Srinivas reddy
-
కోడి పందేల నిర్వహణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌస్పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్హౌస్ను శివ కుమార్ వర్మ లీజ్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండమొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్హౌస్పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. -
ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభం
-
రెవెన్యూను సరిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘ఆసామి సరిగా లేకపోతే ఏం జరుగుతుందో గత ప్రభుత్వ హయాంలో అదే జరిగింది. దొరికినోడికి దొరికినంత తరహాలో ఆగమాగం చేశారు. ఈ పరిస్థితిని మార్చకపోతే ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమైపోతాయి. అలాకాకుండా వాటిని కాపాడడం మా బాధ్యత. నేను మంత్రిగా ఉన్నప్పుడే రెవెన్యూ వ్యవస్థను సరిచేస్తా. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా..’అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పారదర్శకత కోసమే ప్రక్షాళన: ‘కర్ణాటకలో పారదర్శక రిజిస్ట్రేషన్ల ప్రయత్నం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతోంది. అక్కడ ఇప్పటికీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. తెలంగాణలోనూ దీనికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ వ్యవస్థను అన్ని రకాలుగా ప్రక్షాళన చేస్తున్నాం. రాష్ట్రంలో డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 1.2 శాతం పెరిగినా మా అంచనాలకు తగినట్టు మాత్రం రాలేదు. ఈ మూడు నెలలు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మొత్తం 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో 4.5 లక్షల వరకు పరిష్కరించాం. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. జాగ్రత్తగా ముందుకెళ్తుండటంతో ఈ విషయంలో కొంత జాప్యం జరుగుతోంది.జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి) దరఖాస్తుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. భూముల విలువల సవరణ ప్రక్రియ అమలు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల నియామక ప్రక్రియ త్వరలో చేపడతాం. వీఆర్వో, వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 1,365 మందిని నేరుగా రెవెన్యూలోకి తీసుకుంటాం. మిగిలిన వీఆర్వోలు, వీఆర్ఏల్లో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెడతాం. ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలిపోతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేయర్ల నియామక ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 81 లక్షల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ 85 శాతం పూర్తయింది..’అని పొంగులేటి తెలిపారు. కొత్త పాస్ పుస్తకాలుండవు ‘కొత్త రెవెన్యూ చట్టం వస్తున్నందున రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయనడం సరికాదు. కొత్తగా అవసరమైన వారికి మాత్రమే కొత్త పుస్తకాలు వస్తాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు లోతుగా విచారణ చేయాలని చెప్పానే తప్ప 2వేల ఎకరాల వరకు అక్రమాలు జరిగాయని నేను కూడా ఊహించలేదు. ధరణి పోర్టల్ నిర్వహణను ఈనెల ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఐసీ చూస్తోంది..’అని మంత్రి వెల్లడించారు. సియోల్ బాంబులు స్టార్టయ్యాయి: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తాను చెప్పిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు పేలడం మొదలయ్యాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని, అయితే తప్పొప్పులు తేల్చేది కోర్టులని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో తప్పు చేయకుంటే కేటీఆర్కు భయమెందుకని, కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గ్రీన్కో ఇచ్చిన ఎన్నికల బాండ్లు మాత్రమే కాదని, ఈ కేసులో బయటపడాల్సినవి చాలానే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకి వెళ్లాయో తేలాలని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఎలా అయిందని, జాతీయ పార్టీలకు కూడా లేని నిధులు ఆ పార్టీకి ఎక్కడివని ప్రశ్నించారు. -
రెవెన్యూ డివిజన్లు, మండలాల గందరగోళాన్ని సరిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటాం’అని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల స మయంలో పెద్దసంఖ్యలో సభ్యులు, రెవెన్యూ డి విజన్లు, మండలాల గందరగోళంపై అడిగిన ప్ర శ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.ఐదు మండలాలున్న చేర్యాల ప్రాంతంలో ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు సంబంధిత పనులకు హుస్నాబాద్కు, వ్యవసాయశాఖ పనులకు గజ్వేల్ కార్యాలయానికి, కలెక్టరేట్ కోసం సిద్దిపేటకు తిరగాల్సి వస్తోందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. ముధోల్, తాండూరు, జడ్చర్ల, వేములవాడ, నారాయణఖేడ్, వర్ధన్నపేట, మహబూబాబాద్.. ఇలా పలు నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలపై సీఎం, సహచర మంత్రులతో చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
బద్వేల్ బాధిత తల్లిదండ్రుల ప్రశ్నలకు టీడీపీ నేత పరారు..
-
ఆ పెద్దన్న ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నివాసంపై ఈడీ జరిపిన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ దాడిలో రూ.వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూ కు ఒక్క విషయం బయటకి రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ.40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
హైదరాబాద్లో ‘డేట్ డ్రగ్’
సాక్షి, హైదరాబాద్ : డేట్ డ్రగ్ ఎంఫెటమైన్ (8.5 కేజీలు) భారీస్థాయిలో పట్టుబడింది. దీనిని రేప్ డ్రగ్ అని కూడా అంటారు. డేటింగ్ పేరుతో యువతులను తీసుకెళ్లి వారికి తెలియకుండా వారు తాగే నీరు, కూల్డ్రింక్స్లో కలిపి ఇచ్చేసి అప స్మారక స్థితిలోకి చేరాక అఘాయిత్యాలకు పాల్పడటానికి కొందరు ఈ డ్రగ్ను వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీసీపీలు సాధన రష్మి పెరుమాళ్, వైవీఎస్.సుధీంద్రలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో హైదరాబాద్ సీపీ ఆ వివరాలు వెల్లడించారు. బౌరంపేటకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చంద్రారెడ్డి గార్డెన్స్ పేరుతో ఫంక్షన్హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్వహించేవాడు. సాయికుమార్గౌడ్, రాకే‹శ్ కొన్నాళ్ల క్రితం ఫార్మా కంపెనీల్లో పనిచేశారు. వీరికి కెమికల్ ప్రాసెసింగ్పై పట్టు ఉంది. వీరితో కలిసి అల్ప్రాజోలం తయారు చేయాలని అంజిరెడ్డి పథకం వేశాడు. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్గౌడ్ సహకారంతో అదే గ్రామంలో ఓ కోళ్ల ఫారం అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ గదిలో డ్రగ్స్ ప్రాసెసింగ్కు అవసరమైన రియాక్టర్ ఏర్పాటు చేశారు. అంజిరెడ్డి బాలానగర్ నుంచి ముడి సరుకులు ఖరీదు చేసి ఇచ్చేవాడు. వీటిని వినియోగించి సాయి, రాకేశ్లు అల్ప్రాజోలం, ఎంఫిటమైన్ తయారు చేసేవారు. డిప్రెషన్ వంటి రుగ్మతలకు వైద్యుల చీటీ ఆధారంగా విక్రయించే ఔషధాలను తయారు చేయడానికి ఈ రెండింటినీ వాడతారు. వీటిని దుర్వినియోగం చేస్తూ మాదకద్రవ్యాలుగా వీరు విక్రయించడం మొదలు పెట్టారు. టీజీ ఏఎన్బీకి ఫిర్యాదుతో....ల్యాబ్లో మిగిలిన రసాయన వ్యర్థాలను కొత్తపల్లి శివార్లలో పడేసేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ వస్తున్న వాసనలతో స్థానికులు దీనిపై టీజీ ఏఎన్బీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు జూన్ 18న దాడి చేసి అంజిరెడ్డి తదితరులను అరెస్టు చేసి 2.6 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇదే ల్యాబ్లో అంజిరెడ్డి ఎంఫిటమైన్ తయారు చేయించాడు. అరెస్టు కావడానికి పదిరోజుల ముందు తన అనుచరుడైన కుంచల నాగరాజును పిలిచాడు.తన వద్ద ఉన్న 8.5 కేజీల ఎంఫిటమైన్ను అప్పగించి భద్రపర చాలన్నాడు. అంజిరెడ్డి అరెస్టు కావడం.. జైలుకు వెళ్లి రెండు నెలలు దాటినా అతడు బయటకు రాకపోవడంతో నాగరాజు ఆ సరుకును ముందు గ్రామం నుంచి నగరానికి చేరుద్దామని, ఆపై ఖరీదు చేయ డానికి ఆసక్తి చూపిన వారికి విక్రయిద్దామని భావించాడు. దీనికోసం వినోద్కుమార్గౌడ్, శ్రీశైలంలను సంప్రదించాడు. ఈ ముగ్గురూ కలిసి వాహనంలో ఎంఫిటమైన్ పెట్టుకొని బయలుదేరారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందింది. బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాసి...ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, డానియేల్, బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాశారు. అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎంఫిటమైన్ దొరికింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డ్రగ్తో పాటు వాహనం స్వాధీనం చేసుకున్నారు. ‘అత్యంత తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్ను ముక్కు ద్వారా పీల్చడం, నీరు/కూల్డ్రింక్స్లో కలిపి తాగడం, నీళ్లల్లో కలిపి ఇంజెక్షన్లా చేసుకోవడం ద్వారా సేవిస్తుంటారు.అనేక మందికి తెలియకుండానే దీనిని కూల్డ్రింక్లో కలిపి ఇచ్చి వారినీ బానిసలుగా మారు స్తారు. ఈ నేపథ్యంలోనే అపరిచితులు, డ్రగ్స్ అలవాటు ఉన్నవారు ఇచ్చే పార్టీలకు యువత వెళ్లకూడదు. ఈ కేసులో అంజిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని పీటీ వారెంట్పై అరెస్టు చేస్తాం’ అని కొత్వాల్ శ్రీనివాస్రెడ్డి చెప్పారు. -
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
-
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత.. యువతకు సీపీ వార్నింగ్..
-
ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
-
నంద్యాల జిల్లాలో నరమేధం సృష్టించిన శ్రీనివాస్రెడ్డి ఎక్కడ?
-
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
హిమాయత్నగర్(హైదరాబాద్): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీడియాలో వస్తున్న మార్పులతో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోనున్నదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్గా ఉద్యోగ విరమణ చేసిన కె.రవికాంత్రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, కోశాధికారి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజే‹Ù, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కేఎన్, హరి, సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు, ఇతర సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. అర్హులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలన్నారు. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, వై.నరేందర్రెడ్డి, శంకర్గౌడ్, సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని పోచా రం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు.. చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహా్వనించారు. పోచారంతో పా టు ఆయన కుమారుడు భాస్కర్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడే సీఎం మీడియాతో మాట్లాడారు. అండగా నిలవాలని కోరా తెలంగాణ పునరి్నర్మాణంలో భాగంగా పోచారంను కలిశామని, పెద్ద నాయకుడిగా తమకు అండగా నిలబడాలని కోరామని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. రైతుల విషయంలో పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. తమది రైతు రాజ్యమని, రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి రైతు పక్షపాతి: పోచారం సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతి అని పోచారం చెప్పారు. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యమైనవని పేర్కొన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు. రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లలో పనిచేసినా చివరకు కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని చెప్పారు. రేవంత్రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో మరిన్ని చేరికలు?పోచారం చేరిక నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. దానం నాగేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలంటూ ఏకంగా ఓ జాబితానే ప్రకటించారు. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించారు.పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్రావు, కేటీఆర్లు తప్ప మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని ఆయన చెప్పడం గమనార్హం. కాగా దానం, తాజాగా పోచారంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పారీ్టలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి 70కి చే రడం గమనార్హం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్ యత్నంబంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసం నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు అక్కడకు వచ్చారు. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది.ఈ క్రమంలో బాల్క సుమన్ను బలవంతంగా బయటకు తీసుకువచి్చన పోలీసులు జీపులో కూర్చోబెట్టి తరలించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెల్లాచెదురు చేసి. బాల్క సుమన్ను బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. సీఎంఉ ండగానే పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బాల్క సుమన్తో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, అందరికీ బెయిల్ మంజూరైంది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యిందో ట్విట్టర్ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు.మార్ఫింగ్ వీడియోను ఫోరెన్సిక్కు పంపించాము. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల కోసం ఫుల్ బందోబస్తు..ఇదే సమయంలో ఎన్నికల బందోబస్తు గురించి కూడా వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన దాని కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్కి వచ్చాయి. మరిన్ని బలగాలను పంపాలని కోరాం.పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయి. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పనిచేస్తాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి 18 కోట్ల అక్రమ నగదుని ఇప్పటివరకు పట్టుకున్నాం. అలాగే, 12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్తో గీతాంజలికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్లో ఫాస్ట్పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని, 71రోజుల్లో ఇప్పటికే 31వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో సుమారు రూ.47కోట్లతో నిర్మించిన కె–హబ్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధనసరి అనుసూయ(సీతక్క), కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కె–హబ్లో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నాలుగు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు యూనివర్సిటీల్లోని యువతను రెచ్చగొట్టి దాదాపు పదేళ్లు అ«ధికారంలో ఉన్న గత ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించకుండా విస్మరించిందని విమర్శించారు. -
మహబూబ్నగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మరో లోక్సభ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. కాగా, ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నుంచి లోక్సభకు కొత్త వారే.. -
ఖర్చులు వెల్లడిస్తాం
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరకు చేసిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్న అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. జాతరకు డబ్బు లేదనకుండా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం జాతరకు మూడు వేల బస్సులను నడిపితే.. ఈ ప్రభుత్వం ఆరువేల బస్సులు నడుపుతోందన్నారు. ఇప్పటివరకు వనదేవతలను 17 లక్షల మంది మహిళలు దర్శించుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈసారి జాతరకు వచ్చిపోతున్నారని, వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్రమశిక్షణ, స్వీయ రక్షణతో జాతరకు వచ్చివెళ్లాలని, వాహనాలను ఓవర్టేక్ చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. -
మీలా ఆత్రుత పడం.. తప్పులు చేయం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరాన్ని తొందరగా కట్టేయాలనే ఆత్రుత తప్ప అసలు ఆ ప్రాజెక్టు మనుగడ గురించి ఆలోచించలేదు. కటాఫ్వాల్ డిజైన్ మార్చకుండా డయాఫ్రమ్ వాల్ను ఆర్సీసీతో కట్టి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఇసుకను సరైన విధంగా గట్టిపర్చలేకపోవడం వల్ల నష్టం జరిగింది. ఆర్సీసీతో వాల్ కట్టి ఉంటే రాఫ్ట్ కుంగేది కాదు.. డ్యామ్ కుచించుకుపోయి పగుళ్లకు ఆస్కారం ఏర్పడేది కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలోని ఈ మూడు పిల్లర్లే కాదని, అన్నారంలో కూడా బుడగలు వస్తున్నాయని, సుందిళ్ల బ్యారేజీలో సీపేజీ మొదలైందని చెప్పారు. ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆత్రుత పడేది లేదని, తప్పులు చేసేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం శిల్పాన్ని చెక్కిందే తానని, తన మెదడులోనే ప్రాజెక్టు డిజైన్ ఉందని చెప్పే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే తనకున్న సమస్యకు పరిష్కారం చెప్పేవారు కదా అని ఎద్దేవా చేశారు. నాడు ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కలిసి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పవిత్ర దేవాలయం అని చెప్పిన కేసీఆర్కు అదే ప్రాజెక్టు బొందలగడ్డ ఎలా అయిందని ప్రశ్నించారు. పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే.. కనీస పరిశోధనలు లేకుండానే కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేశా రని శ్రీనివాస్రెడ్డి అన్నారు. మట్టి పరీక్షలు, ఇతరాత్ర పరిశోధనలు లోతుగా నిర్వహించకుండానే ప్రాజెక్టులను కట్టడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వ్యవసాయానికి నీటిని అందించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న వాదన అర్థరహితమన్నా రు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేరా అని కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, అక్టోబర్ 21, 2023 రోజునే పిల్లర్లు కుంగిపోయాయని, అప్పటి నుంచి దాదాపు 45 రోజుల పాటు కేసీఆరే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నా రని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్స్టేషన్కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్కుమార్కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
HYD: పంజాగుట్ట పీఎస్ మొత్తం సిబ్బందిపై వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్ ఎస్ఐ మొదలు.. హోంగార్డ్ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. వివాదాల పోలీస్స్టేషన్గా పేరు పడ్డ పంజాగుట్టను రిపేర్ చేయలేమని భావించిన పోలీస్ శాఖ మొత్తానికి మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట స్టేషన్లో హోంగార్డు నుంచి ఇన్స్పెక్టర్ దాకా ఎన్నో వివాదాలు ఉన్నాయి. పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది. -
ప్రజలపై భారం మోపం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ భూములపై నివేదిక ఇవ్వాలి.. గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. 2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్ కుమా ర్, నవీన్మిత్తల్ పాల్గొన్నారు. -
భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-
తెలంగాణలో ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
-
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్కార్డును ప్రామాణికం(థంబ్రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'రాఘవ రెడ్డి'!
శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్పై శివ శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రాఘవ రెడ్డి ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసరైన హీరో డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల అతనేం కోల్పోయాడు? అన్న కథాంశంతో తెరకెక్కించారు. ఈ ట్రైలర్లో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
హైదరాబాద్ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
-
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డితో టుడేస్ లీడర్
-
జనగామపై వీడని పీటముడి!
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్లో స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్లోని ఓ హోటల్లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం. అలాగే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. -
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
కెరీర్ కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు: బాధితురాలు
-
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
‘సాక్షి’ విలేకరులపై టీడీపీ గూండాల దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది. ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్ను టెంట్లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్లో నిర్బంధించారు. సెల్ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు. వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం ‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -
అనుమతులు లేకుండా ఐస్క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్లో జరిగే ట్విస్ట్లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు. తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
స్కూల్ డేస్ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ
టైటిల్: టెన్త్ క్లాస్ డైరీస్ నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్ తదితరులు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార సంగీతం: సురేష్ బొబ్బిలి విడుదల తేది: జులై 1, 2022 అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి అజయ్ మైసూర్ సమర్పకులు. ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రం శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ: మిడిల్ క్లాస్ అబ్బాయి సోమయాజ్ (శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్ మ్యాన్గా స్థిరపడతాడు. డబ్బు, అమ్మాయిలు, లగ్జరీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ తన జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. ఈ వెలితీతో జీవిస్తున్న అతనికి ఆనందం లేదు. అతని భార్య కూడా వదిలేస్తుంది. తను ఏది మిస్ అవుతున్నాడో తెలుసుకునేందుకు ఒక సైకియాట్రిస్ట్ను సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే అతని ఆనందం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ప్రేమించిన తన ఫస్ట్ లవ్ చాందినీ (అవికా గోర్) దగ్గర ఉందని. దీంతో టెన్త్ క్లాస్ రీ యూనియన్కు ప్లాన్ చేస్తాడు. మరీ ఆ రీ యూనియన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది ? చాందినీని కలుసుకున్నాడా ? అసలు చాందినీకి ఏమైంది ? అనే తదితర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'కు వెళ్లాల్సిందే. విశ్లేషణ: యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మనసులు హత్తుకునేలా ఉంటాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాలు కాస్తా అటు ఇటు అయిన తేడా కొడుతుంటాయి. అలాంటిదే ఈ కథ. నిర్మాత అచ్యుతరామారావు జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశంతో ఈ కథను రూపొందించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో ఈ సినిమా ద్వారా చూపించారు. నిజానికి ఇలాంటి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు దర్శకనిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ వారు ఎంచుకున్న కథను పక్కాగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయారు. ప్రేమించిన అమ్మాయి కోసం వెతికేందుకు చేసిన రీ యూనియన్, దానిలో భాగంగా వచ్చే సీన్లు ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. హాఫ్ బాయిల్ (శ్రీనివాస్ రెడ్డి), గౌరవ్ నిర్మాత (అచ్యుత రామారావు) మధ్య వచ్చే సీన్లు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులను తెగ నవ్వించారు. కానీ సోమయాజ్, చాందినీ ప్రేమ సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఈ లవ్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్లో హీరోయిన్ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల జీవితంలో కోరుకునే విషయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు. ఊహించని విధంగా ఉండే క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుంది. మూవీ మొత్తం ఎలా ఉన్న క్లైమాక్స్కు వచ్చేసరికి మాత్రం ఆడియెన్స్కు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది. ఎవరెలా చేశారంటే? తన ఫస్ట్ లవ్ను దక్కించుకోవాలనే ప్రేమికుడిగా, ఆనందం మిస్ అయిన బిజినెస్ మ్యాన్గా శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంతకుముందు 'రోజాపూలు' సినిమాలో చూసిన శ్రీరామ్ నటన, ఆ ఈజ్ ఎక్కడో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక అవికా గోర్ నటన కూడా పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంది. హీరో ఫ్రెండ్స్గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత అచ్యుత రామారావు కామెడీ టైమింగ్తో అదరగొట్టారు. వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్గా అచ్యుత రామారావుకు మంచి భవిష్యత్తు ఉందనే చెప్పవచ్చు. వీరితోపాటు హిమజ, అర్చన, శివ బాలాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలోని బీజీఎం '96' మూవీని తలపిస్తుంది. ఇక 'గరుడవేగ' అంజికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. రీ యూనియన్ సీన్లు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. సినిమాలోని డైలాగ్లు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్' మీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చాలవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
100 ఏళ్లు మన్నికయ్యే రంగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ లైమ్ ఆధారిత ఇటాలియన్ ఫినిషెస్ను భారత్లో ప్రవేశపెట్టింది. వారసత్వ కట్టడాలకు లైమ్ ఆధారిత పెయింట్స్ను వాడతారని, 100 ఏళ్లకుపైగా మన్నికగా ఉండడం వీటి ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రసాయనాలు లేకుండా సహజ ఖనిజాలు, వర్ణ ద్రవ్యాలతో వీటిని తయారు చేస్తారు. ఖరీదైన భవంతులు, విల్లాలకూ ఈ రంగుల వినియోగం పెరుగుతోందని కంపెనీ వివరించింది. లైమ్ ఆధారిత రంగుల తయారీ భారత్లో లేదని, కొన్ని కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయని తెలిపింది. చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.150–400 మధ్య ఉంటుంది. లైమ్ ప్లాస్టర్స్, డెకోరేటివ్ ఫినిషెస్, వెనీషియన్ ప్లాస్టర్స్, మెటాలిక్ స్టకోస్ సైతం కంపెనీ విక్రయించనుంది. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు..: ఇటలీ కంపెనీ రియాల్టోతో టెక్నో పెయింట్స్ సాంకేతిక సహకారం కుదుర్చుకుంది. లైమ్ ఆధారిత ఫినిషెస్ను తొలుత దిగుమతి చేసుకుంటామని టెక్నో పెయింట్స్ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘అమ్మకాలు పెరిగిన తర్వాత వీటిని ఉత్పత్తి చేస్తాం. రియాల్టో సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన డిజైనింగ్ ఫినిషెస్ను తయారు చేస్తున్నాం. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు వద్ద ఉన్న కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం ఒక లక్ష మెట్రిక్ టన్నులు. తొలి దశలో రూ.75 కోట్లు వెచ్చించాం. ప్లాంటు వినియోగం 2023 మార్చికల్లా 100 శాతానికి చేరుతుంది. 2023–24లో మరో రూ.75 కోట్లు ఖర్చు చేస్తాం. తద్వారా సామర్థ్యం రెండింతలు అవుతుంది. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లు ఉంది’ అని వివరించారు. -
అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెఫ్ట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని ఏప్రిల్లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రకు సంబంధించిన సీన్స్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్లో ఆ సీన్స్ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్ వర్కింగ్ స్టెల్ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందన్నారు. టైటిల్తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
టెన్త్ క్లాస్ డైరీస్ నుంచి సిలకా సిలకా సాంగ్ వచ్చేసింది..
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులుగా కెమెరామేన్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ నెల 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘సిలకా.. సిలకా.. రామా సిలకా.. ఏదో ఉందే మెలికా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సందర్భంగా ‘గరుడ వేగ’ అంజి మాట్లాడుతూ – ‘‘ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డ్యాన్సర్స్పై ఈ పాటను తెరకెక్కించాం. ఈ పాటలో ఇద్దరు ముంబై డ్యాన్సర్స్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘రోజ్ విల్లా, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత మేం చేస్తోన్న మూడో చిత్రం ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు అచ్యుత రామారావు. -
బియ్యం ఎక్కడ నిల్వ చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ఎఫ్సీఐ గోదాములన్నీ నిండిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందం మేరకు ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. పౌరసరఫరాల భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్సీఐకి రాష్ట్రంలో 20.37 లక్షల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ప్రస్తుతం సామర్థ్యానికి మించి మరో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కువగా నిల్వచేసినట్లు తెలిపారు. గోదాముల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయకుండా కేంద్రం తన వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై రుద్దడానికి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
కిషన్రెడ్డి వాదన అర్థరహితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల యాసంగిలో రా రైస్ (పచ్చిబియ్యం) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదనే ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ అప్పగిస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని రా రైస్గా మారిస్తే బియ్యానికి బదులు నూకలు 30 నుంచి 40 శాతం వస్తాయని, బ్రోకెన్ రైస్ను ఎఫ్సీఐ 25 శాతమే అనుమతిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అర్థరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని కిషన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే ధాన్యం సేకరణ కేంద్ర జాబితాలోని అంశంగా వస్తోందని ఆయన పేర్కొన్నారు. -
ఒకే ఫ్రేమ్లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్రాజ్, రాజేశ్తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
30 రోజుల్లో మాదకద్రవ్య రహిత తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రానున్న 30 రోజుల్లో రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత తెలంగాణగా మార్చాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. డ్రగ్స్, గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘాతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను మరింత పటిష్టం చేయనున్నారు. మత్తు పదార్థాలను తయారు చేస్తున్న వారితో పాటు రవాణా, అమ్మకం, వినియోగం చేస్తున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు ఎక్సైజ్ అధికారులు. రాష్ట్ర పోలీసు శాఖ సహకారంతో గంజాయి సాగు, రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు గుడుంబా వినియోగం పెరగకుండా తయారీదారులకు పునరావాస ప్రక్రియ అమలు చేయనున్నారు. ఎక్సైజ్ అధికారులకు మంత్రి సన్మానం కాగా, అంతర్జాతీయ మార్కెట్లో రూ.2కోట్లకు పైగా విలువ ఉండే సుమారు 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ను పట్టుకున్న ఎక్సైజ్ అధికారులను ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ ఈఎస్ విజయ్భాస్కర్, సీఐ సహదేవ్లతో పాటు వారి సిబ్బందిని శాలువాలతో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని, దాడి చేసి పట్టుకునేంతవరకు నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. టాస్క్ఫోర్స్ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. -
బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం
-
‘ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: యాసంగికి సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారం పౌరసరఫరాలభవన్లో కమిషనర్ అనిల్ కుమార్తో కలసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించా రు. యాసంగి సీజన్లో మొత్తంగా 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, సీఎంఆర్ కింద బియ్యంగా మార్చి 64 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ తీసుకుందని తెలిపారు. -
పేదరికంపై అలుపెరగని పోరాటం చేస్తున్న దివ్యాంగుడు
-
Plan B Review And Rating: ‘ప్లాన్ బి’ ఎలా ఉందంటే..?
టైటిల్ : ప్లాన్ బి జానర్ :సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ తదితరులు నిర్మాణ సంస్థ : ఏవీఆర్ మూవీ వండర్స్ నిర్మాత : ఏవీఆర్ కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కెవి రాజమహి సంగీతం : స్వర నేపథ్య సంగీతం : శక్తికాంత్ కార్తీక్ డీవోపీ : వెంకట్ గంగాధరి ఎడిటింగ్: ఆవుల వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021 గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో పెద్ద తరహా చిత్రాలే కాదు.. కాన్సెప్ట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కథలో కొత్తదనం ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే టాలీవుడ్లో ఇటీవల చిన్న చిత్రాలు ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘ప్లాన్ బి’థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,టీజర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. పక్కా ప్లాన్తో వచ్చిన‘ప్లాన్ బి’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలకు సంతానం కలగదు. ఆ గ్రామంలోని పురుషులకు వీర్యకణాలు తగ్గిపోవడం వల్లే పిల్లలకు పుట్టరు. ఈ క్రమంలో ఆ ఊరికి వచ్చిన ఓ డాక్టర్ మంచి వైద్యాన్ని అందించి అందరికి సంతానం కలిగేలా చేస్తాడు. అయితే గ్రామంలోని ఓ జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. దీంతో ఆ వైద్యుడు తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో వారికి బిడ్డను అందిస్తారు. కట్ చేస్తే.. ఓ రిటైర్డ్ పోలీసు అధికారి చనిపోయే ముందు తన కూతుకు రూ. 10 కోట్లు ఇస్తాడు. అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించబడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్(శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్ టీచర్ రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. ఈ హత్యలకు, రూ. 10 కోట్ల దొంగతనానికి సంబంధం ఏంటి? ఆ డబ్బును ఎవరు దొంగిలించారు? ఈ కేసును పోలీసు అధికారి( మురళీ శర్మ) ఎలా చేధించాడు? అసలు ఈ కథకి డాక్టర్కి సంబంధం ఏంటి? ప్లాన్ బి అంటే ఏంటి? అది ఎవరు వేశారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకు కీలకమైన లాయర్ విశ్వనాథ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ప్రేమికుడు గౌతమ్ పాత్రలో సూర్య వశిష్ట తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్ సీన్స్లో కూడా అవలీలగా నటించాడు. ప్రతినాయకుడిగా కునాల్ శర్మ అధ్బుత నటనను కనబరిచాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర మురళి శర్మది. పోలీసు అధికారి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు కెవి రాజమహి. ఆయన ఎంచుకున్న పాయింట్స్, రాసుకున్న స్క్రీన్ప్లే, డిజైన్ చేసుకున్న క్యారెక్టర్లు బాగున్నాయి. ప్లాన్ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. అయినప్పటికీ.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా ప్రతి క్యారెక్టర్ని, సీన్ని చాలా క్లియర్గా, ప్రేక్షకుడికి కన్ప్యూజన్ లేకుండా తెరపై చూపించాడు. అయితే కాస్త పేరున్న నటులను తీసుకొని ఉంటే ఆయన తపనకు సరైన ఫలితం ఉండేది. కథలో చాలా వరకు ఫేమస్ కానీ నటులు ఉండడం కాస్త మైనస్. పోలీసుల విచారణ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తాయి. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఏం జరిగిందో ముందో ఊహించడం కాస్త సిల్లీగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది. స్వర సంగీతం, శక్తికాంత్ కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొనేలా ఉంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
సెప్టెంబర్ 17న శ్రీనివాస్ రెడ్డి ' ప్లాన్ బి'
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో డింపుల్ హీరోయిన్గా నటిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర పాటలు అందించగా, శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. -
పచ్చి బియ్యం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్ సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అడిగిన విధంగా రా రైస్ (పచ్చి బియ్యం) ఇవ్వలేమని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో వరిసాగు కాలంలో అధిక ఉష్ణో గ్రత వల్ల రా రైస్ దిగుబడికి అనుకూలంగా ఉండదని, 25 శాతం కంటే అధికంగా నూకలు వస్తాయని, దీన్ని ఎఫ్సీఐ తిరస్కరిస్తోందన్నా రు. అందువల్ల ఎఫ్సీఐ అడిగినట్లుగా 40 శాతం బాయిల్డ్ రైస్, 60 శాతం రా రైస్ ఇవ్వ లేమని, 80–90 శాతం వరకు బాయిల్డ్ రైస్, మిగిలినవి రా రైస్ ఇవ్వగలమని తెలిపారు. ఈ విషయంలో ఎఫ్సీఐ తన నిర్ణ యాన్ని పునఃసమీక్షించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్, ఎఫ్ సీఐ నుంచి రావాల్సిన బకా యిలపై సోమవారం పౌర సరఫరాల భవ న్లో అధికారులతో శ్రీనివాస్రెడ్డి సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 63 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 24.75 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని ఎఫ్సీఐ పేర్కొనడం రైతాం గానికి గొడ్డలిపెట్టుగా మారుతోందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ఇప్పుడు తీసుకోబోమనడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ఈ సమస్యను సీఎం కేసీ ఆర్, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలా కర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా సీఎంఆర్ గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. -
మంత్రి శ్రీనివాస్ రెడ్డి సభలో మహిళల ఆందోళన
-
లాక్డౌన్లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్. శంకర్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. కె. నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా విధించబడిన లాక్డౌన్స్తో ప్రజలందరూ చెప్పలేని హౌస్ అరెస్ట్ను ఫీలయ్యారు. కరోనా టైమ్లో స్క్రిప్ట్ను ఓకే చేయించుకుని శేఖర్ సినిమాను పూర్తి చేయడం విశేషం’’ అన్నారు. (చదవండి: మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్) ‘‘పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి హిట్ చేయాలి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్టైనరే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘పిల్లలంటే దేవుళ్లతో సమానం. వారికోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ జనరేషన్లో పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయాన్నే ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శేఖర్. ఈ కార్యక్రమంలో కౌశిక్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ తాజాగా ఇటలీ సంస్థతో చేతులు కలిపింది. ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే సూపర్ ప్రీమియం పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నూతన తయారీ కేంద్రంలో.. కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద స్థాపిస్తోంది. దీని వార్షిక సామర్థ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్ పెయింట్స్, స్పెషల్ టెక్స్చర్ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్ ఫినిషెస్ తయారు చేస్తారు. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో.. టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 650 ప్రాజెక్టులను పూర్తి చేసింది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లుంది. హైదరాబాద్లో పెయింటింగ్ సేవల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్ 2021–22లో టర్నోవర్లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇక నుంచి చిన్న ప్రాజెక్టులను సైతం చేపట్టనుంది. కస్టమర్ల నమ్మకంతోనే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా
సాక్షి, హైదరాబాద్: ‘నేను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డిని, నాకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమి వ్వండి.. యూత్ కాంగ్రెస్ వాళ్లకు టికెట్లు ఇవ్వరా? ఆ కోటాలో మాకు టికెట్లివ్వండి అంటే ఇచ్చేది లేదు’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడి మోకాలిచిప్పలు పగులగొట్టుకుంటే రాహుల్పక్కన కూర్చునే అవకాశం దక్కిందని, అలా కష్టపడి పనిచేసే నాయకులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేస్తే ఇంటికే వచ్చి బీఫారం ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం శంషాబాద్లోని మేఫెయిర్ కన్వెన్షన్ హాల్లో శివసేనారెడ్డి అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, ఈ దేశానికి, రాష్ట్రానికి ఎంతో మంది నాయకులను అందించిన చరిత్ర యూత్ కాంగ్రెస్కు ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులు కూడా యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. అయితే, వారంతా ఎంతో కష్టపడి నాయకులుగా ఎదిగారని, ప్రస్తుత యూత్ కాంగ్రెస్ నాయకత్వం కూడా క్రియాశీలకంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో అయినా సంక్షోభ సమయంలోనే నాయకులు తయారవుతారని, ఆ స్థితి ఇప్పుడు కాంగ్రెస్లో ఉందని, అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్కు ఓనర్లు ఎవరూ లేరని, ఎవరు కష్టపడి పనిచేస్తే వారే నాయకులని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సవాల్గా తీసుకుని పోరాడాలి: మాణిక్యం రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడమే మన లక్ష్యం. ఇంకా 20 నెలల సమయమే ఉంది. దీన్ని సవాల్గా తీసుకోవాలి. మనం గెలిచి తీరాలి అనే కసితో పనిచేయాలి’ అని వ్యాఖ్యానించా రు. సమావేశానికి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్, రాష్ట్ర ఇన్చార్జి కృష్ణ అల్లవారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్కుమార్ యాదవ్, మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్కుమార్, మాజీ మంత్రులు షబ్బీర్అలీ, మల్లురవితో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల, పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
Cheruvaina Dooramaina: సుజిత్కి మంచి భవిష్యత్ ఉంది : అనిల్ రావిపూడి
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా నటించిన చిత్రం ‘చేరువైన... దూరమైన’.చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నివినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని తెలిపారు. సుజిత్ కి మంచి భవిష్యత్ ఉంటుదన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘హీరో సుజిత్ తో నాకు చాలా అనుబంధం వుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఓ మూడు నిమిషాల నిడివిగల ఓ డెమో సన్నివేషాన్ని తీసి సుజిత్ వాళ్ల అమ్మకు చూపించాం. ఆమె ఎంతో ఆనందించారు. నన్ను నమ్మి వాళ్ల అబ్బాయిని నా చేతిలో పెట్టారు. సుజిత్ లో ఆనందం కంటే... వాళ్ల అమ్మ కళ్లలో ఆనందమే చూడాలనుకున్నా. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరించాం. ఆ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’అన్నారు. నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..‘శ్రీనివాసరెడ్డి అన్న మా వెన్నంటి వుండి ఈసినిమాను ఎంతో ప్రోత్సహించారు. ఆయన కొన్ని సందేహాలు వెలిబుచ్చినా...ఈ సినిమాను దర్శకుడు ఎంతో పట్టుదలతో కంప్లీజ్ చేశారు చంద్రశేఖర్ తాను చెప్పిన కథ ఏదైతో వుందో దానినే తీశారు. ఈ రోజు టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు’అని అన్నారు. ‘నా మేనల్లుడిని ఆశీర్వదించండి’అని ప్రేక్షకులను కోరారు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో విలన్ గా నటించిన శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు. -
హీరోగా కమెడియన్.. థియేటర్స్లో సినిమా రిలీజ్
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మరోసారి హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించిన ఆయన ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి హీరోగా సందడి చేయనున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మించారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు. ముగ్గురు దివ్యాంగుల జీవితంలో చోటుచేసుకునే క్రైమ్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. అనుకోని విధంగా ఓ హత్యకేసు నుంచి చిక్కుకున్న ఆ ముగ్గురు ఎలా అక్కడినుంచి బయటపడ్డారు అన్న అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. -
అండగా నేనుంటా: పొంగులేటి
ములకలపల్లి: కాలికి స్టీల్ రాడ్లతో ఏడాదిగా ఇబ్బందిపడుతున్న మౌనికకు అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్సింగ్నగర్కు చెందిన గుర్రం మౌనిక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమె ఎడమ కాలికి స్టీల్ రాడ్లు వేశారు. వీటిని 15 రోజుల్లో రాడ్లు తొలగించాల్సి ఉన్నా భర్త, కుటుంబం పట్టించుకోకపోవడంతో నడవలేక పాకుతూ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ ఘటనపై ‘ఏడాదిగా.. కాళ్లకు స్టీల్ రాడ్లతోనే’శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. మౌనిక చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు తాను భరించి, ఖమ్మంలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, ఎస్సై బాల్దె సురేశ్ గ్రామానికి వెళ్లి మౌనిక భర్త మహేశ్ను శ్రీనివాసరెడ్డితో మాట్లాడించారు. వాహనం ఏర్పాటు చేసి, ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి మౌనికను తరలించారు. ఎస్సై సురేశ్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. -
నవ్వులు పూయిస్తున్న ‘ముగ్గురు మొనగాళ్లు’
Mugguru Monagallu: టాలీవుడ్ స్టార్ కెమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గరు మొనగాళ్లు’. ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల కథ ఇది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్లో శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. సరదాగా సాగుతూనే ఓ మిస్టరీ కేసు అంశంతో ఉత్కంఠ పెంచుతోంది ఈ ట్రైలర్. మరి ఆ హత్య కేసు ఏంటి? వీళ్లకి దానికి సంబంధం ఏంటి? పోలీసులు ఈ అమయాకుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర ఆసక్తికర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దివంగత నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కీలక పాత్రలు పోషించారు. రిత్విష్ శర్మ, శ్వేతా వర్మ హీరోయిన్స్గా నటించారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) కుంభకోణం కేసులో దరాప్తు, సోదాలు చేసిన కొద్దీ అనేక అక్రమాలు, అక్రమార్జనలు వెలుగు చూస్తున్నాయి. అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సోదాలు చేయడం, వారి నుంచి దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో వీరికి కూడా సంబంధాలు ఉన్నప్పుడు మరి రెండేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ వీరిని ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం విచారించ లేదా? విచారించినా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదా? ఒకవేళ ఏసీబీ వీరిని ప్రశ్నించేందుకు యత్నించినా.. ఏవైనా రాజకీయశక్తులు అడ్డు పడ్డాయా? అప్పటి మంత్రి పేషీ నుంచి కథంతా నడిచిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019లో ఏసీబీ విచారణ ప్రారం భమవుతున్న దశలో కార్మిక శాఖకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి ఏసీబీకి ఓ లేఖ రాశారు. అందులో అక్రమాలు కిందిస్థాయిలోనే జరిగాయని, ఉన్నతాధికారులకు సంబంధం లేవన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడదే ఉన్నతాధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా మారి అరెస్టు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏసీబీ నివేదిక ఆధారంగా రంగంలోకి ఈడీ మనీలాండరింగ్ జరిగిందన్న ఏసీబీ నివేదిక (8ఎఫ్ఐఆర్లు) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని డిసెంబర్ నుంచి ప్రశ్నిస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కొత్తగా శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డిల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. కాగా ఇదే పనిని గతంలో ఏసీబీ ఎందుకు చేయలేకపోయింది? అన్న చర్చ సాగుతోంది. ఏపీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇదే తరహా కేసులో అరెస్టయ్యారు. ఇక్కడా, అక్కడా కుంభకోణం జరిగిన తీరు (మోడస్ ఆపరెండి) ఒకటే కావడం గమనార్హం. ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై కన్ను ముకుందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవికారాణి, శ్రీహరిబాబు తదితరుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. 2014 నుంచి 2019లో ఈ కేసు వెలుగు చూసే వరకు వీరు, వీరి బంధువుల బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆన్లైన్ లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కూడబెట్టిన నగలు, చెల్లించిన ఆదాయపు పన్ను తదితరాలను విశ్లేషిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు లాకర్లు తెరిచేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంతకాలం అధికారులు మాత్రమే ఈ కుంభకోణంలో ఉన్నారనుకున్నప్పటికీ తాజాగా ఈడీ రంగప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. ఈ కుంభకోణానికి మంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు వాస్తవానికి ముందు నుంచీ ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ కలకుంట్ల పద్మలు ఇష్టానుసారంగా, నిబంధనలకు విరుద్ధంగా మందుల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు మంత్రి కార్యాలయం అభ్యంతరం తెలపలేదు. ‘‘కార్మిక శాఖ నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లు కాంట్రాక్టులు ఇచ్చినా ఏనాడూ వివరణ కోరలేదు. విజిలెన్స్ రంగప్రవేశం చేసేవరకూ ఆడిటింగ్లో ఎలాంటి లోపాలు వెలుగుచూడలేదు’’ అంటూ ఈఎస్ఐ సిబ్బంది అనేక సందేహాలు లేవనెత్తినప్పటికీ వీటిపై ఏసీబీ అంతగా దృష్టి సారించలేదు. కానీ, ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. పేద కార్మికుల సొమ్మును తినేశారు! ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.700 కోట్లకుపైగా మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈఎస్ఐ ఆసుపత్రి పేద కార్మికులకు ఒక వరం లాంటిది. రూ.25 వేలలోపు వేతనం ఉన్న కార్మికుల నుంచి నెలానెలా రూ.500 వరకు చందా కింద వసూలు చేస్తారు. అలా సేకరించిన నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అనారోగ్యం బారిన పడిన కార్మికులకు వైద్యసేవలు అందిస్తారు. అలాంటి బీద కార్మికులకు దక్కాల్సిన మందులను, వైద్య పరీక్షలకు కావాల్సిన మెడికల్ కిట్లను తదితరాల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోవడం, కమీషన్ల రూపంలో అందినకాడికి దండుకోవడం నాలుగేళ్లపాటు యధేచ్ఛగా సాగింది. ‘‘ఆరుగాలం శ్రమించిన పంటను పందికొక్కులు తిన్నట్లు, తాము చందాగా చెల్లించిన డబ్బులను కొందరు అవినీతిపరులు అదేవిధంగా పంచుకుతిన్నారంటూ’’ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీలో కూడా ఇదే తరహాలో రూ.988 కోట్ల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక్కడా, అక్కడా.. పాత్రధారులు వేరైనా.. సూత్రధారులు ఒకరేనా? అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏపీలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయి బెయిల్పై విడుదల అయిన బుర్రా ప్రమోదరెడ్డి పేరిట తెలంగాణ, ఏపీల్లో 7 డొల్ల కంపెనీలు ఉన్నాయి. కాగా శనివారం హైదరాబాద్లో శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డి ఇంటితో పాటు ప్రమోదరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం, రూ.1.15 కోట్లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. -
'సినిమా చూస్తున్నంతసేపు..కనీసం మొభైల్ కూడా చూడరు'
హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లాన్ బి’. ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎవిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠంగా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని, కథ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. 'ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదల కి ముందే మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
గజదొంగల నవ్వులు
‘‘హౌస్ అరెస్ట్’ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్ రూబెన్స్. చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది’’ అని డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్ అరెస్ట్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్ అరెస్ట్’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్డౌన్ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి. -
‘పూర్ణ కెరీర్కి మరో టర్నింగ్ పాయింట్ ఇది’
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. యువ నటుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్రలో నటించాడు. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది. పూర్ణ కెరీర్కి మరో టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూర్ణ పెర్ఫార్మెన్స్, గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అన్నారు కర్రి బాలాజీ. పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి, నటిగా నాకు, నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డిగారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
మరో మహ ప్రస్థానం..
-
టీజర్ ఆసక్తికరంగా ఉంది
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా, డింఫుల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏవీఆర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను త్రివిక్రమ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా క్యూరియాసిటీ నింపింది. సినిమా పెద్ద సక్సెస్ అయి అందరికీ పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సస్పెన్స్, క్రైమ్ థిల్లర్గా రూపొందించాం. కునాల్ శర్మ విలన్గా చేశారు’’ అన్నారు రాజమహి. ‘‘షూటింగ్ పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మా టీజర్ని విడుదల చేసిన త్రివిక్రమ్గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివర్లో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ఏవీఆర్. -
ఇంట్లో అరెస్ట్ అయ్యారు
హాస్యనటులు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు విభిన్నమైన, చక్కని వినోదాన్ని అందించే సినిమాలు అందిస్తూ భవిష్యత్తులో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మా ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ కంపెనీ అడుగులు వేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె. యువరాజ్. -
‘సాక్షి’ చదివి అరకిలో బంగారం గెలిచాడు
-
‘సాక్షి’ చదివి అరకిలో బంగారం గెలిచాడు
సాక్షి, హైదరాబాద్ : సాక్షి సెలబ్రేషన్స్ ఆఫర్ అరకిలో బంగారం విజేతగా ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్రెడ్డి నిలిచారు. గోల్డ్ప్రైజ్ రావడం చాలా ఆనందంగా ఉందని, అందుకు సాక్షికి కృత జ్ఞతలు తెలియచేశారు. ఇటీవలె తనకు ఆడపిల్ల పుట్టిందని ఈ బంగారాన్ని ఆమెతోపాటు ,తన భార్యకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాక్షి ఇచ్చే కథనాలంటే తనకు బాగా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షి డైరెక్టర్లు, సీఈవో చేతుల మీదుగా అరకిలో బంగారాన్ని అందుకున్నారు. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సాక్షి యాజమాన్యం ఈ ఆఫర్ను ప్రవేశపెట్టింది. చదవండి.. గెలవండి అనే నినాదంతో సాక్షి నిర్వహించిన ఈ సెలబ్రేషన్ ఆఫర్కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు. -
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ధర్నా
సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని తొగుట మండలం మల్లన్న సాగర్ భూబాధితులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మాణంకు ఎన్జీటి అనుమతులు లేకుండా అక్రమంగా కాలువ నిర్మించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు కేవలం లక్షా యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధర్యంలో ధర్నా చేపట్టారు. దీనిని పోలీసులు భగ్నం చేయడంతో ధర్నా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు తుక్కాపూర్ గ్రామస్తులను కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని బేగంపేట పోలీస్ స్టేషస్కు తరలించినట్లు తెలిసింది. -
కాంగ్రెస్ గూటికి చెరుకు శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నేత, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి మంగళవారం కాంగ్రెస్లో చేరారు. మంగళ వారం తన అనుచరులతో కలసి గాంధీ భవన్కు చేరుకున్న శ్రీనివాస్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి వెంట తరలివచ్చిన అనుచరులను ఉద్దేశించి ఉత్తమ్, పలువురు ముఖ్య నేతలు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయ కులు సంపాదించిన అవినీతి డబ్బుతో దుబ్బాక ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచేందుకు వస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్రావు దుబ్బాకలో తానే అభ్యర్థినని చెప్తున్నారని, ఎమ్మెల్యేలకు వ్యక్తిత్వం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేశారని, ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్రెడ్డికి కాంగ్రెస్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై బుధవారం ప్రకటన చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని, దుబ్బాకలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్రెడ్డి పేరును బుధవారం పార్టీ ప్రకటన చేస్తుందన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చెరుకు శ్రీనివాస్రెడ్డి దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవానికి సంబంధించినదని, దుబ్బాకకు కనీసం బస్సు, నీళ్లు లేని పరిస్థితుల్లో తన తండ్రి అభివృద్ధి చేశారని చెరుకు శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. పల్లెలు నగరాలకు తరలకుండా పట్టణాలు పల్లెలకు రావాలని కలగనేవారన్నారు. 30 ఏళ్లు మచ్చలేని ప్రజాజీవితం గడిపిన ముత్యంరెడ్డికి టీఆర్ఎస్ అవమానాన్ని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట కలెక్టర్ను బదిలీ చేయాలి: జగ్గారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి... దుబ్బాక అభివృద్ధిలో చెరుకు ముత్యంరెడ్డి తనదైన ముద్ర వేశారన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని బదిలీ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత జీవితాంతం జైల్లో గడపాల్సి ఉంటుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, గూడూరు నారాయణరెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముత్యం రెడ్డి 30 ఏళ్లు ప్రజల కోసం బతికితే.. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్గా అవమానాన్ని ఇచ్చింది అంటూ ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక. దుబ్బాకకు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారు. జనాలు పల్లెలు నుంచి పట్నాలకు వెళ్లకుండా.. పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి. ఐదు మార్కెట్ యార్డ్లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది అన్నారు. (చదవండి: కాంగ్రెస్లో చేరిక.. టికెట్ కన్ఫాం) నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే.. ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థినే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు. -
కాంగ్రెస్లో చేరిక.. టికెట్ కన్ఫాం
సాక్షి, హైదరాబాద్ : చెరుకు ముత్యం రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గొప్ప నాయకుడని టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్లోకి అహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకకే కాకుండా తెలంగాణ మొత్తానికి ఆదర్శ నాయకులని కొనియాడారు. దుబ్బాక-దొమ్మట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషిచేసిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. చదవండి: (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) అదే విధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట-గజ్వేల్కు మధ్యలో ఉందని, టీఆర్ఎస్ దుబ్బాకకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో టీఆరెస్ తరపున తనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారని, మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా రేపు ఏఐసీసీ ప్రకటన చేస్తుందని వెల్లడించారు. తనతో సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటుందని, ఈ ఎన్నికల తరువాత సైతం దుబ్బాక అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటూ కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాకలో ఎవరు పైసలు ఇచ్చిన మద్యం పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్కే వేయాలని కోరారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్) టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది నిజాయితీకి మారుపేరు రైతు, ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో, సెక్రటేరియట్లో, తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేశారు. రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుంది. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు. శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎం చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది. 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము. దుబ్బాకలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ రెండేళ్లలో ఒక్క రూపాయి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు.ఎన్నికలు ఉన్నాయని 9వేల కొత్త పెన్షన్స్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావుకు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.’ అని అధికార టీఆర్ఎస్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భయపడదు దుబ్బాకలో టీఆర్ఎస్ సెంటిమెంట్ డ్రామా ఆడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు. రాంలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే.. కానీ ఆయన సెంటిమెంట్ ఆలోచిస్తే ముత్యం రెడ్డి గారు చనిపోయిన సెంటిమెంట్ ఏం కావాలని ప్రశ్నించారు. దుబ్బాకకు ఎనలేని సేవలు అందించిన ముత్యం రెడ్డి కుమారుడే బరిలోకి దిగుతున్నారున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్డినా కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డికి అవకావం దక్కలేదు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. దీంతో శ్రీనివాస్రెడ్డి నేడు హస్తం గూటికి చేరారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్రెడ్డి బరిలో నిలవడం పూర్తిగా ఖరారు అయినట్లే. -
దుబ్బాక ఎన్నిక : టీఆర్ఎస్కు ఝలక్
సాక్షి, సిద్దిపేట : కీలకమైన దుబ్బాక ఉప ఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు. అంతేకాకుండా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన మాజీమంత్రి ముత్యంరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయం ముందు టీఆర్ఎస్లో చేరారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు విడుదల చేయనున్నారు. -
దుబ్బాకలో టీఆర్ఎస్కు ఝలక్
-
తేమ, తాలు అంటూ.. తరుగు తీస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారం కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతు బంధు కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పంట తేమ శాతం నిర్ధారించి టోకెన్లు అందజేస్తారన్నారు. గన్నీ సంచుల సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బిహార్ నుంచి హమాలీలు హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయని మారెడ్డి తెలిపారు. ఎక్కువగా బిహార్ నుంచి హమాలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారని, వారు ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాశారని, వాళ్లు ఇక్కడికి రావడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు. -
కానిస్టేబుల్పై దాడి; కఠిన చర్యలు తప్పవు
-
కానిస్టేబుల్పై దాడి; కఠిన చర్యలు తప్పవు
సాక్షి, గుంటూరు: ధర్నాలు, రాస్తారోకోలు జరిగే సమయంలో సాధారణంగా డ్రోన్లతో విజువల్స్ తీస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. రెండు రోజుల క్రితం మందడంలో కూడా అలానే విజువల్స్ తీయించామని పేర్కొన్నారు. కానీ, డ్రోన్ ఆపరేట్ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని చెప్పారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : మాపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాస్తున్నారు: డీఎస్పీ) డ్రోన్ ఆపరేటర్ పై దాడి, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న ఘటన, తుళ్లూరు డీఎస్పీపై దురుసుగా వ్యవహరించిన ఘటనల్లో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు చాలా సహనం పాటిస్తున్నారని ఎస్పీ విజయారావు చెప్పారు. కొంతమంది అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజలను రెచ్చగొట్టే వారిని గుర్తించామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మీడియా కూడా తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు. -
మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీఎస్పీ
సాక్షి, గుంటూరు: రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల ముసుగులో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వారి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. నిన్న(గురువారం) రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తే డ్రోన్ ఆపరేట్ చేశామని పేర్కొన్నారు. అయితే డ్రోన్ను కిందకు దించే సమయంలో ఆపరేటర్పై దాడి చేసి డ్రోన్ను ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ల ద్వారా మహిళలు స్నానం చేసే విజువల్స్ను పోలీసులు తీసుక్నునారంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రాశారన్నారు. అంతేగాక గతంలో కూడా ఓ మహిళను కాలితో తన్నినట్లు తప్పుడు వార్తలు రాశాని తెలిపారు. ఇక రైతులను రెచ్చగొడుతున్న జేఎసీ నాయకుడు పువ్వాడ సుధాకర్ను అరెస్టు చేసే పయత్నం చేశామని, కానీ మహిళా రైతులు అడ్డుపడటంతో అరెస్ట్ చేయలేకపోయామన్నారు. హోంమంత్రి, డీజీపీలు సచివాలయానికి వస్తుంటే ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టిన వారిపై కేసు పెట్టామన్నారు. ఎమ్మెల్యే రోజాను కూడా అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతులు తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. -
‘సాక్షి’ సెలబ్రేషన్ ఆఫర్.. అరకిలో గోల్డ్ విజేత శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సాక్షి సెలబ్రేషన్స్ ఆఫర్ అరకిలో బంగారం విజేతగా కాశిరెడ్డి శ్రీనివాస్రెడ్డి (ప్రకాశం జిల్లా) నిలిచారు. సాక్షి పాఠకులను ప్రోత్సహించే క్రమంలో యాజమాన్యం ఈ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ‘చదవండి.. గెలవండి’ అనే నినాదంతో ‘సాక్షి’ నిర్వహించిన ఈ సెలబ్రేషన్ ఆఫర్కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు. వారందరికి బహుమతులను అందజేసేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేపట్టింది. విజేతల పేరులను https:// www. sakshi. com/ వెబ్సైట్లో పొందుపరిచారు. విజేతలుగా నిలిచిన పాఠకులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని అందిస్తారు. మంగళవారం సాక్షి ప్రధాన కార్యాలయంలో ఈ ఆఫర్ లక్కీడీప్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతి«థిగా విచ్చేసిన విశ్రాంత న్యాయమూర్తి కె.రవీందరెడ్డి విజేతలను ప్రకటించారు. గోల్డ్ విన్నర్ శ్రీనివాస్రెడ్డికి ఆయన ఫోన్చేసి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు సాక్షి దినపత్రిక ఏజెంట్లు వినోద్ (సరూర్నగర్), సురేష్ (రామంతాపూర్), నాగిరెడ్డి (ఈసీఐఎల్), శ్రీనివాసరెడ్డి (నేరేడ్మెంట్), కిషోర్కుమార్ (అబిడ్స్), రషీద్ (తార్నాక) కూడా వివిధ కేటగిరీల్లోని విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ విభాగానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. తొలి 3 కేటగిరీల్లో విజేతలు వీరే.. మొదటి కేటగిరి : అర కిలో బంగారాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్రెడ్డి సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్గా పని చేస్తున్న ఈయన.. ‘నాకు గోల్డ్ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. దీనిని నేను ఊహించలేదు. కారు వస్తే బాగుంటుందని ఆశించా. ఏకంగా అర కిలో బంగారం దక్కింది’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండవ కేటగిరి : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోటి వరప్రసాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన కె.రాజేందర్ మారుతి స్విఫ్ట్ కార్లను సొంతం చేసుకున్నారు. మూడవ కేటగిరి : ఎస్.రవీంద్రనాథ్ (కొవ్వూరు), మహమ్మద్ పాషా (హైదరాబాద్), పి.జాకరయ్య (కడప), స్వర్ణలత (గన్నవరం), ఎస్.ఎ. రహమాన్ (గుంతకల్), ఎం.అంకిత, ఎం.జగన్నాథన్ (కర్నూలు), ఆర్.సంయుక్త (హైదరాబాద్), ఉద్దారగుడి చిరంజీవి), కుప్పలి శశిభూషణరావు (పార్వతిపురం).. యాక్టివా స్కూటర్లను గెలుచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సాక్షి కృషి విభిన్న కోణాల్లో ప్రజా సమస్యలపై కథనాలు రాస్తూ వాటి పరిష్కారానికి ‘సాక్షి’ కృషి చేయడం ఆనందంగా ఉంది. మారుమూల గ్రామాలకు సైతం ‘సాక్షి’ చేరుకోవడం స్ఫూర్తిదాయకం. ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకర్లను అభినందించాలి. అక్కడి సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్దఎత్తున పాఠకుల ఆదరణను సంపాదించుకున్న ‘సాక్షి’ యాజమాన్యం అభినందనీయులు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సెలబ్రేషన్ ఆఫర్ను ‘సాక్షి’ పారదర్శకంగా నిర్వహించినందుకు కృతజ్ఙతలు. విజేతలకు అభినందనలు. – కె.రవీందర్రెడ్డి, విశ్రాంతి న్యాయమూర్తి విజేతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టెక్నో పెయింట్స్ మరింత కలర్ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్లు సీవీఎల్ఎన్ మూర్తి, సత్యనారాయణ రెడ్డి, సీఈవో కె.అనిల్తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డీలర్ నెట్వర్క్ ద్వారా రిటైల్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇప్పటికే 30 కోట్ల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులకు రంగులు అందించామని పేర్కొన్నారు. రూ.250 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని వెల్లడించారు. రెండింతలకు సామర్థ్యం..: ప్రస్తుతం టెక్నో పెయింట్స్కు అయిదు ప్లాంట్లున్నాయి. వీటన్నిటి వార్షిక సామర్థ్యం 42,000 మెట్రిక్ టన్నులు. ఆరవ ప్లాంటును హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నెలకొల్పుతున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంటు కోసం రూ.25 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏడాదిలో సిద్ధం కానున్న కొత్త ప్లాంటుతో సామర్థ్యం రెండింతలకు చేరుతుంది. నూతనంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018–19లో రూ.62 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్లు ఆశిస్తున్నాం. రెండేళ్లలో రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యం. ఆఫ్రికాలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాదితోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సేవలు అందిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని వివరించారు.