మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో 18 కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ పుష్పా దేశ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 15 మందికి రూ.2వేల చొప్పున జరిమానా, అతిగా మద్యం తాగిన ముగ్గురికి మూడు రోజుల జైలుశిక్ష విధించారు.