నకిరేకల్ (నల్గొండ) : నకిరేకల్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం సాయంత్రం శీతలపానీయాలతో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది. లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. లారీలో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే లారీలో ఉన్న సగం కూల్ డ్రింక్స్ సీసాలన్నీ పగిలిపోయాయి. లారీ హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
శీతలపానీయాల లారీ బోల్తా
Published Thu, Aug 20 2015 6:25 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement
Advertisement