16 నుంచి ఒంటిపూట బడి | from 16nth half day classes | Sakshi
Sakshi News home page

16 నుంచి ఒంటిపూట బడి

Published Sat, Mar 14 2015 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

హైదరాబాద్: వేసవి ఎండల నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం (16వ తేదీ) నుంచి ఒక్క పూట బడులను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్: వేసవి ఎండల నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం (16వ తేదీ) నుంచి ఒక్క పూట బడులను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 16వ తేదీ నుంచి పాఠశాలలు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లలో.. పరీక్షలు జరిగే 11 రోజుల పాటు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులను నిర్వహిస్తారని చెప్పారు. కాగా వేసవి ఎండల దృష్ట్యా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నడిచే స్కూళ్ల విషయంలో పునరాలోచించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు పాఠశాల విద్యా డెరైక్టర్‌కు విజ్ఞప్తి చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement