మరో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ | IAS Officials Transfers Second List | Sakshi
Sakshi News home page

మరో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

Published Sat, Mar 10 2018 2:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మరో 9 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం కలిగించింది. గురువారం 8 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం శుక్రవారం రెండో జాబితాను విడుదల చేసిన విషయం
తెలిసిందే. పదోన్నతులు, ప్రస్తుతమున్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌ అధికారులను భారీ స్థాయిలో బదిలీలు చేయాలని నిర్ణయించింది. దాదాపు 49 మంది అధికారులకు స్థానం
చలనం కల్పించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు పూర్తి చేశారు. రెండో విడతలో 9 మంది అధికారుల బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement