
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. వీడ్కోలు అనంతరం గవర్నర్ ఈవాళ సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ గవర్నర్గా నియమితులైన తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు రాజ్భవన్లో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment