kamareddy district
-
‘రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం’
బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటాడంటూ విమర్శించారు కవిత. ఈరోజు(సోమవారం) కామారెడ్డి జిల్లా పర్యటలో భాగంగా బాన్సువాడలో ఆమె మాట్లాడారు. ‘బాన్సువాడ బీఆర్ఎస్ గడ్డ. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం ఉంటుంది. నేను, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి లాంటి వారం బాన్సువాడకు అండగా ఉంటాం. సీఎం రేవంత్ ది ఎప్పుడూ ఫ్లైట్ మోడే. అందుకే 15 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ చెప్పినట్లు వింటారు. 15 నెలలుగా జనాలు అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడతారు. క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు పండుగ బహుమతులు ఎత్తేశారు’ అంటూ విమర్శించారు.వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్ఎస్ వ్యతిరేకం‘తులం బంగారం అన్నారు.. అదీ లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. వీటిన్నంటిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.. రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. మీ పక్షాన నిలబడుతుంది.. మేము ఎప్పటికీ మీ వెంటనే ఉంటాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా., ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలే. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఆయన ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు.జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారు. అక్కడ హిందూ ముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదు. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్ చేసింది.. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు కవిత. -
ఒంటికాలితో విజయం సాధించి..
అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నా చాలా మంది ఆటలు ఆడటానికి ఆసక్తి చూపరు. కానీ ఒక కాలు లేకపోయినా ఓ యువకుడు కుస్తీ పోటీలో పాల్గొనడమే కాకుండా, విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెవరికీ తీసిపోనని క్రీడాభిమానుల సాక్షిగా నిరూపించాడు. సంకల్ప బలానికి వైకల్యం అడ్డురాదని చాటిచెప్పాడు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు దివ్యాంగ మల్లయోధుడు యు. సాయిలు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో బేడీల మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మల్లయోధులు తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నారాయణఖేడ్ పట్టణానికి చెందిన దివ్యాంగ మల్లయోధుడు (Divyang Wrestler) సాయిలు కూడా ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆయన రూ.500 కుస్తీ పోటీల్లో ఓ మల్లయోధునితో కుస్తీ పట్టి విజయం సాధించాడు. దీంతో సాయిలు పోరాటానికి మెచ్చిన ప్రేక్షకులు రూ.3 వేల వరకు విరాళాలు అందజేశారు. వివిధ విభాగాల్లో కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నగదును బహుమానంగా అందజేశారు. కట్టె కాసులు తెచ్చి పెట్టెతెల్లబంగారం (White Gold) సాగులో ఆదిలాబాద్ జిల్లాది ఆసియాలోనే ప్రథమ స్థానమని చెప్పొచ్చు. జిల్లాలో 90 శాతం మంది రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. పత్తితీత అనంతరం మిగిలిన చెట్లను గతంలో ట్రాక్టర్ల సాయంతో పెరికేసి చేలల్లోనే కాల్చేసేవారు. అయితే ఇప్పుడు పరిశ్రమల్లోని బాయిలర్లలో ఉపయోగించే బ్రికెట్లను ఈ పత్తి కట్టెతో తయారు చేస్తుండటంతో పత్తికట్టె కూడా అన్నదాతకు లాభసాటిగా మారింది. రైతులు పత్తి ఏరివేసిన అనంతరం మిగిలిన పత్తి కట్టెకు వ్యాపారులు ఎకరాకు రూ.300 చెల్లించి.. వారే ట్రాక్టర్ల ద్వారా తొలగించి జిల్లా కేంద్రంలోని ఓ పరిశ్రమకు తరలిస్తున్నారు. అక్కడ క్రష్ చేసి బ్రికెట్స్ను తయారు చేస్తున్నారు. దీంతో పత్తి కట్టె అన్నదాతకు అదనపు లాభంగా మారింది.చి‘వరి’కి పశువుల మేతగా..ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రైతుల ఆరుగాలం కష్టం పశువులకు మేతగా మారుతోంది. సాగునీరు అందక ఎండుతున్న పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు చెందిన రైతు గుగులోతు మహేశ్నాయక్.. అప్పులు చేసి ఆరు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నాలుగు బోర్లు ఎత్తిపోయాయి. మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీటిని విడుదల చేయకపోవడంతో.. సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. సాగునీటి కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చి‘వరి’కి రైతు మహేశ్నాయక్ పంట పొలాన్ని పశువులకు వదిలేశాడు. ఇలాంటి పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది.చదవండి: అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలి -
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
ఇక్కడ చికెన్ చీప్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోరోజువారీ ధరల ప్రకారం చికెన్ అమ్మకాలు సాగుతుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం మార్కెట్ రేట్ కన్నా కిలోకు రూ.30 తక్కువకు విక్రయిస్తుంటారు. ఎక్కడా కనిపించని పోటీ కామారెడ్డిలోనే ఉంటుంది. నాలుగైదేళ్ల కిందట మొదలైన పోటీ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడి దుకాణాల నిర్వాహకులు పేపర్ రేట్ కన్నా రూ.30 తక్కువ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ విక్రయాల్లో పోటీ పడుతుంటారు. ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్వింటాళ్ల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తారు. సాధారణంగా పేపర్లో వచ్చే ధరల ప్రకారమే రాష్ట్రమంతటా చికెన్ అమ్ముతారు. అక్కడక్కడా ఐదో, పదో రూపాయలు తగ్గించి అమ్ముతారు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కొందరు పేపర్ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువకు అమ్ముతుండగా, ఇంకొందరు రూ.35 నుంచి రూ.40 తక్కువ కూడా విక్రయిస్తుంటారు.గురువారం పేపర్ ధర ప్రకారం స్కిన్తో చికెన్ ధర కిలోకు రూ.181 ఉండగా, కామారెడ్డిలో రూ.150కి అమ్మారు. అంటే కిలోకు రూ.31 తక్కువగా విక్రయించారు. అలాగే స్కిన్లెస్ చికెన్ కిలో పేపర్ ధర ప్రకారం రూ.206 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి అమ్మారు. అంటే కిలోకు రూ.26 తక్కువకు అమ్మినట్లు స్పష్టమవుతోంది. లైవ్ బర్డ్ ధర కిలోకు రూ.128 ఉండగా, ఇక్కడ రూ.120కి అమ్ముతారు. మొత్తంగా ఏ దుకాణానికి వెళ్లినా మార్కెట్ ధర కన్నా తక్కువకే దొరుకుతుంది. టన్నుల కొద్దీ అమ్మకాలు.. కామారెడ్డి మార్కెట్లో నిత్యం 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చికెన్ అమ్ముతుంటారు. ఆదివారం రోజైతే 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అమ్ముడవుతోంది. వివిధ పౌల్ట్రీ సంస్థలు ఇక్కడ హోల్సేల్గా షాపులకు కోళ్లను సప్లై చేస్తాయి. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు చెందిన కోళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల మధ్యన నెలకొన్న పోటీ మూలంగా కొనుగోలుదారులకు తక్కువ ధరకు చికెన్ లభిస్తోంది. రెగ్యులర్గా చికెన్ కొనుగోలు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మరింత తక్కువ ధరలకు అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువ ధరలకు.. కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాల్లో పేపర్ ధరకే చికెన్ అమ్ముతారు. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా ఎక్కువకే అమ్ముతుంటారు. కామారెడ్డి లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక్కడ ఎక్కువ ఎందుకని ఎవరైనా వినియోగదారులు చుట్టుపక్కల మండలాల్లో వ్యాపారులను ప్రశ్నిస్తే.. అక్కడి ధర అక్కడే, ఇక్కడి ధర ఇక్కడే అని విక్రయదారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కిలో, రెండు కిలోలు తీసుకునేవాళ్లు అందుబాటులో ఉన్న దుకాణాల్లో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తారు. అదే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల కోసం ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరమైనపుడు మాత్రం కామారెడ్డిలో కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో కొంటే మరింత తక్కువ ధరకు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ఆటోలు, వ్యాన్లలో వచ్చి చికెన్ తీసుకుని వెళుతుంటారు. -
మెట్ల బావులకు పూర్వవైభవం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పూడికతో ఉనికి కోల్పోయిన మెట్ల బావులకు మహర్దశ కలిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయం వద్ద ఉన్న మెట్ల బావులకు అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో పూర్వ వైభవం చేకూరింది. దీంతో పర్యాటకులు వాటిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మెట్ల బావులు ఉనికి కోల్పోతున్న విషయమై ‘సాక్షి’ అక్షర సమరం సాగించింది. 2022 జనవరి 29న లింగంపేటలోని నాగన్న బావి ఉనికి కోల్పోతున్న వైనంపై ‘మెట్ల బావిలో నిర్లక్ష్యపు పూడిక’ శీర్షికన, తరువాత వరుసగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. నాగన్నగారి బావిని సందర్శించిన కలెక్టర్.. గ్రామస్తులతో కలిసి ముళ్ల పొదలు, చెట్లను తొలగించడంతో మొదలైన పనులు.. పూడిక తొలగించే వరకు కొనసాగింది. రెయిన్ వాటర్ ప్రాజెక్టు అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ కల్పనా రమేశ్తో మాట్లాడి.. వారి సహకారంతో దానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయ ప్రాంగణంలో మరుగున పడిన మెట్ల బావిని అద్భుతంగా తీర్చిదిద్దారు. మెట్ల బావి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిద్దరామేశ్వరా లయం దర్శనానికి వెళ్లిన వారంతా.. మెట్ల బావి కట్టడాన్ని చూసి అబ్బురపడుతున్నారు. ఫొటోలు దిగుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో రెండు మెట్ల బావులు, రాజంపేట మండల కేంద్రంలో ఒకటి, లింగంపేట మండలం శెట్పల్లి, నాగిరెడ్డిపేట మండలం మాటూరు గ్రామాల్లో మెట్ల బావులను గుర్తించి.. వాటిలో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.నాగన్నగారి బావిని సందర్శించిన ‘జూపల్లి’లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావిని గత నెలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్తో కలిసి సందర్శించారు. మెట్ల బావికి పూర్వవైభవం తేవడాన్ని అభినందించారు. పర్యాటక శాఖ ద్వారా మరింత వైభవం తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వవైభవం వచ్చింది. ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దానికి మరింత వన్నె తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా మెట్ల బావులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్ల బావులకు పూర్వవైభవం సమకూరడం పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. -
సైబర్ మోసానికి యువకుడు బలి!
-
ఆత్మహత్యలా.. హత్యలా?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/భిక్కనూరు: ఒకే సమయంలో, ఒకేచోట ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యు వకుడు చనిపోవటం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీ పేటకే చెందిన నిఖిల్ (29) అనే యువకుడి మృతదేహాలు జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్య మయ్యా యి.శృతి, నిఖిల్ మృత దేహాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు తీయగా, గురువారం ఉదయం 8.30 గంటలకు సాయికుమార్ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది. దీంతో వీరు ఎలా చనిపోయారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవి ఆత్మహత్యలా? లేక ఈ మరణాల వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది. మృతులు ముగ్గురికి చాలాకాలం నుంచి పరిచయం ఉండటంతో రకరకాల చర్చ జరుగుతోంది. అనుకోకుండా బయటపడిన ఘటన.. ఈ మూడు మరణాల ఘటన కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచాఫ్ వస్తోంద ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలపటంతో.. ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సాయికుమార్, నిఖిల్ చెప్పులు, సెల్ఫోన్లు.. శ్రుతి మొ బైల్ కనిపించాయి. ఎస్ఐ కారు కూడా చెరువు సమీపంలో ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. గజ ఈతగా ళ్లతో చెరువులో గాలించగా మరణాల మిస్టరీ బయటపడింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. 3 మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతుచిక్కని కారణాలు: ఈ ముగ్గురి మరణం వెనుక గల కారణాలు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వీరు ఎలా చనిపోయారన్నది పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. అయితే, వీరి మరణంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎస్సై సాయికుమా ర్ బీబీ పేట పోలీస్స్టేషన్లో పనిచేసిన సమయంలో శ్రుతితో సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ఇటు సాయికుమార్తో అటు శ్రుతితో క్లో జ్గా ఉండేవాడని సమాచారం. ముగ్గురూ ఒకేసారి చనిపోవ డంతో వారి మధ్య నడిచిన వ్యవహా రం ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం మండ లం కిష్టాపూర్ గ్రామం. 2018 ఎస్ఐ బ్యాచ్కు చెందిన ఆయన.. 2022 ఏప్రిల్ 13న బీబీపేటలో ఎస్ఐ గా చేరారు. గత ఏడాది ఆగస్టు 1న భిక్కనూరు ఎస్ఐగా బదిలీ అయ్యారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో 2021 నుంచి పనిచేస్తోంది. బీబీపేటకు చెందిన తోట నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూనే, కంప్యూటర్ల రిపేర్లు చేసేవాడు. పోలీస్స్టేషన్లో కంప్యూటర్లు మొరాయించినపుడు అతడే వచ్చి రిపేర్ చేసి వెళ్లేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కలిసి చనిపోయేదాకా ఎందుకు వచ్చిందన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నా కొడుకు పిరికివాడు కాదు: పోస్ట్మార్టం నిర్వహించిన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు మృతులకు టుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకొని బోరున విలపించారు. తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎస్ఐ సాయికుమార్ తండ్రి అంజయ్యకన్నీరుమున్నీరయ్యాడు. ఎవ రో ఒకరిని కాపాడే ప్ర యత్నంలో చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశా రు. శ్రుతి తండ్రి పుండరీకం మాట్లా డుతూ.. ఈ ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు తేల్చాలని కోరారు. నిఖిల్ చనిపోయిన విషయం పోలీసు లు చెబితే తెలిసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువులో టాపర్ఎస్ఐ సాయికుమార్ చిన్నతనం నుంచి చదువు లో టాపర్. 2007–2008లో పదో తరగతిలో మండల టాపర్గా నిలిచాడు. ఇంటర్లోనూ మంచి మార్కులు సాధించారు. హైదారాబాద్లోని సీబీఐటీలో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. 2018లో పోస్టల్ డిపార్టుమెంట్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఎస్సైగా మొదటి పోస్టింగ్ సాధించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, భిక్కనూరులో ఎస్సైగా చేశాడు. రెండు పర్యాయాలు ఎస్పీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తెలిసింది. -
కామారెడ్డి జిల్లాలో ముగ్గురి అదృశ్యం విషాదాంతం
-
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం
-
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
పప్పుల అంగడి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఆచార వ్యవహారాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇక్కడ శాకాహారులే ఉంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. అందుకే దీన్ని త్రిభాషా సంగమం అని అంటుంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్దకొడప్గల్, డోంగ్లీ, బిచ్కుంద, నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పలుచోట్ల అంగళ్లు (వారసంతలు) జరుగుతాయి. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం, జుక్కల్లో గురువారం, పి ట్లంలో శుక్రవారం, మద్నూర్లో సోమవారం, డోంగ్లీ, మేనూర్లో శుక్రవారం అంగళ్లు జరుగుతాయి. ఆ ప్రాంత ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, బట్టలు, వంట పాత్రలు.. ఏవైనా సరే అంగడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పేద, మధ్య తరగతి వర్గాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం అంగళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పప్పులు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న రైతులు వారు పండించిన పప్పుదినుసులను అంగళ్లలో అమ్ముతారు. పెసర, కంది, మినుము, శనగ, ఎర్రపప్పులతో పాటు జొన్నలు, గోధుమలు, ఆవాలు కూడా విక్రయిస్తారు. పొట్టు పప్పునకు భలే డిమాండ్ సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత పప్పు దినుసులు ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వస్తాయి. ఆ సమయంలో ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఆయా అంగళ్లకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. దుకాణాల్లో మరపట్టిన, పాలిష్ చేసినవి అమ్ముతుంటే అంగళ్లలో మాత్రం రైతులు నేచురల్ గా పండించిన పప్పుదినుసులు దంచి పొట్టుతో అమ్ముతుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. క్వింటాళ్ల కొద్దీ పప్పులు అమ్ముడు పోతాయని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా పప్పులకు కొరత రావచ్చు గానీ, జుక్కల్ ప్రాంతంలో మాత్రం ఏనాడూ పప్పుదినుసులకు కొరత ఏర్పడదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడే ఎక్కువగా పప్పుదినుసులు పండిస్తారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో కూడా పప్పుదినుసులు సాగుచేస్తారు. జొన్నలు, గోధుమలు కూడా విక్రయిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా.. జుక్కల్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద అంగళ్లకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్, హనేగావ్ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటకలోని ఔరద్ ప్రాంతానికి చెందిన వారు కూడా పప్పులు అమ్మడానికి వస్తుంటారు. అలాగే అంగళ్లలో పప్పులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రజలు రావడం విశేషం. జుక్కల్ అంగడికి జుక్కల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. మద్నూర్, మేనూర్లో జరిగే అంగళ్లకు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్రలోని దేగ్లూర్ తాలూకాలోని గ్రామాల ప్రజలు వస్తారు. బిచ్కుంద అంగడికి బిచ్కుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. పిట్లం మండల కేంద్రంలో జరిగే అంగడికి పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కంగి్ట, కల్హేర్ మండలాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తారు.రెండు తరాలుగా ఇదే దందా మా కుటుంబం రెండు తరాలుగా పప్పులు, జొన్నలు పిట్లం అంగడిలో అమ్ముతున్నం. మా నాయిన అమ్మేవారు. తర్వాత నేనూ పదేళ్లుగా పప్పులు, జొన్నలు అమ్ముతున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పప్పులు, జొన్నలు కొంటారు. – రంజిత్, తిమ్మానగర్ (విక్రయదారుడు) పిట్లం అంగడిలోనే కొంటాను పిట్లం అంగడిలో ఏళ్ల నుంచి పప్పులు కొనుగోలు చేస్తున్నాం. తక్కువ ధరకు దొరుకుతాయి. పప్పులతో పాటు జొన్నలు కూడా అమ్ముతారు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లుగా పిట్లం అంగడిలో కొన్నవే తింటున్నాం. – రాజు, ఎల్లారెడ్డి (కొనుగోలుదారుడు)నాణ్యమైన పప్పులు దొరుకుతాయి పిట్లంకు మా ఊరు దగ్గరగా ఉంటుంది. వారం వారం అంగడికి ఇక్కడికే వచ్చి అవసరం ఉన్నవి కొనుగోలు చేస్తాం. పప్పులు ప్రతిసారీ పిట్లం అంగడిలోనే కొంటాం. ఇక్కడ నాణ్యమైనవి దొరుకుతాయి. – రాజేశ్వర్, తాడ్కోల్, సంగారెడ్డి జిల్లా (కొనుగోలుదారుడు) -
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్దేవ్పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
రాళ్లూ.. చిగురిస్తాయి..!
రాతి నేలల్లో సిరుల పంటలు పండుతున్నాయి. నాగళ్లకు ఎదురుతిరిగే రాతి నేలలవి. అలాంటి నేలల్లో సాగు చేయడం అంత తేలిక పని కాదు. రాతి నేలలకు పచ్చదనం అద్దిన రైతులు పడినది మామూలు కష్టం కాదు. మూడు తరాల రైతుల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు బోసిగా కనిపించిన రాతినేలలు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రైతులు కొండ ప్రాంతాల్లోని రాతినేలల్లో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రాతినేలల్లో చెమటను, నెత్తుటిని చిందించి మరీ వారు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం గురించి తెలుసుకుందాం...విత్తనాలు వేసేటప్పుడు రాళ్లల్లో నడుస్తుంటే, అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటాయి. రాళ్లల్లో మొలకెత్తిన కలుపు తీస్తుంటే, చేతులు చీరుకుపోయి నెత్తురు చిమ్ముతుంది. అయినా, వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సాగు చేస్తారు. తాతల కాలం నుంచి వారు ఇదే పని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి, లింగంపేట, తాడ్వాయి, జుక్కల్, పెద్దకొడప్గల్, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.ఈ జిల్లాలో 5.26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే, వాటిలో దాదాపు పదిశాతం రాతినేలలే! వీటినే నమ్ముకుని వేలాది రైతులు మూడు తరాలుగా సాగు చేస్తున్నారు. ఇదివరకటి కాలంలో నాగళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నాగళ్లతో దున్నేటప్పుడు ఎడ్ల కాళ్లకు గాయాలయ్యేవి. ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాక, పని కొంచెం సులువైనా, ఖర్చులు బాగా పెరిగాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఏటా రాళ్లు తీసి కుప్పలుగా పోస్తున్నా, తవ్వే కొద్ది రాళ్లు వస్తూనే ఉంటాయని, రాళ్ల మధ్యనే సేద్యం చేయడం తమకు అలవాటైపోయిందని ఈ రైతులు చెబుతారు.వర్షాధార వ్యవసాయం..ఈ రాతినేలల్లో వేసే పంటలకు వర్షాలే ఆధారం. మంచి వర్షాలు కురిసినప్పుడు అధిక దిగుబడులు వస్తాయి. వర్షాలు సరిగా కురవకపోయినా, అకాల వర్షాలు కురిసినా రైతులకు నష్టాలు తప్పవు. వర్షాధార పరిస్థితుల వల్ల ఇక్కడి రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈ రాతి నేలల్లో పత్తి, మొక్కజొన్న, సోయా పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అక్కడక్కడా వరి కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటలను అడవి జంతువుల దాడి నుంచి కాపాడుకోవడం రైతులకు పెనుసవాలు.పొలాల్లోకి అడవి జంతువులు చొరబడకుండా ఉండేందుకు కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు పొలాల చుట్టూ ఇనుప తీగెలు కట్టి, రాత్రివేళల్లో పొలాలకు కాపలా ఉంటున్నారు. రాళ్లతో కూడుకున్నవన్నీ నల్లరేగడి నేలలు కావడంతో ఇక్కడ పంటల దిగుబడి ఆశాజనకంగానే ఉంటుంది. రాళ్ల మధ్య తేమ వారం రోజుల వరకు అలాగే ఉంటుంది. వారం రోజుల తర్వాత వర్షం కురిస్తే పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు. రాతినేలలు ఉన్న ప్రాంతాలు సాధారణంగా వర్షాలకు అనుకూలంగానే ఉంటాయి. తగిన వానలు కురవకపోవడం వల్ల పంటల దిగుబడులు తగ్గిన సందర్భాలు ఈ ప్రాంతంలో అరుదుగానే ఉంటాయి.మూడు తరాల వాళ్లం కష్టపడ్డాం..మా తాత మందిరానాయక్, మా నాయిన నంగరాజ్, తరువాత నేను మూడు తరాల వాళ్లం రాళ్లను ఏరి చుట్టూ కంచె వేశాం. మూడెకరాల భూమిని రాళ్లు లేని భూమిగా తయారు చేసి, వరి పంట పండిస్తున్నం. వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా బావినీళ్లతో పంట పండుతుంది. ఇక్కడ బోర్లు వేస్తే పడవు. మూడు తరాల కష్టానికి మూడెకరాల వరి పొలం తయారైంది. – దేవిసింగ్, చద్మల్ తండాచేతులు పగిలి మంట పెడుతుంది..కలుపు తీస్తుంటే అరచేతికి, వేళ్లకు రాళ్లు గుచ్చుకుని రక్తం కారుతది. మంట పెడుతున్నా కష్టపడుతున్నం. రాళ్లు ఎంత ఏరినా తగ్గిపోవు. అందుకే ఉన్న రాళ్లల్లోనే పంట వేస్తున్నం. కాలం మంచిగ అయితే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటికైతే మా దిక్కు వానలు మంచిగనే పడ్డయి. ముందు ఇట్లనే ఉంటే బాగుంటుంది. – సురేఖ, బూర్గుల్ తండాఅరికాళ్లకు అన్నీ గాయాలే..మాకు నాలుగెకరాల భూమి ఉంది. ట్రాక్టర్తో దున్నించి మొక్కజొన్న పంట వేస్తుంటం. విత్తనం వేసినపుడు, కలుపు తీసినపుడు రాళ్లు గుచ్చుకుని అరికాళ్లు నొప్పిగా తయారై ఇబ్బంది పడుతుంటం. వాన పడితే పంట మంచిగనే వస్తది. వానలు కింద మీద అయితే రెక్కల కష్టం పోతది. దేవుని మీద భారం వేసి పంటలు వేస్తున్నం. – పారిబాయి, గుర్జాల్ తండాతాతల కాలం నుంచి ఇదే కష్టం..మాకు 1957లో పట్టాలు వచ్చినయి. అప్పటి నుంచి మా తాతలు, తరువాత మా తండ్రులు, ఇప్పుడు మేం రాళ్లల్లనే పంటలు వేస్తున్నం. మూడు ఎకరాల్లో పత్తి వేసినం. విత్తనం వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా అవస్థలు పడాల్సిందే! సమయానికి వాన పడితే పంటకు ఇబ్బంది ఉండదు. రోగాలు వచ్చినపుడు మందులు కొడుతుంటం. – ప్రేమ్సింగ్, గుర్జాల్ తండాఐదెకరాలూ రాళ్ల భూమే!నేను ఇంజినీరింగ్ చదివి ఇంటి వద్దే వ్యవసాయం చూసుకుంటున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. అది కూడా రాళ్ల భూమే! వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వేశాం. కొద్దిగా వరి కూడా పండిస్తున్నాం. మా ఊరి శివారే కాదు చుట్టుపక్కల ఊళ్లన్నీ రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములే ఉన్నయి. రాళ్ల భూములే అయినా కష్టపడుతున్నం. – ధన్రాజ్, గుర్జాల్ తండాఖర్చు ఎక్కువ..రాళ్ల భూములల్ల దున్నడానికి ట్రాక్టర్కు ఎక్కువ టైం తీసుకుంటది. అట్లనే కిరాయ కూడా ఎక్కువ అడుగుతరు. గంటలకు రూ.8 వందల నుంచి రూ.9 వందలు తీసుకుంటరు. దున్నడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఖర్చు ఎక్కువవుతుంది. కలుపు ఇంటోళ్లమే తీసుకుంటున్నం. రాళ్లు తగిలి కాళ్లకు గాయాలైతున్నా భరిస్తం. – రవి, బూర్గుల్ తండాకాలం కలిసొస్తే మంచి దిగుబడులు..పంటకు అనుకూలంగా మంచి వర్షాలు కురిస్తే చాలు, మంచి దిగుబడులు వస్తాయి. రైతుల రెక్కల కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్నిచోట్ల ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. రాతినేలల్లో ఈ స్థాయి దిగుబడులు రావడం విశేషమే! సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించకుంటే, ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వస్తాయి. అయితే, ఈ రాతి నేలలను దున్నడంలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేలలను దున్నడానికి ట్రాక్టర్ యజమానులు ఆసక్తి చూపరు. సాధారణమైన సాగునేలలను దున్నడానికి గంటకు ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు.ఈ రాతినేలలను దున్నడానికి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు. సాధారణ పొలాల్లో ఎకరం దున్నడానికి గంట నుంచి గంటన్నర సమయం సరిపోతుంది. రాతి నేలలు దున్నడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఈ పరిస్థితి వల్ల దుక్కి దున్నడానికే రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేలల్లో కలుపు తీయడానికి కూలీలు దొరకరు. ఇక్కడ కలుపు తీస్తే చేతులకు గాయాలు తప్పవు. కూలీల కొరత వల్ల చాలా పొలాల్లో రైతుల కుటుంబ సభ్యులే కలుపు తీస్తుంటారు. ఇంతటి కఠోర శ్రమకు ఓరుస్తూనే ఈ రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. – ఎస్.వేణుగోపాల చారి, సాక్షిప్రతినిధి, కామారెడ్డిఇవి చదవండి: కాలనీలో థ్రిల్ -
శిశు విక్రయ ఘటన.. కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్
సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం. -
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
నాలుగడుగుల లోతుల్లోనే నీరు
సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. బావులు ఎన్నడూ ఎండిపోలేదు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. –ఆల నారాయణ, ఉప్పల్వాయి అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం... మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు. – సుతారి మహేశ్వరి, ఉప్పల్వాయి మా తాత తవ్వించిన బావి... మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం. –శంకర్గౌడ్, ఉప్పల్వాయి -
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పెట్టుబడిదారుల పార్టీకి..పేదల కన్నీళ్లు పట్టవు
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. రూపాయి విలువ భారీగా పడిపోయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. బీజేపీ దోపిడీదారులు, పెట్టుబడిదారులకే కొమ్ముకాసే పార్టీ. దాని ఎజెండాలో పేదల కష్టాలు, కన్నీళ్లు ఉండవు..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేసీఆర్ రోడ్షో నిర్వహించారు. జయప్రకాశ్ నారాయణ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగులో ప్రసంగించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో కూడా మాట్లాడారు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చే దిన్ వచ్చినయ్ ‘ప్రధాని నరేంద్ర మోదీ వట్టి గ్యాస్ మాటలు చెబుతాడు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’అని చెప్పి సత్తె నాశనం చేశాడు. ఎగుమతులు బందయి, దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ పడావో..బేటీ బచావో, జన్ధన్ యోజన ఇవేవీ దేశానికి ఉపయోగపడలేదు. 150 వాగ్దానాలు చేసిండ్రు. అవేవీ ప్రజలను ఆదుకోలేదు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చేదిన్ వనయ్. పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు.అంతటా రూ.15 లక్షలు ఇస్తామన్నారు? కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు ఇక్కడ రూ.30 లక్షలు ఇచి్చండ్రా? (లేదంటూ సభికులు కేకలు పెట్టారు) రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎక్కడా రైతులకు మేలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రంటూ మోదీ ప్రతిసారీ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కాడు. పేదలకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయడమే దండుగ. ఆ పారీ్టకి 400 సీట్లు రానేరావు. మళ్లీ మోదీ ప్రధాని అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 దాటిపోతాయి..’ అని కేసీఆర్ అన్నారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు ‘ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అసమర్థులు, పరిపాలన సాగించలేని తెలివితక్కువ వాళ్ల చేతుల్లోకి వెళ్లి ఐదు నెలల్లోనే ఆగమైంది. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తనంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఈ నెల 9 లోపు రైతుబంధు వేస్తా అన్న ముఖ్యమంత్రి తనే కుట్ర చేసి ఆపించాడు.ఐదెకరాలకు ఇస్త అంటడు. ఆరెకరాలు, ఏడెకరాల రైతులకు ఎందుకు ఇవ్వడు? తొమ్మిదేళ్లు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగనే కరెంటుకు ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ వన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదు? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? ఫీజు రీయింబర్స్మెంటు చేయడం లేదు, 125 గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి..’అని మాజీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.అలాగైతే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి?‘రేవంత్రెడ్డి ఒట్లు పెట్టుకోవడం, కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు రాజ్యమేలితే ఇలాగే ఉంటుంది. కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కారు.. గోదావరి నదిని తమిళనాడుకు అప్పగిస్తోంది. ఉన్న ఒక్క గోదావరి నదీ జలాలు తమిళనాడుకు వెళితే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి? మేం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే వాటిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఉద్యమాల్లో రాటుదేలిన, చైతన్యవంతమైన కామారెడ్డి, మెదక్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.పార్లమెంటు ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో మనం గెలిస్తే రాష్ట్రం మెడలు వంచి హామీలు అమలు చేయించుకుందాం. కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 12, 13 స్థానాలు గెలిస్తే మనమే కీలకంగా మారతాం. కామారెడ్డితో పాటు ఇతర జిల్లాలు పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మన నదీ జలాలు మనకు రావాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మన అభ్యర్థులను గెలిపించాలి..’అని బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో మాజీ మంత్రి టి.హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, మెదక్, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్ రెడ్డి, గాలి అనిల్కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు పకోడీలు తినిపించిన కేసీఆర్ ఇందల్వాయి ( నిజామాబాద్ రూరల్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం చిన్న పిల్లలు, రైతులతో కాస్త సరదాగా గడిపారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళుతూ 44వ నంబరు జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగారు. అక్కడి హోటల్లో ఉల్లిగడ్డ పకోడి తిని టీ తాగారు. అక్కడ ఉన్న చిన్నారులకు పకోడీలు తినిపించారు. తనను కలిసేందుకు వన రైతులకు ఇచ్చారు. మరోవైపు హోటల్ వద్ద ఆగిన ప్రయాణికులు, చిన్నారులు కేసీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారందరితో కేసీఆర్ సరదాగా సంభాíÙంచారు. హోటల్ యజమాని వెంకట రమణయ్యతోనూ ముచ్చటించారు. -
కామారెడ్డి జిల్లాలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న కారు
-
పాస్పోర్టు ఈ సేవాకేంద్రంలో అగ్నిప్రమాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్పోర్టు ఈ సేవాకేంద్రంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోస్టల్ అధికారులకు, ఫైర్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సామగ్రితోపాటు కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాట రీలు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గది పక్కనే పోస్టల్ శాఖ ఉత్తరాల గది ఉండటంతో హుటాహుటిన సిబ్బంది ఆ ఉత్తరాల సంచులను బయటకు తీసుకువచ్చి ఎదురుగా ఉన్న ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. పాస్పోర్టు ఈ సేవాకేంద్రంలో మాత్రం అంతా అగ్నికి ఆహుతైంది. పాస్పోర్టులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదై ఉంటాయని, ఫైళ్లు ఎప్పటికప్పుడు తరలిస్తామని, ఎలాంటి డేటా, ముఖ్యమైన ఫైళ్లు నష్టపోలేదని, ఫరి్నచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని పోస్టల్ శాఖ అధికారి రాజు తెలిపారు. 26 నుంచి కామారెడ్డి పీవోపీఎస్కేలో కార్యకలాపాలు నిలిపివేత రాంగోపాల్పేట్ (హైదరాబాద్): కామారెడ్డిలోని పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రంలో నిర్వహణ కారణాలతో ఈ నెల 26 నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి జె. స్నేహజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26 నుంచి అపా యింట్మెంట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వాటిని రీ షెడ్యూల్డ్ చేసుకునే ఆప్షన్లను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు. -
పల్లె కడుపున రాచపుండు!
సాక్షి, కామారెడ్డి: కేన్సర్ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్ తో అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. వరుసగా మరణాలతో కలవరం మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) కేన్సర్తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్ కేన్సర్తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. గ్రామస్తుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్ కేన్సర్ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కడుపులో కేన్సర్ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా కేన్సర్పై అవగాహన కల్పిస్తున్నాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వో, కామారెడ్డి -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
షాపింగ్ మాల్ బుగ్గి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాజ్టాకీస్ రోడ్లోని అయ్యప్ప షాపింగ్ మాల్లో రాత్రి 11.20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన నైట్ వాచ్మన్ మాల్ యజమానికి, ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించేలోపే భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి, గాంధారి, ఇందల్వాయి, రామాయంపేట, నిజామాబాద్ల నుంచి ఆరు ఫైర్ ఇంజన్లను, 50 మంది సిబ్బందిని రప్పించారు. భవనం నాలుగు అంతస్తుల్లో ఉండటంతో హైదరాబాద్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్విసెస్ విభాగం నుంచి భారీ స్కై లిఫ్ట్ను తెప్పించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో పాటు స్కైలిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు 50 ట్యాంకర్ల నీటిని తీసుకు వచ్చి మంటలను ఆర్పారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయితే మాల్లోని దుకాణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. -
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్లోని గోషామహల్, మలక్పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్గా నిలుస్తోందన్నారు. ధూల్పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
‘కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’
సాక్షి, కామారెడ్డి జిల్లా: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై హోంమంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ముందు రేవంత్రెడ్డి ఓ బచ్చా అని.. చిన్న పిల్లాడు అంటూ విమర్శించారు. రేవంత్రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి అని, కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ దేశంలోనే తెలంగాణ నంబర్వన్ రాష్ట్రం.. నంబర్వన్ సీఎం కేసీఆర్.కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు. రేవంత్ రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు.కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?, సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. మైనార్టీ సంక్షేమం కేవలం తెలంగాణలోనే అయింది. మైనార్టీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యం. కామారెడ్డిలో కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
చూసుకుందాం.. దమ్ముంటే రా
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తడని అనంగనే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయి. జబ్బలు చరిచినోళ్లు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే కామారెడ్డి తెలంగాణ ఉద్యమాల గడ్డ. షబ్బీర్ అలీ అసోంటోళ్లు పోటీ నుంచి తప్పుకున్నరు. ఇగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి వస్తడట. రేవంత్రెడ్డి.. దమ్ముంటే రా చూసుకుందాం. డిపాజిట్ కూడా దక్కనీయం. చిత్తుచిత్తుగా ఓడిస్తం. పోరాటాల గడ్డ మీద తెలంగాణ ద్రోహులకు స్థానం లేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ పోటీ చేస్తున్నడని తెలవంగనే కొందరు నాయకులు పోటీ నుంచి తప్పుకున్నరు. షబ్బీర్ అలీ పోటీ చేయనని పక్కన కూసున్నట్టు మీడియాలో చూసిన. కేసీఆర్ మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు మేకపోతును బలిచ్చినట్టే. గ్రామగ్రామాన ప్రజలే ఏకగ్రీవంగా కేసీఆర్కు మద్దతు ఇస్తున్నరు. పోటీ ఏకపక్షమే’అని పేర్కొన్నారు. కామారెడ్డికి గోదావరి తెస్తాం ‘పుట్టుక నుంచి చావు వరకు కేసీఆర్ పథకాలు ఇంటింటికీ చేరినయి అంటూ బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు వస్తది, ఏదేని పరిస్థితుల్లో ప్రాణాలు పోతే కేసీఆర్బీమాతో ఆదుకుంటాం’అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయన్నారు. కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ‘కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఎవరు చూసుకుంటరని కొందరు అంటున్నరు. ఇక్కడ ప్రత్యేక అధికారిని పెడతం. ఆయన పర్యవేక్షణలో అన్నీ జరుగుతయి. ఈ ప్రాంతానికి చెందిన ఆర్డీవో ముత్యంరెడ్డి గజ్వేల్లో ప్రత్యేకాధికారిగా పనిచేసి అక్కడి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అవసరమైతే ఆయన్నే ఇక్కడ పెట్టుకుని పాలన సాగించుకుంటాం. నాది పక్క నియోజక వర్గం సిరిసిల్ల.. నేను వారం, పదిరోజులకోసారి వస్తూపోతూనే ఉంట. ఇక మీదట కామారెడ్డిలో ఆగుత. ఇక్కడి ప్రజల కష్టాలను నేనే తీరుస్తా’అని కేటీఆర్ అన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి, విప్ గంప గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చూస్తారని తెలిపారు. గంప గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించారని, ఇంకా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలా అభివృద్ధి జరగాలంటే సీఎం పోటీ చేయాలని గంప గోవర్ధన్ సీఎంను కోరడంతో పోటీకి సిద్ధమయ్యాడన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ విజయం సాధిస్తారని, ఇక్కడ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా? కాంగ్రెస్కు 11 సార్లు అధికారం ఇస్తే వాళ్లు చేసిందేమి లేదని, ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మాలని కేటీఆర్ ప్రశ్నించారు.70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తున్నరా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారని, వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా అని అన్నారు. సభలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తాం.... కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త చంద్రశేఖర్రెడ్డి సస్పెన్షన్పై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డిపై దౌర్జన్యం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తప్పుడు పనులు చేసేవారిని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని క్షమించేది లేదన్నారు. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో?
అసెంబ్లీలో స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించినవారు ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనిని బలపరుస్తూ గతంలో పనిచేసిన స్పీకర్లు ఓడిన ఉదంతాలున్నాయి. 1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటివరకు ఎవరూ గెలుపును సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ను తిరగరాస్తానన్న ధీమాలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. వయసు పైబడుతుండటంతో ఈసారి పోటీ నుంచి తప్పుకొని కుమారుడిని వారసునిగా నిలబెట్టాలని అనుకున్నా సీఎం మాత్రం తాను ఉన్నన్ని రోజులు శీనన్న ఉంటారని పేర్కొనడంతో ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తుంటారు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లోనూ ఆయనను అలాగే గౌరవిస్తారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుబంధు పథకం ప్రారంభించారు. రూ. వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, అందుకే శీనన్న లక్ష్మీపుత్రుడు అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ...: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం... 2004 మినహా 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన నిత్యం జనం మధ్యే తిరుగుతుంటారు. వేకువజామునే లేచి బ్యాటరీ వాహనంలో ఊరంతా కలియ తిరుగుతారు. మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు శుభ్రం చేస్తుంటే నిలబడి వారికి సూచనలు ఇస్తారు. ఇంటికి చేరగానే ఊళ్ల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ నేతలతో మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని లెక్కలతో సహా చెబుతారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ది దారులకు అందించారు. విద్య, వైద్య రంగంలోనూ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపారు. బాన్సువాడలోని మాతాశిశు ఆస్పత్రి సేవల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. సెంటిమెంట్ ఏం చేస్తుందో? స్పీకర్ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతూ రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సెంటిమెంట్ను పోచారం అధిగమిస్తారని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం చరిత్రను తిరగరాస్తారంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. రంగుల పోషాలు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మోస్రాలో ఉంటున్న చెల్లెలు పోషవ్వ.. అన్న మరణవార్త విని కన్నీటి పర్యంతమై గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెను సవాల్ విసురుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. విద్యార్థుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతున్నారు. చదవండి: పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు.. -
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ...
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఘన విజయం సాదిస్తే ఎల్లారెడ్డిలో మాత్రం టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోవడం విశేషం. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ 35148 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సురేందర్కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి టి.బాలరాజుకు 9600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేందర్ తొలిసారి గెలు పొందారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇ.రవీంద్ర రెడ్డి నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 2004లో టీఆర్ఎస్ పక్షాన గెలిచి, ఉద్యమంలో బాగంగా 2008లో పార్టీ ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాన ఓటమి చెందారు. ఆ తర్వాత 2009లో తిరిగి గెలిచారు. మళ్లీ ఉద్యమంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. 2014 సాదారణ ఎన్నికలలో కూడా గెలుపొందినా, 2018లో ఓటమి చెందారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బిసిలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరు కాపు వర్గం వారు కాగా, ఇద్దరు గౌడ వర్గం వారు. మూడుసార్లు ఎస్. సిలు ప్రాతినిధ్యం వహించారు. 1983 తరువాత ఒకే ఒక ఉప ఎన్నికలో 2018లో కాంగ్రెస్ ఐ గెలిచింది. మిగిలిన అన్నిసార్లు టిడిపి, టిఆర్ఎస్లు విజయం సాధించాయి. టిఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటే, 2009లో టిడిపికి మిత్రపక్షం అయింది. 2014 నుంచి ఒంటరిగానే పోటీచేస్తోంది. ప్రముఖ దళితనేత టి.ఎన్.సదాలక్ష్మి ఒకసారి ఇక్కడ, మరోసారి కామారెడ్డిలో గెలిచారు. ఎల్లారెడ్డిలో రెండుసార్లు విజయం సాధించిన జె.ఈశ్వరీబాయి, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లీ, కూతుళ్లు, 1978లో ఇక్కడ గెలిచిన బాలాగౌడ్ కొంత కాలం జడ్పి ఛైర్మన్గా, నిజామాబాద్ ఎమ్.పిగా కూడా పనిచేశారు. ఇక్కడ గెలిచినవారిలో టిఎన్ సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, బాలాగౌడ్ 1981 తరువాత అంజయ్య, భవనం క్యాబినెట్లలో ఉన్నారు. నేరెళ్ల ఆంజనేయులు కొద్దికాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఎల్లారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్షాక్కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి
అయిదంతస్తులు.. వంద అడుగుల లోతు.. కాకతీయుల కాలం నాటి కళాత్మక నిర్మాణమిది. శిథిలమైపోతున్న ఒక పురాతన బావి నేపథ్యమిది. పాలకుల ఆదరణకు నోచక..శిథిలమైపోతున్న ఈ బావి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్ర శివారులో ఉంది. సుమారు 18వ శతాబ్దంలో నిర్మితమైన ఈ బావి అడుగు నుంచిపైభాగంవరకునాలుగు వైపులా ఒకే రకమైన మెట్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి 20 అడుగుల వరకు ఒక్కొక్క అంతస్తు చొప్పున అయిదు అంతస్తుల మెట్లు ఉన్నాయి. మెట్ల బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పునరుద్ధరణ కోసం పురావస్తు శాఖ ముందుకొచ్ఛినా.. నిధుల కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సికింద్రాబాద్లోని బన్సీలాల్ మెట్ల బావి తరహాలోనే.. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని బాగు చేయాలని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
నేడు కామారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.40 గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిమ్మాపూర్కు చేరుకొని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటే శ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యా హ్నం 1.30 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ధర్మకర్తగా ఉన్న తెలంగాణ తిరుమల ఆలయాన్ని 2016 ఏప్రిల్ 2న సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. -
ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు
కామారెడ్డి టౌన్: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకున్నారు. కళ్లద్దాల పెట్టె అందిస్తే ఆనందంగా అందుకున్నారు.. తీరా దాన్ని తెరిచి చూస్తే ఖాళీగా కనిపించడంతో అవాక్కవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన దూడ బీరయ్య కంటి వెలుగు కార్యక్రమంలో తనిఖీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు వైద్య సిబ్బంది కళ్లద్దాల పెట్టె అందజేశారు. కానీ పెట్టె తెరిచాక అందులో కళ్లద్దాలు లేకపోవడంతో బీరయ్య, అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విస్తుపోయారు. మళ్లీ వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్ చేస్తామని తెలిపారు. చాలాచోట్ల ఇలాగే జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. -
బాన్సువాడ ఎంసీహెచ్కు జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ)‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1)‘లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్ను పలుమార్లు సందర్శించింది. అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధా రించుకొని అక్రెడిటేషన్ మంజూరు చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆసుపత్రులకే బీఎఫ్హెచ్ఐ అక్రెడిటేషన్ ఉంది. దీంతో భారత దేశ స్థాయిలో ఘనత సాధించిన ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సీఎం ఆదేశాలతో .. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్‘ను నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. వైద్య సిబ్బందికి అభినందనలు: హరీశ్రావు బాన్సువాడ ఎంసీహెచ్కు బీఎఫ్హెచ్ఐ అక్రెడిటే షన్ రావడం హర్షణీయమని హరీశ్రావు పేర్కొ న్నారు. హాస్పిటల్ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. -
‘కొత్తపల్లె’ కరెంటు బిల్లు.. రూ. 11.41 కోట్లు!
మాచారెడ్డి: ఇటీవల పంచాయతీల పునర్విభజనలో కొత్త పంచాయతీగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె పంచాయతి భవనానికి రూ. కోట్లలో వచ్చిన కరెంటు బిల్లును చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. పంచాయతీ వాటర్ వర్క్స్కు సంబంధించిన సర్వీస్ నంబర్ 3801–02321పై ఈనెల 3న ట్రాన్స్కో బిల్లింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేశారు. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 3 వరకు 1,88,15,257 యూనిట్లు వాడినట్టు పేర్కొన్నారు. దీనికి ఏకంగా రూ. 11,41,63,672 బిల్లు విధించారు. ఏసీడీ డ్యూ కింద మరో రూ.8,716 వడ్డించారు. ఈనెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది షాక్కు గురయ్యారు. గతనెల విద్యుత్ బిల్లు రూ.3,257 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సాంకేతిక సమస్యతో బిల్లు ఇలా వచ్చిందని చెప్పారు. -
‘అమ్మా’రావం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇలా అంతా కోరుకున్న రీతిలో వస్తున్న ఆవు దూడలు పాడి రంగంలో కొత్త క్షీర విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. స్వదేశీ ఆవుల సంఖ్యను పెంచడం.. అలాగే అధికంగా పాలిచ్చే జాతి ఆవులను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీన్ని తెలంగాణ, ఆంధ్రపదేశ్తోపాటు మరో పది రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టింది. ఇందులోభాగంగా కామారెడ్డి జిల్లా తిప్పాపూర్, ఎర్రపహాడ్, కొండాపూర్, చిన్నమల్లారెడ్డి, లింగంపల్లి, ఎల్లంపేట, మోతె, కొయ్యగుట్ట, మహ్మదాపూర్, కరత్పల్లి పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన 160 ఆవుల్లో లింగ నిర్ధారణ చేసి సాహివాల్, గిర్ తదితర స్వదేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే హెచ్ఎఫ్, జెర్సీ కోడెల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. ఇందులో ఇప్పటివరకు 134 ఆవులు గర్భం దాల్చి 126 (94 శాతం) ఆడ దూడలు, 8 కోడె దూడలకు జన్మనిచ్చాయి. దీంతో రైతులు స్వదేశీ గిర్, సాహివాల్ ఆడ దూడలతోపాటు అధిక పాలనిచ్చే ఆవులకు యజమానులయ్యారు. లక్షలు పోసినా దొరకని స్వదేశీ, విదేశీ ఆవుజాతులు ఇప్పుడు తమ పంటపొలాల్లో పరుగెడుతుండటంతో సంబరపడిపోతున్నారు. ‘స్వదేశీ ఆవును పెంచుకోవాలన్నది నా జీవితాశయం. ఎవరి వద్దనైనా కొందామంటే ధర.. రూ.లక్షల్లో చెబుతున్నారు. అంత సొమ్ము భరించే స్తోమత లేదు. నా కల ఇక నెరవేరదు అనుకున్నా..! కానీ ఓ రోజు కేంద్ర పశుసంవర్థక శాఖ వారు మా ఊరిలో క్యాంప్ పెట్టి.. నా వద్ద ఉన్న విదేశీ జాతి హెచ్ఎఫ్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో కోరుకున్న స్వదేశీ ఆవు దూడ పుట్టేలా ఉచితంగా చేస్తామన్నారు. అందులో ఆడ–మగ.. ఏది కోరుకుంటే అదే పడుతుందన్నారు. నాకు సాహివాల్ రకం ఆడ దూడ కావాలని అడిగాను. నా దగ్గర ఉన్న ఆవు గర్భంలో లింగ నిర్ధారణ వీర్యం ప్రవేశపెట్టి 9 నెలల్లో సాహివాల్ ఆడ దూడను కానుకగా ఇచ్చారు. ఇలా మా ఊరి ఆవుల్లో చేసిన కృత్రిమ గర్భధారణతో అందరికీ కోరుకున్న జాతి ఆడ దూడలే పుట్టాయి. ఇది మాకు ఆశ్చర్యంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది’ అంటూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ పాడిరైతు ఏలేటి గణేశ్రెడ్డి ఆనందంతో గంతేశాడు.. ఈ ఆనందం ఇప్పుడు ఈయన ఒక్కడిదే కాదు కామారెడ్డి జిల్లాలో మరికొందరిది కూడా. ఇక అన్ని పల్లెలకు.. కేంద్ర ప్రభుత్వం–విజయ డెయిరీ సహకారంతో చేపట్టిన కామారెడ్డి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,192 మంది వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులతో కృత్రిమ గర్భధారణ శిబిరాల్లో రైతు రూ.250 చెల్లిస్తే వారు కోరుకున్న దూడలకు జన్మనిచ్చేలా ఆవులను సిద్ధం చేయనున్నారు. అయితే 90 శాతం ఆడ దూడలు, 10 శాతం కోడె దూడలుండే విధంగా సమతౌల్యం పాటించనున్నారు. ఈ పథకం విస్తృతంగా రైతుల్లోకి వెళ్తే వచ్చే ఏడేళ్లలో టాప్–10 రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశం ఉందని పాడి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెరీవెరీ స్పెషల్.. ►గిర్, సాహివాల్ ఆవుల పాలల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. సంతానోత్పత్తి సమర్థత కూడా అధికం. తక్కువ మేత, ఎక్కువ పాల దిగుబడితో ప్రస్తుతం ఈ స్వదేశీ జాతి ఆవులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. ►హెచ్ఎఫ్ ఆవుల్లో ఎక్కువ పాల దిగుబడితోపాటు ప్రసవించే పదిహేను రోజుల ముందు వరకు పాలు ఇవ్వడం ప్రత్యేకం. పాడిలో పెను మార్పులు పైలట్ ప్రాజెక్ట్గా పది గ్రామాల్లో చేసిన ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఈ పథకాన్ని మార్చిలో రాష్ట్రమంతా విస్తరిస్తాం. దీంతో పాడి రంగంలో పెనుమార్పులు రానున్నాయి. –డాక్టర్ మంజువాణి, సీఈఓ, లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మా ఇంట్లో పోషకాల గోవు.. స్వదేశీ గిర్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో మళ్లీ గిర్ ఆడ దూడ పుట్టింది. గిర్ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నా ఆవు రోజుకు 16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఒక్క స్వదేశీ ఆవు ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే. –మన్నె గంగారెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి పుణేలో.. ఫలించిన ప్రయోగంతో.. అంతరిస్తున్న దేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే విదేశీ జాతి సంతతి వృద్ధి కోసం భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (ఫుణే).. ఫ్లో సైటీమెట్రీ (బయాలాజికల్ విశ్లేషణ)తో తొలి అడుగు వేసింది. లింగ నిర్ధారణ వీర్యంతో పుణేలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, అక్కడి నుంచి తొలుత దేశీ జాతులు, ఆపై విదేశీ జాతుల లింగ నిర్ధారణ వీర్యాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆవుల్లో కృత్రిమ గర్భధారణ చేయగా, ఆశించిన విధంగానే ఎక్స్ క్రోమోజోమ్తో అండ ఫలదీకరణ ప్రయోగంతో కోరుకున్న స్థాయిలో ఆడ ఆవుదూడలు పుట్టాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్, ఒడిశాల్లో కృత్రిమ గర్భధారణ వేగవంతం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని విస్తృతం చేయనున్నారు. -
చంపుతాడని చంపేశాడు
నిజాంసాగర్: అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటికి తెలియడంతో తనను ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో అన్ననే మట్టుపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని అంతాపూర్లో జరిగింది. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్రెడ్డి శనివారం తెలిపిన వివరాలిలా.. అంతాపూర్ గ్రామనికి చెందిన మక్కల్ వాడి గంగాధర్(27).. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నమ్మ వద్దనే పెరిగాడు. చిన్నమ్మ కుమారుడు గంగాధర్, మక్కల్వాడి గంగాధర్ సొంత అన్నదమ్ముళ్లలా పెరిగారు. మక్కల్వాడి గంగాధర్కు వివాహమైంది. భార్య రేణు, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతను కూలి పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో వరుసకు వదిన అయిన రేణుతో గంగాధర్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం ఇంటికి వచ్చిన మక్కల్వాడి గంగాధర్.. ఇది గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తనను అన్న చంపేస్తాడేమోనని భయపడి ముందుగా అతడినే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మక్కల్వాడి గంగాధర్ వంట చెరుకు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. తమ్ముడు గంగాధర్ బైక్పై అతడి వద్దకు వచ్చి, పొలానికి వెళ్దామని చెప్పాడు. జుక్కల్ మండలంలోని హంగర్గ శివారులోగల కర్ణం గుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడ మాటు వేసి ఉన్న తన మిత్రులు అశోక్, బాలాజీలు మక్కల్వాడి గంగాధర్పై బండరాళ్లతో దాడి చేశారు. కుప్పకూలిన అతని తలపై ముగ్గురూ కలిసి రాళ్లతో కొట్టి చంపి నీటి గుంటలోకి తోసివేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం వేళ అన్న కనిపించడం లేదంటూ గంగాధర్ గ్రామస్తులకు తెలిపాడు. హంగర్గ శివారు ప్రాంతానికి వెళ్లినవారికి నీటి గుంటలో మక్కల్వాడి గంగాధర్ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. బిచ్కుంద సీఐ కృష్ణ, జుక్కల్ ఎస్సై మురళి ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జరిపారు. గంగాధర్పై అనుమానంతో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కామినేని పుష్ప కన్నుమూత
దోమకొండ: కామారెడ్డి జిల్లా లోని దోమకొండ గడికోట వార సులైన దివంగత రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు సతీమణి పుష్ప (71) సోమవారం హైదరాబాద్ లోని స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతదేహా నికి జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వ హించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కుమారుడు, జాతీయ అర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కుమార్తె ఉపాసనను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్తో దోమ కొండలో వివాహం జరిపించిన విషయం తెలిసిందే. పుష్ప ప్రతి మహా శివరాత్రి నాడు గడికోటలోని మహ దేవుని ఆలయానికి వచ్చి పూజల్లో పాల్గొనేవారు. ఆమె గడికోటకు వచ్చిన ప్రతిసారీ అందరితో కలుపుగోలుగా ఉండేవారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. -
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ప్లాన్ రద్దుకు తీర్మానం
-
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం
-
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గిన పాలక వర్గం
-
కామారెడ్డి రైతుల సంచలన నిర్ణయం.. వారు రాజీనామా చేయాలని హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: మున్సిపల్ మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్ రద్దుపై పాత రాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, రైతుల సమావేశంలో ఎల్లుండి(గురువారం) సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకు గడువు ఇచ్చారు. 19న విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని హెచ్చరించారు. 20వ తేదీన ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. మున్సిపల్ తీర్మానం చేయించి మాస్టర్ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యాచరణ కమిటీకీ రాజీనామా పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి రామేశ్వరపల్లికి చెందిన బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మాస్టర్ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. నిర్మల్లో పాత రోడ్లనే బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు
-
హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హైదరాబాద్ వెళ్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, తమపై విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్ ప్లాన్లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా? అని రైతులు ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ తన చాంబర్లో ఉండి కూడా, రాత్రి 8 గంటలైనా తమ గోడును పట్టించుకోలేదని, అలాగే ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్ఐలు లాఠీచార్జి చేసి రైతులను విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో తన్ని హింసించారన్నాని పేర్కొన్నారు. -
తల్లిని కొట్టి చంపి.. కాసేపటికే రక్తపు మడుగులో పడి..
మాచారెడ్డి: ఇంట్లో గొడవ.. ఓ కొడుకు తల్లిని కర్రతో బాదడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది.. మృతదేహాన్ని తీసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి.. ఆ కొడుకు కూడా ఇంట్లో రక్తపు మడుగు మధ్య చనిపోయి ఉన్నాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో కేవలం గంటన్నర వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో..: చిటుకుల నర్సమ్మ (67), ఆమె కుమారుడు నర్సారెడ్డి (45), ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి భవానీపేటలో ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్సారెడ్డి భార్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లీకొడుకులు నర్సమ్మ, నర్సారెడ్డి సొంత ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల అయ్యప్పమాల వేసుకున్న నర్సారెడ్డి.. రెండు రోజుల క్రితమే శబరిమల యాత్రకు వెళ్లివచ్చాడు. శుక్రవారం సాయంత్రం తన భార్యను ఇంటికి రప్పించాలంటూ తల్లితో నర్సారెడ్డి గొడవకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నర్సారెడ్డి ఆవేశంతో కర్రతో నర్సమ్మ తలపై బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. దీంతో వారు నర్సమ్మ మృతదేహాన్ని భవానీపేటలోని ఇంటికి తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఇంట్లో రక్తం మడుగులో నర్సారెడ్డి మృతిచెంది కనిపించాడు. ఇది చూసి గ్రామస్తులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే నర్సారెడ్డి తలకు పెద్ద గాయమైనట్టు కనిపిస్తుండటం, రక్తపు మడుగు మధ్య పడి ఉండటంతో ఆయనను ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. -
బంద్ ఎఫెక్ట్.. కామారెడ్డిలో హై టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతు జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మాస్టర్ ప్లాన్కు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో బంద్ పాటించాలని రైతు ఐక్య కార్యాచారణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాల చేసుకుంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో బంద్ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం, బీబీపేట పోలీసు స్టేషన్కు తరలించారు. మరోవైపు.. మాస్టర్ ప్లాన్ భూబాధత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్ చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న చేస్తున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదంటున్న బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రైతులకు కాంగ్రెస్ నేత షబ్బీర్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనను అవమానించారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మాస్టర్ ప్లాన్ను సవరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోంది. రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
Kamareddy: మాస్టర్ ప్లాన్పై రైతుల ఆందోళన.. కలెక్టర్ ఏమన్నారంటే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటాని తెలిపారు. అలాగే కొత్త మాస్టర్ ప్లాన్పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతులు నిరసన విరమించారు. కలెక్టర్ దిష్టిబొమ్మను రైతులు దగ్దం చేశారు. కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డి బంద్కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కాగా అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హెటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ ముందు టెంట్ వేసి రైతులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించి., బృందాలుగా లోపలికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కోరినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. మాస్టర్ ప్లాన్పై స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రావాల్సిందేనని పట్టుబట్టారు. కాగా కామారెడ్డి బల్దియాలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రీయల్ జోన్ కింద చూపడం, అవసరం లేని చోట్ల 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతులు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అయితే మాస్టర్ ప్లాన్లో భూమి పోతుందని మనస్తాపంతో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. చదవండి: KTR: మాస్టర్ప్లాన్పై స్పందించిన మంత్రి కేటీఆర్ -
రైతు ఆత్మహత్యతో ఉద్రిక్తత
కామారెడ్డి టౌన్: తన మూడు ఎకరాల భూమి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో, ఆ భూమిని అమ్ముకోవడానికి వీలుపడక మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు (42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇల్చిపూర్ వద్ద 3 ఎకరాలు పంట భూమి ఉంది. కాగా, ఇటీవల మున్సిపల్ నూతన మాస్టర్ప్లాన్లో అక్కడి భూములన్నీ ఇండస్ట్రియల్ జోన్లోకి చేర్చా రు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఆ భూమి ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్లడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకురాక మనస్తాపంతో రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన తల్లి.. చుట్టుపక్కల వారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాములు మృతితో రైతులు గ్రామంలో కాసేపు ఆందోళన చేశా రు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడానికి తరలివచ్చారు. అయితే కామా రెడ్డి కొత్త బస్టాండ్ ముందు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తర్వాత రాము లు మృతదేహాన్ని అక్కడే వదిలేసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ధర్నాకు దిగారు. ఈ సమయంలో 2 గంటల పాటు రోడ్డుపైనే ట్రాక్టర్ లో మృతదేహం అలానే ఉంది. తర్వాత పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తన భర్త మృతదేహాన్ని తన అను మతి లేకుండా ఆస్పత్రికి తరలించినందుకు రాములు భార్య.. తన కుటుంబ సభ్యులు, ఇతర రైతులతో కలసి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వారికి సంఘీభావం ప్రకటించారు. రెండు పంటలు పండే రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడం దారుణమన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాములు భార్య శారద కోరారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి కుటుంబ సభ్యులతో కలసి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. రాములు మృత దేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు. మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. చదవండి: మరో గుడ్న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది?
బాన్సువాడ రూరల్(కామారెడ్డి జిల్లా): నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో గురువారం మాలోత్ సోని (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు.. చందూర్ మండలం కారేగాం తండాకు చెందిన రమావత్ చంద్రుకు నలుగురు కూతుర్లు. చిన్న కుతూరు సోనికి అంకోల్తండాకు చెందిన మాలోత్ రాంచందర్తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. రాంచందర్ భార్యతో కలిసి మహబూబ్నగర్ వెళ్లాడు. అక్కడ రాంచందర్ భార్యను అనుమానిస్తూ వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు కులపెద్దలు పంచాయతీ పెట్టిన రాంచందర్ తీరు మార్చుకోలేదు. దీంతో భర్త వేధింపులు భరించలేక ఇటీవల సోని కారేగాం తండాలోని తల్లిగారింటికి వచ్చింది. భార్యను కొట్టనని, మంచిగా చూసుకుంటానని రాంచందర్ వచ్చి చెప్పడంతో ఈ నెల 17న అంకోల్ సోనీని తల్లిదండ్రులు అంకోల్ తండాకు పంపించారు. చదవండి: పెళ్లి కుమార్తె రవళి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కాగా గురువారం తన కూతురు చనిపోయినట్లు సమాచారం రావడంతో వెళ్లి చూడగా అల్లుడు పారిపోయాడని చంద్రూ చెప్పారు. రాంచందర్ తన కూతురు మనికట్టు వద్ద కోసి తాడుతో ఉరివేసి చంపేసినట్లు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్రెడ్డి తెలిపారు. -
రాజు రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల నరకయాతన నుంచి విముక్తి
సాక్షి, కామారెడ్డి/ కామారెడ్డి టౌన్: రెండు పెద్ద బండరాళ్ల మధ్య.. దాదాపు 48 గంటల పాటు.. ఎటూ కదల్లేని మెదల్లేని పరిస్థితి.. రాత్రివేళ మరీ నరకయాతన. బయట పడతానో లేదో అన్న సందిగ్ధం. కానీ ధైర్యం కోల్పోలేదు. రెండు రాత్రిళ్లు గడిచాయి. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఆ నరకం నుంచి విముక్తి. అధికారులు, సిబ్బందిలో ఒకరి ప్రాణాలు కాపాడగలిగామనే సంతృప్తి..కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన సంతోషం. గుట్టల్లో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు గురువారం క్షేమంగా బయటపడటంతో కుటుంబసభ్యులు, బంధువులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. వేటకు వెళ్లి..బండరాళ్ల మధ్య చిక్కి.. మంగళవారం రెడ్డిపేట–సింగరాయపల్లి రోడ్డులో గన్పూర్ (ఆర్) తండాకు సమీపంలోని పులిగుట్ట అటవీ ప్రాంతానికి వెళ్లిన చాడ రాజు.. రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఏదులు, ఉడుములు పట్టుకోవడంలో దిట్ట అయిన రాజు.. ఉడుమును పట్టుకునే క్రమంలోనే బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కాగా రాజు వెంట వెళ్లిన అతని స్నేహితుడు సున్నపు మహేశ్.. అతన్ని బయటకు లాగేందుకు చాలాసేపు విఫలయత్నం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏ ఇబ్బంది ఎదురవుతుందోనని మహేశ్ భయపడ్డాడు. ఆ రోజు రాత్రంతా రాజుతో మాట్లాడుతూ అక్కడే రాతి గుండుపై ఉండిపోయాడు. బుధవారం ఉదయం ఇక లాభం లేదనుకుని గ్రామంలోని తమ మిత్రులు కొందరికి విషయం చెప్పాడు. వారు కూడా అక్కడికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేశారు. రాజు కూడా బయటకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచాడు. కానీ ఫలించలేదు. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసు, రెవెన్యూ, అటవీ సిబ్బంది సమష్టిగా.. రామారెడ్డి ఎస్సై అనిల్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలోని గుట్టల వద్దకు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వెంటనే అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్లతో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని పంపించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వచి్చన పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సహాయ సిబ్బంది.. రాజును రక్షించేందుకు గుట్టను తవ్వే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో స్థానిక యువకుల్ని అప్పుడప్పుడు రాజుతో మాట్లాడిస్తూ ధైర్యం చెప్పారు. ముఖ్యంగా అశోక్ అనే రాజు మిత్రుడు అతని సమీపం వరకు వెళ్లి నీళ్లు, పండ్ల రసాలు అందించడంలో సాయపడ్డాడు. లోపల ఉక్కపోత నుంచి కాపాడేందుకు చార్జింగ్ ఫ్యాన్ను లోనికి పంపించారు. బుధవారం రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించారు. జేసీబీతో, రాళ్లను బ్లాస్ట్ చేస్తూ.. పులిగుట్ట మొత్తం పెద్దపెద్ద బండరాళ్లతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాళ్ల మధ్యన ఇరుక్కున్న రాజును రక్షించేందుకు మొదట జేసీబీ సాయంతో ప్రయతి్నంచారు. తర్వాత రాళ్లకు డ్రిల్లింగ్తో రంధ్రాలు చేసి పేలుడు మందు నింపి బ్లాస్టింగ్ చేశారు. ఈ విధంగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 12 సార్లు బండరాళ్లను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ (పెద్ద రాళ్ల ముక్కలు రాజు మీద పడకుండా తక్కువ మోతాదు పేలుళ్లు) చేశారు. బ్లాస్ట్ చేసిన రాళ్లను తొలగించేందుకు జేసీబీని వినియోగించారు. ఈ క్రమంలో రాజుతో వీలైనన్నిసార్లు మాట్లాడుతూ అధైర్యపడవద్దని చెప్పారు. రాళ్లు రాజుపై పడకుండా అడ్డుగా ఏర్పాట్లు చేశారు. సుమారు 20 గంటల ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజును బయటకు తీయగలిగారు. దీంతో దాదాపు 48 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పక్కా ప్రణాళికతో..చాకచక్యంగా.. రెస్క్యూ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ స్వ యంగా పర్యవేక్షించారు. బండరాళ్లు పేల్చడం ఒక రకంగా అధికారులు చేసిన సాహసమేనని చెప్పాలి. అందుకనే ఈ తరహా పేలుళ్లలో అనుభవజు్ఞడైన కామారెడ్డికి చెందిన పెంటయ్యతో పాటు అతని బృందాన్ని పిలిపించారు. తక్కువ పరిమాణంలో మందుగుండు అమర్చుతూ పేలుళ్లు జరిపారు. పొరపాటున భారీ విస్ఫోటనం జరిగితే లోపల ఇరుక్కున్న రాజుకు అపాయం జరిగే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రెస్క్యూ ఆపరేషన్లో 80 పాల్గొన్నారు. ఆస్పత్రిలో 24 గంటల అబ్జర్వేషన్ రాజును అధికారులు తక్షణమే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. రెండురోజుల పాటు సరైన ఆహారం లేకపోవడంతో శరీరంలో షుగర్ శాతం తగ్గిన్నట్లు గుర్తించారు. ఎడమ చేతికి వాపు వచి్చంది. బండరాళ్ల మధ్య కదలడంతో రెండు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. అతని ధైర్యమే అతన్ని కాపాడిందని డాక్టర్ సంతోష్ కుమార్ చెప్పారు. అధికారులు దేవుళ్లలాగా వచ్చారు.. పడిపోయిన సెల్ఫోన్ తీసుకోవడానికి వెళ్లి రాళ్లలో తలకిందులుగా ఇరుక్కుపోయా. అయినా ధైర్యంగానే ఉన్నా. నేను ఎవ్వరికీ భయపడను.. ఒక్క దేవుడికి తప్ప. అయితే బండరాళ్ల మధ్య నరకం అనుభవించా. కానీ మా వాళ్లకు ధైర్యంగా ఉండాలని, నాకు ఏం కాదని చెప్పా. రాళ్లు పేల్చుతుంటే మాత్రం కొంచెం భయం వేసింది. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవె న్యూ, అటవీ, వైద్య శాఖల అధికారులు దేవుళ్లలాగా వ చ్చారు. చాలా కష్టపడి నన్ను బయటకు తీశారు. వాళ్లందరికీ నేను చనిపోయేంత వరకు రుణపడి ఉంటాను. – రాజు అందరికీ రుణపడి ఉంటా.. మా ఆయన్ను ఆ పరిస్థితిలో చూసి చాలా భయపడ్డా. అసలు బయటకు వస్తాడా..బతుకుతాడా?.. నా పిల్లలు, నా పరిస్థితి ఏందని ఏడ్చాను. గుండె ఆగిపోయినంత పని అయింది. సార్లు, డాక్టర్లు అందరూ వచ్చి రెండ్రోజులు కష్టపడి నా భర్తను బతికించారు. అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా. – లక్షి్మ, రాజు భార్య బయటికి వస్తాడో లేడో అని అని్పంచింది రాజు రాళ్ల మధ్యలో పడ్డాడని నాకు చెప్పారు. నేను వెళ్లి బయటకు తీయడానికి చాలాసేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తర్వాత భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాం. అందరూ వచ్చి కష్టపడి రాజన్నను బతికించారు. పరిస్థితి చూస్తే అసలు బయటికి వస్తాడో లేడో అని భయం వేసింది. అతని బాధ చెప్పలేను. కానీ రాజు చాలా ధైర్యంగా ఉన్నాడు. – అశోక్, రాజు మిత్రుడు -
సెల్ టవర్ పై ఉరేసుకుని రైతు ఆత్మహత్య
-
ముందస్తు ఎన్నికలు ఖాయం: ఆర్.ఎస్.ప్రవీణ్
కామారెడ్డి టౌన్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వెనక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పలువురు రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని తెలిపారు. కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వందలమంది నాయకులను మోహరించి, రూ.500 కోట్లు ఖర్చు చేస్తేగానీ మునుగోడు ఉపఎన్నికలో గెలవలేదని ప్రవీణ్ ఎద్దేవాచేశారు. బీఎస్పీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్రాజు, జిల్లా ఇన్చార్జులు సురేశ్గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం
-
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు: వైఎస్ షర్మిల
బిచ్కుంద (జుక్కల్): మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పేరుతో కొల్లగొట్టి తన జేబులు నింపుకొన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను ఆగం చేశారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల మీదుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.38 వేల కోట్లకు పూర్తి చేయాలనుకున్నారని, అదే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేయించి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష 20 వేలకు పెంచి రూ.70 వేల కోట్లను మింగారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఏనాడూ సీఎం కేసీఆర్ అవినీతిపై నిలదీయలేదని, రెండు పార్టీలూ తమ స్వార్థం చూసుకుంటున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాçష్ట్ర అధికార ప్రతినిధి పిట్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్.సుధాకర్ పాల్గొన్నారు. -
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
అది బందిపోట్ల రాష్ట్ర సమితి
ఎల్లారెడ్డి: ఇన్నాళ్లూ ప్రజాసంక్షేమం మరిచి తాగుబోతుల రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారి దేశాన్ని దోచుకోబోతోందని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ‘బీడి బిచ్చం కల్లు ఉద్దెర’గా మారిందని విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన పాలనాకాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 60 ఏళ్లలోపు ఉన్నవారికి మాత్రమే రైతుబీమా వర్తిస్తుందనడం అమానుషమని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ప్రతిపథకంలోనూ వైఎస్సార్ కనిపిస్తుంటారని, అట్లాంటివాటి పేర్లు మార్చి అవి తమవంటూ టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల 175 రోజుల్లో 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటి రాజన్న బిడ్డగా ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిందని అన్నారు. షర్మిలను వైఎస్సార్ ఒక యువరాణిలా పెంచారని, పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఆమె ప్రజల వద్దకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ నాయకులు నీలం రమేశ్, నీలం సుధాకర్, పిట్టా రాంరెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న తన ఆటపాటలతో సభికులను అలరించారు. -
మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ గేట్ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి. తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్ గేట్ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. (క్లిక్: హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!) నిధులు మంజూరైతేనే... మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?) రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. – యు.మనోహర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట -
మహాత్ముని మార్గంలో " ర్యాగట్లపల్లి "
-
కరెంటు కంచె ముగ్గురిని కాటేసింది..
మామడ/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలే వారిపాలిట మృత్యుపాశమయ్యాయి. పశువులు మేపేందుకు అడవికి వెళ్లిన ఓ పశువుల కాపరి, పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతు పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాద ఘటనలు నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మద్దిపడగ మల్లయ్య(64) రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తనకున్న గొర్రెలను మేత కోసం అటవీప్రాంతానికి తీసుకువెళ్లాడు. రాత్రి అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా గ్రామానికి చెందిన పారెడి చంద్రమౌళి పొలం వద్ద విగత జీవిగా కనిపించాడు. సమీపంలో విద్యుత్ కంచె ఉండడంతో కరెంటుషాక్తో మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొన్కల్ గ్రామానికే చెందిన ద్యాగల బొర్రన్న(55) కూడా మంగళవారం మరోచోట విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. బొర్రన్న ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. పొరుగు రైతుకు చెందిన పొలం వద్ద పశువుల కోసం గడ్డి కోస్తుండగా కానక విద్యుత్ కంచెకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కరోజు వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యుత్ కంచెకు బలవడంతో పొన్కల్లో విషాదం నెలకొంది. నిజాంసాగర్లో శవమై...: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్కి చెందిన రైతు కుమ్మరి నల్ల పోశెట్టి(43) సోమవారం వేకువజామున పొలానికి వెళ్లాడు. దారిలో స్థానిక ఎంపీటీసీ మోతె శ్రీనివాస్కు చెందిన పొలానికి ఉన్న విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగలడంతో పోశెట్టి మృత్యువాతపడ్డాడు. అయితే ఆయన మంగళవారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్వాటర్లో శవమై తేలడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంపీటీసీ కుటుంబసభ్యులే పోశెట్టి మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని బ్యాక్వాటర్లో పడేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోశెట్టి మృతికి కారణమైనవారు తమకు లొంగిపోయారని, మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశి వనగర్ మండలం దగ్గి గ్రామ శివారు 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారు లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు. అనంతరం సదాశివనగర్ మండల కేంద్రం అటవీ ప్రాంతం శివారులో ఖననం చేశారు. డీఎఫ్వో నిఖిత, ఎఫ్డీవో గోపాల్రావు, ఆర్ఎస్వో రమేశ్, సెక్షన్ అధికారి ముబాషిర్అలీ, బీట్ ఆఫీసర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
రెండో పెళ్లి చేయడంలేదని తల్లిని చంపాడు
మద్నూర్: రెండోపెళ్లి చేయడంలేదనే కోపంతో తల్లినే నరికిచంపాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగా గ్రామంలో చోటుచేసుకుంది. మొగ గ్రామానికి చెందిన పింజరి ఇస్మాయిల్ బీ(55), మహబూబ్సాబ్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అల్లావుద్దీన్ గ్రామంలో వేరే ఇంట్లో భార్య, పిల్లల తో కలిసి ఉంటున్నాడు. చిన్న కొడుకు సల్లావుద్దీన్ తో తల్లిదండ్రులు ఇస్మాయిల్ బీ, మహబూబ్ సాబ్ కలిసి ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సల్లా వుద్దీన్కు వివాహం జరగగా, రెండేళ్ల క్రితం భార్య గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత అతడు హైదరాబాద్లోని ఫంక్షన్ హాల్లో కొంతకాలం కూలిపని చేశాడు. రెండు నెలలుగా అతడు గ్రామంలోనే ఉంటూ ఇంటి నిర్మాణపనులకు దినసరికూలిగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. పెళ్లి విషయమై బుధవారం సాయంత్రం తల్లితో మరోసారి గొడవపడి బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తల్లి మెడపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి మరో గదిలో నిద్రపోతున్నాడు. దొంగలు హత్య చేశారంటూ...: తల్లిని హత్య చేసిన తర్వాత సల్లావుద్దీన్ భయాందోళనకు గురయ్యాడు. హత్య కేసు తనపైకి రాకుండా ఉండేందుకు పథకం వేశాడు. తల్లిని దొంగలు హత్య చేసి పారిపోయారంటూ గట్టిగా అరుస్తూ రోదించాడు. తండ్రి వద్దకు వెళ్లి గుర్తుతెలియని వ్య క్తులు అమ్మను హత్య చేసి పారిపోయారని చెప్పా డు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. తన తల్లిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసుల ఎదుట సల్లావుద్దీన్ వాపోయాడు. పోలీసులు అనుమానంతో అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. గురువారం బిచ్కుంద సీఐ కృష్ణ, క్లూస్టీం సభ్యులు ఘటనాస్థలం వద్ద వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాముకాటుతో హాస్టల్ విద్యార్థి మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ)/ బాన్సువాడటౌన్: కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని బీసీ వసతి గృహంలో విద్యార్థి పాముకాటుతో మృతిచెందాడు. నస్రు ల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బీర్కూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ఐదో తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఏదో కుట్టినట్లుగా అనిపించడంతో నిద్రలేచి మిగతా విద్యార్థులను అప్రమత్తం చేశాడు. అక్కడే ఓ పాము కనిపించడంతో అందరూ కలిసి దానిని చంపేశారు. సాయిరాజ్కు వాంతులు కావడంతో వెంటనే అతడిని పీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే, ఆరోగ్య సిబ్బంది కొద్దిసేపు పరిశీలించి లక్షణాల్లేవని చెప్పి, ప్రాథమిక చికిత్స చేయకుండానే విద్యార్థిని వెనక్కి పంపించేశారు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సాయిరాజ్ నోటి నుంచి నురుగులు రావడంతో భయానికి గురైన తోటి విద్యార్థులు నైట్ వాచ్మన్, వార్డెన్, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్టల్కు వచ్చేసరికి సాయిరాజ్ మృతి చెందాడు. వార్డెన్ వచ్చి సాయిరాజ్ మృతికి కారణం చెప్పాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన గురించి తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్తో మాట్లాడారు. దీంతో కలెక్టర్ వెంటనే వార్డెన్ ను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఎక్స్గ్రేషియా అందించేలా చూస్తామని స్పీకర్ ఫోన్లో బాధితులకు హామీనిచ్చారు. సాయిరాజ్ తల్లిదండ్రులు గంగామణి, మురళి కూలీలు. వీరికి మరో మూడేళ్ల పాప ఉంది. పారిశుధ్య కార్మికురాలికీ పాముకాటు విద్యార్థి మృతి అనంతరం అధికారుల ఆదేశాలతో శనివారం పరిసరాలను శుభ్రంచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు జ్యోతినీ ఓ పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను బాన్సువా డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లక్షణాలు కనిపించలేదు: స్టాఫ్ నర్స్ వినోద, బీర్కూర్ పీహెచ్సీ సాయిరాజ్ అస్వస్థతకు గురై రాత్రి ఒంటి గంట సమయంలో పీహెచ్సీకి వచ్చాడు. ఎటువంటి లక్షణాలు కనబడకపోవడంతో వైద్యం చేయలేదు. వసతిగృహంలోకి పాము వచ్చిందని తెలపడంతో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో పంపిస్తానన్నాను. అయితే, తనను పాము కరవలేదని, అక్కడికి వెళ్లబోనని సాయిరాజ్ చెప్పడంతో తిరిగి పంపించేశాను. -
పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!
సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. గొర్రెల మందలే లోకంగా.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. బీపీ, షుగర్లు దరిచేరవట! గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్నగర్ ఎయిర్పోర్టుకు మహర్దశ) చిరుతపులి వెంట పడ్డాం.. పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. – చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా కాపరుల జీవితమంతా కష్టాలే.. గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. – జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. – కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. – మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి -
కామారెడ్డి జిల్లాలో విషాదం
-
కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్య
-
ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కామారెడ్డి కలెక్టర్కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్కు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy These political histrionics on the street will only demoralise hardworking AIS officers My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct 👏 — KTR (@KTRTRS) September 2, 2022 కాగా శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. చదవండి: స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్ -
ఆ జిల్లాలో టీఆర్ఎస్ గట్టెక్కుతుందా?
కామారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో కూడా గులాబీ పార్టీ మీద అంత పాజిటివ్ ఒపీనియన్స్ లేవనే చెప్పాలి. ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి గతంలో మాదిరిగా సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యర్థులు బలహీనంగా ఉంటేనే టీఆర్ఎస్ గట్టెక్కుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్కు గతంలోలాగా పరిస్థితులన్నీ అనుకూలంగా లేవని చెప్పొచ్చు. సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ కూడా అధికారపార్టీకి మైనస్ అనే వాదన వినిపిస్తోంది. ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన ముజీబ్ ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్ఆశిస్తున్నారు. గతంలో అతణ్ని మంత్రి కేటీఆర్ బుజ్జగించి జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు, ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గతంలో బీజేపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నిట్టు వేణుగోపాల్ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ మూడు గ్రూపులుగా మారింది. అయితే గంప గోవర్ధన్ కొడుకు శశాంక కూడా నియోజకవర్గంలో కలియతిరుగుతుండటంతో... కొడుకునూ భవిష్యత్ నేతగా తీర్చిదిద్దే పనిలో గోవర్ధన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకు దక్కకపోతే... కొడుకుకైనా దక్కించుకోవాలనే యత్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్నేత షబ్బీర్ అలీపై ఈసారి సానుభూతి కనిపిస్తోంది. కామారెడ్డిలో మైనార్టీల ఓట్లు ఎంత కీలకమో..అదే స్థాయిలో హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ సెగ్మెంట్ లో ఎన్నిక మత ప్రాతిపదికన కీలకం కానుంది. గతంలో షబ్బీర్ అలీ సోదరుడు నయీంపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నువ్వు చూసుకో... కామారెడ్డి నేను చూసుకుంటా అంటూ నయూం ఏకంగా పత్రికల్లో యాడ్ ఇవ్వడం వంటివి షబ్బీర్ కు మైనస్ గా మారాయి. అయితే ఇటీవల తరచూ నియోజకవర్గానికి వస్తుండటం.. పబ్లిక్లో ఉండటంతో షబ్బీర్ వైపు ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నాయి. బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కాషాయ పార్టీకి హైప్ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ నేతల అవినీతంటూ కొన్ని భూకబ్జాలకు సంబంధించి.. రమణారెడ్డి సవాల్ విసరడం... టీఆర్ఎస్ దాన్ని స్వీకరించడంతో కామారెడ్డి రాజకీయం రక్తికడుతోంది. బీజేపి నుంచి గతంలో బరిలోకి దిగి ఓటమిపాలైన ఇద్దం సిద్ధిరాములు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా.. కాటిపెల్లిని వరిస్తుందా.. లేక, ఇంకెవరైనా రాష్ట్రస్థాయి నేత కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారా అనే ఆసక్తికరమైన చర్చ కాషాయసేనలో జరుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాలిటిక్స్హాట్ హాట్ గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న సెగ్మెంట్ ఎల్లారెడ్డి. ప్రస్తుతం గులాబీ కండువా ధరించిన జాజుల సురేందర్ గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పక్షాన గెల్చిన ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పక్షాన గెల్చి... టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయాడన్న ఒక అపవాదు ఇప్పటికే సురేందర్ కి మైనస్గా ప్రచారంలో ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయనకు శ్రీరామరక్షగా నిల్చే అవకాశాలూ లేకపోలేదు. కాంగ్రెస్ కు బలమున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉన్నాయి. గతంలో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిచెందిన మదన్ మోహన్ రావు ప్రస్తుతం ఎల్లారెడ్డి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇంఛార్జ్ గా ఉన్న సుభాష్ రెడ్డికి, మదన్ మోహన్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య పలుచోట్ల రచ్చబండ కార్యక్రమాల్లో మదన్ మోహన్ వర్గీయులు, సుభాష్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగిన సంఘటనలు మరోసారి కాంగ్రెస్ పరువును మంజీరాలో కలిపేశాయి. అయితే ఎల్లారెడ్డి వేదికగా జరిగిన రేవంత్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నా.. ప్రత్యర్థి పార్టీతో ఫైట్ చేయాల్సిన ఆ పార్టీ కార్యకర్తలు తమలో తామే కొట్టుకోవడం ఇప్పుడు పార్టీకి మైనస్సని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీలో ఉండి.. ఆ తర్వాత కాషాయకండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పాటు..గతంలో బీజేపి తరపున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కమలం పార్టీ ఆశావహులుగా ఉన్నారు. రవీందర్ రెడ్డికి గనుక టిక్కెట్ దక్కితే మాత్రం నియోజకవర్గంలో హోరాహోరీ తప్పదు. కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ కు నెట్ వర్క్ ఎక్కువ ఉండటం.. స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ దక్కితే కచ్చితంగా ఎల్లారెడ్డిలో మూడుపార్టీలు ఢీ అంటే ఢీ అంటాయి. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కంచుకోట అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడినుంచి పోచారం ఆరుసార్లు వరుసగా గెలిపొందిన చరిత్ర ఉంది. నియోజకవర్గంలో అణువణువు గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. పోచారం కుమారులు డీసీసీబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారన్న ప్రచారమూ ఉంది. భాస్కర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం మీద, రెండుసార్లుగా అధికారంలో ఉన్న గులాబీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగల ప్రత్యర్థులు నియోజకవర్గంలో కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజు.. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్మోహన్ రావు ఇక్కడి నుంచి కూడా ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు కాంగ్రెస్నేతలు. బీజేపి నుంచి స్థానిక నేత మాల్యాద్రిరెడ్డి పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే మాల్యాద్రిరెడ్డి గతంలో పోటీ చేసి ప్రత్యర్థులకు సహకరించాడనే అపవాదు ఉంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ఆరోపణ వినిపిస్తోంది. బీజేపీలోనూ ఇక్కడ రెండు వర్గాలుండటం... ఆ రెండువర్గాల మధ్య తారాస్థాయిలో విభేదాలుండటం కాషాయసేనకు మైనస్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేంత స్థాయిలో లేవు. అందుకే మరోసారి పోచారం ఫ్యామిలీలో ఎవరికి టిక్కెట్ దక్కినా విజయం అటువైపేనన్న ప్రచారమూ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గమైన జుక్కల్ లోనూ రసవత్తర రాజకీయమే కనిపిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకే మళ్లీ గులాబీ పార్టీ టిక్కెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గతంలో నాల్గుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన గంగారాం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే మూడుసార్లుగా ఓటమిపాలు కావడంతో గంగారాంకు ఈసారి సానుభూతి లభించవచ్చంటున్నారు. అయితే గడుగు గంగాధర్ కూడా కాంగ్రెస్నుంచి జుక్కల్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఆశీస్సులతో ఎలాగైనా టిక్కెట్ సాధించేందుకు గంగాధర్ ప్రయత్నిస్తున్నారు. చారంలో ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే గంగారాంకు పీసీసీ చీఫ్ రేవంత్మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంగారాం ప్రత్యర్థిగా ఉన్నంత కాలం హన్మంత్ షిండే గెలుపుకు ఢోకా లేదనే ఓ టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. నిజామాబాద్ కు చెందిన అరుణతార జుక్కల్ లో బీజేపీ తరపున ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు. ఈమె కామారెడ్డి జిల్లా బీజేపి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో క్యాడర్ కూడా ఆమెకు పెద్దగా సహకరించడంలేదని..ఆమె క్యాడర్ను కాపాడుకోలేకపోతున్నారని వినిపిస్తోంది. తరచుగా పార్టీలు మారతారన్న నెగటివ్ ప్రచారం కూడా అరుణతారకు మైనస్ అవుతోంది. ఈ మధ్య ప్రతీ ఫంక్షన్ కీ హాజరవుతూ..ప్రజల్లో ఉండే యత్నం చేయడంతో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారనే టాక్సంపాదించుకున్నారు అరుణతార. సిట్టింగ్ ఎమ్మెల్యే షిండే అభివృద్ధి విషయంలో చెప్పుకునేంత చేయకపోయినా.. వివాదరహితుడనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు పరిస్థితులను చూస్తే.. టీఆర్ఎస్ అన్ని సెగ్మెంట్లల్లో విజయాలు సాధించడం అంత తేలిక కాదనేది మాత్రం స్పష్టం అవుతోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ఫైట్ చేస్తూఉంటే.. వారికి కనీసం చెరో రెండైనా సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎత్తులు...దానికి ప్రత్యర్థుల పై ఎత్తులు..టిక్కెట్లెవ్వరికి దక్కనున్నాయి.. పార్టీల్లోని అంతర్గత విభేదాలు... ఇలా ఎన్నో అంశాలు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. -
కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
-
కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
-
ఎవరి వాటా ఎంతో చెప్పండి?
సాక్షి, కామారెడ్డి జిల్లా: రేషన్ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అంటూ.. కామా రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించా రు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్ కాస్త తడబడ్డారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ రేషన్ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగానే పేదలకు చౌకధ రల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? అని కలెక్టర్ను అడిగారు. ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో అరగంట సమయం తీసుకుని చెప్పాలని నిర్మలా సీతారామన్ సూచించారు. తర్వాత కేంద్రం బియ్యం పంపిణీకి రూ.28 ఖర్చు చేస్తోందని, ప్రజలు ఒక రూపాయి ఇస్తున్నారని, మిగతా నాలుగైదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. ప్రధాని ఫొటోలు పెట్టాలి కోవిడ్ నేపథ్యంలో నిరుపేదలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు ఎందుకు చెప్పలేక పోతున్నారన్నారు. రేషన్ దుకాణాల దగ్గర ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని లేకపోతే తానే ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలన్నారు. అంతకు ముందు బీర్కూర్ గ్రామానికి చెందిన విద్యా ర్థులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. -
అలుగులు పారే.. అందాల జోరే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామశివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి సరిగ్గా వందేళ్లవుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణమది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1917లో శ్రీకారం చుట్టి, 1922లో పూర్తిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.27.11 లక్షలు. నిజాం ప్రభుత్వ ఇంజనీర్ ఆలీ నవాబ్జంగ్ బహద్దూర్ ఆధ్వర్యంలో 21 అడుగుల ఎత్తుతో, 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రాళ్లు, డంగు సున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ నిర్మించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. కాగా, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. రెండు మండలాల్లోని 43 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా అందుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీలో ఒక ఏడాది ‘ఏ’జోన్కు, మరో ఏడాది ‘బీ’జోన్కు వంతులవారీగా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును ఐదడుగులు పెంచితే నీటినిల్వ సామర్థ్యం పెరిగి ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ డిమాండ్ను పట్టించుకునే నాథుడేలేరు. పోచారం అభయారణ్యంలో జింకల సందడి విదేశీ పక్షుల సందడి పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నదంటే విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా నైజీరియాకు చెందిన పక్షులు పెద్దసంఖ్యలో వచ్చి సందడి చేస్తాయి. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన పర్యాటకులను పక్షులు ఆకట్టుకుంటాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను బందిస్తుంటారు. అలుగులు పారే నీరు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ఎంతో శోభను సంతరించుకుంటుంది. పర్యాటకాభివృద్ధి అంతంతే.. పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పట్లో బోటింగ్ కోసం ప్రయత్నాలు జరిగినా, ముందుకు సాగలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్మించిన గెస్ట్హౌస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ముందు మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేలా టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందానికి ఆస్కారముందని జిల్లావాసులు పేర్కొంటున్నారు. వన్యప్రాణుల కోసం అభయారణ్యం... ప్రాజెక్టుకు సమీపంలో పోచారం అభయారణ్యాన్ని 1952 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కామారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ అధీనంలో ఉండగా, అభయారణ్యం నిర్వహణను మెదక్ జిల్లా అటవీ శాఖ చూసుకుంటోంది. అభయారణ్యంలో జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. సందర్శకులు వన్యప్రాణులను చూడటానికి అభయారణ్యంలో వాహనాన్ని ఏర్పాటు చేశారు. -
ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలోని గెస్ట్ హౌజ్ లో మందు పార్టీ
-
కామారెడ్డి జిల్లా: శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు స్థానికులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
సంతాయిపేట వద్ద వాగు అవతల చిక్కుకున్న రైతులు సురక్షితం
-
మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. ఉండడానికి చోటు లేక బిక్కుబిక్కుమంటూ..
మాచారెడ్డి(కామారెడ్డి జిల్లా): ఊహ తెలియని వయసులో ఆమె తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి కన్న తల్లే అన్నీ తానై పోషిస్తున్న సమయంలో మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురై కన్నుమూసింది. మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన కర్రోళ్ల ఎల్లయ్య, ఎల్లవ్వల ఏకైక కుమార్తె సోనికి కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మృతి చెందిన కొన్ని రోజులకే వారు నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోయింది. చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ ఉండడానికి చోటు లేక ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డిలోనే సోని ప్రస్తుతం నివసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరుగుగా ఉన్న ఆ చిన్న మరుగుదొడద్డిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది. గ్రామస్థుల సహకారంతో సోనికి వాడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించినా కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. -
తెలంగాణలో మంకీపాక్స్ కలకలం.. పుణె ల్యాబ్కు శాంపిల్స్
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన బాధితుడు.. 20 నుంచి జ్వరంతో బాధపడుతుండగా 23న దద్దుర్లు రావడంతో మంకీపాక్స్గా అనుమానిస్తున్నారు. బాధితుడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించారు. వారిని వైద్యులు ఐసోలేషన్లో ఉంచారు. పుణె ల్యాబ్కు మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తి శాంపిల్స్ పంపించారు. చదవండి: భారత్లో మంకీపాక్స్ కలకలం.. పెరుగుతున్న కేసులు ప్రస్తుతం భారత్లో సైతం మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో మరో పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కాగా, ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. -
ఆ విద్యార్థికి మూడుసార్లు పాముకాటు
పెద్దకొడప్గల్ (జుక్కల్): ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు ఒక విద్యార్థి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణకు శుక్రవారం ఉదయం పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్గల్లోని బాలుర సంక్షేమ హాస్టల్లో ఇదే విద్యార్థికి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. -
విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్కు తాకడంతో..
కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్ బేగం (32), కూతురు మాహీన్ (6), కుమారులు అద్నాన్ (3), ఫైజాన్ (2) ఉన్నారు. ఫైజాన్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్ ఫ్యూజ్ ఉంది. దానికి వైరు తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్ తెలిపారు. -
మంచి నీళ్లివ్వమంటే యాసిడ్ ఇచ్చారు
నిజామాబాద్ నాగారం: గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమంటే యాసిడ్ ఇచ్చారు. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన ఎల్.విజయ్కుమార్ దుస్తుల కొనుగోలు కోసం శనివారం కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్మాల్ వెళ్లి దుస్తులు కొన్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ దాహంగా ఉందని మంచి నీళ్లు ఇవ్వమని సిబ్బందిని కోరారు. సిబ్బంది నీళ్ల మాదిరిగానే ఉండే యాసిడ్ బాటిల్ ఇచ్చారు. విజయ్కుమార్ గొంతులోకి పోసుకోగానే తీవ్ర మంట ప్రారంభమై అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారంభించిన వైద్యులు పేషెంట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్కు తరలించారు. అంతకు ముందు షాపింగ్ మాల్ నిర్వాహకులతో విజయ్కుమార్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అది యాసిడ్ కాదంటూ అందులో పనిచేసే ఆనంద్ అనే ఉద్యోగి కొంచెం నోట్లో పోసుకోవడంతో గొంతులో మంటరేగి అతను కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
ప్రజా దర్బార్... రణరంగం
కామారెడ్డి టౌన్: టీఆర్ఎస్, బీజేపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో కామారెడ్డి జిల్లా కేంద్రం సోమవారం రణరంగంగా మారింది. అవినీతి, అక్రమాలు, కబ్జాలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పదిరోజులుగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరు పార్టీలు చర్చలకు సిద్ధమై మున్సిపల్ కార్యాలయంలో ప్రజాదర్బార్కు సోమవారం పిలుపునిచ్చారు. దీంతో ప్రజాదర్బార్కు అనుమతి లేదంటూ పోలీసులు 30యాక్టు అమలు చేసి, ఉదయం 9 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ తండ్రి నిట్టు వేణుగోపాల్రావు 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి దేవునిపల్లి స్టేషన్కు తరలించారు. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి రమణారెడ్డి, ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు, భూ కబ్జా బాధితులతో కలిసి కార్యాలయం ముందున్న మోర్ సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు, అధికారులు వచ్చి బాధితులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలెవరూ గుమిగూడొద్దని హెచ్చరించిన పోలీసులు బాధితులను పక్కకు లాక్కెళ్లారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన బీజేపీ నేతలు ర్యాలీగా పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి ధర్నా నిర్వహించారు. అక్కడా పోలీసులు, బీజేపీ నేతల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. అనంతరం.. రమణారెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు, నేతలను అరెస్టు చేసిన పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు. రెండు పార్టీల ఆందోళనతో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య
కామారెడ్డి క్రైం: కుళాయి దగ్గర జరిగిన గొడవ ఒకరి హత్యకు కారణమైంది. కామారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన పులి గంగాధర్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నిజామాబాద్ లో, రెండవ భార్య రాజమణి కామారెడ్డిలోని వేణుగోపాలస్వామి రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటారు. మొదటి భార్య కొడుకైన రవికుమార్(40) ఏ పనీ లేకపోవడంతో రెండేళ్లుగా కామారెడ్డిలోని తన పిన్ని దగ్గరే ఉంటున్నాడు. అయితే గతంలోనే రవికి గీత అనే మహిళతో పెళ్లికాగా, ఇద్దరు కొడుకులున్నారు. పనిచేయడానికి ఇష్ట పడకపోవడంతో భార్య గీత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం తండ్రి గంగాధర్ రెండో భార్య వద్దకు వచ్చి అక్కడ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటున్న రవిని బయటకు గెంటేశాడు. అప్పటి నుంచి రాంమందిర్రోడ్ శివాలయం ప్రాంతంలో తిరుగుతూ ఎవరైనా పనిచెబితే చేసుకుంటూ రాత్రి గుడి అరుగులపై పడుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామాలయం ఎదురుగా ఉన్న ఓ వ్యాపార సముదాయం అరుగుపై నిద్రించా డు. అర్ధరాత్రి దాటాక రవి తలపై గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో బలం గా మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నిందితుడు రిక్షా పుల్లర్ అడ్డగారి పాండుగా గుర్తించారు. నీళ్ల కుళాయి వద్ద మంచినీళ్లు పట్టుకునే విషయంలో గొడవ జరగడంతో కక్ష పెంచుకుని ఈ హత్య చేసినట్లు పాండు విచారణలో అంగీకరించాడు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన డీఎస్పీ సోమనాథం పట్టణ ఎస్హెచ్ఓ నరేశ్, ఎస్సైలు అహ్మద్, రాములు, సిబ్బంది మల్లేశ్గౌడ్, సయిద్ను ప్రత్యేకంగా అభినందించారు. -
పిడుగులు పడి 11 మందికి గాయాలు
కామారెడ్డి క్రైం/కోనరావుపేట(వేములవాడ): కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులు పడి పదకొండు మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండా శివారులో శనివారం సాయంత్రం బూ క్యా బందర్, అతని భార్య బుల్యా, కొడుకు రాజేందర్, తండాకు చెందిన బూక్యా లక్ష్మి, బూక్యా హుస్సేన్, ఇస్లావత్ గం గులు పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వచ్చింది. వెంట నే వారంతా ఓ చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో వారికి సమీపంలో పిడుగు పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అందరూ అ పస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాజన్న జిల్లాలో.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షం రావడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పిడుగు పడడంతో చెట్టుకింద తలదాచుకున్న ఐదుగురు రైతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ మామిడిపల్లికి చెందిన పన్నాల హన్మాండ్లు, పన్నాల దేవీవెంకటేశ్, అన్నాడి ఎల్లారెడ్డి, మారు మోహన్రెడ్డి, మారు బుచ్చిమల్లవ్వలను వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మండల అధికారులను ఆదేశించారు. -
‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ..
నిజాంసాగర్: కొడుకు దినకర్మ తర్వాత ‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ తల్లి సహా సమీప బంధువులు తొమ్మిది మంది ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, ముగ్గురు చిన్న పిల్లలు సహా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని ఎల్లారెడ్డి–బాన్సువాడ రహదారిపై అన్నాసాగర్ తండా సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మిగతా ఏడుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. రక్తం మడుగులో విలవిల్లాడుతున్న క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. టాటా ఏస్లో కిక్కిరిసి వెళుతూ.. పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన చౌదర్పల్లి మానయ్య ఈ నెల 4వ తేదీన మరణించాడు. శనివారం దినకర్మ పూర్తయ్యింది. కులాచారం ప్రకారం బంధువులు.. మానయ్య కుటుంబ సభ్యులను ఆదివారం ‘అంగడి తిప్పడం’కార్యక్రమం కోసం ఎల్లారెడ్డి సంతకు తీసుకువచ్చారు. సాయంత్రం వరకు ఎల్లారెడ్డి అంగడిలో గడిపిన 25 మంది టాటా ఏస్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఎదురుగా బియ్యం లోడుతో వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీని వేగంగా ఢీకొట్టింది. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్ పెద్దకొడప్గల్ మండలం తుక్దల్ గ్రామానికి చెందిన సాయిలు (32) అందులోనే ఇరుక్కుని చనిపోయాడు. ట్రాలీలో కూర్చున్న పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన చౌదరిపల్లి లచ్చవ్వ (58) కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. ఆస్పత్రుల్లో ఏడుగురు.. క్షతగాత్రులను ఎల్లారెడ్డి పోలీసులు స్థానికులు, ప్రయాణికుల సహకారంతో ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు. ఎల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాన్సువాడకు చెందిన అంజవ్వ (40) చనిపోగా, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చిల్లర్గికి చెందిన చౌద రిపల్లి వీరమణి (38), సాయవ్వ (45), పిట్లం మండలం కాటేపల్లికి చెందిన సర్వగళ్ల ఎల్లయ్య (52) మృతిచెందారు. గాయపడ్డ కొందరిని ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరవ్వ (70), చిల్లర్గికి చెందిన గంగవ్వ (44), పోచయ్య (55) మృత్యువాత పడ్డారు. మరణించిన వీరవ్వ మానయ్య తల్లి కాగా టాటా ఏస్ డ్రైవర్ సాయిలు ఆయన మేనల్లుడు. మిగిలిన వారు కూ డా సమీప బంధువులే. వీరిలో లచ్చవ్వ, వీరమణి అత్తాకోడళ్లు. ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి ట్రాలీ బయలుదేరిన పది నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకుంది. మరో అరగంట గడిస్తే చిల్లర్గికి చేరుకునే వారని, అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లేవారని బంధువులు విలపిస్తూ చెప్పారు. తమవారి మరణ వార్తతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ఏమిటీ అంగడి తిప్పడం.. జుక్కల్ నియోజకవర్గంలోని కొన్ని కులాలలో చనిపోయిన వారి దినకర్మల అనంతరం.. కుటుంబ సభ్యులు, బంధువులకు ఆ బాధ నుంచి కొంత ఉపశమనం కలిగేలా ఎక్కడైనా అంగడి (సంత)కి తీసుకువెళ్లి తిప్పడం, విందు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. బంధువులంతా తలా కొంత చొప్పున డబ్బు జమ చేసుకుని ఆ డబ్బులతో సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. -
కామారెడ్డి: కాంగ్రెస్లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, కామారెడ్డి: పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటుతో జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకె క్కాయి. ఇరువర్గాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని డీసీసీ అధ్యక్షుడు చెబుతుండగా.. పీసీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న మాజీ మంత్రి షబ్బీర్అలీ దశాబ్దాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్నారు. చదవండి: కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ అయితే ఇటీవలి కాలంలో మదన్మోహన్రావు షబ్బీర్అలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం ఆయనకు మింగుడు పడడం లే దు. జిల్లా కాంగ్రెస్ పార్టీని కాదని వేరుగా కార్యక్రమాలు చేపట్టడంపై షబ్బీర్అలీ వర్గం గుర్రుమంటోంది. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మదన్మోహన్ కామారెడ్డిలో తన ఇంటి దగ్గర ఓ కార్యాలయాన్ని ప్రారంభించడం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో షబ్బీర్అలీ తనయుడిని ఓడించడం ద్వారా షబ్బీర్అలీపై ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇ ప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్రెడ్డి వర్గం పార్టీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేపడుతోంది. అయితే మదన్మోహన్రావు వర్గం వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతుండండతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఎల్లారెడ్డి నియోజక వర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవలు సైతం జరిగాయి. ఫ్లెక్సీలు చించుకున్నారు. జిల్లా అంతటా వివాదం గతంలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మదన్మోహన్రావుకు జిల్లా అంతటా పరిచయాలు పెరిగాయి. దీంతో ఆయన జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. దీంతో పారీ్టలో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్అలీదే పైచేయిగా ఉన్నా.. ఇటీవల ఆయనను కాదని మదన్మోహర్రావు జాబ్మేళా నిర్వహించారు. దీనికి పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అజారుద్దీన్ను రప్పించడం ద్వారా షబ్బీర్అలీకి సవాల్ విసిరారని భావిస్తున్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా నేతలు విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి దిగజారింది. బాన్సువాడలోనూ రెండు వర్గాలయ్యాయి. మదన్మోహన్రావు చర్యలను ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తప్పుపడుతున్నారు. తమ నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిపై ట్రోలింగ్.. సస్పెన్షన్ వ్యవహారంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డీసీసీ అధ్యక్షుడిని వివరణ కోరడాన్ని మదన్మోహన్రావు వర్గం తనకు అనుకూలంగా తీసుకుంటోంది. మాజీ మంత్రి షబ్బీర్అలీ ప్రధాన అనుచరుడైన డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావుపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తోంది. పీసీసీ ప్రతినిధిని సస్పెండ్ చేసే హక్కు డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ మదన్మోహన్రావు అనుచరులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతేగాక డీసీసీ అధ్యక్షుడి లేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖలను జత చేసి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అంటూ పేర్కొంటూ కైలాస్ శ్రీనివాస్రావ్ ఫొటో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలా రెండువర్గాల మధ్య రోజురోజుకు ముదురుతున్న వివాదంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. 48 గంటల్లో వివరణ ఇవ్వండి పీసీసీ ఐటీసెల్ చైర్మన్గా ఉన్న మదన్మోహన్రావును సస్పెండ్చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావ్కు లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో ఆదివారం ఓ లేఖ విడుదలైంది. పీసీసీ నేతలను సస్పెండ్ చేసే అధికారం జిల్లా స్థాయి నేతలకు లేదన్న ఆయన.. ఎలాంటి ఆధారాలతో ఈ చర్యలు తీసుకున్నారో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
పెళ్లి భోజనం పెట్టలేదని.. కుల బహిష్కరణ
రామారెడ్డి: కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మద్దికుంటకు చెందిన యెల్ది పోశయ్య కూతురు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసు కుంది. విషయం తెలుసుకున్న కులపెద్దలు కులానికి పెళ్లి భోజనం పెట్టాలని పోశయ్యను అడిగారు. కులాచారం ప్రకారం పెళ్లి వరుడి ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాహన ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలన్నారు. కూతురు తమకు చెప్పకుండా వెళ్లిపోయిందని, పెళ్లి భోజనం ఎలా పెట్టాలని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన కులపెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కరించారని పోశయ్య వాపోయారు. కులపెద్దల తీరును నిరసిస్తూ ఆదివారం బాధిత కుటుంబం ఇంటికి తాళంవేసి ఇంటి ముందు సాయంత్రం వరకు దీక్షచేసింది. -
కామారెడ్డి ఆస్పత్రి ఐసీయూలో ఎలుకలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండగా ఆదివారం కొందరు రోగులు గమనించి ఫొటోలు తీశారు. ఐసీయూతో పాటు ట్రామాకేర్ సెంటర్, అత్యవసర మందులుంచే చోట కూడా ఎలుకలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. గోడలు, ఆక్సిజన్ పైప్ల వద్దకే కాకుండా పడకలపైకి కూడా వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. దీనిపై కాగా, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంవో శ్రీనివాస్ను వివరణ కోరగా, ‘ఆస్పత్రిలోకి ఎలుకలు రాకుండా నెట్లు ఉన్నాయి. ఎలా వచ్చాయో తెలియదు. సోమవారం శానిటేషన్ కాంట్రాక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. -
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేసేవారు.. చివరకు..
కామారెడ్డి క్రైం: వాళ్లిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేసేవారు.. చివరికి మృత్యువు సైతం వారిని విడదీయలేకపోయింది. రామేశ్వర్పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులిద్దరు మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన బురుగుల్ల రాహుల్(20), మహ్మద్ షఫీ(18) మంచి స్నేహితులు. రాహుల్ మున్సిపాలిటీలో కార్మికుడి గా, షఫీ స్థానికంగా ఓ మోటార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి రామేశ్వర్పల్లిలో పని ఉండడంతో శుక్రవారం బైక్పై వెళ్లారు. తిరిగి వస్తుండగా హైవేపై యూటర్న్ తీసుకోబోయారు. ఆ సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాహుల్, షఫీ అక్కడికక్కడే మృతి చెందారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. చదవండి: (భార్యపై అనుమానం.. మద్యం సేవించి..) ప్రమాదాల నిలయంగా యూటర్న్... రామేశ్వర్పల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ఇక్కడ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడగా అనేక మందికి గాయాలయ్యాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని రామేశ్వర్పల్లి గ్రామస్తులు ధర్నాలు సైతం చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించాలని కోరుతున్నారు. -
పిట్టకొంచెం.. ‘వ్యూస్’ ఘనం..
సాక్షి, కామారెడ్డి: ఆ బుడతడి వయసు ఏడేళ్లు.. చదివేది ఒకటో తరగతి.. కానీ అతడు చేసే యాక్టింగ్ యూట్యూబ్లో నవ్వులు పూయిస్తోంది. లక్షలాది మందికి ఆనందం పంచుతోంది. ఫెమోప్స్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రేసులో నిలిచిన చతురణన్పై సండేస్పెషల్.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అర్చన, సంతోష్ దంపతుల కుమారుడైన చతురణన్ బుడిబుడి అడుగులు వేసేటప్పుడే టీవీల్లో వస్తున్న సినిమాలను చూసి దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేసేవాడు. మూడేళ్ల వయసులోనే ఎంతో శిక్షణ తీసుకున్నవాడిలా నృత్యం చేయడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. డ్యాన్స్ను వీడియో తీసి బంధువులకు, స్నేహితులకు పంపించేవారు. అందరూ చతురణన్ డ్యాన్స్ను చూసి మురిసిపోయేవారు. స్కూ ల్ నుంచి రాగానే టీవీలో ఏదో ఒక పాట పెట్టుకోవడం, డ్యాన్స్ చేయడం చేసేవాడు. కొడుకులో ఉన్న టాలెంట్ను గమనించిన తండ్రి సంతోష్.. వివిధ సినిమాల పాటలు, టీజర్లను చూపించి, అలాగే చేయమంటూ ప్రోత్సహించాడు. కుమారుడి నటనను కెమెరాలో బంధించేవాడు. ఒక సినిమా టీజర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. దాన్ని మించి నటిస్తూ అందరినీ ఆకట్టుకోసాగాడు. తర్వాత ‘చతుర్ డార్లింగ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. చతురణన్ వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే 39 వీడియోలు... చతురణన్ యాక్టింగ్కు సంబంధించి యూట్యూ బ్లో ఇప్పటివరకు 39 వీడియోలను అప్లోడ్ చేశారు. చానల్కు సుమారు 6 వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. వేలమంది వీడియోలను వీక్షి స్తున్నారు. ‘పుష్ప’ స్పూఫ్స్ను లక్షలాది మంది చూశారు. బీమ్లానాయక్ టీజర్ స్పూఫ్సైతం నవ్వులు పూయిస్తోంది. వాటిని చూసివారు ఈ బుడ్డోడు మామూలోడు కాదంటున్నారు. అవార్డు రేసులో... ఫెమోప్స్ ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్స్–2022 బెస్ట్ యాక్టింగ్ కేటగిరిలో చతురణన్ నామినేట్ అయ్యాడు. ఈనెల 15 వరకు ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అత్యధిక ఓట్లు పొందిన వారిని విన్నర్గా ప్రకటించి, ఈనెల 18న హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారని చతురణన్ తండ్రి సంతోష్ తెలిపారు. నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న ఈ బుడ్డోడు.. అవార్డు రేసులో ఎంతవరకు నెగ్గుకువస్తాడో చూడాలి. మూడేళ్ల నుంచే.. మా బాబుకు చిన్నప్పటినుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. మూడేళ్ల వయసులోనే వాడిలోని ప్రతిభను గమనించాం. ప్రోత్సహిస్తుండడంతో చాలాబాగా నటిస్తున్నాడు. వాటిని యూ ట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. వ్యూయర్స్నుంచి మంచి స్పందన వస్తోంది. – సంతోష్, చతురణన్ తండ్రి, కామారెడ్డి -
అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య పింఛన్ రాక ఎలా బతకాలని రామారెడ్డికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు దుడుక సత్తవ్వ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ను ప్రశ్నిచింది. ఆదివారం రామారెడ్డి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన సత్తవ్వ తనకు పింఛన్ ఇవ్వాలని కోరింది. తనతో పాటు మరో 8 మంది వృద్ధులు ఆయాలుగా పనిచేసి రిటైర్ అయినా పింఛన్ల రావడం లేదని చెప్పింది. తమకు అంగన్వాడీ నుంచి ఎలాంటి పింఛన్లు ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
అమ్మా.. తెల్లారింది లేమ్మా!
రామారెడ్డి: రాత్రి జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఉరికి వేలాడుతున్న తల్లిదండ్రులు ఇంకా నిద్రలేవలేదనుకొని ఆరేళ్ల బాలుడు ‘అమ్మా లేమ్మా.. తెల్లారింది. నాన్న నువ్వైనా నిద్ర లెవ్వు’అని తట్టిలేపడం చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నామాల శంకర్ (40), సుజాత (35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల బాలుడు ప్రేమ్కుమార్ ఉన్నాడు. ఆదివారం రాత్రి నిద్రపోయేటప్పుడు ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కొడుకు నిద్రపోయాక ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బాలుడు ఉదయం లేచి మెడకు తాడుతో వేలాడుతున్న తల్లిదండ్రులను చూసి లేపగా వాళ్లు కదళ్లేదు. దీంతో తలుపులు తీసుకొని బయటకు వచ్చి నానమ్మ దగ్గరికెళ్లి అమ్మానాన్న నిద్రలేవట్లేదని చెప్పి తీసుకొచ్చాడు. వారి శవాలను చూసి ఆమె.. పక్కనున్నవారికి సమాచారం అందించింది. బాలుడు ‘లే అమ్మా’అని తల్లిపై పడుకొని ఏడ్వడం అక్కడున్న వారిని కలచి వేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. -
ఎవరు చంపారో? ఎందుకు చంపారో?
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామ శివారు లో శనివారం పంట పొలాల మధ్య రక్తపు మ డుగులో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలుడు మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెర సురేష్ (12)గా గుర్తించారు. అక్కంపల్లిలోని ఒడ్డెర రాములు, సాయవ్వ దంపతులకు ముగ్గురు కుమారులుండగా పెద్దవాడైన సురేష్ ఆరో తరగతి చదువుతున్నాడు. సురేష్తో పాటు మరో కుమారుడిని ఇంటివద్ద తల్లి పోచవ్వతో ఉంచి రాములు, సాయవ్వ మరో కుమారునితో బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డితోపాటు నాగిరెడ్డిపేట ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించారు. శనివారం రాత్రి వరకు బాలుని మృతిపై స్పష్టత రాలేదు. -
కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి
సాక్షి, కామారెడ్డి: కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. పట్టణంలోని హరిజనవాడ కాలనీకి చెంది బుంది గంగయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి భార్య గంగవ్వ (42) కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తరుణ్ కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గంగవ్వ మానసికంగా కుంగిపోతోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసుదన్గౌడ్ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని.. -
తొలి రోజు.. అంతంతే హాజరు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ థర్డ్వేవ్ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. -
ఆర్టీసీ బస్సుకు టోల్గేట్ బ్రేక్
పెద్దకొడప్గల్(జుక్కల్): టోల్ ట్యాక్స్ చెల్లించనందున పల్లెలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు టోల్గేట్ వద్దనే ఆగిపోయింది. ఫలితంగా గ్రామీణులు ఇబ్బందులపాలయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్గేట్ వద్ద బాన్సువాడ నుంచి పెద్దకొడప్గల్, బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, గ్రామాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సును టోల్గేట్ సిబ్బంది మంగళవారం ఉదయం నిలిపివేశారు. దీంతో బస్సు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఆయా గ్రామస్తులు పలువురు ఆర్టీసీ అధికారులను సంప్రదించగా ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీలు ట్రిప్పుకు రూ.200 నుంచి రూ.400 వసూలు అవుతుందని, టోల్ ట్యాక్స్ ట్రిప్పుకు రూ.480 ఉండటంతో నష్టం వస్తోందని తెలిపారు. రోజుకు మూడు ట్రిప్పులు బస్సును నడపలేకపోతున్నామన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు వెళ్లి టోల్గేట్ అధికారులతో మాట్లాడాలని, ట్యాక్స్ మినహాయింపు ఇస్తే బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్యెల్యే హన్మంత్ సింధే దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
పంట పొలాల్లో సంక్రాంతి వేడుక
బిచ్కుంద (జుక్కల్): సంక్రాంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లోని రైతులు శుక్రవారం పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న ఈ సంప్రదాయాన్ని ఆ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాల్లో రైతులు పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం సంక్రాంతి రోజున రైతులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఎడ్లబండి, వాహనాల్లో పంట చేలకు వెళ్తారు. దేవత ముందు వెలిగించిన దీపాన్ని ఇంటికి తీసుకెళ్తున్న మహిళలు పంటచేలలో లక్ష్మీ దేవతను ప్రతిష్టించి పూజిస్తారు. వ్యవసాయరంగంతో ముడిపడి ఉన్న పశువులనూ కొలుస్తారు. 5 రకాల కూరగాయలతో వంటలు, భక్షాలు చేసి నైవేద్యంగా పెట్టి దీపం వెలిగిస్తారు. బంధుమిత్రులతో పంట చేలలో వనభోజనాలు చేస్తారు. దేవత ముందు వెలిగించిన దీపం ఆరిపోకుండా సాయంత్రం గంపలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ దీపంతో ఇంట్లో దీపాలు వెలిగించి పాడిపంటలు పుష్కలంగా పండాలని వేడుకుంటారు. -
లగ్జరీ లైఫ్ కోసం భార్య డబ్బులు అడుగుతుందని.. భర్త స్కెచ్!
సాక్షి, సదాశివనగర్(నిజామాబాద్): విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు అడుగుతుందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. తలపై కట్టెతో కొట్టి హతమార్చిన భర్త.. మృతదేహాన్ని పంట పొలాల్లోకి తీసుకెళ్లి కాల్చివేశాడు. పూర్తిగా కాలక పోవడంతో హత్య విషయం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి సదాశివగనగర్ పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని బల్రాంపూర్ జిల్లాకు చెందిన ఫాతిమా ఖాతూన్ (26), రంజాన్ఖాన్ దంపతులు ఉపాధి కోసం మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతానికి వలస వచ్చారు. కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వీరికి నలుగురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. అయితే, ఫాతిమాకు విలాసవంతంగా బతకాలనే ఆశ ఉండేది. ఇందుకోసం డబ్బులు కావాలని భర్తను ఇబ్బంది పెడుతుండేది. ఇది మనస్సులో పెట్టుకున్న భర్త రంజాన్ఖాన్ భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 24న ఫాతిమా తలపై దుడ్డుకర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులు రియాజ్ఖాన్, పూజన్లతో కలిసి పథకం రచించాడు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొలెరో వాహనంలో మృతదేహాన్ని తీసుకుని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారుకు చేరుకున్నారు. పంట పొలాల్లో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. అయితే, పొలాల్లోకి వెళ్లిన రైతులకు సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా... ఒక బొలెరో వాహనం మర్కల్ శివారులోకి అనుమానాస్పదంగా వచ్చి తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ వాహనం కోసం భిక్కనూర్, డిచ్పల్లి టోల్గేట్ల వద్ద గల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా అటువైపు వెళ్లలేదని తేలింది. దీంతో భిక్కనూరు టోల్గేట్ సీసీ టీవీ ఫుటేజీల్లో సదరు వాహనం కనిపించింది. బొలెరో రిజిస్ట్రేషన్ నెంబర్ (టీఎస్ 08 యూఎఫ్ 5551) ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. రియాజ్ ఖాన్ వాహనాన్ని తీసుకెళ్లినట్లు తేలడంతో అతడ్ని పట్టుకుని విచారించగా, రంజాన్ఖాన్ గురించి తెలి సింది. దీంతో రంజాన్ఖాన్ (ఏ1), రియాజ్ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగతా నిందితులు నన్బాబు, రిజ్వాన్ఖాన్, పూజన్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులను సత్కరించారు. డీఎస్పీ శశాంక్రెడ్డి, సీఐ రామన్, ఎస్సై శేఖర్ పాల్గొన్నారు. చదవండి: పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్త చెవి కోసిన అల్లుడు.. -
రాయితీలు.. ఇంకా రాలే..
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు. ►కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే. నవంబర్ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్’ పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వీటికింద రాయితీ, స్టాంప్ డ్యూటీ, సేల్స్ టాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. బడ్జెట్లో కేటాయించినా..! రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు బడ్జెట్లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి. -
‘బోల్తా’ కొట్టిన గంజాయి గుట్టు
కామారెడ్డి క్రైం: పోలీసుల కళ్లు కప్పి... గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిద్దామనుకున్నారు. కానీ అదుపుతప్పిన వాహనం వారిని పట్టుబడేలా చేసింది. ఆదివారం సాయంత్రం కామారెడ్డి పట్టణ శివారులో జరిగిన ఈ ఘటనలో పోలీసులు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్వైపు నుంచి నిజామాబాద్ వైపు ఓ వాహనం వెళ్తోంది. క్యాసంపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వారు వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని చూడగా వాహనంలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్లు 15 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం కామారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని భావించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ, రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. -
అవి అవ్వ-తాతల సంఘాలు.. కొడుకు, కోడళ్లతో ఎలా మెలగాలో చెబుతాయి..
జీవితాంతం కనాకష్టం చేసి.. చరమాంకంలో తమకంటూ ఏమీ మిగుల్చుకోని స్థితి వృద్ధులది. పెద్దలు చెప్పింది పిల్లలు వినరు. ‘అత్త మూతి విరుపు... మామ చాదస్తం’ అంటారు. అలాగే పిల్లల చేతలు పెద్దలకు నచ్చవు. ‘కొడుకు పట్టించుకోడు.. కోడలు సూటి పోటి మాటలు’ అని పుట్టడన్నీ ఫిర్యాదులు. ఇలా చిన్నచిన్న ఇబ్బందులతో మొదలైన మాటలు పంచాయతీ దాకా వస్తుంటాయి. చివరికి పెద్ద మనుషులనో, పోలీసు స్టేషన్ల నో ఆశ్రయించాల్సిన పరిస్థితి చాలా కుటుంబాలది. అయితే కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ సీన్ కనిపించదు. అక్కడ పండుటాకులంతా సం ఘటితమయ్యారు. వృద్ధాప్యంలో ఒకరికొకరై, అందరూ ఒకటై... ఆపద వస్తే ధైర్యాన్నిస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలకు బుద్ధి చెబుతారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని మోతె గ్రామంలో వృద్ధులు గాంధీ మహాత్ముని స్ఫూర్తితో 2009లో ‘తాత సంఘం’స్థాపించారు. 60 ఏళ్లు పైబడిన 60 మందితో మొదలైన సంఘం ఇప్పుడు 108 మందికి చేరింది. ప్రతి నెల రూ.పది చొప్పున జమ చేస్తారు. సంఘం కోసం షెడ్డు నిర్మించుకున్నారు. గాంధీ విగ్రహంతోపాటు అందరి పేర్లతో రూపొందించిన శిలాఫలకాన్నీ పెట్టుకున్నారు. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్ల తో ఎలా మెలగాలనేది చర్చించుకుంటారు. చదవండి: తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా కోమట్పల్లిలో తాత, అమ్మల సంఘం లింగంపేట మండలం కోమట్పల్లిలో 2018లో ‘తాత, అమ్మ’ల సంఘం ఏర్పాటైంది. ఇందులో 93 మంది సభ్యులున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు సంగయ్య సహకారంతో సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు. సభ్యులు ప్రతినెల ఒక్కొక్కరూ రూ. 50 సంఘంలో జమ చేస్తారు. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటారు. సమస్య వస్తే కలిసి పరిష్కరించుకుంటున్నారు. చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు దేమికలాన్లో వయో వృద్ధుల సంఘం తాడ్వాయి మండలం దేమికలాన్లో 2017లో ‘పార్వతీ దేవి వయో వృద్ధుల సంక్షేమ సంఘం’ఏర్పాటైంది. 40 మందితో మొదలైన సంఘం ఇప్పు డు 80 మందికి చేరింది. ఇందులో పది మంది మహిళలు ఉన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ రూ.పది తీసుకుని సమావేశానికి వస్తారు. సంఘం సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నిధులతో కలిపి రూ.5 లక్షలతో భవనం నిర్మించుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సహాయం తో ఫర్నీచర్ను సమకూర్చుకున్నారు. ప్రతి రోజూ అక్కడకు వచ్చి సాదకబాధకాలు పంచుకుంటారు. -
పాలన చేతకాకే ధర్నాలు
సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలన చేతగాకే ధర్నాలంటూ కొత్త నాటకానికి తెరలేపారని, చావుడప్పు కొట్టాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వానికేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రైతుల చావులకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమ ని ఆరోపించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె సోమవారం కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ఇటీవల సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో వడ్ల కొ నుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. లింగంపేట మండలం ఐలాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన బీరయ్య కుటుంబాన్ని, నాగిరెడ్డిపేట మండలం వదల్పర్తిలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నూరి యాదయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న సీఎం కేసీఆర్ రైతుల ఉసురు పోసుకున్నారని షర్మిల మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వానలో నానుతూ, చలిలో వణుకుతూ పలువురు రైతులు పడిగాపులుగాసి చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. బాధిత రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు పండించిన పంటలను కొనడం లేదు, పింఛన్ల కోసం ఏళ్ల తరబడిగా వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్లు కొనకుంటే ఆమరణ దీక్ష చేస్తా.. యాసంగిలో వడ్లను కొనకుంటే ఆమరణ దీక్షకు కూర్చుంటానని షర్మిల వెల్లడించారు. యాసంగి వడ్లు కొనబోమని కేసీఆర్ చెబుతున్నారని కొందరు రైతులు షర్మిల దృష్టికి తీసుకురాగా, మీరు వరి పండిస్తే కొనుగోలు కోసం తాను పోరాడుతానని, ఆమరణ దీక్ష చేపట్టయినా ధాన్యం కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో వైఎస్సార్టీపీ నాయకులు ఏపూరి సోమన్న, నీలం ర మేశ్, రాజగోపాల్, చంద్రహాస్రెడ్డి, రఘునాథ్రెడ్డి, చైతన్యరెడ్డి, రాంరెడ్డి, పొ ట్కూరి తిరుపతిరెడ్డి, గౌతం ప్రసాద్, సత్యవతి, తాహెర్, సుధాకర్ పాల్గొన్నారు. -
కామారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆమె పరామర్శించారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, లింగంపేట మండలం ఐలాపూర్, నాగిరెడ్డిపేట మండకం వడల్ పర్తి గ్రామాల్లో ఈ యాత్ర సాగుతుండగా.. షర్మిలకు అడ్లూరు ఎల్లారెడ్డిలో ప్రజలు, రైతులు స్వాగతం పలికారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. చదవండి: ఏ అధికారంతో వరి వద్దంటున్నారు? -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
నిజాంసాగర్ (జుక్కల్): వారు దర్గా వద్ద మొక్కులు తీర్చుకొని క్వాలిస్ వాహనంలో ఇంటికి తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యంలో ఆ వాహనం అతివేగంగా వెళ్లి ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఏడు గురు మృత్యువాతపడ్డారు. వీరిలో రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలున్నారు. మరో ఐదుగురు పిల్లలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం జగన్నాథపల్లిలో సంగారెడ్డి– నాం దేడ్ 161 జాతీయ రహదారిపై శనివారం మధ్యా హ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్నేహితులైన హైదరాబాద్లోని మూసానగర్, వినాయక వీధి ప్రాంతాలకు చెందిన మహమ్మద్ అమీర్తాజ్, మహమ్మద్ హుస్సేన్ తమ కుటుంబాల్లోని మొత్తం 12 మందితో కలసి రెండురోజుల క్రితం క్వాలిస్ వాహనంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఖందార్ దర్గాలో కందురు చేసేందుకు వెళ్లారు. మొక్కులు తీర్చుకొని వస్తుండగా... ఖందార్ దర్గా వద్ద మొక్కులు తీర్చుకుని అమీర్, హుస్సేన్ కుటుంబాలు తిరుగుప్రయాణంలో 110 కిలోమీటర్ల దూరం వచ్చారు. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ జగన్నాథపల్లి దాబా వద్ద రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్ దాబాలోకి వెళ్లేలోపు క్వాలిస్ అతివేగంగా వచ్చి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో క్వాలిస్ ముం దుభాగం లారీ కిందికి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదం లో అమీర్ (29), అతని భార్య పర్వీన్ సనా (20) వారి ఇద్దరు పిల్లలు అలియా పాతిమా (18 నెలలు), హన్నన్ ఫాతిమా, అలాగే, హుస్సేన్ (33), తస్లీమ్ బేగం(26) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్సేన్ కూతురు నూర్ బేగం (8) నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మరణించింది. మరో ఐదుగురు పిల్లలు అజార్ బేగం, సుల్తానా, హరి, హిబా, యాస్మిన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైనవారిలో నలుగురు హుస్సేన్ పిల్లలు కాగా, మరొకరుసనా పర్వీన్ అక్క కూతురైన యాస్మా బేగం ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి, బిచ్కుంద సీఐ శోభన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను 108 అంబులెన్స్లో బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనాథలైన హుస్సేన్ పిల్లలు ప్రమాదంలో మృతి చెందిన హుస్సేన్(33), తస్లీం బేగం(26) దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కూతుళ్లు హాజరాబేగం, నూర్బేగం, సుల్తానా బేగం, హిబా, కుమారుడు అలీ ఉన్నారు. హుస్సేన్ దంపతులతోపాటు కూతురు నూర్ బేగం మృతి చెందారు. మిగిలిన నలుగురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. బహుత్ అచ్చా రహ్తె థే: షేక్ జహంగీర్, సనా బంధువు, నిజామాబాద్ మా అన్న కూతురైన సనా, అమీర్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఎంతో ప్రేమతో ఉండే వీరిని రెప్పపాటులో మృత్యువు కబళించింది. ఇద్దరు పిల్లలూ చనిపోయారు. చాలా బాధగా ఉంది. చదవండి: పెళ్లయిన 42 రోజులకే.. నవ వధువు హత్య!.. మూఢనమ్మకాలతో భర్తే అలా చేశాడా? చిన్ననాటి స్నేహితులు... మృతులు మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ అమీర్ చిన్ననాటి స్నేహితులు. హుస్సేన్ వాటర్ప్లాంట్ నిర్వహిస్తుండగా అమీర్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. వీరు ప్రతిఏటా దర్గాకు వెళ్లి వస్తుంటారు. వీరి స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. -
మారిన తర‘గతి’
సాక్షి, కామారెడ్డి: చెట్ల కింద నడుస్తున్న పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం నిర్మాణానికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రకటించారు. చెట్లకింద కొనసాగుతున్న కామారెడ్డి జిల్లా పల్లెగడ్డతండా ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ఇదీ తర‘గతి’... కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పల్లెగడ్డతండా పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసి, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. -
దోమకొండ ఫోర్టులోపోచమ్మ పండుగ
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండగడీ కోట వారసులైన కామినేని అనిల్కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం కోటలో పోచమ్మ పండుగ నిర్వహించారు. పెళ్లికూతురు అనుష్పాల పోచమ్మకు బోనం సమర్పించారు. ఈ పండుగ కోసం రిటైర్డు ఐఏఎస్ అధికారి, దివంగత కామినేని ఉమాపతిరావ్ భార్య పార్వతమ్మ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చారు. వేడుకలకు సినీ నటుడు రామ్చరణ్ తేజ, ఆయన సతీమణి ఉపాసనతో పాటు అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్రెడ్డి, మాజీ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరయ్యారు. అపోలో ఆస్పత్రులకు చెందిన వందలాది మంది ఉద్యోగులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
హైదరాబాద్ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని..
సాక్షి, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్గా గుర్తించారు. చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..! స్థానికుల కథనం ప్రకారం.. దళితవాడకు చెందిన నడిపి నరేష్ కొంత కాలంగా హైదరాబాద్కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కొద్దిరోజులుగా ఆ అమ్మాయి నరేష్తో మాట్లాడటం లేదని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటి వద్ద బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరేష్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హృదయ విదారకం: రోగికి ఊపిరి పోస్తుండగా.. ఆగిన డాక్టర్ గుండె
సాక్షి, గాంధారి (కామారెడ్డి): గుండెపోటుకు గురైన ఓ రోగికి ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలో వైద్యుడు సైతం గుండెపోటుకు గురయ్యాడు. వైద్యం అందించేలోగానే తుదిశ్వాస విడిచాడు. దీంతో రోగిని అంబులెన్సులో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అతనూ మార్గమధ్యలోనే కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే... గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్గు (60) ఆదివారం ఉదయం గుండెనొప్పితో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధారి మండల కేంద్రంలోని ఎస్వీ శ్రీజ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని నడుపుతున్న డాక్టర్ డి. లక్ష్మణ్ (45) వెంటనే వైద్య సేవలు మొదలు పెట్టారు. రోగిని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే డాక్టర్కు గుండెపోటు వచ్చింది. ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది వెంటనే సమీపంలో ఉన్న మరో ఆస్పత్రి వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం అందించే ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే మరణించారు. అదే సమయంలో రోగి జగ్గును అంబులెన్స్లో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అటు డాక్టర్, ఇటు రోగి నిమిషాల వ్యవధిలో మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ముందురోజు సరదాగా గడిపి.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ డి. లక్ష్మణ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య స్నేహలత, ఇద్దరు కుమార్తెలు దీక్షణి, దర్శణి ఉన్నారు. ఆరు నెలల క్రితం గాంధారి మండల కేంద్రంలో సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఎం.ఫార్మసీ చదివిన భార్య స్నేహలత ఆస్పత్రిలో మెడికల్ షాప్ చూసుకుంటున్నారు. ఆయన ఇటీవలే అయ్యప్ప మాల ధరించారు. శనివారం భార్య, పిల్లలతో స్థానికంగా ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సరదాగా గడిపి వచ్చిన డాక్టర్ ఆదివారం ఉదయమే మేల్కొని చన్నీటితో స్నానం చేసి పూజలు పూర్తి చేసుకున్న సమయంలోనే గుండెపోటుకు గురైన జగ్గును అతని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతనికి వైద్యం అందించే ప్రయత్నంలో డాక్టర్ లక్ష్మణ్ చనిపోవడం అందరినీ కలచి వేసింది. డాక్టర్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. భార్య, పిల్లల రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం గుండెపోటు రావడంతో గాంధారి మండలంలోని ఎస్వీ శ్రీజ మల్లి స్పెషలిస్ట్ ఆసుపత్రికి వారి బంధువులు తీసుకొచ్చారు. పేషేంట్కు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్ లక్ష్మణ్కు కూడా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పేషేంట్కి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మధ్యమార్గంలో రోగి కూడా మృతి చెందారు. దీంతో గాంధారి మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. చదవండి: టెన్త్ క్లాస్మెట్.. పెళ్లి చేసుకుంటానని యువతిని లొంగదీసుకుని.. -
కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య (50) ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాజయ్య ధాన్యం నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రానికి తరలించి 15 రోజులు గడుస్తోంది. వర్షాలు పడటంతో ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. రెండు రోజుల నుంచి ఛాతీలో నొప్పి వస్తోందని కుటుంబీకులతో చెబుతున్నాడు. గురువారం సాయంత్రం కూడా ధాన్యం ఆరబెడుతున్న సమయంలో ఛాతీలో నొప్పి వస్తోందని తోటి రైతులకు చెప్పడంతో వారు రాజ య్య భార్య రాజవ్వకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాజయ్య మృతి చెందాడు. -
ధాన్యం ట్రాక్టర్లతో రైతుల రాస్తారోకో
కామారెడ్డి రూరల్: రైస్మిల్లర్ల తీరుతో రైతన్నకు కోపం వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని సరంపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం ధాన్యం ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. సరంపల్లి గ్రామం రైతుల వద్ద నుంచి రెండ్రోజుల క్రితం వచి్చన 200 బస్తాల ధాన్యాన్ని చిన్నమల్లారెడ్డిలోని ఓ రైస్మిల్ యాజమాన్యం గురువారం వెనక్కి పంపించింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగా రు. కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకా రం రైతులు ధాన్యం విక్రయించారు. ఆ కేంద్రం నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించగా మిల్లర్.. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. కేం ద్రం నిర్వాహకులు చూసినప్పుడు తేమ శాతం నిబంధనలకు లోబడే ఉందని, వర్షం రావడం.. వాతావరణంలో మార్పు కారణంగా తేమ శాతం పెరిగి ఉండొచ్చని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్ల ఆగడాలు మితిమీరి పోతున్నా యని రైతులు ఆరోపించారు. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగితే తప్పు తమదా? అని రైతులు ప్రశ్నించారు. దేవునిపల్లి ఎస్ఐ రవికుమార్, రూరల్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, పోలీసు సిబ్బంది, తహసీల్దార్ ప్రేమ్కుమార్ తదితరులు రైతులను సముదా యించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
నా భర్తతో ఉండను.. రాందాస్తోనే ఉంటా..
సాక్షి, పిట్లం(కామారెడ్డి): వివాహిత ప్రేమ వ్యవహారం ఆమె ప్రియుడి ప్రాణం మీదికి తెచ్చింది. భర్త దాడి చేయగా ప్రియుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైయ్యాడు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని నాగంపల్లితండాకు చెందిన చందర్కు, కాస్లాబాద్తండాకు చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలిపని చేస్తూ నివసిస్తుండేవాడు. గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మి, తలాబ్తండాకు చెందిన రాందాస్ అనే యువకుడు ప్రే మించుకుంటున్నారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) ఈక్రమంలో శుక్రవారం రాందాస్ నాగంపల్లితండాలోని లక్ష్మిని కలవడానికి వెళ్లగా భర్త చందర్, కుటుంబసభ్యులు అతడిని బెదిరించి పంపించివేశారు. వెంటనే లక్ష్మి, తన పిల్లలతో కలిసి పిట్లం పోలీస్స్టేషన్కు వెళ్లి తన భర్తతో ఉండనని, రాందాస్తోనే ఉంటానని తెలిపింది. రాందాస్, లక్ష్మి స్టేషన్లోనే ఉండగా.. సాయంత్రం రాందాస్ కానిస్టేబుల్ను వెంటతీసుకొని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ లక్ష్మి భర్త చందర్ కత్తితో రాందాస్పై దాడి చేసి తల, ఛాతి, కడుపుపై మూడు కత్తిపోట్లు పోడిచాడు. వెంటనే కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో చందర్ని పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితుడు రాందాస్ను చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. చదవండి: (విషాదం: కలిసి చదివారు.. కలిసున్నారు.. చివరికి కలిసే..) -
కేటీఆర్ ట్వీట్పై స్పందించిన మహేశ్ బాబు
Mahesh Babu Retweet To Minister KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. మహేశ్ చిత్రం శ్రీమంతుడు మూవీ స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట్లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు. అది చూసిన మహేశ్ కేటీఆర్ ట్వీట్కు రీట్వీట్ చేస్తూ.. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ గురించి తెలుసుకున్న ఆయన... శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానంటూ ట్వీట్ చేశారు. అలాగే బీబీపేట్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సుభాష్ రెడ్డి వంటి వాళ్లు సమాజానికి అవసరమంటూ మహేశ్ ప్రశంసలు కురిపించారు. చదవండి: కొరియన్ భామతో ప్రభాస్ రొమాన్స్! కాగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ నాయకుడు సుభాష్ రెడ్డి తన సొంత ఖర్చులతో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వం పాఠశాలను నిర్మించారు. ఈ స్కూల్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత గొప్పగా పాఠశాల నిర్మించడం హర్షించదగ్గ విషయమని, సొంత ఊరి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదన్నారు. పాఠశాల నిర్మాణం కోసం రూ. 6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్త సుభాశ్ రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారి నానమ్మ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ అలాగే శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ పాఠశాల కట్టించారని ముందే తెలిస్తే.. మహేశ్ బాబును ఈ కార్యక్రమానికి తీసుకొచ్చే వాడిని అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు కట్టే జూనియర్ కాలేజ్ పూర్తయిన తరువాత మహేష్ బాబుని తీసుకొద్దాం అని కేటీఆర్ నిన్న జరిగిన మీటింగ్లో ఆయన అన్నారట. తన చిత్రం శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల నిర్మించారని ఇక కేటీఆర్ ట్వీట్తో తెలుసుకున్న మహేశ్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సుభాశ్ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం’ అంటూ మహేశ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ — Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021 -
మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
KTR: ఇక ఊరుకోం: విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, కామారెడ్డి/బీబీపేట: ‘బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఇన్నిరోజులు ఓపిక పట్టినం. ఇగ ఊరుకునేది లేదు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టుడే. మాటకు మాట అంటం. ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేవూంగా. వడ్లు కొనమంటే కథలు చెబుతుండ్రు. ఈ అంశంపై కేంద్రం మెడలు వంచేవిధంగా ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమస్ఫూర్తితో ఆందోళనలు చేపడతాం’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ సాఫ్ట్ అయ్యారని అనుకుంటున్నారా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఇక నుంచి పాత కేసీఆర్ను చూస్తరు’అని హెచ్చరించారు. ‘ధాన్యం కొనుగోలు చేయబోమని ఢిల్లీ బీజేపీ అంటది, వరిపంట వేయుండ్రని సిల్లీ బీజేపీ చెబుతది.. ఇదెక్కడి పద్ధతి. బీజేపీ నేతలు ఎక్కువ నీలుగుతున్నరు. బాండ్పేపర్ మీద సంతకాలతో మోసం చేసి గెలిచినోళ్లు, తెలంగాణ కోసం ఏమీ చేయనోళ్లు ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నరు. టీఆర్ఎస్ తగిన సమాధానం చెబుతుంది’అని అన్నారు. తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివకుమార్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తుంటే, ఇక్కడి బీజేపీ నేతలకు మాత్రం అవి కనబడవని ఎద్దేవా చేశారు. జాతి నిర్మాణంలో తెలంగాణ కీలకం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, వెయ్యి గురుకులాలు తెరిచి 5 లక్షల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఐదు శాతం జీడీపీతో జాతి నిర్మాణంలో కీలకంగా మారిందని, తలసరి ఆదాయం రెట్టింపు అయిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి నాలుకలు కోసే దాక వదలమని మంత్రి ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (KTR: వసూలు ఇక్కడ.. ఖర్చు అక్కడా?) మహేశ్బాబును తీసుకొచ్చేవాళ్లం గదా.. ప్రత్యేక ‘మిషన్’తో పనిచేసి సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చామని, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపామని, అదేస్ఫూర్తితో విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో జనగామకు చెందిన వ్యాపారవేత్త సుభాష్రెడ్డి–రజనీ దంపతులు రూ.6 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ‘తిమ్మయ్యగారి సుశీల–నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల’భవనాన్ని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ‘సుభాష్రెడ్డి స్ఫూర్తితో మా నాయనమ్మ సొంత గ్రామమైన పోసానిపల్లె (కోనాపూర్)లో ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దుతాను’అని పేర్కొన్నారు. శ్రీమంతుడు సినిమా తన కొడుకు నిహాంత్ను ఆలోచింపచేసిందని, పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలని ప్రేరేపించడంతో స్కూల్ భవనాన్ని కట్టించానని సుభాష్రెడ్డి తనతో చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఆ విషయం ముందుగానే చెబితే ఆ సినిమా హీరో మహేశ్బాబును ప్రారంభోత్సవానికి తీసుకొచ్చేవాళ్లమని అన్నారు. జూనియర్ కాలేజీ పూర్తయిన తరువాత మహేశ్బాబును తీసుకొస్తానని చెప్పారు. ప్రతిఒక్కరూ సుభాష్రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సొంత ఊరి రుణం తీర్చుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. -
అప్పుల బాధ తాళలేక..
బాన్సువాడ రూరల్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసు కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం డలం హన్మాజీపేట్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సింగం శంకర్ (52) ఇటీవలే వరి పంట కోసి తన పొలం పక్కనే ఆరబె ట్టాడు. ఆదివారం రాత్రి ధాన్యం కాపలా కో సం ఇంటి నుంచి వెళ్లిన అతడు.. సోమవారం తెల్లవారు జామున పురుగు ల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం కుప్పపై విగతజీవిగా పడిఉన్న శంకర్ను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంటలు పండక నష్టాలు వచ్చి అప్పులు పెరిగి పోయాయని మృతుడి భార్య లక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. -
కార్లను కుమ్మేసి.. మనుషులను పొడిచేసి..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం చూపింది. మూడు గంటలపాటు ఆవు సృష్టించిన గందరగోళంతో అశోక్నగర్, శ్రీనివాసనగర్ కాలనీ వాసులు హడలిపోయారు. కనిపించిన వారినల్లా పొడవడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. పార్క్ చేసి ఉన్న కార్లను సైతం వదలకుండా కొమ్ములతో కుమ్మడంతో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. ఆవు దాడిలో ముగ్గురికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చివరకు పోలీసులు, పశువైద్య అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో ఆవును బంధించి మత్తు మందు ఇచ్చి నియంత్రించారు.దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
అంగన్వాడీలో టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి
మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రంలో ప్రమా దవశాత్తు టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మద్నూర్ మండలం రాచూర్కి చెందిన సూర్యకాంత్ కుమార్తె అదితి(5) శనివారం మినీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం ఆ బాలిక నోటి నుంచి నురగ రావడం గమనించిన అంగన్వాడీ కార్యకర్త నగరబాయి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది. దీంతో కుటుంబసభ్యులు చిన్నారిని మహారాష్ట్ర దెగ్లూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు చిన్నారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, అదితి టర్పంటాయిల్ను అంగన్వాడీ కేం ద్రంలో తాగిందా.. లేక ఆ సమీపంలోని అంగన్ వాడీ కార్యకర్త ఇంట్లో తాగిందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాప టర్పం టాయిల్ తాగి మృతి చెందిందని, దీనికి కార్యకర్త నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీడీపీవో సునంద వివరణ కోరగా, ఆదివారం ఉదయం రాచూర్కు వెళ్లి విచారణ చేపడతామని, ఆ తర్వాతే పాప మృతికి గల కారణాలు వివరిస్తామని బదులిచ్చారు. -
‘దళితబంధు’ పేరుతో వంచన
సాక్షి, కామారెడ్డి: దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పేరుతో మరోసారి వారిని వంచిస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరో పించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూర్లో శుక్రవారం నిర్వహించిన ‘జుక్కల్ దళితభేరి’సభలో ఆమె మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం మూలంగా ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు ప్రభుత్వం బాకీ పడిందని, భూమి ఇచ్చి ఉంటే గడచిన ఏడేళ్లలో కనీసం రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని, వీటన్నింటిని కలిపితే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వం ఇచ్చే రూ.పది లక్షలు తీసుకుని మిగతాడబ్బుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చా రు. తాతల కాలం నుంచి దళితులు సాగు చేసుకుం టున్న భూములకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలు ఇచ్చారని, కేసీఆర్ ప్రభుత్వం వాళ్లకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితులంటే సీఎంకు పట్టింపు లేదు... సీఎం కేసీఆర్కు దళితులంటే పట్టింపులేదని, ఇసుక అక్రమరవాణాపై ప్రశ్నించిన పాపానికి దళిత యువకులను చితకబాది జైల్లో వేశారని, దళితమహిళలను చంటి బిడ్డలతోసహా జైలుకు పంపించార ని షర్మిల విమర్శించారు. రాష్ట్రమంతటా రూ.వందల కోట్ల ఇసుక దందా నడుస్తోందని ఆరోపించా రు. మంజీరలో ఇసుకను అడ్డగోలుగా తవ్వడం వ ల్లే నలుగురు ప్రాణాలు కోల్పోయారని, ఇసుక మా ఫియాలో టీఆర్ఎస్ నేతలకు వాటాలున్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బిచ్కుంద మండలంలోని షెట్లూర్లో ఇటీవల నీటమునిగి చనిపోయినవారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. -
Kamareddy: నా కూతురిని బతికించండి..
సాక్షి, హైదరాబాద్: చదువుల తల్లి అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. డబ్బుల్లేక ఆమె తల్లిదండ్రులు ఇల్లు, ఆటో అమ్మేసుకున్నారు. వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ప్రసుత్తం కామారెడ్డి జిల్లాకు చెందిన రుబినా ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచింది. ఐసెట్లో ర్యాంకు సాధించిన రుబినా డెంగీ పాజిటివ్తో పాటు ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోయి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టుపోయి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆపరేషన్ కోసం రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆటో డ్రైవర్ అయిన ఆమె తండ్రి దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రుబినాకు ఆపరేషన్ అత్యవసరం మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రుబినాను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను బతికించాలని వేడుకుంటున్నారు. ఫోన్పే లేదా గూగుల్ పే 94931 06370, 97030 58557 యూసుఫ్(రుబినా తండ్రి), బ్యాంక్ అకౌంట్ నంబర్లు 758402010000266, ఐఎఫ్సీ కోడ్ –యూబీఐఎన్0575844, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
కామారెడ్డి జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం
-
మిస్టరీగా మారిన తిమ్మక్పల్లి ఆర్మీ జవాన్ మిస్సింగ్
-
పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కన్న కొద్దిసేపటికే బావిలో దూకి..
సాక్షి, కామారెడ్డి: అప్పుడే పుట్టిన శిశువును ముళ్ళ పొదల్లో వేసి, ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్ తండాలో చోటుచేసుకుంది. గ్రామంలోని దుర్గం చెరువు వద్ద ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యమైంది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న గాంధారి ఎస్సై, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సరస్వతి శిశువును కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ శిశువును అబ్జర్వేషన్లో ఉంచారు. తండా వాసులు ఇచ్చిన సమాచారం ప్రకారం శిశువు తల్లి అవివాహిత కావడంతో పసికందును ముళ్లపొదల్లో వదిలేసి అమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు -
నడవలేని బాల్యం!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన సింగసాని కాశీరాం, స్వప్న దంపతులకు ఇద్దరు కొడుకులు అభినవ్ సాయి, అభినందన్. పిల్లలను కామారెడ్డిలో చదివిస్తున్నారు. హఠాత్తుగా ఒకరోజు స్కూళ్లో బెంచీ పైనుంచి అభినవ్ సాయి కిందపడిపోయాడని ఫోన్ వచ్చింది. అప్పటినుంచి పిల్లాడి కాళ్లు పనిచేయట్లేదు. ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. హైదరాబాద్లో బ్రెయిన్ ఎంఆర్ఐ చేశారు. సీరియస్ సమస్య ఉందని అనుమానించి వైద్యులు ముంబైలో పరీక్షలకు పంపారు. అక్కడి నుంచి బెంగళూరు ఎయిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు తొడ మాంసాన్ని తీసి పరీక్షల కోసం అమెరికా పంపారు. కండరాల క్షీణత వ్యాధి అని నిర్ధారణ అయింది. చిన్న కుమారుడికి కూడా పరీక్షలు చేయగా, అతడికీ అదే సమస్య ఉందని తేల్చారు. 2015 నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆస్తులన్నీ అమ్మి రూ.1.82 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరకు భార్యా పిల్లలతో కలసి చనిపోవాలని నిర్ణయించుకుని, చివరి నిమిషంలో విర మించుకున్నారు. కళ్ల ముందే చనిపోతున్నా.. జన్యుసంబంధ సమస్యలు పిల్లల్లో కండరాల క్షీణతకు దారితీస్తున్నాయి. వేలల్లో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పిల్లల్ని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కట్లేదు. ఇటీవల కండరాల క్షీణత నుంచి కోలుకునే మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ అత్యంత ఖరీదైనది కావడంతో వైద్యం చేయించుకోవడం సాధ్యం కావట్లేదు. ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.4 కోట్లు ఉంటుందని, ఒక్కొక్కరికీ నాలుగు డోసులు ఇవ్వాలంటే రూ.16 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత ఏ ఒక్క కుటుంబానికీ లేదు. దీంతో చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాకు ముందు రాష్ట్రంలో 3,250 మంది వరకు కండరాల క్షీణత బాధితులు ఉండగా, అందులో చాలామంది చనిపోయారు. ఇప్పుడు 923 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. కండరాల క్షీణత వ్యాధి బాధితులు వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఫోన్ నంబర్లు షేర్ చేసుకుని, వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నారు. వైద్యం విషయంలో ఎవరికి తెలిసిన సమాచారం వారు షేర్ చేసుకుంటున్నారు. మంచానికే పరిమితం.. జన్యుపరమైన కండరాల క్షీణత వ్యాధితో లేవలేని, నడవలేని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు మంచానికే పరిమితం అవుతున్నారు. కూర్చోబెడితే కొంతసేపు కూర్చుంటారు. తర్వాత ఎటో ఒకవైపు పడిపోతున్నారు. మూత్రానికి వెళ్లాలన్నా, స్నానం చేయాలన్నా తల్లిదండ్రులు మోసుకువెళ్లాల్సిందే. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. దీంతో ఆ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక çకష్టాల్లో చిక్కుకుంటున్నారు. వైద్యం చేయించలేక పేద, మధ్య తరగతి వాళ్లు దేవుడిపైనే భారం మోపుతున్నారు. సర్కారు కరుణ అవసరం.. కండరాల క్షీణతతో వందలాది మంది పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కళ్ల ఎదుటే పిల్లలు మరణిస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వేదన అనుభవిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన మందులను ప్రభుత్వం కొనుగోలు చేసి వైద్యం అందిస్తే పిల్లలు జీవించే అవకాశాలు ఉన్నాయి. సర్కారు ఆదుకుంటేనే తమ పిల్లల ప్రాణాలు దక్కుతాయని, మానవతా దృక్పథంతో ప్రభుత్వం ముందుకు రావాలని వేడుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. హైదరాబాద్ నగరంలోని హస్తినాపురం శ్రీరమణ కాలనీకి చెందిన తిరుపతిరెడ్డి, గీత దంపతుల కొడుకు సాయికుమార్రెడ్డి (17) కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పటి వరకు రూ 6 లక్షలు ఖర్చు చేశారు. ‘ఇప్పటి వరకు రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బు మొత్తం కొడుకు కోసమే ఖర్చుపెట్టాం. ఇప్పుడిక చేతిలో నయాపైసా కూడా లేదు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి’అని తిరుపతిరెడ్డి కోరారు. -
యాదాద్రి రింగ్రోడ్డు.. అందాలు మెండు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావంతోపాటు ఆహ్లాద వాతావరణం కలిగేలా వైటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. యాదాద్రి కొండ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రింగ్రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు నాటుతోంది. ప్రెసిడెన్షియల్ సూట్కు సమీపంలో నిర్మించిన సర్కిల్ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 60 మీటర్లతో ఏర్పాటు చేసిన ఈ సర్కిల్లో చెన్నై నుంచి తెచ్చిన ఫీనిక్స్ ఫాం జాతి మొక్కలతోపాటు సీజనల్ పూల మొక్కలను నాటారు. దీంతో ఇప్పుడు ఆ సర్కిల్ రంగుల వలయంలా మారి ఆకట్టుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్ యాదాద్రి భువనగిరి యూరియా.. రైతుల బాధ ఇదయా! కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. –సదాశివనగర్ (ఎల్లారెడ్డి) జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో ధరూరు/దోమలపెంట(అచ్చంపేట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు 1,00,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇన్ఫ్లో తగ్గడంతో ఉదయం ప్రాజెక్టు 15క్రస్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 10 క్రస్టు గేట్లను ఎత్తి 67,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 1,00,948 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.914 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి 1,45,169 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. రెండు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,692 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 64,487క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. -
విషాదం: అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం
సాక్షి, కామారెడ్డి: అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేష్ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్ మృతదేహం లభ్యమైంది. హత్య లేక ఆత్మహత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన
-
ఆ ‘స్వామి’ లీలలెన్నో: విలాస జీవితం.. పెళ్లి పేరుతో వంచన
సాక్షి, కామారెడ్డి: డీఎస్పీ అవతారమెత్తిన ‘స్వామి’ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఖాకీ యూనిఫాంలో చేసిన ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. విలాసవంతమైన జీవితం కోసం అతడు అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. తాను చేసే తప్పుడు పనులు బయట పడకుండా ఉండేందుకు ఖాకీ అవతారం ఎత్తినట్లు సమాచారం. ఉద్యోగాలిప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ఖాకీ దుస్తుల్లో సెటిల్మెంట్లు చేయడం ద్వారా మూడు, నాలుగేళ్లలో బాగానే వెనకేసుకున్నట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో నకిలీ స్వామి బాగోతం బట్టబయలైంది. డీఎస్పీ అవతారం ఎత్తిన బీబీపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిని బేగంబజార్ పోలీసులు రెండ్రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడ్ని తమదైన శైలిలో విచారించగా ఆ స్వామి వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డిలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఓ మహిళను ఢీకొట్టిన ఘటనలో స్వామిపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదైంది. ఈ కేసులో అతడ్ని రిమాండుకు తరలించారు. యూనిఫాంలో సెటిల్మెంట్లు.. పోలీసు అధికారిగా నమ్మించేందుకు స్వామి ఖాకీ దుస్తులు ధరించి సెటిల్మెంట్లకు వెళ్లడం అలవాటైనట్టు తెలిసింది. ఓ సెటిల్మెంట్కు సంబంధించిన వీడియో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతేకాకుండా హైదరాబాద్లో పోలీసు దుస్తుల్లో వెళ్లి లాఠీ చేతపట్టి మహిళలను తరిమేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. భూములతో పాటు డబ్బులకు సంబంధించిన సెటిల్మెంట్ల విషయంలో స్వామి పోలీసు దుస్తుల్లో వెళ్లడం ద్వారా అక్కడ తాను పోలీసు అధికారినని నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడని తెలుస్తోంది. తన కారులో యూనిఫాం, లాఠీ, టోపీ ఉంటాయని సమాచారం. పెళ్లి పేరుతో వంచన.. హైదరాబాద్లో అద్దె ఇంట్లో ఉంటూ విలాస జీవితం మొదలుపెట్టిన స్వామి.. పలువురు అమ్మాయిలను పెళ్లి పేరుతో వంచించాడని తెలుస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో అతడికి పరిచయాలున్నాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి వస్తూ ఉద్యోగాల పేరుతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఉద్యోగాలు రాకపోగా, డబ్బులు తీసుకున్న స్వామి కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగిన పలువురు బాధితులు తుజాల్పూర్లోని ఆయన ఇంటికి పలుమార్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా టీఎస్పీఎస్సీ అధికారులు బేగంబజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి నకిలీ స్వామి గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అతడ్ని కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఖరీదైన మద్యంతో విందులు.. హైదరాబాద్ నుంచి నాలుగైదు రోజులకోసారి సొంతూరికి వచ్చే స్వామి ఇక్కడ తన దర్పం ప్రదర్శించుకునే వాడు. ఖరీదైన మద్యం సేవించే స్వామి.. స్నేహితులకు విందులు ఇచ్చే సందర్భంలోనూ ఖరీదైన మద్యం బాటిళ్లు తెప్పిస్తాడని సమాచారం. తుజాల్పూర్ గ్రామానికి వచ్చినపుడల్లా కొందరు దోస్తులను పిలవడం, వారికి విందులు ఇవ్వడం పరిపాటిగా చెబుతున్నారు. కొందరు పోలీసులతో కూడా అతడికి స్నేహం ఉందని, వాళ్లు కూడా విందులకు హాజరవుతుంటారని తెలిసింది. పోలీసు జాగిలాన్ని పోలిన అల్సెషన్ డాగ్ను కూడా కారులో తీసుకొస్తాడని స్థానికులు తెలిపారు. సొంతూరిలో రాత్రి ఉంటే పొద్దున ఆ కుక్కతో కలిసి వాకింగ్కు వెళ్లే వాడని చెప్పారు. అతడి కారుకు పోలీసు సైరన్ ఉంటుందని, దోమకొండ, బీబీపేట మండల కేంద్రాలకు చేరుకునే సమయంలో సైరన్ మోగిస్తూ వెళ్తాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలైన నకిలీ డీఎస్పీ స్వామి గురించి బీబీపేట ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నకిలి డీఎస్పీ నెల్లూరు స్వామిపై ఎస్పీ శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ అమాయకులను మోసం చేస్తున్న నెల్లూరు స్వామికి ఎవరైనా సహకరించినట్లు విచారణలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్వేతారెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగాల నిమిత్తం నకిలీ డీఎస్పి నెల్లూరు స్వామి కి డబ్బులు ఇస్తే ఫిర్యాదు చేయండి. మార్చి 15న కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ నెల్లూరు స్వామి విషయంలో విచారణ చేస్తున్నాం. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు’’ అని తెలిపారు. -
కామారెడ్డి జిల్లాలో పెళ్లింట విషాదం
-
Photo Feature: రోడ్డెక్కిన రైతన్న.. సొంతూరికి జనం
కరోనాకు తోడు అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. వర్షాల కారణంగా నిండా మునిగామని, ఆదుకోవాలని పాలకులకు విన్నవించుకుంటున్నారు. కరోనా కట్టడికి దేశంలో అమలు చేస్తున్న ఆంక్షలతో నగరాల్లో ఉపాధి లేకపోవడంతో వలస కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. మరోవైపు సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు (సన్హాలో) బుధవారం కనువిందు చేసింది. -
Kamareddy District: కరోనాతో ఎస్ఐ గణపతి మృతి
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టించింది. ఇటీవల కరోనా సోకిన ఎస్ఐ గణపతి(53) చికిత్స పొందుతూ మరణించారు. ఐదు రోజుల క్రితం గణపతికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో గణపతిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరిలించారు. ఆస్పత్రిలో మూడు రోజుల పాటు గణపతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆరు నెలల క్రితం సిద్దిపేట్ నుంచి బదిలీపై గణపతి కామారెడ్డికి వచ్చారు. ప్రస్తుతం ఆయన వీఆర్లో ఉన్నారు. గతంలో గణపతి కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐగా కూడా విధులు నిర్వహించారు. చదవండి: మితిమీరిన కషాయాలు కాల్చేస్తాయి.. సూర్యరశ్మి తగలాల్సిందే -
కరోనాతో ఎస్ఐ గణపతి మృతి
-
వామ్మో... బైక్ దొంగల తెలివి I
-
కరోనాతో తల్లీకొడుకు మృతి
బీర్కూర్ (బాన్సువాడ): కరోనా కారణంగా తల్లీకొడుకు గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీన, ఆమె భర్త హన్మంత్ (42), అత్త గంగామణి (65) వారం క్రితం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్కు వెళ్లి పరీక్ష చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముగ్గురు ఇంటికి వచ్చి హోం ఐసోలేషన్లో ఉన్నారు. రెండ్రోజుల తర్వాత హన్మంత్ దంపతుల ఆరోగ్యం క్షీణించడంతో నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఇంట్లో ఉన్న గంగామణికి ఆదివారం రాత్రి శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఊపిరి ఆడక కన్ను మూసింది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోవిడ్ నిబంధనల ప్రకారం రాత్రి సమయంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు, ఆదివారం రాత్రి హన్మంత్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, సోమవారం ఉదయం మృతి చెందారు. 12 గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందడంతో బీర్కూర్లో విషాద చాయలు నెలకొన్నాయి. 5 రోజుల వ్యవధిలో దంపతులు మృతి బెల్లంపల్లి: మాయదారి కరోనా ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఐదు రోజుల వ్యవ ధిలో భార్యాభర్తల ఉసురుతీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్బస్తీకి చెందిన దంపతులకు వారం క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. భర్తకు తీవ్ర అస్వస్థత ఉండటంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. భార్య హోం ఐసోలేషన్లో ఉండి తీవ్ర మనోవేదనకు గురైంది. తన భర్తకు నయం అవుతుందో లేదోనని ఆందోళన చెందింది. సంతానం లేని సదరు గృహిణి.. ఈనెల 14న ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. తాజాగా ఆమె భర్త కరోనాతో పోరాడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. -
దొంగలతో వీరోచిత ఫైటింగ్, ముంబై పోలీసుల అభినందనలు
భిక్కనూరు: మహారాష్ట్రలోని నివసిస్తున్న భిక్కనూరుకు చెందిన బూర్ల నగేశ్ను ముంబై పోలీసులు అభినందించారు. వివరాలు.. భిక్కనూరుకు నగేష్15 ఏళ్లుగా ముంబైలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం జోగేశ్వర్ ఈస్ట్ ఏరియాలోని శాటిలైట్ ఏస్టేట్లో ఆరో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆయన పక్క ఫ్లాట్లో డాక్టర్ రమేశ్ యాదవ్ దంపతులు ఉంటున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం తన పక్క ఫ్లాట్లోకి దొంగలు చొరబడి ఓ మహిళను కత్తితో హతమార్చబోగా నగేశ్ వారితో తలబడ్డాడు. మహిళను కాపాడిన నగేశ్ను అక్కడి పోలీసులు అభినందించారు. నగేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కొరియర్ పేరిట అపార్టుమెంట్లోకి చొరబడి మహిళను తల్వార్తో హతమార్చేందుకు యత్నించారన్నారు. ఆమె అరవడంతో తాను వెళ్లి దొంగలతో పోరాడనని చెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. రెండో వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారని చెప్పారు. చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్తో కొట్టి హత్య -
‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య
నసురుల్లాబాద్ (బాన్సువాడ): తమను చూసేవారెవరూ లేరనే మనోవేదనతో వృద్ధ దంపతులు మనోవేదనకు గురయ్యారు. దీంతో ఉన్న ఇల్లు విక్రయించి వచ్చిన డబ్బులతో పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఆ తిరుగుతున్న సమయంలోనే వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో చివరకు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్లో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి గ్రామానికి చెందిన గంగాధర్ గిరి (70), మహానంద (65) భార్యాభర్తలు. వీరికి సంతానం లేకపోవడంతో వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. దీంతో వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమ గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో మూడు నెలలుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా నసురుల్లాబాద్లోని కొచ్చరి మైశమ్మ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. అయితే తీర్థయాత్రలు చేస్తున్న క్రమంలో చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో గురువారం భార్యాభర్తలు నిజాంసాగర్ ప్రధాన కాలువ వెంట ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన అక్కడి స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే భర్త మృతిచెందగా, భార్య బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ నలుగురు లేక ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్యలేని జీవితం నాకొద్దంటూ..
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): ‘నా భార్యంటే నాకు ప్రాణం. ఆమెలేని జీవితం నాకొద్దు’అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన భూమా రాజాగౌడ్ (26)కు రెండేళ్ల కిందట సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహమైంది. ఆరు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత శిరీషను ఆమె కుటుంబసభ్యులు కాపురానికి పంపకపోవడంతో పెద్దల సమక్షంలో మాట్లాడి రాజాగౌడ్ను అతని తల్లిదండ్రులు తుర్కపల్లికి పంపించారు. తుర్కపల్లిలో రాజాగౌడ్ కల్లు అమ్మగా వచ్చిన రూ.3 లక్షలు శిరీష తండ్రి చింతల రాజాగౌడ్కు ఇచ్చాడు. అతడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన శిరీష నెలకిందట కల్లుమందు తాగింది. ఇది తెలిసి అదే సమయంలో రాజాగౌడ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత రాజాగౌడ్ ఒక్కడే ధర్మారెడ్డి గ్రామానికి వచ్చాడు. రాజాగౌడ్ తన మామ రాజాగౌడ్కు శనివారం ఫోన్చేయగా తనతో మాట్లాడేది ఏమీలేదని, వరకట్నం కేసు వేస్తామని బెదిరించినట్లు మృతుడి తండ్రి శివరామ గౌడ్ తెలిపారు. దీంతో తన భార్య తనకు దక్కదేమోనని బెంగతోపాటు అత్తమామలు, ఇతర కుటుంబసభ్యుల బెదిరింపులతో రాజాగౌడ్.. సోమవారం సాయంత్రం మండలంలోని తాండూర్ శివారులో గల అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రాజాగౌడ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. చదవండి: పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం! -
కామారెడ్డి: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
సాక్షి, మాచారెడ్డి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై చర్య తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతు భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని బండరామేశ్వర్పల్లిలో జరిగింది. కోడలి రాకను గమనించిన అత్త లక్ష్మీ, మామ నారాయణ ఇంటికి తాళం వేసి పరారైనట్లు ఆమె తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బండ రామేశ్వర్పల్లికి చెందిన ఉట్ల శ్రీనివాస్కు కామారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి శరణ్యను రెండేళ్ల కింద ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా కట్న కానుకలతో పాటు నగదు, బంగారాన్ని అందజేశారు. పెళ్లయిన మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గాయత్రి శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను వదిలించుకోవాలని తనపై ఎన్నో నిందలు వేస్తున్నారని ఆరోపించింది. తనను వేధిస్తున్న భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు! -
పది నెలలుగా ఇంటి కూరగాయలే
చుట్టూ పచ్చని వాతావరణం.. ఉదయం లేవగానే పలకరించే పూలు.. తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు... ఇవన్నీ పట్టణంలోనే మన ఇంటిపైనే అందుబాటులోకి తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది. డా. వేదప్రకాశ్, కిరణ్మయి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గాయత్రీ నగర్లోని తమ ఇంటిపై ఎంతో శ్రద్ధగా cను ఏర్పాటు చేసుకున్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా డా. వేదప్రకాశ్ పనిచేస్తున్నారు. 280 చదరవు గజాల ఇంటి పైకప్పుపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో ఒక పచ్చని లోకాన్ని సృష్టించారు. ఇటు కుండీలు, గ్రోబాగ్స్లోను.. అటు హైడ్రోపోనిక్స్ పద్ధతిలోనూ ఇంటిపంటలు సాగు చేసుకొని పది నెలలుగా తింటున్నారు. లాక్డౌన్ సమయంలో పది నెలల క్రితం డా. వేదప్రకాశ్ ఈ మిద్దె తోటకు శ్రీకారం చుట్టారు. కోతుల నుంచి కాపాడుకునేందుకు ఇనుప జాలీని ఏర్పాటు చేస్తూ ఇంటికి కావలసిన కూరగాయలన్నీ పండిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలను బందువులు, స్నేహితులకూ రుచి చూపిస్తున్నారు. వేదప్రకాశ్తో పాటు కుటుంబ సభ్యులందరూ ఇంటి పంటల సాగు పనులు చూసుకుంటున్నారు. 32 రకాల కూరగాయల సాగు వేదప్రకాశ్ ఇంటి పైకప్పుపై 32 రకాల కూరగాయలు సాగవుతున్నాయి. బీర, కాకర, దోస, గుమ్మడి, చిక్కుడు, సోరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, వంకాయ, టమాట, చిక్కుడు, మిర్చి, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఆలు, ఇలాయిచీ వంటివి పండిస్తున్నారు. అలాగే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బచ్చలి, బిర్యానీ ఆకును అక్కడ పండిస్తున్నరు. అలాగే మామిడి, అరటి, యాపిల్ చెర్రీ, వాటర్ యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, సింగపూర్ చెర్రి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బాదాం, పనస, మునగ వంటి పండ్లు, కాయల చెట్లు పెంచుతున్నారు. అప్పటి నుంచి మార్కెట్కు వెళ్ల లేదు వేదప్రకాశ్ తన ఇంటిపైకప్పుపై పండిస్తున్న కూరగాయలు వాళ్ల ఇంటి అవసరాలకే కాకుండా, ఇరుగు పొరుగు వారికి, బంధువులు, స్నేహితులకు ఇస్తున్నారు. గడచిన పది నెలలుగా మార్కెట్లో అడుగు పెట్టలేదని కిరణ్మయి తెలిపారు. ఇంటి అవసరాలకు కావలసిన అన్ని రకాల కూరగాయలు అక్కడే లభిస్తున్నాయి. మార్కెట్లో లభించనివి కూడా మిద్దెపై అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఈ రోజు ఏ కర్రీ వండుకోవాలో మిద్దెపైకి వెళ్లి అక్కడ చూసి నిర్ణయం తీసుకుంటారు. క్షణాల్లో తమకు కావలసిన కూరగాయలను కోసుకుని వెళ్లి వండుకోవడం జరుగుతోంది. ఇంటిపంటల మధ్య వెదురు బొంగులతో వేసిన కుటీరం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. పండుగల పూట, బంధువులు, స్నేహితులు వచ్చినపుడు అందరూ అక్కడే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి పూట రంగురంగుల విద్యుద్దీపాల మద్యన విందులు చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరు వెళ్లినా మిద్దెపైకి తీసుకువెళ్లి అంతా చూయిస్తారు. తిరిగి వెళ్లేటపుడు కూరగాయలు కత్తిరించి చేతిలో పెట్టి పంపించడం వాళ్లకు ఆనవాయితీగా మారింది. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి పంట చేలో ఉన్నంత ఆనందం మిద్దె మీద కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నాం. పది నెలల కాలంగా మార్కెట్కు వెళ్లే అవసరం రాలేదు. ఇంట్లో అందరం పొద్దున లేస్తే చాలు మిద్దెపైకి రావడం, మొక్కలకు నీళ్లు పట్టడం, వాటì ని చూసుకోవడం అలవాటైంది. మనకు కావలసిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆనందాన్ని పొందవచ్చో మాకు అర్థమైంది. ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండిస్తున్నాం. పండుగల సందర్భంగా అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తుంటే పంట చేను దగ్గర తిన్నంత తృప్తి కలుగుతోంది. – డాక్టర్ వేదప్రకాశ్ (95531 81399), కామారెడ్డి -
ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్
మహిళా పోలీసులు అంటే రిసెప్షన్, బందోబస్తులకే పరిమితం అనేది ఒకనాటి మాట. మహిళా పోలీసులు అంటే హోంగార్డు నుంచి డిజీ స్థాయి వరకు ఎక్కడ చూసినా వారే అనేది నేటి మాట. సెంట్రీ గార్డ్, పెట్రోలింగ్, డ్రైవర్ పోలీస్ స్టేషన్, సర్కిల్, సబ్డివిజన్ ‘ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్’ అనే కాన్ఫిడెన్స్ మహిళా పోలీసుల్లో పెరిగిందని అంటూ పోలీసు శాఖలో మహిళా శక్తి గురించి ఐపీఎస్ ఆఫీసర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత ‘సాక్షి’కి వివరించారు. ‘‘గతంలో పోలీసు శాఖలో ఎక్కడో ఒక చోట మహిళా సిబ్బంది ఉండేవారు. ఏవైనా ఆందోళన ప్రదర్శనలు, వీఐపీల కార్యక్రమాలు ఉంటే మహిళల కోసం మహిళా పోలీసులను ఎక్కడెక్కడి నుంచో రప్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భద్రత విషయంలో వుమెన్ సేఫ్టీ వింగ్ తీసుకుంటున్న అనేక చర్యలు మహిళల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులపై వేధింపులు, దాడులను నిరోధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘షీ టీం’ల ద్వారా పోలీసు శాఖ చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలాగే వేధింపులు, దాడులకు గురైన మహిళలను చేరదీసి వారికి ధైర్యాన్ని కలిగించేందుకు ‘భరోసా’ కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. భారీగా మహిళల హాజరు ఇటీవల పోలీసు ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు భారీ సంఖ్యలో యువతులు హాజరయ్యారు. అందులో ఎంపికైన వారు ఎసై ్స, కానిస్టేబుల్ శిక్షణ కూడా పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. మరోవైపు పోలీసు శాఖలో హోంగార్డు నుంచి అదనపు డీజీ స్థాయి వరకు మహిళా అధికారులు తమ పనితీరుతో గుర్తింపు పొందుతున్నారు. చాలా మంది మహిళా అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన శైలిలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. శ్వేత, ఐపీఎస్ రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి 55 వేల మంది వరకు పోలీసులు ఉండగా, అందులో కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ స్థాయి వరకు 4,829 మంది ఉన్నారు. అలాగే 2 వేల మందికి పైగా హోంగార్డులుగా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య ప్రస్తుతం 10 శాతానికి చేరింది. ఇంకా పెరగాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం పోలీసు శాఖ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం కేటాయించిన మీదట వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో కొద్దిమంది మాత్రమే మహిళలు ఉన్న పోలీసు శాఖలో ఇప్పుడు దాదాపు ఏడు వేల పైచిలుకు మహిళా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైవింగ్.. ఎనీ టైమ్.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలు అందరికీ డ్రైవింగ్లో శిక్షణ ఉంటుంది. అవసరం ఏర్పడినపుడు వెహికిల్ను వారే స్వయంగా నడుపుకుని వెళ్లేలా శిక్షణ ఇస్తారు. మహిళా కానిస్టేబుళ్లు సెంట్రీ డ్యూటీతో పాటు బందోబస్తు డ్యూటీలు, డ్రైవింగ్, పెట్రోలింగ్, ట్రాఫిక్ డ్యూటీలన్నీ చేస్తున్నారు. ఏ డ్యూటీ అయినా చేయగలమని నిరూపిస్తున్నారు. అందుకు మానసికంగానూ సంసిద్ధులయ్యారు. అన్ని రకాల డ్యూటీలు మగవారితో సమానంగా చేసి సత్తా చాటుతున్నారు. మరింత ప్రోత్సాహం అవసరం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింతగా దూసుకుపోతారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా ఉన్నతాధికారులు తమ సత్తా చాటుతున్నారు. పోలీసు డ్యూటీ అనగానే మగవారిదనే భావన సమాజంలో మెల్లమెల్లగా మాయమైపోతోంది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలో చేరడానికి మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పది శాతం వరకు మహిళల సంఖ్య పెరిగింది. మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. మహిళలకు అండగా... పోలీసు స్టేషన్కు వెళ్లాలంటే మహిళలు జంకే పరిస్థితులు ఉండేవి. ఆపద ఉందని పోలీసు స్టేషన్కు వెళితే తమ గోడు వినేవారు ఉండకపోగా, వాళ్ల నుంచి వచ్చే ప్రశ్నలు ఇబ్బందిపెట్టేవిగా ఉండేవి. అయితే పోలీసు శాఖలో మహిళలు అధికారులుగా వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కూడా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఠాణాలో మహిళా రిసెప్షనిస్టును ఉంచడం ద్వారా మహిళలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మహిళలపై దాడుల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు, మహిళపై జరిగే అఘాయిత్యాల్లో బాధితులకు ‘సఖి’ అండగా నిలవడం, ఇంకా ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా అధికారులు ఉన్న చోట బాధిత మహిళలు నేరుగా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా వారికి సత్వర న్యాయం అందుతోంది. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా మహిళలకు కొండంత అండ దొరికినట్టయ్యింది’’ అని వివరించారు శ్వేత. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
వారియర్స్కు వ్యాక్సిన్; చాలా బాధగా ఉంది..
కామారెడ్డి టౌన్: కరోనాపై పోరులో ఎంతో మంది ప్రాణాలకు తెగించి పని చేశారు. వైరస్ వ్యాపిస్తున్నా భయపడకుండా విధులు నిర్వహించారు. అలాంటి వారిలో 108 సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా సోకిన రోగులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలకు సేవలందించారు. అయితే, వారిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తొలి విడతలోనే ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు ఇచ్చిన ప్రభుత్వం.. 108 సిబ్బందిని మాత్రం మరిచింది. వెలకట్టలేని సేవలు.. కరోనా వైరస్ నియంత్రణలో వైద్యారోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు తదితర శాఖలు కీలకంగా వ్యవహరించాయి. ఆశలు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలి విడతలో ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు ఇచ్చా రు. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న సాధారణ పౌరులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, కరోనా సమయంలో ముందుండి సేవలందించిన 108 సిబ్బందికి మాత్రం టీకాలు ఇవ్వక పోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. ఫోన్ రాగానే ఆగమేఘాల మీద ప్రజలకు సేవలందింన తమను గుర్తించలేక పోయారని మనోవేదన చెందుతున్నారు. కరోనా నియంత్రణకు పాటు పడిన నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. పట్టించుకోని యంత్రాంగం జిల్లాలో 108 అంబులెన్సులు 12 ఉన్నాయి. డ్రైవర్లు, పైలెట్, సిబ్బంది కలిపి మొత్తం 60 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కామారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మిగతా వారిని మాత్రం మరిచారు. ఆన్లైన్లో కూడా వీరి వివరాలను నమోదు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు తమను గుర్తించాలని 108 సిబ్బంది వేడుకుంటున్నారు. చాలా బాధగా ఉంది అత్యవసర సమయాల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తున్నాం. కరోనా సోకిన వారిని ఆస్పత్రులకు తరలించాం. ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందిస్తున్న మమ్మల్ని గుర్తించక పోవడం బాధగా ఉంది. సాధారణ పౌరులకు టీకా ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మా సేవలను గుర్తించాలి. – విజయ్, 108, అంబులెన్స్ డ్రైవర్, కామారెడ్డి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు నేను జిల్లాకు ఇటీవలే బదిలీపై వచ్చాను. 108 సిబ్బంది టీకాలు ఇవ్వాలని ఇప్పటి వరకు ఆదేశాలు రాలేవు. అందుకే మేము కూడా స్పందించ లేకపోయాం. రెండు రోజుల క్రితమే సిబ్బంది డేటాను సేకరించాం. వారికి టీకా ఇచ్చే విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – అనిరుధ్, 108 జిల్లా కో–ఆర్టినేటర్, కామారెడ్డి -
నా భర్తకు మరో పెళ్లట... నాకు న్యాయం చేయండి!!
సాక్షి, కామారెడ్డి: ఓ మహిళ తన భర్త కోసం 40 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష నేటికి 41వ రోజుకు చేరుకుంది. భర్త నవీన్ ఇంటి ముందే ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు అశోక్ నగర్ కాలనీలో భర్త కోసం భార్య పైడి అరుణ భర్త ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాలో మాట్లాడుతూ.. పైడి నవీన్తో తనకు 2017 సంవత్సరంలో పెళ్లి జరిగిందని, పెళ్లి సమయంలో 14 లక్షల నగదు , 23 తులాల బంగారం కట్నంగా ఇచ్చామని తెలిపారు. పెళ్లి తర్వాత ఆరు నెలల వరకు తాము బాగానే ఉన్నామని, ఆ తర్వాత అదనంగా రూ. 15 లక్షల కట్నం తీసుకురావాలని తన అత్తమామలు వేధింపులకు గురిచేశారని చెప్పారు. తన మామ సురేందర్ అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆరోపించారు. తనకు పిల్లలు పుట్టరని వదంతులు సృష్టించి తన భర్తకు మరో పెళ్లి చేయాలని కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ విషయం తెలిసిన వెంటనే కుల పెద్దల సమక్షంలో మాట్లాడిన్నట్టు తెలిపారు. కానీ, తాజాగా మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేయాలని తన అత్తమామలు చూస్తున్నారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజైనా తనకు న్యాయం చేయలని అరుణ కోరుతున్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. చదవండి: వృద్ధుడిని నమ్మించి..కోటి రూపాయలతో ఉడాయించి -
కామారెడ్డిలో ఆర్టీసీ బస్ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
-
కామారెడ్డిలో ఆర్టీసీ బస్ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టేక్రియాల్ 44వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది. -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా -
కీ‘లేడీ’ జేబుదొంగ.. వీడియో వైరల్
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఓ లేడీ జేబుదొంగ వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. పలు ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్లాస్టిక్ కవర్ అడ్డుపెట్టి మరి జేబులు కొట్టేస్తోంది. ఈ నెల 23న జరిగిన రెండు దొంగతనలు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మేన్స్ క్లబ్లోకి వెళ్లిన మహిళా జేబుదొంగ ఓ వ్యక్తి జేబు కొట్టిసింది. అరగంట వ్యవధిలోనే సూపర్ మార్కెట్లోకి వెళ్లి మరో వ్యక్తి జేబు కొట్టేసింది. దర్జాగా సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళ కేవలం ఒక్క నిమిషంలోనే వ్యక్తి జేబులోంచి పర్సును దొంగిలించిది. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. జీన్స్ టీషర్టులో ధరించిన మహిళ ముఖానికి మాస్కు కట్టుకొని షాప్లోకి ప్రవేశించింది. అనంతరం సరాసరి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లిన మహిళ తనను ఎవరైనా గమనిస్తున్నారా అని పరిశీలించి మెల్లగా తన ముందు ఉన్న వ్యక్తి జేబులోనుంచి పర్సును దొంగిలించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీంతో సదురు జేబుదొంగ బాగోతం బట్టబయలైంది. ఈ దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఆయా షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు.. -
షబ్బీర్ అలీకి కీలక పదవి!?
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై పక్షం రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతికి చెక్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు. అయితే ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీ సీ పెద్దలతో షబ్బీర్ అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. చదవండి: ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న షబ్బీర్అలీకి జిల్లా అంతటా అనుచరులున్నారు. అయితే ఇటీవలి కాలంలో కామారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కాగా మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. -
కామారెడ్డికి అరుదైన గౌరవం
సాక్షి, కామారెడ్డి : జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లాకు అత్యుత్తమ పురస్కారం లభించింది. డిజిటల్ గవర్నెన్స్లో వెబ్రత్న –2020 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని కలెక్టర్ శరత్ శనివారం తెలిపారు. అవార్డుకు ఎంపికవడానికి కారణాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో జిల్లా గురించి సంక్షిప్తంగా మ్యాప్, చరిత్ర, పరిపాలన విభాగం, జనాభా తదితర అంశాలను వివరణాత్మకంగా రూపొందించి వెబ్సైట్లో సమాచారాన్ని నమోదు చేశామన్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారుల వివరాలు, ఫోన్నెంబర్లు, ఇతర అన్ని రకాల సమాచారాన్ని పొందుపరిచామని తెలిపారు. వెబ్సైట్లో జిల్లా పరిపాలన, చారిత్రక, భౌగోళిక నేపథ్యం గురించి చిత్రాలతో వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జీఐజీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నవీకరించిన సమాచారం అందుబాటులో ఉందన్నారు. కలెక్టర్ శరత్ పర్యాటక సమాచారం, ప్రదేశాలు, వసతి, సంస్కృతి, పండుగలు, ఉత్పత్తులు, ముఖ్యమైన దేవాలయాల సమాచారాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో జిల్లా వెబ్సైట్లో నమోదు చేశామని వివరించారు. ఆసక్తికర సంఘటనలు, మతపరమైన ప్రదేశాల ఫొటో గ్యాలరీలు, పథకాలు, ప్రాజెక్టులు లాంటి వివరాలతో వెబ్సైట్ సమగ్ర సమాచారాన్ని కలిగి ఉందన్నారు. హోంపేజీలో తాజా రోజువారి సంఘటనలు, ప్రెస్నోట్లు, కోవిడ్–19 సమాచారం ఉంచుతున్నామని తెలిపారు. జిల్లా వెబ్సైట్ను బలమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నామని వివరించారు. కామారెడ్డి జిల్లా https://kamareddy.telangana.gov.in వెబ్సైట్ సేవలను ప్రజలందరూ వినియోగించుకుని అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈనెల 30 వతేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. -
దీపావళి పండగపూట విషాదం
-
దీపావళి పండగపూట విషాదం
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో దీపావళి పండగపూట విషాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ కాల్వలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. పండగ పూట జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల చొరవతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు. మృతులను సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. డ్యాం గేట్ల వద్ద స్నానానికి దిగిన సందర్భంగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బయోమె‘ట్రిక్’తో బియ్యం మాయం
సాక్షి, కామారెడ్డి: బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయడంతో బియ్యం దొంగలకు వరంగా మారింది. ఫలితంగా రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని అక్రమాలకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించిన బియ్యాన్ని కాజేస్తున్న వైనం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లను సేకరించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో బియ్యాన్ని దారి మళ్లించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో కొందరు డీలర్లు మహబూబాబాద్, భద్రాద్రి, మంచిర్యాల జిల్లాలకు చెందిన లబ్ధిదారుల పేరిట పెద్ద ఎత్తున బియ్యాన్ని తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఎల్లారెడ్డి పట్టణంలో ఒక రేషన్ దుకాణం, బాన్సువాడ పట్టణంలో రెండు దుకాణాలు, బీర్కూర్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, దామరంచ గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు డీలర్లతో పాటు సహకరించిన వీఆర్వో, వీఆర్ఏలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఐదుగురు వీఆర్ఏలను, ఒక వీఆర్వోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్వినియోగం ఈ దందా ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తుండగా.. అక్రమాలకు అలవాటు పడిన కొంత మంది రేషన్ డీలర్లు, మాఫియా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుని కొత్త దారులు వెతికారు. బయోమెట్రిక్కు బదులు రెవెన్యూ సిబ్బంది ఆథరైజేషన్తో సరుకులు పంపిణీ చేస్తుండటంతో సిబ్బందిని మచ్చిక చేసుకుని లబ్ధిదారుల బియ్యాన్ని మింగేస్తున్నారు. అది కూడా ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి సంబంధించిన నెలనెలా మిగిలిపోతున్న బియ్యాన్ని మింగేశారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. అక్రమాలకు హైదరాబాద్తో లింకు..! పొరుగు జిల్లాల లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసే మాఫియాకు హైదరాబాద్తో లింకు ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం మాఫియా ఎంచుకున్న కొన్ని రేషన్ దుకాణాల ద్వారా అక్కడి సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఇతర జిల్లాల లబ్ధిదారుల పేరుతో బియ్యాన్ని కాజేస్తోంది. దీనికి హైదరాబాద్లోని మాఫియా, యంత్రాంగం అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లు రాజధాని నుంచే డీలర్ల వాట్సాప్లకు వచ్చినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పౌరసరఫరాల అధికారులు ఇతర జిల్లాలపై దృష్టి సారించారు.