ఆవుల మందపై చిరుతల దాడి | Leopards attack cows gruop | Sakshi
Sakshi News home page

ఆవుల మందపై చిరుతల దాడి

Published Mon, Aug 8 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ఆవుల మందపై చిరుతలు దాడి చేయడంతో బెదిరిపోయి 15 ఆవులు పాడుబడిన బావిలో పడిపోయాయి. అందులో రెండు ఆవులు మృతి చెందాయి.

మాచారెడ్డి: ఆవుల మందపై చిరుతలు దాడి చేయడంతో బెదిరిపోయి 15 ఆవులు పాడుబడిన బావిలో పడిపోయాయి. అందులో రెండు ఆవులు మృతి చెందాయి. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లంపేటకు చెందిన ఆవుల మందను పశువుల కాపరులు ఇసాయిపేట్, అక్కాపూర్‌ల మధ్య ఉన్న సందుకట్ల గూడెం అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. ఒక్కసారిగా 3 చిరుతలు పశువుల మందపై దాడి చేశాయి. దీంతో బెదిరిన ఆవులు పాడుబడిన ఓ బావిలో పడ్డాయి. అందులో రెండు ఆవులు ఊపిరాడక మృతి చెందగా.. మిగతా ఆవులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు ఆవులను బయటకు తీసి వైద్య సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement