కుషాయిగూడ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ కిరాతక భర్త. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తి తన భార్య అనితపై గురువారం సాయంత్రం ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.