంగా అందుకోవడం లేదనుకుంది సౌమ్య. ‘మల్టిప్లైయర్ ఏఐ’ పేరుతో హెల్త్కేర్ రంగంలో ప్రవేశించింది. ఇంత సునిశితమైన, సంక్లిష్టమైన పరిశ్రమను నిర్వహించడం మగవాళ్లకే సాధ్యం అనే అభిప్రాయాన్ని చెరిపేసిందామె. ‘మగవాళ్ల ప్రపంచం అనే భావన మహిళలు ప్రవేశించేటంత వరకే. ఒకసారి మహిళలు ప్రవేశిస్తే ఇక అది అపోహ మాత్రమేనని నిర్ధారణకు వచ్చేస్తాం. మా టీమ్ లో సగానికి పైగా మహిళలే. సేల్స్ విభాగంలో కూడా మహిళలు సమర్థంగా పని చేస్తున్నార’ని చెప్పింది. ఒక టెకీ హెల్త్కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితులను, హైదరాబాద్లో సంస్థ స్థాపించి సక్సెస్ అందుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు సౌమ్య. భారీ మూల్యం చెల్లించాం ‘‘నన్ను హెల్త్కేర్ ఇండస్ట్రీలోకి రప్పించిన కారణాలు అత్యంత బాధాకరమైనవి. మాది ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ (అలహాబాద్). నాన్న రవిప్రకాశ్ శ్రీవాస్తవ ఐఏఎస్ ఆఫీసర్. నాన్న డయాబెటిస్తో బాధపడుతుండేవారు. రొటీన్ టెస్ట్లు, మెడికేషన్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. మా జీవితాలు భారీ మూల్యం చెల్లించుకున్న పొరపాటు అది. వైద్యుల నిర్లక్ష్యం, రాంగ్ మెడికేషన్ కారణంగా ఆయన హటాత్తుగా ప్రాణాలు వదిలారు. నేనప్పుడు బీటెక్ సెకండియర్లో ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసంవత్సరాల్లోనే అమ్మకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. మేము తెలుసుకునేటప్పటికే వ్యాధి మూడవ దశకు చేరింది. చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆరు నెలలకే అమ్మను కూడా కోల్పోయాను. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ వైద్యరంగం ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతోంది. ఆ వెనుకబాటు తెచ్చిన నష్టంలో మా అమ్మానాన్నల మరణాలు కూడా భాగమేననిపించింది. ఈ రెండు రంగాల మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాలనే సంకల్పం కలిగింది, చేయగలననే నమ్మకం కూడా. సమాచారలోపం తలెత్తని విధంగా మెడికల్ డాటాను పరిరక్షించగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాను. మల్టిప్లైయర్ ఏఐ స్థాపించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా డాటా అనలైజేషన్, డాటా మెయింటెయిన్ చేస్తున్నాం. మా సంస్థకు ‘ఐఎస్ఓ 27001’ సర్టిఫికేట్ వచ్చింది. మా సర్వీస్ను దేశవిదేశాల్లో పెద్ద ఆరోగ్య సంస్థలు తీసుకుంటున్నాయి. పేషెంట్ కేర్లో మొదటిది పేషెంట్ ఆరోగ్య చరిత్ర, క్రమం తప్పని పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల నివేదికల నిర్వహణ ప్రధానమైనవి. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు దక్కవని చెప్పడానికి మా పేరెంట్సే ఉదాహరణ. ఫాలో అప్ సర్వీస్ వ్యాధి నిర్ధారణ ఆధారంగా వైద్యం అందించిన తర్వాత తదనంతర పరీక్షలను, వైద్యాన్ని అందించాల్సిన సమయానికి ఫాలో అప్ చేయడం కూడా మా సర్వీస్లో భాగంగా ఉంది. అలాగే భవిష్యత్తులో టెలిమెడిసిన్ విస్తరించాల్సిన అవసరం ఉంది. వైద్యచికిత్సను కుగ్రామాలకు చేరడానికి చక్కటి మాధ్యమం ఇది. పేషెంట్ను ఉన్న చోటనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని మానిటర్ చేయడం సాధ్యమవుతుంది. నేను చదివిన టెక్, బయోటెక్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేసింది. నాకు సవాళ్లు ఎదురయ్యాయా అంటే సవాళ్లు లేని ప్రొఫెషన్ అంటూ ఏదైనా ఉంటుందా? డిజిటల్ బ్రాండింగ్, మార్కెటింగ్లో అవరోధాలు వచ్చాయి. మా క్లయింట్ల సందేహాలను తీరుస్తూ, వాళ్లు సమాధానపడే వరకు సహనంగా వివరించాం. సవాళ్లకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు పోవడమే సక్సెస్కు దారి తీస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా నాన్నను కోల్పోవడమే నన్ను ఈ రంగం వైపు నడిపించింది. ప్రతి విజయంలో మా అమ్మానాన్న కనిపిస్తున్నారు’’ అని వివరించారు సౌమ్య. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
ఈ–సైకిళ్ల జోరు.. ప్రయాణంలో హుషారు
సాక్షి, అమరావతి: భారతదేశంలో సైక్లింగ్పై మక్కువ పెరుగుతోంది. కరోనా తర్వాత ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ స్పృహతో చాలామంది సైకిళ్లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో ఈ–సైకిళ్ల వాడకం జోరందుకుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను విడుదల చేసే వాహనాలు తక్కువ దూరం ప్రయాణించడంలో పర్యావరణాన్ని దెబ్బతీయడంతోపాటు రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ–సైకిళ్లే భవిష్యత్గా గుర్తించిన కంపెనీలు బహుళార్థ సాధక ప్రయోజనాన్ని కలిగేలా డిజైన్లు చేస్తున్నాయి. కొన్ని మెట్రో సిటీలు, నగరాల్లో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు రోడ్లపై ప్రత్యేక పాత్వేలు నిర్మిస్తుండటం విశేషం. యాప్ సాయంతో కంట్రోల్ టెక్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు ఈ–సైకిళ్లలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. యాప్ సాయంతో నియంత్రించే ఈ–సైకిల్, ఈ–బైక్లు మార్కెట్లోకి వచ్చేశాయి. మొబైల్ ఆధారిత యాప్ల ద్వారా వినియోగదారులకు వారి వేగం, దూరం, కేలరీలు కరిగిపోవడం, హృదయ స్పందన రేటుపై రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తున్నాయి. వాస్తవానికి దేశంలో ఈ–సైకిళ్లు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ వాటి కొనుగోళ్లు ఏటా రెట్టింపు అవుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), క్లిన్వెల్డ్ పీట్ మారి్వక్ గోర్డెలర్ (కేపీఎంజీ) నివేదిక ప్రకారం త్వరలోనే భారతదేశ ఈ–సైకిల్ మార్కెట్ మిలియన్ యూనిట్లకు పైగా ఉంటుందని అంచనా. గ్లోబల్ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ పరిమాణం 2021లో 18.58 బిలియన్ల డాలర్ల నుంచి 2028లో 52.36 బిలియన్ల డాలర్లకు వృద్ధి చెందడంతోపాటు భారతదేశంలో ఈ–సైకిల్ మార్కెట్ విలువ 2021లో 1.02 మిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 2.08 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత సైక్లింగ్ గణనీయంగా పెరుగుతుందనడానికి ఉదాహరణ.. యూరప్ మొత్తం పరిశ్రమల్లో 50 శాతం కంటే ఎక్కువ ఈ–సైకిళ్లు ఉత్పత్తి కావడమే. సైక్లిస్ట్ ఫ్రెండ్లీ వాతావరణం ప్రస్తుతం దేశంలో చిన్నారులు, యువతతో పాటు మౌంటైన్ బైక్స్ విభాగంలో ఈ–సైకిళ్లలో ఎక్కువ వృద్ధి నమోదవుతోంది. ప్రతిరోజూ దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తక్కువ దూరం (20 కిలోమీటర్ల లోపు) ప్రయాణిస్తున్నట్టు సెన్సస్ డేటా చెబుతోంది. ఈ ప్రయాణ విధానానికి ఈ–సైకిల్స్ సరైన పరిష్కారమని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. చురుకైన జీవనశైలి, సాహనం, ఫిట్నెస్కు ప్రాధాన్యమిచ్చే పట్టణ వాసులే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. పాశ్చాత్య నగరాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సైక్లిస్ట్ ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ–సైకిళ్లలో థొరెటల్ అసిస్ట్, పెడల్ అసిస్ట్ అనే రెండు రకాలు ఉన్నాయి. థొరెటల్ అసిస్ట్ అంటే మోటార్ను ఆన్ చేస్తే బైక్ పెడల్ చేయకుండా ముందుకు కదులుతుంది. పెడల్ అసిస్ట్ అంటే సైక్లిస్ట్ పెడల్ చేస్తున్నప్పుడు మాత్రమే మోటార్ రన్నింగ్లో ఉంటుంది. పెడల్ సహాయక ఎలక్ట్రిక్ బైక్లను మనం సంప్రదాయ సైకిల్ను తొక్కడంతో పోలి్చనప్పుడు మానవ ప్రయత్నాన్ని 70–80 శాతం వరకు తగ్గిస్తాయి. అయితే ప్రామాణిక మోటార్ బైక్లతో పోలిస్తే ఈ–సైకిళ్లు వైరింగ్, డిజైన్, మోటార్/మినీ ఇంజిన్, బ్యాటరీ శక్తి కారణంగా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఈ–సైకిల్ ధర ఎక్కువగా దాని గ్రేడ్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సుమారు రూ.20 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా పలుకుతోంది. -
కునో నేషనల్ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి 5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేఎన్పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు. -
హెల్త్ కేర్ సెంటర్గా భారత్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రపంచానికి హెల్త్ కేర్ సెంటర్గా మారిందని రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండూల్కర్, డాక్టర్ సందేశ్ యాదవ్ తెలిపారు. జీ–20 సదస్సులో భాగంగా సోమ, మంగళవారాల్లో స్విట్జర్లాండ్, ఇటలీలలో హెల్త్కేర్పై జరిగిన సన్నాహక సదస్సుల్లో పల్సస్ గ్రూప్ పాలుపంచుకుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని పల్సస్ సంస్థ కార్యాలయాన్ని వినయ్ టెండూల్కర్, డాక్టర్ సందేశ్ యాదవ్ సందర్శించారు. అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా పల్సస్ గ్రూప్ కృషి చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. సమావేశాల కో–కన్వెనర్ డాక్టర్ శ్రీనుబాబు గేదెల పాల్గొన్నారు. -
బయోఫ్యాక్చురాతో అరబిందో కంపెనీ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోనోక్లోనల్ యాంటీబాడీ ఉస్టెకినుమాబ్ బయోసిమిలర్ కోసం ప్రత్యేక హక్కులను తమ అనుబంధ కంపెనీ క్యూరాటెక్ బయాలాజిక్స్ పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. స్టెలారా (ఉస్టెకినుమాబ్) ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి యూఎస్కు చెందిన బయోఫ్యాక్చురాతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పేగుల్లో వచ్చే వ్యాధులు, సొరియాసిస్, కీళ్ల వాతం వంటి రోగాల చికిత్సకు ఈ ఔషధం వాడతారు. ఒప్పందం ప్రకారం యూఎస్, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర పాక్షిక నియంత్ర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో సహా అన్ని ప్రధాన నియంత్రిత మార్కెట్లలో బీఎఫ్ఐ–751ని వాణిజ్యీకరించడానికి క్యూరాటెక్కు ప్రత్యేక లైసెన్స్ హక్కులు ఉంటాయి. -
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విధంగా చేస్తే నార్మల్ డెలివరీ పక్కా..
-
ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ అలర్జీ మెడిసిన్ వాడితే ప్రమాదమా..?
-
ఆరోగ్యమే మహా భాగ్యం!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ నినాదాన్ని భారతీయులు తరతరాలుగా ఒక సందేశంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారతీయులకు దీని అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ కుటుంబ ఆదాయాల్లో పది శాతానికిపైగా ఆరోగ్య పరిరక్షణకు భారతీయులు వ్యయం చేస్తున్నట్టుగా ఇటీవల నివేదికలో వెల్లడైంది. దీనికి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేస్తున్న టాప్–5 రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ నిలుస్తున్నాయి. ఇది 2017–18 స్థాయిలను బట్టి చూస్తే గణనీయంగా వైద్య, ఆరోగ్యంపై ఖర్చు పెరగడానికి ప్రధానంగా కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన విపత్కర, అనిశి్చత పరిస్థితులే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) పురోగతిపై తాజాగా ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’విడుదల చేసిన డేటాలో ఆయా అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే.. 2022–23లో 6.67 శాతం ప్రజలు తమ ఆదాయాల్లో పదిశాతానికిపైగా (2017–18లో ఇది 4.48 శాతం) వ్యయం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా... మొత్తం కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న వారు 2.3 శాతం మంది ఉన్నట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలి్చతే పట్టణ ప్రాంతాల్లోని వారే తమ ఆదాయంలో పదిశాతానికి పైగా వ్యయం చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఐతే కొన్ని సందర్భాల్లో...పరిస్థితులు చేయి దాటడం లేదా విపత్కర పరిస్థితులు ఎదురుకావడం వంటివి చోటుచేసుకున్నపుడు మాత్రం గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భారతీయుల వైద్య, ఆరోగ్యానికి సంబంధించి తలసరి వ్యయం 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి (కరోనా తరువాత) అత్యధికంగా పెరిగినట్టుగా కేంద్ర మంత్రిత్వశాఖ నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్హెచ్ఏ) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యం, కుటుంబాల ‘ఔట్ ఆఫ్ ప్యాకెట్’వైద్య, ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వం ఖర్చు పెంచాక ఈ వృద్ధి నమోదైనట్టుగా ఈ అంచనాల్లోపేర్కొన్నారు. 2014–15 లలో ప్రభుత్వం చేస్తున్న తలసరిఖర్చు రూ. 1,100 కాగా, 2019–20 కల్లా అది రూ. 2,014కు పెరిగినట్టు ఇందులో తెలిపారు. -
ఆధునిక ప్రపంచంలో 'ఏఐ' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!
Artificial Intelligence: ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులు యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా తయారు చేస్తున్నారు. మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లో చేస్తాయని 1965లోనే సైంటిస్ట్ & నోబెల్ గ్రహీత 'హెర్బర్ట్ సైమన్' అన్నాడు. నేడు అదే పరిస్థితి మొదలైందా అని తలపిస్తోంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మిలటరీ రంగం వరకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది ఈ రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతుందా? లేదా చీకటి భవిష్యత్తులోకి తీసుకెళుతుందా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆరోగ్య సంరక్షణ గతంలో వైద్య సంరక్షణలో మనుషుల పాత్ర ఎక్కువగా ఉండేది. ఏదైనా ఆపరేషన్ వంటివి చేయాలంటే ఎక్కువ మంది అవసరం పడేది. అయితే ఈ రోజుల్లో MRI స్కాన్స్, X-రేస్ వంటి వాటితో ఎక్కడ ప్రమాదముంది అని ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇవన్నీ వైద్యరంగాన్ని మరింత సులభతరం చేశాయి. స్మార్ట్ఫోన్ ద్వారా డిమెన్షియా నిర్ధారణపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని యాప్స్ మనిషి రోజు వారీ కదలికలను కూడా చెప్పేస్తున్నాయి. అయితే ఒక రోగిని ఒక గది నుంచి మరో గదికి తరలించాలంటే ఖచ్చితంగా మనిషి అవసరం ఉంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ ప్రమేయం లేకుండా అనుకున్న విజయం సాధించే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాగిన్ చేయవచ్చు, రోగికి సంబంధించిన రోగాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆ తరువాత దాన్ని ఒక వైద్యుడే పూర్తి చేయాలి. మనిషి ప్రమేయం లేకుండా AI మాత్రమే ఏమి సాధించలేదు. అదే సమయంలో మనిషి చేయాల్సిన పని మరింత వేగవంతం కావడానికి 'ఏఐ' చాలా ఉపయోగపడుతుంది. విద్య ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో బోధించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఒక ప్రొఫెసర్ చెప్పే క్లాస్ ఆటోమేషన్ చెబితే భిన్నంగా ఉంటుంది. తరగతిలో సమయాన్ని బట్టి ఏది ఎలా చెప్పాలో ఒక గురువు మాత్రమే నిర్ణయిస్తాడు. కానీ ఆటోమేషన్ తనకు ఇచ్చిన క్లాస్ పూర్తి చేసి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఉపయోగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనిషి భావాన్ని, భావోద్వేగాన్ని గ్రహించదు. కావున విద్యార్థులతో పరస్పర సంబంధం కోల్పోతుంది. ఆ సంబంధం కేవలం గురువు మాత్రమే పొందగలడు. కాల్ సెంటర్లు కాల్ సెంటర్లలో మాత్రమే AI తప్పకుండా చాలా ఉపయోగకరమైనదనే చెప్పాలి. ఎందుకంటే కాల్ సెంటర్లు తరచుగా ఒత్తిడితో నిండిన వాతావరణం కలిగి ఉంటాయి. ఇది అక్కడ పనిచేసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్థానంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది వాయిస్-టోన్ గుర్తింపును ఉపయోగించి సిబ్బంది, నిర్వాహకులు తమ కస్టమర్లు, కార్మికుల భావోద్వేగ స్థితిని అంచనా వేయడానికి అనుమతిస్తుంది. (ఇదీ చదవండి: చాలా గర్వంగా ఉంది.. కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్) వ్యవసాయం ప్రస్తుతం ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయ రంగంలో కూడా ఆటోమేషన్ రాజయమేలుతున్నాయి. క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అండ్ తెగుళ్లు, వ్యాధి నిరోధకతలో AI ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రోబోటిక్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఏ పనైనా చేయడానికి ఉపయోగపడే ఈ టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవు. ఏ ట్రక్కు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రక్కులో ఏమి నింపాలి అనే విషయాలు అది అర్థం చేసుకున్నప్పటికీ మానవ ప్రమేయం లేకుండా ఇది మాత్రమే ఏమి చేయలేదు. ఆలా జరిగితే తప్పకుండా ప్రమాదాలు సంభవిస్తాయి. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) మిలటరీ ఇక చివరగా మిలటరీ విభాగం విషయానికి వస్తే, AIలో సైనిక పెట్టుబడులు ఇప్పటికే చాలా పెట్టినట్లు తెలుస్తోంది. ఇది యుద్ధ భవిష్యత్తును నడిపిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. కానీ సెమీ అటానమస్ డ్రోన్లు, ట్యాంకులు, జలాంతర్గాములను ప్రవేశపెట్టినప్పటికీ, సాంకేతికత ఊహించిన దాని కంటే తక్కువగా ఉపయోగపడుతుంది. యుద్ధం వంటి వాటిలో ఈ టెక్నాలజీ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ధైర్యం, దయ, కరుణ వంటి లక్షణాలు కేవలం సైనికులకు మాత్రమే ఉంటాయి. AI టెక్నాలజీకి అలాటివి ఉండవు. అయితే దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్యను తగ్గిస్తుంది. భవిష్యత్తులో మనిషి ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ముందుకు వెళతాడు అనేది సమ్మతించాల్సిన విషయమే. -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
మహారాష్ట్ర: కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
జీవితకాల గరిష్ఠాలకు స్టాక్మార్కెట్లు.. 22,950 మార్కు చేరిన నిఫ్టీ
బెంగుళూరులోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపు
లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది
తప్పక చదవండి
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
Advertisement