‘మియాపూర్‌’పై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు | High Court Given Stay On Miyapur Land Scam | Sakshi
Sakshi News home page

మియాపూర్‌ భూకుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

Published Tue, Apr 16 2019 3:38 PM | Last Updated on Tue, Apr 16 2019 6:25 PM

High Court Given Stay On Miyapur Land Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్‌ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములపై సీల్‌ డీడ్‌ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తక్షణమే ఆ ఉత్తర్వులను నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంలో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు స్టే విధించింది. మియాపూర్‌ భూములను యధావిధిగా ఉంచాలని స్టే ఆర్డర్‌ ఇచ్చింది. కోర్టులో పరిష్కారం అయ్యేంతవరకు మియాపూర్‌ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని తేల్చి చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపట్ల కోర్టుకు సానుభూతి ఉండదని హైకోర్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement