
సాక్షి, నల్గొండ: హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 27న పోక్సోకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment