కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి | Nanded Passenger train hits school bus, 16 students killed | Sakshi
Sakshi News home page

కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి

Published Thu, Jul 24 2014 11:11 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి - Sakshi

కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి

మెదక్ : మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది.  వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద  ఓ  ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు.
 

20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement