
సాక్షి, హైదరాబాద్ : యాచకులను షెల్టర్ హోంలకు తరలించే ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించాలన్న పిటీషన్పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణను చేపట్టింది. యాచకులను షెల్టర్ హోంలకు తరలించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టుకు నివేదించగా.. ఎంతమందిని, ఎక్కడెక్కడికి తరలించారో అన్న వివరాలు సమగ్రంగా లేవని, ఈనెల 15లోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment