kamareddy district
-
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
ఇక్కడ చికెన్ చీప్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోరోజువారీ ధరల ప్రకారం చికెన్ అమ్మకాలు సాగుతుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం మార్కెట్ రేట్ కన్నా కిలోకు రూ.30 తక్కువకు విక్రయిస్తుంటారు. ఎక్కడా కనిపించని పోటీ కామారెడ్డిలోనే ఉంటుంది. నాలుగైదేళ్ల కిందట మొదలైన పోటీ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడి దుకాణాల నిర్వాహకులు పేపర్ రేట్ కన్నా రూ.30 తక్కువ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ విక్రయాల్లో పోటీ పడుతుంటారు. ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్వింటాళ్ల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తారు. సాధారణంగా పేపర్లో వచ్చే ధరల ప్రకారమే రాష్ట్రమంతటా చికెన్ అమ్ముతారు. అక్కడక్కడా ఐదో, పదో రూపాయలు తగ్గించి అమ్ముతారు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కొందరు పేపర్ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువకు అమ్ముతుండగా, ఇంకొందరు రూ.35 నుంచి రూ.40 తక్కువ కూడా విక్రయిస్తుంటారు.గురువారం పేపర్ ధర ప్రకారం స్కిన్తో చికెన్ ధర కిలోకు రూ.181 ఉండగా, కామారెడ్డిలో రూ.150కి అమ్మారు. అంటే కిలోకు రూ.31 తక్కువగా విక్రయించారు. అలాగే స్కిన్లెస్ చికెన్ కిలో పేపర్ ధర ప్రకారం రూ.206 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి అమ్మారు. అంటే కిలోకు రూ.26 తక్కువకు అమ్మినట్లు స్పష్టమవుతోంది. లైవ్ బర్డ్ ధర కిలోకు రూ.128 ఉండగా, ఇక్కడ రూ.120కి అమ్ముతారు. మొత్తంగా ఏ దుకాణానికి వెళ్లినా మార్కెట్ ధర కన్నా తక్కువకే దొరుకుతుంది. టన్నుల కొద్దీ అమ్మకాలు.. కామారెడ్డి మార్కెట్లో నిత్యం 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చికెన్ అమ్ముతుంటారు. ఆదివారం రోజైతే 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అమ్ముడవుతోంది. వివిధ పౌల్ట్రీ సంస్థలు ఇక్కడ హోల్సేల్గా షాపులకు కోళ్లను సప్లై చేస్తాయి. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు చెందిన కోళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల మధ్యన నెలకొన్న పోటీ మూలంగా కొనుగోలుదారులకు తక్కువ ధరకు చికెన్ లభిస్తోంది. రెగ్యులర్గా చికెన్ కొనుగోలు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మరింత తక్కువ ధరలకు అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువ ధరలకు.. కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాల్లో పేపర్ ధరకే చికెన్ అమ్ముతారు. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా ఎక్కువకే అమ్ముతుంటారు. కామారెడ్డి లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక్కడ ఎక్కువ ఎందుకని ఎవరైనా వినియోగదారులు చుట్టుపక్కల మండలాల్లో వ్యాపారులను ప్రశ్నిస్తే.. అక్కడి ధర అక్కడే, ఇక్కడి ధర ఇక్కడే అని విక్రయదారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కిలో, రెండు కిలోలు తీసుకునేవాళ్లు అందుబాటులో ఉన్న దుకాణాల్లో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తారు. అదే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల కోసం ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరమైనపుడు మాత్రం కామారెడ్డిలో కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో కొంటే మరింత తక్కువ ధరకు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ఆటోలు, వ్యాన్లలో వచ్చి చికెన్ తీసుకుని వెళుతుంటారు. -
మెట్ల బావులకు పూర్వవైభవం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పూడికతో ఉనికి కోల్పోయిన మెట్ల బావులకు మహర్దశ కలిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయం వద్ద ఉన్న మెట్ల బావులకు అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో పూర్వ వైభవం చేకూరింది. దీంతో పర్యాటకులు వాటిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మెట్ల బావులు ఉనికి కోల్పోతున్న విషయమై ‘సాక్షి’ అక్షర సమరం సాగించింది. 2022 జనవరి 29న లింగంపేటలోని నాగన్న బావి ఉనికి కోల్పోతున్న వైనంపై ‘మెట్ల బావిలో నిర్లక్ష్యపు పూడిక’ శీర్షికన, తరువాత వరుసగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. నాగన్నగారి బావిని సందర్శించిన కలెక్టర్.. గ్రామస్తులతో కలిసి ముళ్ల పొదలు, చెట్లను తొలగించడంతో మొదలైన పనులు.. పూడిక తొలగించే వరకు కొనసాగింది. రెయిన్ వాటర్ ప్రాజెక్టు అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ కల్పనా రమేశ్తో మాట్లాడి.. వారి సహకారంతో దానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయ ప్రాంగణంలో మరుగున పడిన మెట్ల బావిని అద్భుతంగా తీర్చిదిద్దారు. మెట్ల బావి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిద్దరామేశ్వరా లయం దర్శనానికి వెళ్లిన వారంతా.. మెట్ల బావి కట్టడాన్ని చూసి అబ్బురపడుతున్నారు. ఫొటోలు దిగుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో రెండు మెట్ల బావులు, రాజంపేట మండల కేంద్రంలో ఒకటి, లింగంపేట మండలం శెట్పల్లి, నాగిరెడ్డిపేట మండలం మాటూరు గ్రామాల్లో మెట్ల బావులను గుర్తించి.. వాటిలో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.నాగన్నగారి బావిని సందర్శించిన ‘జూపల్లి’లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావిని గత నెలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్తో కలిసి సందర్శించారు. మెట్ల బావికి పూర్వవైభవం తేవడాన్ని అభినందించారు. పర్యాటక శాఖ ద్వారా మరింత వైభవం తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వవైభవం వచ్చింది. ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దానికి మరింత వన్నె తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా మెట్ల బావులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్ల బావులకు పూర్వవైభవం సమకూరడం పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. -
సైబర్ మోసానికి యువకుడు బలి!
-
ఆత్మహత్యలా.. హత్యలా?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/భిక్కనూరు: ఒకే సమయంలో, ఒకేచోట ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యు వకుడు చనిపోవటం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీ పేటకే చెందిన నిఖిల్ (29) అనే యువకుడి మృతదేహాలు జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్య మయ్యా యి.శృతి, నిఖిల్ మృత దేహాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు తీయగా, గురువారం ఉదయం 8.30 గంటలకు సాయికుమార్ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది. దీంతో వీరు ఎలా చనిపోయారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవి ఆత్మహత్యలా? లేక ఈ మరణాల వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది. మృతులు ముగ్గురికి చాలాకాలం నుంచి పరిచయం ఉండటంతో రకరకాల చర్చ జరుగుతోంది. అనుకోకుండా బయటపడిన ఘటన.. ఈ మూడు మరణాల ఘటన కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచాఫ్ వస్తోంద ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలపటంతో.. ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సాయికుమార్, నిఖిల్ చెప్పులు, సెల్ఫోన్లు.. శ్రుతి మొ బైల్ కనిపించాయి. ఎస్ఐ కారు కూడా చెరువు సమీపంలో ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. గజ ఈతగా ళ్లతో చెరువులో గాలించగా మరణాల మిస్టరీ బయటపడింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. 3 మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతుచిక్కని కారణాలు: ఈ ముగ్గురి మరణం వెనుక గల కారణాలు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వీరు ఎలా చనిపోయారన్నది పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. అయితే, వీరి మరణంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎస్సై సాయికుమా ర్ బీబీ పేట పోలీస్స్టేషన్లో పనిచేసిన సమయంలో శ్రుతితో సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ఇటు సాయికుమార్తో అటు శ్రుతితో క్లో జ్గా ఉండేవాడని సమాచారం. ముగ్గురూ ఒకేసారి చనిపోవ డంతో వారి మధ్య నడిచిన వ్యవహా రం ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం మండ లం కిష్టాపూర్ గ్రామం. 2018 ఎస్ఐ బ్యాచ్కు చెందిన ఆయన.. 2022 ఏప్రిల్ 13న బీబీపేటలో ఎస్ఐ గా చేరారు. గత ఏడాది ఆగస్టు 1న భిక్కనూరు ఎస్ఐగా బదిలీ అయ్యారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో 2021 నుంచి పనిచేస్తోంది. బీబీపేటకు చెందిన తోట నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూనే, కంప్యూటర్ల రిపేర్లు చేసేవాడు. పోలీస్స్టేషన్లో కంప్యూటర్లు మొరాయించినపుడు అతడే వచ్చి రిపేర్ చేసి వెళ్లేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కలిసి చనిపోయేదాకా ఎందుకు వచ్చిందన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నా కొడుకు పిరికివాడు కాదు: పోస్ట్మార్టం నిర్వహించిన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు మృతులకు టుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకొని బోరున విలపించారు. తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎస్ఐ సాయికుమార్ తండ్రి అంజయ్యకన్నీరుమున్నీరయ్యాడు. ఎవ రో ఒకరిని కాపాడే ప్ర యత్నంలో చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశా రు. శ్రుతి తండ్రి పుండరీకం మాట్లా డుతూ.. ఈ ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు తేల్చాలని కోరారు. నిఖిల్ చనిపోయిన విషయం పోలీసు లు చెబితే తెలిసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువులో టాపర్ఎస్ఐ సాయికుమార్ చిన్నతనం నుంచి చదువు లో టాపర్. 2007–2008లో పదో తరగతిలో మండల టాపర్గా నిలిచాడు. ఇంటర్లోనూ మంచి మార్కులు సాధించారు. హైదారాబాద్లోని సీబీఐటీలో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. 2018లో పోస్టల్ డిపార్టుమెంట్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఎస్సైగా మొదటి పోస్టింగ్ సాధించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, భిక్కనూరులో ఎస్సైగా చేశాడు. రెండు పర్యాయాలు ఎస్పీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తెలిసింది. -
కామారెడ్డి జిల్లాలో ముగ్గురి అదృశ్యం విషాదాంతం
-
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం
-
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
పప్పుల అంగడి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఆచార వ్యవహారాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇక్కడ శాకాహారులే ఉంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. అందుకే దీన్ని త్రిభాషా సంగమం అని అంటుంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్దకొడప్గల్, డోంగ్లీ, బిచ్కుంద, నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పలుచోట్ల అంగళ్లు (వారసంతలు) జరుగుతాయి. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం, జుక్కల్లో గురువారం, పి ట్లంలో శుక్రవారం, మద్నూర్లో సోమవారం, డోంగ్లీ, మేనూర్లో శుక్రవారం అంగళ్లు జరుగుతాయి. ఆ ప్రాంత ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, బట్టలు, వంట పాత్రలు.. ఏవైనా సరే అంగడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పేద, మధ్య తరగతి వర్గాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం అంగళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పప్పులు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న రైతులు వారు పండించిన పప్పుదినుసులను అంగళ్లలో అమ్ముతారు. పెసర, కంది, మినుము, శనగ, ఎర్రపప్పులతో పాటు జొన్నలు, గోధుమలు, ఆవాలు కూడా విక్రయిస్తారు. పొట్టు పప్పునకు భలే డిమాండ్ సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత పప్పు దినుసులు ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వస్తాయి. ఆ సమయంలో ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఆయా అంగళ్లకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. దుకాణాల్లో మరపట్టిన, పాలిష్ చేసినవి అమ్ముతుంటే అంగళ్లలో మాత్రం రైతులు నేచురల్ గా పండించిన పప్పుదినుసులు దంచి పొట్టుతో అమ్ముతుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. క్వింటాళ్ల కొద్దీ పప్పులు అమ్ముడు పోతాయని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా పప్పులకు కొరత రావచ్చు గానీ, జుక్కల్ ప్రాంతంలో మాత్రం ఏనాడూ పప్పుదినుసులకు కొరత ఏర్పడదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడే ఎక్కువగా పప్పుదినుసులు పండిస్తారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో కూడా పప్పుదినుసులు సాగుచేస్తారు. జొన్నలు, గోధుమలు కూడా విక్రయిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా.. జుక్కల్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద అంగళ్లకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్, హనేగావ్ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటకలోని ఔరద్ ప్రాంతానికి చెందిన వారు కూడా పప్పులు అమ్మడానికి వస్తుంటారు. అలాగే అంగళ్లలో పప్పులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రజలు రావడం విశేషం. జుక్కల్ అంగడికి జుక్కల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. మద్నూర్, మేనూర్లో జరిగే అంగళ్లకు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్రలోని దేగ్లూర్ తాలూకాలోని గ్రామాల ప్రజలు వస్తారు. బిచ్కుంద అంగడికి బిచ్కుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. పిట్లం మండల కేంద్రంలో జరిగే అంగడికి పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కంగి్ట, కల్హేర్ మండలాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తారు.రెండు తరాలుగా ఇదే దందా మా కుటుంబం రెండు తరాలుగా పప్పులు, జొన్నలు పిట్లం అంగడిలో అమ్ముతున్నం. మా నాయిన అమ్మేవారు. తర్వాత నేనూ పదేళ్లుగా పప్పులు, జొన్నలు అమ్ముతున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పప్పులు, జొన్నలు కొంటారు. – రంజిత్, తిమ్మానగర్ (విక్రయదారుడు) పిట్లం అంగడిలోనే కొంటాను పిట్లం అంగడిలో ఏళ్ల నుంచి పప్పులు కొనుగోలు చేస్తున్నాం. తక్కువ ధరకు దొరుకుతాయి. పప్పులతో పాటు జొన్నలు కూడా అమ్ముతారు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లుగా పిట్లం అంగడిలో కొన్నవే తింటున్నాం. – రాజు, ఎల్లారెడ్డి (కొనుగోలుదారుడు)నాణ్యమైన పప్పులు దొరుకుతాయి పిట్లంకు మా ఊరు దగ్గరగా ఉంటుంది. వారం వారం అంగడికి ఇక్కడికే వచ్చి అవసరం ఉన్నవి కొనుగోలు చేస్తాం. పప్పులు ప్రతిసారీ పిట్లం అంగడిలోనే కొంటాం. ఇక్కడ నాణ్యమైనవి దొరుకుతాయి. – రాజేశ్వర్, తాడ్కోల్, సంగారెడ్డి జిల్లా (కొనుగోలుదారుడు) -
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్దేవ్పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
రాళ్లూ.. చిగురిస్తాయి..!
రాతి నేలల్లో సిరుల పంటలు పండుతున్నాయి. నాగళ్లకు ఎదురుతిరిగే రాతి నేలలవి. అలాంటి నేలల్లో సాగు చేయడం అంత తేలిక పని కాదు. రాతి నేలలకు పచ్చదనం అద్దిన రైతులు పడినది మామూలు కష్టం కాదు. మూడు తరాల రైతుల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు బోసిగా కనిపించిన రాతినేలలు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రైతులు కొండ ప్రాంతాల్లోని రాతినేలల్లో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రాతినేలల్లో చెమటను, నెత్తుటిని చిందించి మరీ వారు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం గురించి తెలుసుకుందాం...విత్తనాలు వేసేటప్పుడు రాళ్లల్లో నడుస్తుంటే, అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటాయి. రాళ్లల్లో మొలకెత్తిన కలుపు తీస్తుంటే, చేతులు చీరుకుపోయి నెత్తురు చిమ్ముతుంది. అయినా, వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సాగు చేస్తారు. తాతల కాలం నుంచి వారు ఇదే పని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి, లింగంపేట, తాడ్వాయి, జుక్కల్, పెద్దకొడప్గల్, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.ఈ జిల్లాలో 5.26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే, వాటిలో దాదాపు పదిశాతం రాతినేలలే! వీటినే నమ్ముకుని వేలాది రైతులు మూడు తరాలుగా సాగు చేస్తున్నారు. ఇదివరకటి కాలంలో నాగళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నాగళ్లతో దున్నేటప్పుడు ఎడ్ల కాళ్లకు గాయాలయ్యేవి. ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాక, పని కొంచెం సులువైనా, ఖర్చులు బాగా పెరిగాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఏటా రాళ్లు తీసి కుప్పలుగా పోస్తున్నా, తవ్వే కొద్ది రాళ్లు వస్తూనే ఉంటాయని, రాళ్ల మధ్యనే సేద్యం చేయడం తమకు అలవాటైపోయిందని ఈ రైతులు చెబుతారు.వర్షాధార వ్యవసాయం..ఈ రాతినేలల్లో వేసే పంటలకు వర్షాలే ఆధారం. మంచి వర్షాలు కురిసినప్పుడు అధిక దిగుబడులు వస్తాయి. వర్షాలు సరిగా కురవకపోయినా, అకాల వర్షాలు కురిసినా రైతులకు నష్టాలు తప్పవు. వర్షాధార పరిస్థితుల వల్ల ఇక్కడి రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈ రాతి నేలల్లో పత్తి, మొక్కజొన్న, సోయా పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అక్కడక్కడా వరి కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటలను అడవి జంతువుల దాడి నుంచి కాపాడుకోవడం రైతులకు పెనుసవాలు.పొలాల్లోకి అడవి జంతువులు చొరబడకుండా ఉండేందుకు కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు పొలాల చుట్టూ ఇనుప తీగెలు కట్టి, రాత్రివేళల్లో పొలాలకు కాపలా ఉంటున్నారు. రాళ్లతో కూడుకున్నవన్నీ నల్లరేగడి నేలలు కావడంతో ఇక్కడ పంటల దిగుబడి ఆశాజనకంగానే ఉంటుంది. రాళ్ల మధ్య తేమ వారం రోజుల వరకు అలాగే ఉంటుంది. వారం రోజుల తర్వాత వర్షం కురిస్తే పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు. రాతినేలలు ఉన్న ప్రాంతాలు సాధారణంగా వర్షాలకు అనుకూలంగానే ఉంటాయి. తగిన వానలు కురవకపోవడం వల్ల పంటల దిగుబడులు తగ్గిన సందర్భాలు ఈ ప్రాంతంలో అరుదుగానే ఉంటాయి.మూడు తరాల వాళ్లం కష్టపడ్డాం..మా తాత మందిరానాయక్, మా నాయిన నంగరాజ్, తరువాత నేను మూడు తరాల వాళ్లం రాళ్లను ఏరి చుట్టూ కంచె వేశాం. మూడెకరాల భూమిని రాళ్లు లేని భూమిగా తయారు చేసి, వరి పంట పండిస్తున్నం. వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా బావినీళ్లతో పంట పండుతుంది. ఇక్కడ బోర్లు వేస్తే పడవు. మూడు తరాల కష్టానికి మూడెకరాల వరి పొలం తయారైంది. – దేవిసింగ్, చద్మల్ తండాచేతులు పగిలి మంట పెడుతుంది..కలుపు తీస్తుంటే అరచేతికి, వేళ్లకు రాళ్లు గుచ్చుకుని రక్తం కారుతది. మంట పెడుతున్నా కష్టపడుతున్నం. రాళ్లు ఎంత ఏరినా తగ్గిపోవు. అందుకే ఉన్న రాళ్లల్లోనే పంట వేస్తున్నం. కాలం మంచిగ అయితే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటికైతే మా దిక్కు వానలు మంచిగనే పడ్డయి. ముందు ఇట్లనే ఉంటే బాగుంటుంది. – సురేఖ, బూర్గుల్ తండాఅరికాళ్లకు అన్నీ గాయాలే..మాకు నాలుగెకరాల భూమి ఉంది. ట్రాక్టర్తో దున్నించి మొక్కజొన్న పంట వేస్తుంటం. విత్తనం వేసినపుడు, కలుపు తీసినపుడు రాళ్లు గుచ్చుకుని అరికాళ్లు నొప్పిగా తయారై ఇబ్బంది పడుతుంటం. వాన పడితే పంట మంచిగనే వస్తది. వానలు కింద మీద అయితే రెక్కల కష్టం పోతది. దేవుని మీద భారం వేసి పంటలు వేస్తున్నం. – పారిబాయి, గుర్జాల్ తండాతాతల కాలం నుంచి ఇదే కష్టం..మాకు 1957లో పట్టాలు వచ్చినయి. అప్పటి నుంచి మా తాతలు, తరువాత మా తండ్రులు, ఇప్పుడు మేం రాళ్లల్లనే పంటలు వేస్తున్నం. మూడు ఎకరాల్లో పత్తి వేసినం. విత్తనం వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా అవస్థలు పడాల్సిందే! సమయానికి వాన పడితే పంటకు ఇబ్బంది ఉండదు. రోగాలు వచ్చినపుడు మందులు కొడుతుంటం. – ప్రేమ్సింగ్, గుర్జాల్ తండాఐదెకరాలూ రాళ్ల భూమే!నేను ఇంజినీరింగ్ చదివి ఇంటి వద్దే వ్యవసాయం చూసుకుంటున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. అది కూడా రాళ్ల భూమే! వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వేశాం. కొద్దిగా వరి కూడా పండిస్తున్నాం. మా ఊరి శివారే కాదు చుట్టుపక్కల ఊళ్లన్నీ రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములే ఉన్నయి. రాళ్ల భూములే అయినా కష్టపడుతున్నం. – ధన్రాజ్, గుర్జాల్ తండాఖర్చు ఎక్కువ..రాళ్ల భూములల్ల దున్నడానికి ట్రాక్టర్కు ఎక్కువ టైం తీసుకుంటది. అట్లనే కిరాయ కూడా ఎక్కువ అడుగుతరు. గంటలకు రూ.8 వందల నుంచి రూ.9 వందలు తీసుకుంటరు. దున్నడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఖర్చు ఎక్కువవుతుంది. కలుపు ఇంటోళ్లమే తీసుకుంటున్నం. రాళ్లు తగిలి కాళ్లకు గాయాలైతున్నా భరిస్తం. – రవి, బూర్గుల్ తండాకాలం కలిసొస్తే మంచి దిగుబడులు..పంటకు అనుకూలంగా మంచి వర్షాలు కురిస్తే చాలు, మంచి దిగుబడులు వస్తాయి. రైతుల రెక్కల కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్నిచోట్ల ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. రాతినేలల్లో ఈ స్థాయి దిగుబడులు రావడం విశేషమే! సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించకుంటే, ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వస్తాయి. అయితే, ఈ రాతి నేలలను దున్నడంలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేలలను దున్నడానికి ట్రాక్టర్ యజమానులు ఆసక్తి చూపరు. సాధారణమైన సాగునేలలను దున్నడానికి గంటకు ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు.ఈ రాతినేలలను దున్నడానికి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు. సాధారణ పొలాల్లో ఎకరం దున్నడానికి గంట నుంచి గంటన్నర సమయం సరిపోతుంది. రాతి నేలలు దున్నడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఈ పరిస్థితి వల్ల దుక్కి దున్నడానికే రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేలల్లో కలుపు తీయడానికి కూలీలు దొరకరు. ఇక్కడ కలుపు తీస్తే చేతులకు గాయాలు తప్పవు. కూలీల కొరత వల్ల చాలా పొలాల్లో రైతుల కుటుంబ సభ్యులే కలుపు తీస్తుంటారు. ఇంతటి కఠోర శ్రమకు ఓరుస్తూనే ఈ రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. – ఎస్.వేణుగోపాల చారి, సాక్షిప్రతినిధి, కామారెడ్డిఇవి చదవండి: కాలనీలో థ్రిల్ -
శిశు విక్రయ ఘటన.. కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్
సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం. -
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
నాలుగడుగుల లోతుల్లోనే నీరు
సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. బావులు ఎన్నడూ ఎండిపోలేదు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. –ఆల నారాయణ, ఉప్పల్వాయి అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం... మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు. – సుతారి మహేశ్వరి, ఉప్పల్వాయి మా తాత తవ్వించిన బావి... మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం. –శంకర్గౌడ్, ఉప్పల్వాయి -
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పెట్టుబడిదారుల పార్టీకి..పేదల కన్నీళ్లు పట్టవు
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. రూపాయి విలువ భారీగా పడిపోయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. బీజేపీ దోపిడీదారులు, పెట్టుబడిదారులకే కొమ్ముకాసే పార్టీ. దాని ఎజెండాలో పేదల కష్టాలు, కన్నీళ్లు ఉండవు..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేసీఆర్ రోడ్షో నిర్వహించారు. జయప్రకాశ్ నారాయణ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగులో ప్రసంగించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో కూడా మాట్లాడారు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చే దిన్ వచ్చినయ్ ‘ప్రధాని నరేంద్ర మోదీ వట్టి గ్యాస్ మాటలు చెబుతాడు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’అని చెప్పి సత్తె నాశనం చేశాడు. ఎగుమతులు బందయి, దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ పడావో..బేటీ బచావో, జన్ధన్ యోజన ఇవేవీ దేశానికి ఉపయోగపడలేదు. 150 వాగ్దానాలు చేసిండ్రు. అవేవీ ప్రజలను ఆదుకోలేదు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చేదిన్ వనయ్. పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు.అంతటా రూ.15 లక్షలు ఇస్తామన్నారు? కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు ఇక్కడ రూ.30 లక్షలు ఇచి్చండ్రా? (లేదంటూ సభికులు కేకలు పెట్టారు) రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎక్కడా రైతులకు మేలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రంటూ మోదీ ప్రతిసారీ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కాడు. పేదలకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయడమే దండుగ. ఆ పారీ్టకి 400 సీట్లు రానేరావు. మళ్లీ మోదీ ప్రధాని అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 దాటిపోతాయి..’ అని కేసీఆర్ అన్నారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు ‘ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అసమర్థులు, పరిపాలన సాగించలేని తెలివితక్కువ వాళ్ల చేతుల్లోకి వెళ్లి ఐదు నెలల్లోనే ఆగమైంది. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తనంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఈ నెల 9 లోపు రైతుబంధు వేస్తా అన్న ముఖ్యమంత్రి తనే కుట్ర చేసి ఆపించాడు.ఐదెకరాలకు ఇస్త అంటడు. ఆరెకరాలు, ఏడెకరాల రైతులకు ఎందుకు ఇవ్వడు? తొమ్మిదేళ్లు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగనే కరెంటుకు ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ వన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదు? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? ఫీజు రీయింబర్స్మెంటు చేయడం లేదు, 125 గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి..’అని మాజీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.అలాగైతే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి?‘రేవంత్రెడ్డి ఒట్లు పెట్టుకోవడం, కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు రాజ్యమేలితే ఇలాగే ఉంటుంది. కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కారు.. గోదావరి నదిని తమిళనాడుకు అప్పగిస్తోంది. ఉన్న ఒక్క గోదావరి నదీ జలాలు తమిళనాడుకు వెళితే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి? మేం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే వాటిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఉద్యమాల్లో రాటుదేలిన, చైతన్యవంతమైన కామారెడ్డి, మెదక్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.పార్లమెంటు ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో మనం గెలిస్తే రాష్ట్రం మెడలు వంచి హామీలు అమలు చేయించుకుందాం. కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 12, 13 స్థానాలు గెలిస్తే మనమే కీలకంగా మారతాం. కామారెడ్డితో పాటు ఇతర జిల్లాలు పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మన నదీ జలాలు మనకు రావాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మన అభ్యర్థులను గెలిపించాలి..’అని బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో మాజీ మంత్రి టి.హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, మెదక్, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్ రెడ్డి, గాలి అనిల్కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు పకోడీలు తినిపించిన కేసీఆర్ ఇందల్వాయి ( నిజామాబాద్ రూరల్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం చిన్న పిల్లలు, రైతులతో కాస్త సరదాగా గడిపారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళుతూ 44వ నంబరు జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగారు. అక్కడి హోటల్లో ఉల్లిగడ్డ పకోడి తిని టీ తాగారు. అక్కడ ఉన్న చిన్నారులకు పకోడీలు తినిపించారు. తనను కలిసేందుకు వన రైతులకు ఇచ్చారు. మరోవైపు హోటల్ వద్ద ఆగిన ప్రయాణికులు, చిన్నారులు కేసీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారందరితో కేసీఆర్ సరదాగా సంభాíÙంచారు. హోటల్ యజమాని వెంకట రమణయ్యతోనూ ముచ్చటించారు. -
కామారెడ్డి జిల్లాలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న కారు
-
పాస్పోర్టు ఈ సేవాకేంద్రంలో అగ్నిప్రమాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్పోర్టు ఈ సేవాకేంద్రంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోస్టల్ అధికారులకు, ఫైర్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సామగ్రితోపాటు కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాట రీలు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గది పక్కనే పోస్టల్ శాఖ ఉత్తరాల గది ఉండటంతో హుటాహుటిన సిబ్బంది ఆ ఉత్తరాల సంచులను బయటకు తీసుకువచ్చి ఎదురుగా ఉన్న ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. పాస్పోర్టు ఈ సేవాకేంద్రంలో మాత్రం అంతా అగ్నికి ఆహుతైంది. పాస్పోర్టులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదై ఉంటాయని, ఫైళ్లు ఎప్పటికప్పుడు తరలిస్తామని, ఎలాంటి డేటా, ముఖ్యమైన ఫైళ్లు నష్టపోలేదని, ఫరి్నచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని పోస్టల్ శాఖ అధికారి రాజు తెలిపారు. 26 నుంచి కామారెడ్డి పీవోపీఎస్కేలో కార్యకలాపాలు నిలిపివేత రాంగోపాల్పేట్ (హైదరాబాద్): కామారెడ్డిలోని పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రంలో నిర్వహణ కారణాలతో ఈ నెల 26 నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి జె. స్నేహజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26 నుంచి అపా యింట్మెంట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వాటిని రీ షెడ్యూల్డ్ చేసుకునే ఆప్షన్లను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు. -
పల్లె కడుపున రాచపుండు!
సాక్షి, కామారెడ్డి: కేన్సర్ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్ తో అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. వరుసగా మరణాలతో కలవరం మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) కేన్సర్తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్ కేన్సర్తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. గ్రామస్తుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్ కేన్సర్ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కడుపులో కేన్సర్ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా కేన్సర్పై అవగాహన కల్పిస్తున్నాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వో, కామారెడ్డి -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
షాపింగ్ మాల్ బుగ్గి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాజ్టాకీస్ రోడ్లోని అయ్యప్ప షాపింగ్ మాల్లో రాత్రి 11.20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన నైట్ వాచ్మన్ మాల్ యజమానికి, ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించేలోపే భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి, గాంధారి, ఇందల్వాయి, రామాయంపేట, నిజామాబాద్ల నుంచి ఆరు ఫైర్ ఇంజన్లను, 50 మంది సిబ్బందిని రప్పించారు. భవనం నాలుగు అంతస్తుల్లో ఉండటంతో హైదరాబాద్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్విసెస్ విభాగం నుంచి భారీ స్కై లిఫ్ట్ను తెప్పించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో పాటు స్కైలిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు 50 ట్యాంకర్ల నీటిని తీసుకు వచ్చి మంటలను ఆర్పారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయితే మాల్లోని దుకాణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. -
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్లోని గోషామహల్, మలక్పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్గా నిలుస్తోందన్నారు. ధూల్పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
‘కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’
సాక్షి, కామారెడ్డి జిల్లా: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై హోంమంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ముందు రేవంత్రెడ్డి ఓ బచ్చా అని.. చిన్న పిల్లాడు అంటూ విమర్శించారు. రేవంత్రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి అని, కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ దేశంలోనే తెలంగాణ నంబర్వన్ రాష్ట్రం.. నంబర్వన్ సీఎం కేసీఆర్.కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు. రేవంత్ రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు.కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?, సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. మైనార్టీ సంక్షేమం కేవలం తెలంగాణలోనే అయింది. మైనార్టీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యం. కామారెడ్డిలో కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
చూసుకుందాం.. దమ్ముంటే రా
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తడని అనంగనే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయి. జబ్బలు చరిచినోళ్లు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే కామారెడ్డి తెలంగాణ ఉద్యమాల గడ్డ. షబ్బీర్ అలీ అసోంటోళ్లు పోటీ నుంచి తప్పుకున్నరు. ఇగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి వస్తడట. రేవంత్రెడ్డి.. దమ్ముంటే రా చూసుకుందాం. డిపాజిట్ కూడా దక్కనీయం. చిత్తుచిత్తుగా ఓడిస్తం. పోరాటాల గడ్డ మీద తెలంగాణ ద్రోహులకు స్థానం లేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ పోటీ చేస్తున్నడని తెలవంగనే కొందరు నాయకులు పోటీ నుంచి తప్పుకున్నరు. షబ్బీర్ అలీ పోటీ చేయనని పక్కన కూసున్నట్టు మీడియాలో చూసిన. కేసీఆర్ మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు మేకపోతును బలిచ్చినట్టే. గ్రామగ్రామాన ప్రజలే ఏకగ్రీవంగా కేసీఆర్కు మద్దతు ఇస్తున్నరు. పోటీ ఏకపక్షమే’అని పేర్కొన్నారు. కామారెడ్డికి గోదావరి తెస్తాం ‘పుట్టుక నుంచి చావు వరకు కేసీఆర్ పథకాలు ఇంటింటికీ చేరినయి అంటూ బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు వస్తది, ఏదేని పరిస్థితుల్లో ప్రాణాలు పోతే కేసీఆర్బీమాతో ఆదుకుంటాం’అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయన్నారు. కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ‘కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఎవరు చూసుకుంటరని కొందరు అంటున్నరు. ఇక్కడ ప్రత్యేక అధికారిని పెడతం. ఆయన పర్యవేక్షణలో అన్నీ జరుగుతయి. ఈ ప్రాంతానికి చెందిన ఆర్డీవో ముత్యంరెడ్డి గజ్వేల్లో ప్రత్యేకాధికారిగా పనిచేసి అక్కడి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అవసరమైతే ఆయన్నే ఇక్కడ పెట్టుకుని పాలన సాగించుకుంటాం. నాది పక్క నియోజక వర్గం సిరిసిల్ల.. నేను వారం, పదిరోజులకోసారి వస్తూపోతూనే ఉంట. ఇక మీదట కామారెడ్డిలో ఆగుత. ఇక్కడి ప్రజల కష్టాలను నేనే తీరుస్తా’అని కేటీఆర్ అన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి, విప్ గంప గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చూస్తారని తెలిపారు. గంప గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించారని, ఇంకా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలా అభివృద్ధి జరగాలంటే సీఎం పోటీ చేయాలని గంప గోవర్ధన్ సీఎంను కోరడంతో పోటీకి సిద్ధమయ్యాడన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ విజయం సాధిస్తారని, ఇక్కడ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా? కాంగ్రెస్కు 11 సార్లు అధికారం ఇస్తే వాళ్లు చేసిందేమి లేదని, ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మాలని కేటీఆర్ ప్రశ్నించారు.70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తున్నరా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారని, వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా అని అన్నారు. సభలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తాం.... కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త చంద్రశేఖర్రెడ్డి సస్పెన్షన్పై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డిపై దౌర్జన్యం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తప్పుడు పనులు చేసేవారిని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని క్షమించేది లేదన్నారు. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో?
అసెంబ్లీలో స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించినవారు ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనిని బలపరుస్తూ గతంలో పనిచేసిన స్పీకర్లు ఓడిన ఉదంతాలున్నాయి. 1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటివరకు ఎవరూ గెలుపును సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ను తిరగరాస్తానన్న ధీమాలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. వయసు పైబడుతుండటంతో ఈసారి పోటీ నుంచి తప్పుకొని కుమారుడిని వారసునిగా నిలబెట్టాలని అనుకున్నా సీఎం మాత్రం తాను ఉన్నన్ని రోజులు శీనన్న ఉంటారని పేర్కొనడంతో ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తుంటారు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లోనూ ఆయనను అలాగే గౌరవిస్తారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుబంధు పథకం ప్రారంభించారు. రూ. వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, అందుకే శీనన్న లక్ష్మీపుత్రుడు అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ...: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం... 2004 మినహా 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన నిత్యం జనం మధ్యే తిరుగుతుంటారు. వేకువజామునే లేచి బ్యాటరీ వాహనంలో ఊరంతా కలియ తిరుగుతారు. మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు శుభ్రం చేస్తుంటే నిలబడి వారికి సూచనలు ఇస్తారు. ఇంటికి చేరగానే ఊళ్ల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ నేతలతో మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని లెక్కలతో సహా చెబుతారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ది దారులకు అందించారు. విద్య, వైద్య రంగంలోనూ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపారు. బాన్సువాడలోని మాతాశిశు ఆస్పత్రి సేవల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. సెంటిమెంట్ ఏం చేస్తుందో? స్పీకర్ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతూ రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సెంటిమెంట్ను పోచారం అధిగమిస్తారని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం చరిత్రను తిరగరాస్తారంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. రంగుల పోషాలు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మోస్రాలో ఉంటున్న చెల్లెలు పోషవ్వ.. అన్న మరణవార్త విని కన్నీటి పర్యంతమై గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెను సవాల్ విసురుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. విద్యార్థుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతున్నారు. చదవండి: పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు.. -
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ...
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఘన విజయం సాదిస్తే ఎల్లారెడ్డిలో మాత్రం టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోవడం విశేషం. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ 35148 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సురేందర్కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి టి.బాలరాజుకు 9600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేందర్ తొలిసారి గెలు పొందారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇ.రవీంద్ర రెడ్డి నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 2004లో టీఆర్ఎస్ పక్షాన గెలిచి, ఉద్యమంలో బాగంగా 2008లో పార్టీ ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాన ఓటమి చెందారు. ఆ తర్వాత 2009లో తిరిగి గెలిచారు. మళ్లీ ఉద్యమంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. 2014 సాదారణ ఎన్నికలలో కూడా గెలుపొందినా, 2018లో ఓటమి చెందారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బిసిలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరు కాపు వర్గం వారు కాగా, ఇద్దరు గౌడ వర్గం వారు. మూడుసార్లు ఎస్. సిలు ప్రాతినిధ్యం వహించారు. 1983 తరువాత ఒకే ఒక ఉప ఎన్నికలో 2018లో కాంగ్రెస్ ఐ గెలిచింది. మిగిలిన అన్నిసార్లు టిడిపి, టిఆర్ఎస్లు విజయం సాధించాయి. టిఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటే, 2009లో టిడిపికి మిత్రపక్షం అయింది. 2014 నుంచి ఒంటరిగానే పోటీచేస్తోంది. ప్రముఖ దళితనేత టి.ఎన్.సదాలక్ష్మి ఒకసారి ఇక్కడ, మరోసారి కామారెడ్డిలో గెలిచారు. ఎల్లారెడ్డిలో రెండుసార్లు విజయం సాధించిన జె.ఈశ్వరీబాయి, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లీ, కూతుళ్లు, 1978లో ఇక్కడ గెలిచిన బాలాగౌడ్ కొంత కాలం జడ్పి ఛైర్మన్గా, నిజామాబాద్ ఎమ్.పిగా కూడా పనిచేశారు. ఇక్కడ గెలిచినవారిలో టిఎన్ సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, బాలాగౌడ్ 1981 తరువాత అంజయ్య, భవనం క్యాబినెట్లలో ఉన్నారు. నేరెళ్ల ఆంజనేయులు కొద్దికాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఎల్లారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్షాక్కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి
అయిదంతస్తులు.. వంద అడుగుల లోతు.. కాకతీయుల కాలం నాటి కళాత్మక నిర్మాణమిది. శిథిలమైపోతున్న ఒక పురాతన బావి నేపథ్యమిది. పాలకుల ఆదరణకు నోచక..శిథిలమైపోతున్న ఈ బావి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్ర శివారులో ఉంది. సుమారు 18వ శతాబ్దంలో నిర్మితమైన ఈ బావి అడుగు నుంచిపైభాగంవరకునాలుగు వైపులా ఒకే రకమైన మెట్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి 20 అడుగుల వరకు ఒక్కొక్క అంతస్తు చొప్పున అయిదు అంతస్తుల మెట్లు ఉన్నాయి. మెట్ల బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పునరుద్ధరణ కోసం పురావస్తు శాఖ ముందుకొచ్ఛినా.. నిధుల కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సికింద్రాబాద్లోని బన్సీలాల్ మెట్ల బావి తరహాలోనే.. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని బాగు చేయాలని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
నేడు కామారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.40 గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిమ్మాపూర్కు చేరుకొని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటే శ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యా హ్నం 1.30 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ధర్మకర్తగా ఉన్న తెలంగాణ తిరుమల ఆలయాన్ని 2016 ఏప్రిల్ 2న సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. -
ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు
కామారెడ్డి టౌన్: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకున్నారు. కళ్లద్దాల పెట్టె అందిస్తే ఆనందంగా అందుకున్నారు.. తీరా దాన్ని తెరిచి చూస్తే ఖాళీగా కనిపించడంతో అవాక్కవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన దూడ బీరయ్య కంటి వెలుగు కార్యక్రమంలో తనిఖీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు వైద్య సిబ్బంది కళ్లద్దాల పెట్టె అందజేశారు. కానీ పెట్టె తెరిచాక అందులో కళ్లద్దాలు లేకపోవడంతో బీరయ్య, అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విస్తుపోయారు. మళ్లీ వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్ చేస్తామని తెలిపారు. చాలాచోట్ల ఇలాగే జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. -
బాన్సువాడ ఎంసీహెచ్కు జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ)‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1)‘లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్ను పలుమార్లు సందర్శించింది. అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధా రించుకొని అక్రెడిటేషన్ మంజూరు చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆసుపత్రులకే బీఎఫ్హెచ్ఐ అక్రెడిటేషన్ ఉంది. దీంతో భారత దేశ స్థాయిలో ఘనత సాధించిన ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సీఎం ఆదేశాలతో .. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్‘ను నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. వైద్య సిబ్బందికి అభినందనలు: హరీశ్రావు బాన్సువాడ ఎంసీహెచ్కు బీఎఫ్హెచ్ఐ అక్రెడిటే షన్ రావడం హర్షణీయమని హరీశ్రావు పేర్కొ న్నారు. హాస్పిటల్ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. -
‘కొత్తపల్లె’ కరెంటు బిల్లు.. రూ. 11.41 కోట్లు!
మాచారెడ్డి: ఇటీవల పంచాయతీల పునర్విభజనలో కొత్త పంచాయతీగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె పంచాయతి భవనానికి రూ. కోట్లలో వచ్చిన కరెంటు బిల్లును చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. పంచాయతీ వాటర్ వర్క్స్కు సంబంధించిన సర్వీస్ నంబర్ 3801–02321పై ఈనెల 3న ట్రాన్స్కో బిల్లింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేశారు. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 3 వరకు 1,88,15,257 యూనిట్లు వాడినట్టు పేర్కొన్నారు. దీనికి ఏకంగా రూ. 11,41,63,672 బిల్లు విధించారు. ఏసీడీ డ్యూ కింద మరో రూ.8,716 వడ్డించారు. ఈనెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది షాక్కు గురయ్యారు. గతనెల విద్యుత్ బిల్లు రూ.3,257 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సాంకేతిక సమస్యతో బిల్లు ఇలా వచ్చిందని చెప్పారు. -
‘అమ్మా’రావం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇలా అంతా కోరుకున్న రీతిలో వస్తున్న ఆవు దూడలు పాడి రంగంలో కొత్త క్షీర విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. స్వదేశీ ఆవుల సంఖ్యను పెంచడం.. అలాగే అధికంగా పాలిచ్చే జాతి ఆవులను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీన్ని తెలంగాణ, ఆంధ్రపదేశ్తోపాటు మరో పది రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టింది. ఇందులోభాగంగా కామారెడ్డి జిల్లా తిప్పాపూర్, ఎర్రపహాడ్, కొండాపూర్, చిన్నమల్లారెడ్డి, లింగంపల్లి, ఎల్లంపేట, మోతె, కొయ్యగుట్ట, మహ్మదాపూర్, కరత్పల్లి పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన 160 ఆవుల్లో లింగ నిర్ధారణ చేసి సాహివాల్, గిర్ తదితర స్వదేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే హెచ్ఎఫ్, జెర్సీ కోడెల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. ఇందులో ఇప్పటివరకు 134 ఆవులు గర్భం దాల్చి 126 (94 శాతం) ఆడ దూడలు, 8 కోడె దూడలకు జన్మనిచ్చాయి. దీంతో రైతులు స్వదేశీ గిర్, సాహివాల్ ఆడ దూడలతోపాటు అధిక పాలనిచ్చే ఆవులకు యజమానులయ్యారు. లక్షలు పోసినా దొరకని స్వదేశీ, విదేశీ ఆవుజాతులు ఇప్పుడు తమ పంటపొలాల్లో పరుగెడుతుండటంతో సంబరపడిపోతున్నారు. ‘స్వదేశీ ఆవును పెంచుకోవాలన్నది నా జీవితాశయం. ఎవరి వద్దనైనా కొందామంటే ధర.. రూ.లక్షల్లో చెబుతున్నారు. అంత సొమ్ము భరించే స్తోమత లేదు. నా కల ఇక నెరవేరదు అనుకున్నా..! కానీ ఓ రోజు కేంద్ర పశుసంవర్థక శాఖ వారు మా ఊరిలో క్యాంప్ పెట్టి.. నా వద్ద ఉన్న విదేశీ జాతి హెచ్ఎఫ్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో కోరుకున్న స్వదేశీ ఆవు దూడ పుట్టేలా ఉచితంగా చేస్తామన్నారు. అందులో ఆడ–మగ.. ఏది కోరుకుంటే అదే పడుతుందన్నారు. నాకు సాహివాల్ రకం ఆడ దూడ కావాలని అడిగాను. నా దగ్గర ఉన్న ఆవు గర్భంలో లింగ నిర్ధారణ వీర్యం ప్రవేశపెట్టి 9 నెలల్లో సాహివాల్ ఆడ దూడను కానుకగా ఇచ్చారు. ఇలా మా ఊరి ఆవుల్లో చేసిన కృత్రిమ గర్భధారణతో అందరికీ కోరుకున్న జాతి ఆడ దూడలే పుట్టాయి. ఇది మాకు ఆశ్చర్యంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది’ అంటూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ పాడిరైతు ఏలేటి గణేశ్రెడ్డి ఆనందంతో గంతేశాడు.. ఈ ఆనందం ఇప్పుడు ఈయన ఒక్కడిదే కాదు కామారెడ్డి జిల్లాలో మరికొందరిది కూడా. ఇక అన్ని పల్లెలకు.. కేంద్ర ప్రభుత్వం–విజయ డెయిరీ సహకారంతో చేపట్టిన కామారెడ్డి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,192 మంది వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులతో కృత్రిమ గర్భధారణ శిబిరాల్లో రైతు రూ.250 చెల్లిస్తే వారు కోరుకున్న దూడలకు జన్మనిచ్చేలా ఆవులను సిద్ధం చేయనున్నారు. అయితే 90 శాతం ఆడ దూడలు, 10 శాతం కోడె దూడలుండే విధంగా సమతౌల్యం పాటించనున్నారు. ఈ పథకం విస్తృతంగా రైతుల్లోకి వెళ్తే వచ్చే ఏడేళ్లలో టాప్–10 రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశం ఉందని పాడి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెరీవెరీ స్పెషల్.. ►గిర్, సాహివాల్ ఆవుల పాలల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. సంతానోత్పత్తి సమర్థత కూడా అధికం. తక్కువ మేత, ఎక్కువ పాల దిగుబడితో ప్రస్తుతం ఈ స్వదేశీ జాతి ఆవులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. ►హెచ్ఎఫ్ ఆవుల్లో ఎక్కువ పాల దిగుబడితోపాటు ప్రసవించే పదిహేను రోజుల ముందు వరకు పాలు ఇవ్వడం ప్రత్యేకం. పాడిలో పెను మార్పులు పైలట్ ప్రాజెక్ట్గా పది గ్రామాల్లో చేసిన ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఈ పథకాన్ని మార్చిలో రాష్ట్రమంతా విస్తరిస్తాం. దీంతో పాడి రంగంలో పెనుమార్పులు రానున్నాయి. –డాక్టర్ మంజువాణి, సీఈఓ, లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మా ఇంట్లో పోషకాల గోవు.. స్వదేశీ గిర్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో మళ్లీ గిర్ ఆడ దూడ పుట్టింది. గిర్ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నా ఆవు రోజుకు 16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఒక్క స్వదేశీ ఆవు ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే. –మన్నె గంగారెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి పుణేలో.. ఫలించిన ప్రయోగంతో.. అంతరిస్తున్న దేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే విదేశీ జాతి సంతతి వృద్ధి కోసం భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (ఫుణే).. ఫ్లో సైటీమెట్రీ (బయాలాజికల్ విశ్లేషణ)తో తొలి అడుగు వేసింది. లింగ నిర్ధారణ వీర్యంతో పుణేలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, అక్కడి నుంచి తొలుత దేశీ జాతులు, ఆపై విదేశీ జాతుల లింగ నిర్ధారణ వీర్యాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆవుల్లో కృత్రిమ గర్భధారణ చేయగా, ఆశించిన విధంగానే ఎక్స్ క్రోమోజోమ్తో అండ ఫలదీకరణ ప్రయోగంతో కోరుకున్న స్థాయిలో ఆడ ఆవుదూడలు పుట్టాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్, ఒడిశాల్లో కృత్రిమ గర్భధారణ వేగవంతం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని విస్తృతం చేయనున్నారు. -
చంపుతాడని చంపేశాడు
నిజాంసాగర్: అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటికి తెలియడంతో తనను ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో అన్ననే మట్టుపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని అంతాపూర్లో జరిగింది. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్రెడ్డి శనివారం తెలిపిన వివరాలిలా.. అంతాపూర్ గ్రామనికి చెందిన మక్కల్ వాడి గంగాధర్(27).. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నమ్మ వద్దనే పెరిగాడు. చిన్నమ్మ కుమారుడు గంగాధర్, మక్కల్వాడి గంగాధర్ సొంత అన్నదమ్ముళ్లలా పెరిగారు. మక్కల్వాడి గంగాధర్కు వివాహమైంది. భార్య రేణు, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతను కూలి పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో వరుసకు వదిన అయిన రేణుతో గంగాధర్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం ఇంటికి వచ్చిన మక్కల్వాడి గంగాధర్.. ఇది గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తనను అన్న చంపేస్తాడేమోనని భయపడి ముందుగా అతడినే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మక్కల్వాడి గంగాధర్ వంట చెరుకు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. తమ్ముడు గంగాధర్ బైక్పై అతడి వద్దకు వచ్చి, పొలానికి వెళ్దామని చెప్పాడు. జుక్కల్ మండలంలోని హంగర్గ శివారులోగల కర్ణం గుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడ మాటు వేసి ఉన్న తన మిత్రులు అశోక్, బాలాజీలు మక్కల్వాడి గంగాధర్పై బండరాళ్లతో దాడి చేశారు. కుప్పకూలిన అతని తలపై ముగ్గురూ కలిసి రాళ్లతో కొట్టి చంపి నీటి గుంటలోకి తోసివేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం వేళ అన్న కనిపించడం లేదంటూ గంగాధర్ గ్రామస్తులకు తెలిపాడు. హంగర్గ శివారు ప్రాంతానికి వెళ్లినవారికి నీటి గుంటలో మక్కల్వాడి గంగాధర్ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. బిచ్కుంద సీఐ కృష్ణ, జుక్కల్ ఎస్సై మురళి ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జరిపారు. గంగాధర్పై అనుమానంతో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కామినేని పుష్ప కన్నుమూత
దోమకొండ: కామారెడ్డి జిల్లా లోని దోమకొండ గడికోట వార సులైన దివంగత రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు సతీమణి పుష్ప (71) సోమవారం హైదరాబాద్ లోని స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతదేహా నికి జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వ హించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కుమారుడు, జాతీయ అర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కుమార్తె ఉపాసనను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్తో దోమ కొండలో వివాహం జరిపించిన విషయం తెలిసిందే. పుష్ప ప్రతి మహా శివరాత్రి నాడు గడికోటలోని మహ దేవుని ఆలయానికి వచ్చి పూజల్లో పాల్గొనేవారు. ఆమె గడికోటకు వచ్చిన ప్రతిసారీ అందరితో కలుపుగోలుగా ఉండేవారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. -
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ప్లాన్ రద్దుకు తీర్మానం
-
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం
-
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గిన పాలక వర్గం
-
కామారెడ్డి రైతుల సంచలన నిర్ణయం.. వారు రాజీనామా చేయాలని హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: మున్సిపల్ మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్ రద్దుపై పాత రాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, రైతుల సమావేశంలో ఎల్లుండి(గురువారం) సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకు గడువు ఇచ్చారు. 19న విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని హెచ్చరించారు. 20వ తేదీన ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. మున్సిపల్ తీర్మానం చేయించి మాస్టర్ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యాచరణ కమిటీకీ రాజీనామా పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి రామేశ్వరపల్లికి చెందిన బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మాస్టర్ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. నిర్మల్లో పాత రోడ్లనే బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు
-
హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, తమపై విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా? అని రైతులు ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తన చాంబర్లో ఉండి కూడా, రాత్రి 8 గంటలైనా తమ గోడును పట్టించుకోలేదని, అలాగే ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్ఐలు లాఠీచార్జి చేసి రైతులను విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో తన్ని హింసించారన్నాని పేర్కొన్నారు. -
తల్లిని కొట్టి చంపి.. కాసేపటికే రక్తపు మడుగులో పడి..
మాచారెడ్డి: ఇంట్లో గొడవ.. ఓ కొడుకు తల్లిని కర్రతో బాదడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది.. మృతదేహాన్ని తీసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి.. ఆ కొడుకు కూడా ఇంట్లో రక్తపు మడుగు మధ్య చనిపోయి ఉన్నాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో కేవలం గంటన్నర వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో..: చిటుకుల నర్సమ్మ (67), ఆమె కుమారుడు నర్సారెడ్డి (45), ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి భవానీపేటలో ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్సారెడ్డి భార్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లీకొడుకులు నర్సమ్మ, నర్సారెడ్డి సొంత ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల అయ్యప్పమాల వేసుకున్న నర్సారెడ్డి.. రెండు రోజుల క్రితమే శబరిమల యాత్రకు వెళ్లివచ్చాడు. శుక్రవారం సాయంత్రం తన భార్యను ఇంటికి రప్పించాలంటూ తల్లితో నర్సారెడ్డి గొడవకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నర్సారెడ్డి ఆవేశంతో కర్రతో నర్సమ్మ తలపై బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. దీంతో వారు నర్సమ్మ మృతదేహాన్ని భవానీపేటలోని ఇంటికి తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఇంట్లో రక్తం మడుగులో నర్సారెడ్డి మృతిచెంది కనిపించాడు. ఇది చూసి గ్రామస్తులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే నర్సారెడ్డి తలకు పెద్ద గాయమైనట్టు కనిపిస్తుండటం, రక్తపు మడుగు మధ్య పడి ఉండటంతో ఆయనను ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. -
బంద్ ఎఫెక్ట్.. కామారెడ్డిలో హై టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతు జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మాస్టర్ ప్లాన్కు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో బంద్ పాటించాలని రైతు ఐక్య కార్యాచారణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాల చేసుకుంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో బంద్ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం, బీబీపేట పోలీసు స్టేషన్కు తరలించారు. మరోవైపు.. మాస్టర్ ప్లాన్ భూబాధత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్ చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న చేస్తున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదంటున్న బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రైతులకు కాంగ్రెస్ నేత షబ్బీర్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనను అవమానించారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మాస్టర్ ప్లాన్ను సవరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోంది. రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
Kamareddy: మాస్టర్ ప్లాన్పై రైతుల ఆందోళన.. కలెక్టర్ ఏమన్నారంటే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటాని తెలిపారు. అలాగే కొత్త మాస్టర్ ప్లాన్పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతులు నిరసన విరమించారు. కలెక్టర్ దిష్టిబొమ్మను రైతులు దగ్దం చేశారు. కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డి బంద్కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కాగా అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హెటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ ముందు టెంట్ వేసి రైతులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించి., బృందాలుగా లోపలికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కోరినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. మాస్టర్ ప్లాన్పై స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రావాల్సిందేనని పట్టుబట్టారు. కాగా కామారెడ్డి బల్దియాలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రీయల్ జోన్ కింద చూపడం, అవసరం లేని చోట్ల 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతులు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అయితే మాస్టర్ ప్లాన్లో భూమి పోతుందని మనస్తాపంతో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. చదవండి: KTR: మాస్టర్ప్లాన్పై స్పందించిన మంత్రి కేటీఆర్ -
రైతు ఆత్మహత్యతో ఉద్రిక్తత
కామారెడ్డి టౌన్: తన మూడు ఎకరాల భూమి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో, ఆ భూమిని అమ్ముకోవడానికి వీలుపడక మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు (42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చిపూర్ వద్ద 3 ఎకరాలు పంట భూమి ఉంది. కాగా, ఇటీవల మున్సిపల్ నూతన మాస్టర్ప్లాన్లో అక్కడి భూములన్నీ ఇండస్ట్రియల్ జోన్లోకి చేర్చా రు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఆ భూమి ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకురాక మనస్తాపంతో రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన తల్లి.. చుట్టుపక్కల వారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు మృతితో రైతులు గ్రామంలో కాసేపు ఆందోళన చేశా రు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడానికి తరలివచ్చారు. అయితే కామా రెడ్డి కొత్త బస్టాండ్ ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తర్వాత రాము లు మృతదేహాన్ని అక్కడే వదిలేసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ధర్నాకు దిగారు. ఈ సమయంలో 2 గంటల పాటు రోడ్డుపైనే ట్రాక్టర్ లో మృతదేహం అలానే ఉంది. తర్వాత పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తన భర్త మృతదేహాన్ని తన అను మతి లేకుండా ఆస్పత్రికి తరలించినందుకు రాములు భార్య.. తన కుటుంబ సభ్యులు, ఇతర రైతులతో కలసి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు. రెండు పంటలు పండే రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడం దారుణమన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాములు భార్య శారద కోరారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి కుటుంబ సభ్యులతో కలసి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. రాములు మృత దేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు. మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. చదవండి: మరో గుడ్న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది?
బాన్సువాడ రూరల్(కామారెడ్డి జిల్లా): నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో గురువారం మాలోత్ సోని (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు.. చందూర్ మండలం కారేగాం తండాకు చెందిన రమావత్ చంద్రుకు నలుగురు కూతుర్లు. చిన్న కుతూరు సోనికి అంకోల్తండాకు చెందిన మాలోత్ రాంచందర్తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. రాంచందర్ భార్యతో కలిసి మహబూబ్నగర్ వెళ్లాడు. అక్కడ రాంచందర్ భార్యను అనుమానిస్తూ వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు కులపెద్దలు పంచాయతీ పెట్టిన రాంచందర్ తీరు మార్చుకోలేదు. దీంతో భర్త వేధింపులు భరించలేక ఇటీవల సోని కారేగాం తండాలోని తల్లిగారింటికి వచ్చింది. భార్యను కొట్టనని, మంచిగా చూసుకుంటానని రాంచందర్ వచ్చి చెప్పడంతో ఈ నెల 17న అంకోల్ సోనీని తల్లిదండ్రులు అంకోల్ తండాకు పంపించారు. చదవండి: పెళ్లి కుమార్తె రవళి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కాగా గురువారం తన కూతురు చనిపోయినట్లు సమాచారం రావడంతో వెళ్లి చూడగా అల్లుడు పారిపోయాడని చంద్రూ చెప్పారు. రాంచందర్ తన కూతురు మనికట్టు వద్ద కోసి తాడుతో ఉరివేసి చంపేసినట్లు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్రెడ్డి తెలిపారు. -
రాజు రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల నరకయాతన నుంచి విముక్తి
సాక్షి, కామారెడ్డి/ కామారెడ్డి టౌన్: రెండు పెద్ద బండరాళ్ల మధ్య.. దాదాపు 48 గంటల పాటు.. ఎటూ కదల్లేని మెదల్లేని పరిస్థితి.. రాత్రివేళ మరీ నరకయాతన. బయట పడతానో లేదో అన్న సందిగ్ధం. కానీ ధైర్యం కోల్పోలేదు. రెండు రాత్రిళ్లు గడిచాయి. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఆ నరకం నుంచి విముక్తి. అధికారులు, సిబ్బందిలో ఒకరి ప్రాణాలు కాపాడగలిగామనే సంతృప్తి..కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన సంతోషం. గుట్టల్లో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు గురువారం క్షేమంగా బయటపడటంతో కుటుంబసభ్యులు, బంధువులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. వేటకు వెళ్లి..బండరాళ్ల మధ్య చిక్కి.. మంగళవారం రెడ్డిపేట–సింగరాయపల్లి రోడ్డులో గన్పూర్ (ఆర్) తండాకు సమీపంలోని పులిగుట్ట అటవీ ప్రాంతానికి వెళ్లిన చాడ రాజు.. రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఏదులు, ఉడుములు పట్టుకోవడంలో దిట్ట అయిన రాజు.. ఉడుమును పట్టుకునే క్రమంలోనే బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కాగా రాజు వెంట వెళ్లిన అతని స్నేహితుడు సున్నపు మహేశ్.. అతన్ని బయటకు లాగేందుకు చాలాసేపు విఫలయత్నం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏ ఇబ్బంది ఎదురవుతుందోనని మహేశ్ భయపడ్డాడు. ఆ రోజు రాత్రంతా రాజుతో మాట్లాడుతూ అక్కడే రాతి గుండుపై ఉండిపోయాడు. బుధవారం ఉదయం ఇక లాభం లేదనుకుని గ్రామంలోని తమ మిత్రులు కొందరికి విషయం చెప్పాడు. వారు కూడా అక్కడికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేశారు. రాజు కూడా బయటకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచాడు. కానీ ఫలించలేదు. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసు, రెవెన్యూ, అటవీ సిబ్బంది సమష్టిగా.. రామారెడ్డి ఎస్సై అనిల్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలోని గుట్టల వద్దకు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వెంటనే అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్లతో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని పంపించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వచి్చన పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సహాయ సిబ్బంది.. రాజును రక్షించేందుకు గుట్టను తవ్వే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో స్థానిక యువకుల్ని అప్పుడప్పుడు రాజుతో మాట్లాడిస్తూ ధైర్యం చెప్పారు. ముఖ్యంగా అశోక్ అనే రాజు మిత్రుడు అతని సమీపం వరకు వెళ్లి నీళ్లు, పండ్ల రసాలు అందించడంలో సాయపడ్డాడు. లోపల ఉక్కపోత నుంచి కాపాడేందుకు చార్జింగ్ ఫ్యాన్ను లోనికి పంపించారు. బుధవారం రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించారు. జేసీబీతో, రాళ్లను బ్లాస్ట్ చేస్తూ.. పులిగుట్ట మొత్తం పెద్దపెద్ద బండరాళ్లతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాళ్ల మధ్యన ఇరుక్కున్న రాజును రక్షించేందుకు మొదట జేసీబీ సాయంతో ప్రయతి్నంచారు. తర్వాత రాళ్లకు డ్రిల్లింగ్తో రంధ్రాలు చేసి పేలుడు మందు నింపి బ్లాస్టింగ్ చేశారు. ఈ విధంగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 12 సార్లు బండరాళ్లను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ (పెద్ద రాళ్ల ముక్కలు రాజు మీద పడకుండా తక్కువ మోతాదు పేలుళ్లు) చేశారు. బ్లాస్ట్ చేసిన రాళ్లను తొలగించేందుకు జేసీబీని వినియోగించారు. ఈ క్రమంలో రాజుతో వీలైనన్నిసార్లు మాట్లాడుతూ అధైర్యపడవద్దని చెప్పారు. రాళ్లు రాజుపై పడకుండా అడ్డుగా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 గంటల ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజును బయటకు తీయగలిగారు. దీంతో దాదాపు 48 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పక్కా ప్రణాళికతో..చాకచక్యంగా.. రెస్క్యూ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ స్వ యంగా పర్యవేక్షించారు. బండరాళ్లు పేల్చడం ఒక రకంగా అధికారులు చేసిన సాహసమేనని చెప్పాలి. అందుకనే ఈ తరహా పేలుళ్లలో అనుభవజు్ఞడైన కామారెడ్డికి చెందిన పెంటయ్యతో పాటు అతని బృందాన్ని పిలిపించారు. తక్కువ పరిమాణంలో మందుగుండు అమర్చుతూ పేలుళ్లు జరిపారు. పొరపాటున భారీ విస్ఫోటనం జరిగితే లోపల ఇరుక్కున్న రాజుకు అపాయం జరిగే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రెస్క్యూ ఆపరేషన్లో 80 పాల్గొన్నారు. ఆస్పత్రిలో 24 గంటల అబ్జర్వేషన్ రాజును అధికారులు తక్షణమే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. రెండురోజుల పాటు సరైన ఆహారం లేకపోవడంతో శరీరంలో షుగర్ శాతం తగ్గిన్నట్లు గుర్తించారు. ఎడమ చేతికి వాపు వచి్చంది. బండరాళ్ల మధ్య కదలడంతో రెండు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. అతని ధైర్యమే అతన్ని కాపాడిందని డాక్టర్ సంతోష్ కుమార్ చెప్పారు. అధికారులు దేవుళ్లలాగా వచ్చారు.. పడిపోయిన సెల్ఫోన్ తీసుకోవడానికి వెళ్లి రాళ్లలో తలకిందులుగా ఇరుక్కుపోయా. అయినా ధైర్యంగానే ఉన్నా. నేను ఎవ్వరికీ భయపడను.. ఒక్క దేవుడికి తప్ప. అయితే బండరాళ్ల మధ్య నరకం అనుభవించా. కానీ మా వాళ్లకు ధైర్యంగా ఉండాలని, నాకు ఏం కాదని చెప్పా. రాళ్లు పేల్చుతుంటే మాత్రం కొంచెం భయం వేసింది. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవె న్యూ, అటవీ, వైద్య శాఖల అధికారులు దేవుళ్లలాగా వ చ్చారు. చాలా కష్టపడి నన్ను బయటకు తీశారు. వాళ్లందరికీ నేను చనిపోయేంత వరకు రుణపడి ఉంటాను. – రాజు అందరికీ రుణపడి ఉంటా.. మా ఆయన్ను ఆ పరిస్థితిలో చూసి చాలా భయపడ్డా. అసలు బయటకు వస్తాడా..బతుకుతాడా?.. నా పిల్లలు, నా పరిస్థితి ఏందని ఏడ్చాను. గుండె ఆగిపోయినంత పని అయింది. సార్లు, డాక్టర్లు అందరూ వచ్చి రెండ్రోజులు కష్టపడి నా భర్తను బతికించారు. అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా. – లక్షి్మ, రాజు భార్య బయటికి వస్తాడో లేడో అని అని్పంచింది రాజు రాళ్ల మధ్యలో పడ్డాడని నాకు చెప్పారు. నేను వెళ్లి బయటకు తీయడానికి చాలాసేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తర్వాత భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాం. అందరూ వచ్చి కష్టపడి రాజన్నను బతికించారు. పరిస్థితి చూస్తే అసలు బయటికి వస్తాడో లేడో అని భయం వేసింది. అతని బాధ చెప్పలేను. కానీ రాజు చాలా ధైర్యంగా ఉన్నాడు. – అశోక్, రాజు మిత్రుడు -
సెల్ టవర్ పై ఉరేసుకుని రైతు ఆత్మహత్య
-
ముందస్తు ఎన్నికలు ఖాయం: ఆర్.ఎస్.ప్రవీణ్
కామారెడ్డి టౌన్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వెనక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పలువురు రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని తెలిపారు. కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వందలమంది నాయకులను మోహరించి, రూ.500 కోట్లు ఖర్చు చేస్తేగానీ మునుగోడు ఉపఎన్నికలో గెలవలేదని ప్రవీణ్ ఎద్దేవాచేశారు. బీఎస్పీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్రాజు, జిల్లా ఇన్చార్జులు సురేశ్గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం
-
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు: వైఎస్ షర్మిల
బిచ్కుంద (జుక్కల్): మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పేరుతో కొల్లగొట్టి తన జేబులు నింపుకొన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను ఆగం చేశారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల మీదుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.38 వేల కోట్లకు పూర్తి చేయాలనుకున్నారని, అదే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేయించి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష 20 వేలకు పెంచి రూ.70 వేల కోట్లను మింగారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఏనాడూ సీఎం కేసీఆర్ అవినీతిపై నిలదీయలేదని, రెండు పార్టీలూ తమ స్వార్థం చూసుకుంటున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాçష్ట్ర అధికార ప్రతినిధి పిట్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్.సుధాకర్ పాల్గొన్నారు. -
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
అది బందిపోట్ల రాష్ట్ర సమితి
ఎల్లారెడ్డి: ఇన్నాళ్లూ ప్రజాసంక్షేమం మరిచి తాగుబోతుల రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారి దేశాన్ని దోచుకోబోతోందని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ‘బీడి బిచ్చం కల్లు ఉద్దెర’గా మారిందని విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన పాలనాకాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 60 ఏళ్లలోపు ఉన్నవారికి మాత్రమే రైతుబీమా వర్తిస్తుందనడం అమానుషమని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ప్రతిపథకంలోనూ వైఎస్సార్ కనిపిస్తుంటారని, అట్లాంటివాటి పేర్లు మార్చి అవి తమవంటూ టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల 175 రోజుల్లో 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటి రాజన్న బిడ్డగా ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిందని అన్నారు. షర్మిలను వైఎస్సార్ ఒక యువరాణిలా పెంచారని, పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఆమె ప్రజల వద్దకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ నాయకులు నీలం రమేశ్, నీలం సుధాకర్, పిట్టా రాంరెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న తన ఆటపాటలతో సభికులను అలరించారు. -
మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ గేట్ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి. తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్ గేట్ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. (క్లిక్: హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!) నిధులు మంజూరైతేనే... మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?) రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. – యు.మనోహర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట -
మహాత్ముని మార్గంలో " ర్యాగట్లపల్లి "
-
కరెంటు కంచె ముగ్గురిని కాటేసింది..
మామడ/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలే వారిపాలిట మృత్యుపాశమయ్యాయి. పశువులు మేపేందుకు అడవికి వెళ్లిన ఓ పశువుల కాపరి, పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతు పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాద ఘటనలు నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మద్దిపడగ మల్లయ్య(64) రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తనకున్న గొర్రెలను మేత కోసం అటవీప్రాంతానికి తీసుకువెళ్లాడు. రాత్రి అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా గ్రామానికి చెందిన పారెడి చంద్రమౌళి పొలం వద్ద విగత జీవిగా కనిపించాడు. సమీపంలో విద్యుత్ కంచె ఉండడంతో కరెంటుషాక్తో మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొన్కల్ గ్రామానికే చెందిన ద్యాగల బొర్రన్న(55) కూడా మంగళవారం మరోచోట విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. బొర్రన్న ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. పొరుగు రైతుకు చెందిన పొలం వద్ద పశువుల కోసం గడ్డి కోస్తుండగా కానక విద్యుత్ కంచెకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కరోజు వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యుత్ కంచెకు బలవడంతో పొన్కల్లో విషాదం నెలకొంది. నిజాంసాగర్లో శవమై...: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్కి చెందిన రైతు కుమ్మరి నల్ల పోశెట్టి(43) సోమవారం వేకువజామున పొలానికి వెళ్లాడు. దారిలో స్థానిక ఎంపీటీసీ మోతె శ్రీనివాస్కు చెందిన పొలానికి ఉన్న విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగలడంతో పోశెట్టి మృత్యువాతపడ్డాడు. అయితే ఆయన మంగళవారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్వాటర్లో శవమై తేలడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంపీటీసీ కుటుంబసభ్యులే పోశెట్టి మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని బ్యాక్వాటర్లో పడేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోశెట్టి మృతికి కారణమైనవారు తమకు లొంగిపోయారని, మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశి వనగర్ మండలం దగ్గి గ్రామ శివారు 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారు లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు. అనంతరం సదాశివనగర్ మండల కేంద్రం అటవీ ప్రాంతం శివారులో ఖననం చేశారు. డీఎఫ్వో నిఖిత, ఎఫ్డీవో గోపాల్రావు, ఆర్ఎస్వో రమేశ్, సెక్షన్ అధికారి ముబాషిర్అలీ, బీట్ ఆఫీసర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
రెండో పెళ్లి చేయడంలేదని తల్లిని చంపాడు
మద్నూర్: రెండోపెళ్లి చేయడంలేదనే కోపంతో తల్లినే నరికిచంపాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగా గ్రామంలో చోటుచేసుకుంది. మొగ గ్రామానికి చెందిన పింజరి ఇస్మాయిల్ బీ(55), మహబూబ్సాబ్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అల్లావుద్దీన్ గ్రామంలో వేరే ఇంట్లో భార్య, పిల్లల తో కలిసి ఉంటున్నాడు. చిన్న కొడుకు సల్లావుద్దీన్ తో తల్లిదండ్రులు ఇస్మాయిల్ బీ, మహబూబ్ సాబ్ కలిసి ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సల్లా వుద్దీన్కు వివాహం జరగగా, రెండేళ్ల క్రితం భార్య గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత అతడు హైదరాబాద్లోని ఫంక్షన్ హాల్లో కొంతకాలం కూలిపని చేశాడు. రెండు నెలలుగా అతడు గ్రామంలోనే ఉంటూ ఇంటి నిర్మాణపనులకు దినసరికూలిగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. పెళ్లి విషయమై బుధవారం సాయంత్రం తల్లితో మరోసారి గొడవపడి బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తల్లి మెడపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి మరో గదిలో నిద్రపోతున్నాడు. దొంగలు హత్య చేశారంటూ...: తల్లిని హత్య చేసిన తర్వాత సల్లావుద్దీన్ భయాందోళనకు గురయ్యాడు. హత్య కేసు తనపైకి రాకుండా ఉండేందుకు పథకం వేశాడు. తల్లిని దొంగలు హత్య చేసి పారిపోయారంటూ గట్టిగా అరుస్తూ రోదించాడు. తండ్రి వద్దకు వెళ్లి గుర్తుతెలియని వ్య క్తులు అమ్మను హత్య చేసి పారిపోయారని చెప్పా డు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. తన తల్లిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసుల ఎదుట సల్లావుద్దీన్ వాపోయాడు. పోలీసులు అనుమానంతో అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. గురువారం బిచ్కుంద సీఐ కృష్ణ, క్లూస్టీం సభ్యులు ఘటనాస్థలం వద్ద వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాముకాటుతో హాస్టల్ విద్యార్థి మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ)/ బాన్సువాడటౌన్: కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని బీసీ వసతి గృహంలో విద్యార్థి పాముకాటుతో మృతిచెందాడు. నస్రు ల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బీర్కూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ఐదో తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఏదో కుట్టినట్లుగా అనిపించడంతో నిద్రలేచి మిగతా విద్యార్థులను అప్రమత్తం చేశాడు. అక్కడే ఓ పాము కనిపించడంతో అందరూ కలిసి దానిని చంపేశారు. సాయిరాజ్కు వాంతులు కావడంతో వెంటనే అతడిని పీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే, ఆరోగ్య సిబ్బంది కొద్దిసేపు పరిశీలించి లక్షణాల్లేవని చెప్పి, ప్రాథమిక చికిత్స చేయకుండానే విద్యార్థిని వెనక్కి పంపించేశారు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సాయిరాజ్ నోటి నుంచి నురుగులు రావడంతో భయానికి గురైన తోటి విద్యార్థులు నైట్ వాచ్మన్, వార్డెన్, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్టల్కు వచ్చేసరికి సాయిరాజ్ మృతి చెందాడు. వార్డెన్ వచ్చి సాయిరాజ్ మృతికి కారణం చెప్పాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన గురించి తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్తో మాట్లాడారు. దీంతో కలెక్టర్ వెంటనే వార్డెన్ ను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఎక్స్గ్రేషియా అందించేలా చూస్తామని స్పీకర్ ఫోన్లో బాధితులకు హామీనిచ్చారు. సాయిరాజ్ తల్లిదండ్రులు గంగామణి, మురళి కూలీలు. వీరికి మరో మూడేళ్ల పాప ఉంది. పారిశుధ్య కార్మికురాలికీ పాముకాటు విద్యార్థి మృతి అనంతరం అధికారుల ఆదేశాలతో శనివారం పరిసరాలను శుభ్రంచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు జ్యోతినీ ఓ పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను బాన్సువా డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లక్షణాలు కనిపించలేదు: స్టాఫ్ నర్స్ వినోద, బీర్కూర్ పీహెచ్సీ సాయిరాజ్ అస్వస్థతకు గురై రాత్రి ఒంటి గంట సమయంలో పీహెచ్సీకి వచ్చాడు. ఎటువంటి లక్షణాలు కనబడకపోవడంతో వైద్యం చేయలేదు. వసతిగృహంలోకి పాము వచ్చిందని తెలపడంతో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో పంపిస్తానన్నాను. అయితే, తనను పాము కరవలేదని, అక్కడికి వెళ్లబోనని సాయిరాజ్ చెప్పడంతో తిరిగి పంపించేశాను. -
పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!
సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. గొర్రెల మందలే లోకంగా.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. బీపీ, షుగర్లు దరిచేరవట! గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్నగర్ ఎయిర్పోర్టుకు మహర్దశ) చిరుతపులి వెంట పడ్డాం.. పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. – చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా కాపరుల జీవితమంతా కష్టాలే.. గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. – జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. – కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. – మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి -
కామారెడ్డి జిల్లాలో విషాదం
-
కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్య
-
ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కామారెడ్డి కలెక్టర్కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్కు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy These political histrionics on the street will only demoralise hardworking AIS officers My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct 👏 — KTR (@KTRTRS) September 2, 2022 కాగా శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. చదవండి: స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్ -
ఆ జిల్లాలో టీఆర్ఎస్ గట్టెక్కుతుందా?
కామారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో కూడా గులాబీ పార్టీ మీద అంత పాజిటివ్ ఒపీనియన్స్ లేవనే చెప్పాలి. ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి గతంలో మాదిరిగా సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యర్థులు బలహీనంగా ఉంటేనే టీఆర్ఎస్ గట్టెక్కుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్కు గతంలోలాగా పరిస్థితులన్నీ అనుకూలంగా లేవని చెప్పొచ్చు. సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ కూడా అధికారపార్టీకి మైనస్ అనే వాదన వినిపిస్తోంది. ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన ముజీబ్ ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ఆశిస్తున్నారు. గతంలో అతణ్ని మంత్రి కేటీఆర్ బుజ్జగించి జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు, ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గతంలో బీజేపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నిట్టు వేణుగోపాల్ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ మూడు గ్రూపులుగా మారింది. అయితే గంప గోవర్ధన్ కొడుకు శశాంక కూడా నియోజకవర్గంలో కలియతిరుగుతుండటంతో... కొడుకునూ భవిష్యత్ నేతగా తీర్చిదిద్దే పనిలో గోవర్ధన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకు దక్కకపోతే... కొడుకుకైనా దక్కించుకోవాలనే యత్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్నేత షబ్బీర్ అలీపై ఈసారి సానుభూతి కనిపిస్తోంది. కామారెడ్డిలో మైనార్టీల ఓట్లు ఎంత కీలకమో..అదే స్థాయిలో హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ సెగ్మెంట్ లో ఎన్నిక మత ప్రాతిపదికన కీలకం కానుంది. గతంలో షబ్బీర్ అలీ సోదరుడు నయీంపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నువ్వు చూసుకో... కామారెడ్డి నేను చూసుకుంటా అంటూ నయూం ఏకంగా పత్రికల్లో యాడ్ ఇవ్వడం వంటివి షబ్బీర్ కు మైనస్ గా మారాయి. అయితే ఇటీవల తరచూ నియోజకవర్గానికి వస్తుండటం.. పబ్లిక్లో ఉండటంతో షబ్బీర్ వైపు ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నాయి. బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కాషాయ పార్టీకి హైప్ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ నేతల అవినీతంటూ కొన్ని భూకబ్జాలకు సంబంధించి.. రమణారెడ్డి సవాల్ విసరడం... టీఆర్ఎస్ దాన్ని స్వీకరించడంతో కామారెడ్డి రాజకీయం రక్తికడుతోంది. బీజేపి నుంచి గతంలో బరిలోకి దిగి ఓటమిపాలైన ఇద్దం సిద్ధిరాములు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా.. కాటిపెల్లిని వరిస్తుందా.. లేక, ఇంకెవరైనా రాష్ట్రస్థాయి నేత కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారా అనే ఆసక్తికరమైన చర్చ కాషాయసేనలో జరుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాలిటిక్స్హాట్ హాట్ గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న సెగ్మెంట్ ఎల్లారెడ్డి. ప్రస్తుతం గులాబీ కండువా ధరించిన జాజుల సురేందర్ గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పక్షాన గెల్చిన ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పక్షాన గెల్చి... టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయాడన్న ఒక అపవాదు ఇప్పటికే సురేందర్ కి మైనస్గా ప్రచారంలో ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయనకు శ్రీరామరక్షగా నిల్చే అవకాశాలూ లేకపోలేదు. కాంగ్రెస్ కు బలమున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉన్నాయి. గతంలో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిచెందిన మదన్ మోహన్ రావు ప్రస్తుతం ఎల్లారెడ్డి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇంఛార్జ్ గా ఉన్న సుభాష్ రెడ్డికి, మదన్ మోహన్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య పలుచోట్ల రచ్చబండ కార్యక్రమాల్లో మదన్ మోహన్ వర్గీయులు, సుభాష్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగిన సంఘటనలు మరోసారి కాంగ్రెస్ పరువును మంజీరాలో కలిపేశాయి. అయితే ఎల్లారెడ్డి వేదికగా జరిగిన రేవంత్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నా.. ప్రత్యర్థి పార్టీతో ఫైట్ చేయాల్సిన ఆ పార్టీ కార్యకర్తలు తమలో తామే కొట్టుకోవడం ఇప్పుడు పార్టీకి మైనస్సని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీలో ఉండి.. ఆ తర్వాత కాషాయకండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పాటు..గతంలో బీజేపి తరపున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కమలం పార్టీ ఆశావహులుగా ఉన్నారు. రవీందర్ రెడ్డికి గనుక టిక్కెట్ దక్కితే మాత్రం నియోజకవర్గంలో హోరాహోరీ తప్పదు. కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ కు నెట్ వర్క్ ఎక్కువ ఉండటం.. స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ దక్కితే కచ్చితంగా ఎల్లారెడ్డిలో మూడుపార్టీలు ఢీ అంటే ఢీ అంటాయి. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కంచుకోట అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడినుంచి పోచారం ఆరుసార్లు వరుసగా గెలిపొందిన చరిత్ర ఉంది. నియోజకవర్గంలో అణువణువు గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. పోచారం కుమారులు డీసీసీబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారన్న ప్రచారమూ ఉంది. భాస్కర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం మీద, రెండుసార్లుగా అధికారంలో ఉన్న గులాబీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగల ప్రత్యర్థులు నియోజకవర్గంలో కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజు.. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్మోహన్ రావు ఇక్కడి నుంచి కూడా ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు కాంగ్రెస్నేతలు. బీజేపి నుంచి స్థానిక నేత మాల్యాద్రిరెడ్డి పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే మాల్యాద్రిరెడ్డి గతంలో పోటీ చేసి ప్రత్యర్థులకు సహకరించాడనే అపవాదు ఉంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ఆరోపణ వినిపిస్తోంది. బీజేపీలోనూ ఇక్కడ రెండు వర్గాలుండటం... ఆ రెండువర్గాల మధ్య తారాస్థాయిలో విభేదాలుండటం కాషాయసేనకు మైనస్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేంత స్థాయిలో లేవు. అందుకే మరోసారి పోచారం ఫ్యామిలీలో ఎవరికి టిక్కెట్ దక్కినా విజయం అటువైపేనన్న ప్రచారమూ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గమైన జుక్కల్ లోనూ రసవత్తర రాజకీయమే కనిపిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకే మళ్లీ గులాబీ పార్టీ టిక్కెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గతంలో నాల్గుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన గంగారాం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే మూడుసార్లుగా ఓటమిపాలు కావడంతో గంగారాంకు ఈసారి సానుభూతి లభించవచ్చంటున్నారు. అయితే గడుగు గంగాధర్ కూడా కాంగ్రెస్నుంచి జుక్కల్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఆశీస్సులతో ఎలాగైనా టిక్కెట్ సాధించేందుకు గంగాధర్ ప్రయత్నిస్తున్నారు. చారంలో ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే గంగారాంకు పీసీసీ చీఫ్ రేవంత్మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంగారాం ప్రత్యర్థిగా ఉన్నంత కాలం హన్మంత్ షిండే గెలుపుకు ఢోకా లేదనే ఓ టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. నిజామాబాద్ కు చెందిన అరుణతార జుక్కల్ లో బీజేపీ తరపున ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు. ఈమె కామారెడ్డి జిల్లా బీజేపి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో క్యాడర్ కూడా ఆమెకు పెద్దగా సహకరించడంలేదని..ఆమె క్యాడర్ను కాపాడుకోలేకపోతున్నారని వినిపిస్తోంది. తరచుగా పార్టీలు మారతారన్న నెగటివ్ ప్రచారం కూడా అరుణతారకు మైనస్ అవుతోంది. ఈ మధ్య ప్రతీ ఫంక్షన్ కీ హాజరవుతూ..ప్రజల్లో ఉండే యత్నం చేయడంతో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారనే టాక్సంపాదించుకున్నారు అరుణతార. సిట్టింగ్ ఎమ్మెల్యే షిండే అభివృద్ధి విషయంలో చెప్పుకునేంత చేయకపోయినా.. వివాదరహితుడనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు పరిస్థితులను చూస్తే.. టీఆర్ఎస్ అన్ని సెగ్మెంట్లల్లో విజయాలు సాధించడం అంత తేలిక కాదనేది మాత్రం స్పష్టం అవుతోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ఫైట్ చేస్తూఉంటే.. వారికి కనీసం చెరో రెండైనా సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎత్తులు...దానికి ప్రత్యర్థుల పై ఎత్తులు..టిక్కెట్లెవ్వరికి దక్కనున్నాయి.. పార్టీల్లోని అంతర్గత విభేదాలు... ఇలా ఎన్నో అంశాలు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. -
కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
-
కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
-
ఎవరి వాటా ఎంతో చెప్పండి?
సాక్షి, కామారెడ్డి జిల్లా: రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామా రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించా రు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగానే పేదలకు చౌకధ రల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? అని కలెక్టర్ను అడిగారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో అరగంట సమయం తీసుకుని చెప్పాలని నిర్మలా సీతారామన్ సూచించారు. తర్వాత కేంద్రం బియ్యం పంపిణీకి రూ.28 ఖర్చు చేస్తోందని, ప్రజలు ఒక రూపాయి ఇస్తున్నారని, మిగతా నాలుగైదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. ప్రధాని ఫొటోలు పెట్టాలి కోవిడ్ నేపథ్యంలో నిరుపేదలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు ఎందుకు చెప్పలేక పోతున్నారన్నారు. రేషన్ దుకాణాల దగ్గర ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని లేకపోతే తానే ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలన్నారు. అంతకు ముందు బీర్కూర్ గ్రామానికి చెందిన విద్యా ర్థులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. -
అలుగులు పారే.. అందాల జోరే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామశివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి సరిగ్గా వందేళ్లవుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణమది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1917లో శ్రీకారం చుట్టి, 1922లో పూర్తిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.27.11 లక్షలు. నిజాం ప్రభుత్వ ఇంజనీర్ ఆలీ నవాబ్జంగ్ బహద్దూర్ ఆధ్వర్యంలో 21 అడుగుల ఎత్తుతో, 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రాళ్లు, డంగు సున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ నిర్మించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. కాగా, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. రెండు మండలాల్లోని 43 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా అందుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీలో ఒక ఏడాది ‘ఏ’జోన్కు, మరో ఏడాది ‘బీ’జోన్కు వంతులవారీగా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును ఐదడుగులు పెంచితే నీటినిల్వ సామర్థ్యం పెరిగి ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ డిమాండ్ను పట్టించుకునే నాథుడేలేరు. పోచారం అభయారణ్యంలో జింకల సందడి విదేశీ పక్షుల సందడి పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నదంటే విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా నైజీరియాకు చెందిన పక్షులు పెద్దసంఖ్యలో వచ్చి సందడి చేస్తాయి. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన పర్యాటకులను పక్షులు ఆకట్టుకుంటాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను బందిస్తుంటారు. అలుగులు పారే నీరు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ఎంతో శోభను సంతరించుకుంటుంది. పర్యాటకాభివృద్ధి అంతంతే.. పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పట్లో బోటింగ్ కోసం ప్రయత్నాలు జరిగినా, ముందుకు సాగలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్మించిన గెస్ట్హౌస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ముందు మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేలా టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందానికి ఆస్కారముందని జిల్లావాసులు పేర్కొంటున్నారు. వన్యప్రాణుల కోసం అభయారణ్యం... ప్రాజెక్టుకు సమీపంలో పోచారం అభయారణ్యాన్ని 1952 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కామారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ అధీనంలో ఉండగా, అభయారణ్యం నిర్వహణను మెదక్ జిల్లా అటవీ శాఖ చూసుకుంటోంది. అభయారణ్యంలో జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. సందర్శకులు వన్యప్రాణులను చూడటానికి అభయారణ్యంలో వాహనాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలోని గెస్ట్ హౌజ్ లో మందు పార్టీ
-
కామారెడ్డి జిల్లా: శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు స్థానికులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
సంతాయిపేట వద్ద వాగు అవతల చిక్కుకున్న రైతులు సురక్షితం
-
మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. ఉండడానికి చోటు లేక బిక్కుబిక్కుమంటూ..
మాచారెడ్డి(కామారెడ్డి జిల్లా): ఊహ తెలియని వయసులో ఆమె తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి కన్న తల్లే అన్నీ తానై పోషిస్తున్న సమయంలో మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురై కన్నుమూసింది. మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన కర్రోళ్ల ఎల్లయ్య, ఎల్లవ్వల ఏకైక కుమార్తె సోనికి కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మృతి చెందిన కొన్ని రోజులకే వారు నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోయింది. చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ ఉండడానికి చోటు లేక ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డిలోనే సోని ప్రస్తుతం నివసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరుగుగా ఉన్న ఆ చిన్న మరుగుదొడద్డిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది. గ్రామస్థుల సహకారంతో సోనికి వాడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించినా కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. -
తెలంగాణలో మంకీపాక్స్ కలకలం.. పుణె ల్యాబ్కు శాంపిల్స్
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన బాధితుడు.. 20 నుంచి జ్వరంతో బాధపడుతుండగా 23న దద్దుర్లు రావడంతో మంకీపాక్స్గా అనుమానిస్తున్నారు. బాధితుడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించారు. వారిని వైద్యులు ఐసోలేషన్లో ఉంచారు. పుణె ల్యాబ్కు మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తి శాంపిల్స్ పంపించారు. చదవండి: భారత్లో మంకీపాక్స్ కలకలం.. పెరుగుతున్న కేసులు ప్రస్తుతం భారత్లో సైతం మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో మరో పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కాగా, ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. -
ఆ విద్యార్థికి మూడుసార్లు పాముకాటు
పెద్దకొడప్గల్ (జుక్కల్): ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు ఒక విద్యార్థి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణకు శుక్రవారం ఉదయం పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్గల్లోని బాలుర సంక్షేమ హాస్టల్లో ఇదే విద్యార్థికి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. -
విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్కు తాకడంతో..
కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్ బేగం (32), కూతురు మాహీన్ (6), కుమారులు అద్నాన్ (3), ఫైజాన్ (2) ఉన్నారు. ఫైజాన్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్ ఫ్యూజ్ ఉంది. దానికి వైరు తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్ తెలిపారు. -
మంచి నీళ్లివ్వమంటే యాసిడ్ ఇచ్చారు
నిజామాబాద్ నాగారం: గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమంటే యాసిడ్ ఇచ్చారు. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన ఎల్.విజయ్కుమార్ దుస్తుల కొనుగోలు కోసం శనివారం కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్మాల్ వెళ్లి దుస్తులు కొన్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ దాహంగా ఉందని మంచి నీళ్లు ఇవ్వమని సిబ్బందిని కోరారు. సిబ్బంది నీళ్ల మాదిరిగానే ఉండే యాసిడ్ బాటిల్ ఇచ్చారు. విజయ్కుమార్ గొంతులోకి పోసుకోగానే తీవ్ర మంట ప్రారంభమై అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారంభించిన వైద్యులు పేషెంట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్కు తరలించారు. అంతకు ముందు షాపింగ్ మాల్ నిర్వాహకులతో విజయ్కుమార్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అది యాసిడ్ కాదంటూ అందులో పనిచేసే ఆనంద్ అనే ఉద్యోగి కొంచెం నోట్లో పోసుకోవడంతో గొంతులో మంటరేగి అతను కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
ప్రజా దర్బార్... రణరంగం
కామారెడ్డి టౌన్: టీఆర్ఎస్, బీజేపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో కామారెడ్డి జిల్లా కేంద్రం సోమవారం రణరంగంగా మారింది. అవినీతి, అక్రమాలు, కబ్జాలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పదిరోజులుగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరు పార్టీలు చర్చలకు సిద్ధమై మున్సిపల్ కార్యాలయంలో ప్రజాదర్బార్కు సోమవారం పిలుపునిచ్చారు. దీంతో ప్రజాదర్బార్కు అనుమతి లేదంటూ పోలీసులు 30యాక్టు అమలు చేసి, ఉదయం 9 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ తండ్రి నిట్టు వేణుగోపాల్రావు 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి దేవునిపల్లి స్టేషన్కు తరలించారు. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి రమణారెడ్డి, ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు, భూ కబ్జా బాధితులతో కలిసి కార్యాలయం ముందున్న మోర్ సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు, అధికారులు వచ్చి బాధితులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలెవరూ గుమిగూడొద్దని హెచ్చరించిన పోలీసులు బాధితులను పక్కకు లాక్కెళ్లారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన బీజేపీ నేతలు ర్యాలీగా పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి ధర్నా నిర్వహించారు. అక్కడా పోలీసులు, బీజేపీ నేతల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. అనంతరం.. రమణారెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు, నేతలను అరెస్టు చేసిన పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు. రెండు పార్టీల ఆందోళనతో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.