బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): బాన్సువాడ సిండికేట్ బ్యాంకు ఏటీఎం వద్ద ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తి వద్ద చాకచక్యంగా డబ్బులు దోచేశారు. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి డబ్బు రూ.60 వేలు డ్రా చేసిన వెంటనే అక్కడున్న ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయి ఒకసారి ఇవ్వండి చెక్చేద్దాం అన్నారు. చేతికి ఇవ్వగానే ముగ్గురూ 60 వేల రూపాయల్లో 30 వేల రూపాయలు కాజేశారు.
ఈ దృశ్యం ఏటీఎంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.
ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయని..
Published Tue, May 16 2017 6:25 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
Advertisement
Advertisement