rail accident
-
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు షాక్!
ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station) కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్ఫాంపై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.Reportedly 21 people lost lives in the Delhi railway station stampede !who's taking responsibility for this ? This is not mismanagement? #RailwayMinisterResign #STAMPEDE #Delhi#NewDelhiRailwaystation#delhirailwaystation #MahakumbhStampede #trainaccident #Railway pic.twitter.com/oxrtomGkKL— sustainme.in®️ (@sustainme_in) February 16, 2025 See the crowd⚠️Each & every human is stuck to another like a garland woven togetherStampede is bound to happen at the slightest hint of chaos & panicIndian Railways for you 🤷#NewDelhiRailwaystation #STAMPEDE#trainaccident #ResignRailwayMinister pic.twitter.com/DKnrE8TYTS— Sudiksha (@Su_diksha) February 16, 2025ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని అంటున్నారు. రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్యాగ్(#ResignRailwayMinister) ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచింది. भारतीय रेलवे 21वी सदी के सबसे अच्छे दौर से गुजर रही है। और सबसे बड़ा योगदान रील मंत्री का है। #STAMPEDE #ResignRailwayMinister #NewDelhiRailwaystation pic.twitter.com/lUXGTLCF5Y— Sunand Sarkar Kushwaha (@TheSunandSarkar) February 16, 2025 ఇక, ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గత కొన్నేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల గురించి కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన రైల్వే శాఖకు మంత్రి అయ్యాకే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. 1956లో అరియలూర్లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 1956 :: Ariyalur Train Accident Railway Minister Lalbahadur Shastri Resigned Taking Moral Responsibility ( Photo - The Hindu ) pic.twitter.com/rtUy9TdcGD— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 Not again Indian Railways 💔Sealdah bound Kanchenjungaa Express hit by a goods train near New Jalpaiguri, More Details awaited, Wishing for everyone's safety 🙏 #trainaccident #indianrailways pic.twitter.com/ALkidHnESb— Trains of India (@trainwalebhaiya) June 17, 2024 Railway Minister Lal Bahadur Resigned Taking Moral Responsibility of The Train Accident In 1956 pic.twitter.com/xJF8PDKPys— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 ज्यादा लोग बिहार के हैं #AshwiniVaishnawMustResign #AshwiniVaishnawResignNow pic.twitter.com/mh1uW2gpJl— Magadh Updates (@magadh_updates) February 16, 2025 -
రైల్వే అంతటా ‘కవచ్’ అమలు
వచ్చే ఆరేళ్లలో మొత్తం రైల్వే నెట్వర్క్లో ‘కవచ్’ టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను పెంచడానికి, స్టేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి, సురక్షితమైన రైల్వే వ్యవస్థను నిర్ధారించడానికి తోడ్పడుతుందని చెప్పారు. రైల్వే రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయితే మౌలిక సదుపాయాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.రెండు రైళ్లు ఒకే ట్రాక్మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా కవచ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రైల్వే భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థనే కవచ్గా పిలుస్తారు. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు రైల్వే బోర్డు గతంలో అనుమతించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024 నాటికి దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1,548 కిలోమీటర్లకు పైగా కవచ్ను విస్తరించారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అధిక ప్రాధాన్యత గల మార్గాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లను కవర్ చేయాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందనప్రయాణికుల భద్రత, స్టేషన్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైల్వేకు రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అందులో భద్రతకు రూ.1.16 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంలో భాగంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10,000 లోకోమోటివ్ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. చాలాచోట్ల వ్యవస్థలో లోపం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు తాత్కాలిక ఉపశమనం కింద ఆర్థిక, వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదనేది వాస్తవం. ప్రమాదాల మూలాలను గమనించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
పూర్ణియా: బీహార్లోని పూర్నియా జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న డీఎంయూ రైలులోని ఓ చక్రానికి ఒక రాడ్డు అడ్డుపడింది. పైలట్ సమయస్ఫూర్తితో రైలును ఆపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాణిపాత్ర స్టేషన్ అధికారులు జీఆర్పీ ఫోర్స్ సాయంతో రైలు చక్రానికి అడ్డుపడిన రాడ్ను తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్పై రాడ్ వేస్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి, తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే -
పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
న్యూ మేనాగురి: పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్దువార్ డివిజన్లోని న్యూ మేనాగురి స్టేషన్లో ఒక గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన దరిమిలా ఈ మార్గంలో వెళ్లే రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇది ఐదు లైన్లతో కూడిన స్టేషన్ అని, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.గూడ్సు రైలు పట్టాలు తప్పిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు(మంగళవారం) ఉదయం 6:20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అలీపుర్దూర్ డివిజన్ డీఆర్ఎం అమర్జీత్ గౌతమ్ తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. కాగా గత నెలలో కూడా పశ్చిమ బెంగాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాడు ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్లోని కుమేదర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్జీపీ నుంచి కతిహార్ వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. #WATCH | 5 wagons of an empty goods train derailed at New Maynaguri station in Alipurduar division. Trains have been diverted through alternate routes and movement has not been affected. Senior officers including DRM Alipurduar have moved to the site. Restoration work is going… pic.twitter.com/6GKv0otIAB— ANI (@ANI) September 24, 2024ఇది కూడా చదవండి: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి -
ఒడిశా రైలు ప్రమాదం: ఒక్కరు తప్ప అందరూ సేఫ్
సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలోని రాష్ట్ర ప్రయాణికులు ఐదుగురిలో ఒక్కరే మృతిచెందారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి మరణించినట్లు గుర్తించామని.. ఒడిశాలో నివసిస్తున్న ఆయన, పెన్షన్ కోసం వచ్చి, తిరిగి వెళ్తూ కోరమాండల్ ఎక్కినట్లు తేలిందన్నారు. అతనితోపాటు అదే బోగీలో విశాఖకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారని, వీరు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు, రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నామని.. గాయపడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందన్నారు. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 342 మంది రిజర్వ్డ్ ప్రయాణికులు సేఫ్ కటక్, బాలాసోర్లోని సోరూ, గోపాలపురం ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రయాణికులతో పాటు, ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఊళ్లలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుని మాట్లాడాం. అత్యవసర చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన విశాఖకు తరలించడంతో పాటు, భువనేశ్వర్లోని అపోలో ఆస్పత్రిలో కూడా చేర్చాం. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో రాష్ట్రం నుంచి బయల్దేరిన లేదా ఏపీలో దిగాల్సిన వారి వివరాలు సేకరించాం. ఆ రైలు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 309 మంది తెలుగువారు ఉన్నారు. యశ్వంత్పూర్–హౌరా ఎక్స్ప్రెస్లో 33 మంది ఉన్నారు. రెండు రైళ్లలో 342 మంది తెలుగువారు ప్రయాణిస్తున్నట్లు తేలింది. వారిలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా, 329 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ప్రయాణికుడు మాత్రం బంధువులతో ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మందిని విశాఖకు తరలించి కేజీహెచ్లో ముగ్గురికి, సెవెన్హిల్స్ ఆస్పత్రిలో ఇద్దరికి, క్యూవన్ ఆస్పత్రిలో ఇద్దరికి, అపోలోలో ఒకరికి చికిత్స చేయిస్తుండగా, మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక సాయం అందజేత కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆరి్థక సాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి అమర్నాథ్ సోమవారం అందించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఇక ఈ ప్రమాదం గురించి తెలియగానే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే.. మర్నాటి ఉదయమే నాతో పాటు ముగ్గురు ఐఏఎస్లు, మరో ముగ్గురు ఐపీఎస్లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మాతోపాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 108 సర్వీసులు 20, మరో 19 ప్రైవేటు అంబులెన్స్లు, 15 మహాప్రస్థానం వాహనాలను తీసుకెళ్లాం. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద ఐదు అంబులెన్స్లతో సేవలందించాం. ఇంకా సీఎం ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస.. ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర స్టేషన్లలో కంట్రోల్ రూంలకు అందిన సమాచారం ద్వారా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల చార్టుల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నంబర్ల ప్రకారం వారితో మాట్లాడి ఆచూకీ తెలుసుకున్నాం. సురక్షితంగా స్వస్థలాలకు చేరేవరకు అందరినీ అప్రమత్తం చేశాం. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లను కలిసి మన చర్యలను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా గురించి చెప్పగా కేంద్ర మంత్రులు అభినందించారు. చదవండి: అమ్మానాన్న క్షమించండి! -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా
సాక్షి అమరావతి/భువనేశ్వర్/మహారాణిపేట: ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో గాయపడి, బాలాసోర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులను సమీక్షించి, ఘటన పూర్వాపరాలపై అధికారులతో విశ్లేషించారు. లోటుపాట్లు లేకుండా సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగేలా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా చర్చించారు. స్థానికుల సహాయ, సహకారాలను మంత్రి ప్రశంసించారు. బాధితులను ఆదుకునే దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవలకు అనుకూలంగా భువనేశ్వర్లో 16 అంబులెన్స్లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసోర్లో 5అంబులెన్స్లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. భువనేశ్వర్లో బాధితుల సహాయ కేంద్రం ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయన్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సహాయం కోసం 1929 హెల్ప్లైన్తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్(ఐఏఎస్) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరాలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ మెడికల్ కళాశాల, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమానాశ్రయంలో హెల్ప్డెస్క్లు పని చేస్తున్నాయన్నారు. క్షతగాత్రులకు విశాఖలో చికిత్స రైలు ప్రమాదంలో గాయపడ్డ పలువురికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సెవెన్ హిల్స్, ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో ఇద్దరి చొప్పున, కేజీహెచ్లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఎ.శంకరరావుకు అన్ని పరీక్షలు చేశామని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. బాధితుల కోసం కేజీహెచ్ క్యాజువాలిటీ వద్ద 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన భారతి, మాధవరావులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. కె.పూజ అనే మహిళను భువనేశ్వర్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. గురుమూర్తికి అక్కడే అంత్యక్రియలు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన సి.గురుమూర్తి ఒక్కరే మృతి చెందారు. ఆయన కుటుంబం బాలాసోర్లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 8333905022 (వాట్సాప్) సంప్రదించవ్చని తెలిపారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. పట్టాలపై ప్రేమ కథ! -
దేవుడా! ఈ మృతదేహాల్లో నా కొడుకు ఉండకూడదు.. ఓ తండ్రి ఆవేదన ఇది
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం. తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే ఘటన ఇది. ఈ ప్రమాదం కారణంగా ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో సుమారు 288 మంది మరణించగా, 900 మంది గాయాలపాలై ఎక్కడెక్కడో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓ పాఠశాల ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాలు పడి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు బతికే ఉన్నాడో లేడో తెలీక ఆ మృతదేహాల్లో వెతుకుతూ.. దేవుడా ఇందులో నా కొడుకు ఉండకూడదూ అని లోపల అనుకుంటూ వెతుక్కుంటూ కనిపించాడు. కుప్పల్లా మృతదేహాలు.. ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ ఘటనలే వినిపిస్తున్నాయి. ఓ తండ్రి పడే బాధకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అందులో ఓ తండ్రి తన కొడుకు అక్కడ పడిఉన్న మృతదేహాల్లో ఉన్నాడేమో అని వెతుకుతున్నాడు. తీరా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి..ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడగ్గా.. నా కొడుకు. ఇదే కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించాడు. బతికే ఉన్నాడో లేడో తెలీదు. బతికే ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది, తనకు ఏమైందో తెలియడం లేదు. ఒకవేళ చనిపోయాడేమో అని ఇక్కడ వెతుక్కుంటున్నాను. కానీ దొరకడంలేదు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా ..శుక్రవారం సాయంత్రం సుమారు రాత్రి 7 గంటలకు జరిగిన విధ్వంసకర సంఘటనలో, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద 12841 షాలిమార్-కోరోమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. బాలాసోర్ రైలు ప్రమాదంపై సంయుక్త తనిఖీ నివేదిక ప్రకారం, ప్రమాదానికి ప్రాథమిక కారణం సిగ్నల్ వైఫల్యంగా అధికారులు గుర్తించారు. This is heartbreaking 💔 A father looking for his son among the dead. 😔#OdishaTrainAccident pic.twitter.com/eZZDAO94BR — Ketofol☀️ (@aka911_) June 3, 2023 -
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్ కీలక ప్రెస్మీట్
సాక్షి,విశాఖ: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందని.. ట్రైన్ ప్రమాదంలో క్షతగాత్రులను మృతులను తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఒరిస్సా పంపించారన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామన్నారు.వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరి ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉండగా.. 20 మందికి స్వల్పంగా గాయాలు కాగా, 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైనట్లు తెలిపారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అయినట్లు భావిస్తున్నామని.. ప్రస్తుతం ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలుచేపడుతున్నామన్నారు. (చదవండి: 'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో..) ఇదిలా ఉండగా హౌరా వెళ్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వారిలో విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. 10 మంది ట్రైను ఎక్కలేదని, 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అయినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు ఇచ్చాపురం నుంచి బోర్డర్లో ఉన్న అన్ని హాస్పిటల్స్ ను సిద్ధం చేశామన్నారు.అన్ని కలెక్టరేట్లోను హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్ తో పాటు మొత్తంగా 65 అంబులెన్స కు పంపించినట్లు చెప్పారు. వీటితో పాటు విమానాశ్రయంలో ఒక చాపర్ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నేవి సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదని గాయపడినట్లు మాత్రమే మాకు సమాచారం అందిందన్నారు. ఒరిస్సాలో కూడా మన వారికి వైద్యం అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. (చదవండి: ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి) -
ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే
సాక్షి, విజయవాడ: రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. కోరమండల్ రైలులో ఏపీకి చెందినవారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల ఫోటోలను సేకరిస్తున్నారు. డేటా ఆధారంగా రాష్టానికి చెందిన ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. ప్రమాద స్థలంలో వైద్య సేవలు, అంబులెన్స్లు సిద్ధం చేశారు. ఒడిశాకు ఏపీ అధికారుల బృందం రైలు ప్రమాదంలో 179 మంతి తెలుగువారు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం అధికారుల బృందం ఓడిశా చేరుకుందన్నారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 కాంటాక్ట్లోకి వచ్చారని తెలిపారు. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో హెల్స్లైన్ ఏర్పాటు: 0866 2575833 చేశామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు. కోరమండల్ రైలులో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వీరిలో 23 మందిని కాంటాక్స్ చేశాం.. వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.. మిగిలిన 16 మందిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ముగ్గురు ప్రయాణికులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కోరమండల్ రైలులో తెలుగు ప్రయాణికుల వివరాలు ►కోరమండల్ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ►విశాఖపట్నం వరకు 110, రాజమండ్రి వరకు26 మంది ►తాడేపల్లి గూడెం ఒకరు, విజయవాడ వరకు 39 మంది ►ఏలూరులో దిగాల్సిన ఇద్దరు సురక్షితం. చంద్పాల్ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీకర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్లో తిరుగు పయనమయ్యారు ►చీరాల నుంచి హౌరా వెళ్లాల్సిన ఆరుగురు ప్రయాణికులు సేఫ్. ఆరుగురిలో ఇద్దరిని సంప్రదించిన పోలీసులు ► తాడేపల్లిగూడెం రావాల్సిన ఇద్దరు ప్రయాణికులు సేఫ్. ఉమామహేశ్రరావు, రంజిత్ గాయాలతో బయటపడ్డారు. కాకినాడ వాసుల కోసం హెల్ప్లైన్ నెంబర్ ఒడిశాలోని బాలాసోర్ సమీపములో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -9490618506 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9494933233 తూర్పుగోదావరి జిల్లా... ►ఒడిశా బాలాసోర్లో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంతపూర్ రైళ్లలో రాజమండ్రికి రావాల్సిన ప్రయాణికులు.. ► మొత్తం ప్రయాణికులు 31 మంది ►వీరిలో రాజమండ్రి వాసులు-5 ►కాకినాడకు చెందినవారు-1 ►కొవ్వూరుకు చెందినవారు-1, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు-- 12, చత్తీస్గఢ్కు చెందిన వారు-2, కోల్కతా-1 ►వీరిలో 22 సురక్షితంగా ఉన్నారు. కృష్ణాజిల్లా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జాషువా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్స్ ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -8332983792 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9491068906 ఎస్బీ ఎస్ఐ - 9618336684 -
బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఎటు చూసినా రక్తపు మడుగే:ఒడిశా ప్రమాద బాధితుడి ఆవేదన
తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్ దాస్ అనే ప్రయాణకుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాటి గాయాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ.. ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు. కోరమండల్ ఎక్స్ప్రెస్లోని దాదాపు 13 కోచ్లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మూడు జనరల్ కోచ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కి పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు, తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలని ఉద్వేగంగా చెప్పాడు. ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులను చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఆ ఘటన నుంచి తేరుకునేలోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు -హౌరా ఎస్ఎంవీటీ(12864) ఎక్స్ప్రెస్ రైలు కోరమండల్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 233 మంది చనిపోగా, సుమారు 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మూడు ఎన్డిఆర్ఎఫ్ యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్లు రంగంలోకి దిగి రెస్కూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా ఛీఫ్ సెక్రటరీ ప్రదీప్ తెలిపారు. As a passenger on the Coromandel Express from Howrah to Chennai, I am extremely thankful to have escaped unscathed. It probably is the biggest train accident related incident. Thread of how the incident unfolded 1/n — Anubhav Das (@anubhav2das) June 2, 2023 (చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ) -
వేగంగా వస్తున్న రైలు.. అక్కను కాపాడి.. చెల్లెలు దుర్మరణం
ఖమ్మం క్రైం: శరవేగంగా వస్తున్న రైలును గమనించని అక్కను కాపాడే క్రమంలో చెల్లెలు మరో రైలు ఢీకొని దుర్మరణం పాలైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అందించిన వివరాలివి. ఖమ్మం శ్రీనివాస్నగర్కు చెందిన పోతునూక యశోద (37) తన అక్క వరలక్ష్మి, మరో మహిళతో కలిసి కమాన్బజార్లో మంగళవారం షాపింగ్కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వరలక్ష్మి ఓవర్ బ్రిడ్జి కింద వెంకటగిరి రైలు గేటుదాటుతోంది. అదే సమయంలో ఎగువ లైన్లో రైలు అతివేగంగా వస్తున్న విషయాన్ని గమనించిన ఆమె చెల్లెలు యశోద.. అక్క వరలక్ష్మిని వెనక్కి లాగింది. కానీ మరోవైపు డౌన్లైన్లో వస్తున్న రైలును గమనించకపోవటంతో యశోదను ఢీకొనగా.. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తన ను కాపాడబోయి చెల్లెలు కళ్ల ముందే మృతి చెందటంతో అక్క వరలక్ష్మి గుండెలు పగిలేలా రోదించడం కలిచివేసింది. యశోదకు భర్త రమేశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మార్చురీకి తరలించగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్రావు తెలిపారు. చదవండి: కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి -
స్పెయిన్లో రైలు ప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు
స్పెయిన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 39 మంది వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. బార్సిలోనా సమీపంలోని మాంట్కాడా స్టేషన్ వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో స్టేషన్లో పార్క్ చేసిన ఉన్న రైలును వెనక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు చాలా నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఎవరికి తీవ్ర గాయాలు అవ్వలేదని చెప్పారు. రైలులో నిలబడి ఉన్న వారు ఎక్కువ గాయపడినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. .ఈ ఘటన కారణంగా సదరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు దిశలలో రైలు ట్రాఫిక్ నిలిపివేశారు. చదవండి: జిన్పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా -
షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు రైలు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్యాసెంజర్ల వెయిటింగ్ హాల్లోకి గూడ్స్ రైలు దూసుకెళ్లినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పడంతో స్టేషన్లోని రెండు ట్రాక్లు బ్లాక్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు భోగీలు బోల్తాపడ్డాయి. రైల్వే స్టషన్లో ఫుటోవర్ బ్రిడ్జి కూడా ధ్వైంసమైంది. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైల్వే స్టేషనలో సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5లక్షల పరిహారం.. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయంగా అందిస్తామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. #JustIn Three passengers killed, while two others sustained grave injuries as a goods train derailed and rammed into passengers waiting at Korai station in #Odisha on Monday.@NewIndianXpress @Siba_TNIE pic.twitter.com/RtjYyhST2z — TNIE Odisha (@XpressOdisha) November 21, 2022 -
పట్టాలపై సెల్ఫీ.. దూసుకొచ్చిన లోకల్ ట్రైన్.. క్షణాల్లో!
కోల్కతా: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలకు క్రేజ్ పెరిగింది. అయితే, అదే సెల్ఫీ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదమని తెలిసి కూడా సెల్ఫీలకు పోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద సంఘటనే పశ్చిమ బెంగాల్లోని హావ్డా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ట్రాక్పై ప్రమాదకర రీతిలో సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు టీనేజర్లపైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సోమవారం రాత్రి కుల్గాచియా- బగ్నాన్ రైల్వేస్టేషన్ల మధ్య మహిష్రేఖ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని జీఆర్పీ పోలీసులు మంగళవారం తెలిపారు. మృతులను బగ్నాన్ ప్రాంతానికి చెందిన షరీఫ్ అలీ ముల్లిక్ (18), షరిఫుల్ ముల్లిక్ (14)గా గుర్తించినట్టు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత గుడ్బై.. బీజేపీలో చేరిక! -
షాకింగ్ వీడియో: భార్యను ట్రైన్ కింద తోసేసి పిల్లలతో పరార్!
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మహిళను ట్రైన్ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. వీడియోలో.. ప్లాట్ఫామ్పై ఉన్న బల్లపై తన పిల్లలతో బాధితురాలు పడుకుని ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి ఆమెను నిద్రలేపాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ట్రైన్ వస్తుండడాన్ని గమనించి.. అకస్మత్తుగా మహిళను లాక్కెళ్లి రైల్వే ట్రాక్పై తోసేశాడు. దాంతో ఆమె పైనుంచి అవాధ్ ఎక్స్ప్రెస్ రైలు దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇద్దరు కుమారులతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వారు ఇరువురు ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టేషన్లోని ఉన్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు దాదర్ వెళ్లాడని, అక్కడి నుంచి కల్యాన్ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. థానేలోని బీవండి నగరంలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. shocking video has emerged of a woman sleeping on the platform at Vasai railway station being pushed down by her husband. @saamTVnews @SaamanaOnline @ANI @AmhiDombivlikar @zee24taasnews @ pic.twitter.com/q0OrFTlePg — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 22, 2022 ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
రైలు ఢీ కొని విద్యార్థి మృతి.... అధికారుల తప్పిదమే అంటూ నిరసనలు
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక విద్యార్థి రైలు ఢీ కొని మృతి చెందింది. ఐతే ఈ ఘటన రైల్వే అధికారుల నిర్లక్యం కారణంగానే జరిగిందంటూ ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ప్రీతి పుట్టస్వామి అనే విద్యార్థి ప్రభుత్వ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తండ్రి ఆటోలో రైల్వే పట్టాల వద్ద దింపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె రైలు పట్టాలు దాటుతుండగా జారిపడటంతో అటుగా వేగంగా వస్తున్న రైలు ఢీ కొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. ఐతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు విద్యార్థులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేప్టటారు. ఇది ముమ్మాటికి రైల్వే అధికారుల తప్పిదమేనని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టాల్సిందేనంటూ...నిరసనలు చేశారు. ఈ మేరకు నిరసనకారులు హాసన్-మైసూరు హైవేను దిగ్భందించడమే కాకుండా తీవ్ర ఆగ్రహంతో టైర్లను తగలబెట్టడం వంటి పనులు చేశారు. వాస్తవానికి ఇలా రైలు పట్టాలను దాటవద్దంటూ హెచ్చరించడమే కాకుండా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఐతే కళాశాలకు, మార్కెట్కు సమీపంలో ఉన్నందున నివాసితులు సులభంగా ఉంటుందని తరుచుగా ఈ రైల్వే ట్రాక్లను దాటి అవతలి వైపుకు వెళ్లిపోతుంటారు. ఇలా నిర్లక్య ధోరణితో రాంగ్రూట్లో రైలు పట్టాలను క్రాస్ చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవడం బాధకరం. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
కొడుకా.. నువ్వులేక మేము బతుకుడెట్లా!
సాక్షి, పెద్దపల్లి : ‘ఎంత పనాయేరా కొడుకా.. నువు లేక మేము బతుకుడెట్లా’ అని విశాల్ తల్లిదండ్రులు, సోదరి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. సోమవారం పెద్దపల్లి రైల్వేస్టేషన్లో కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం ఆగిన సమయంలో రైలు దిగిన విశాల్(21)ను సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన పెద్దపల్లిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. మందమర్రి సింగరేణి బొగ్గుగని వర్క్షాప్లో పనిచేస్తున్న శ్రీనివాస్–పద్మావతి దంపతులకు కుమారుడు విశాల్, కూతురు ఉన్నారు. కూతురు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతోంది. సెలవులు రావడంతో ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి శ్రీనివాస్ బయల్దేరగా లగేజీ ఎక్కువగా ఉంటుందని విశాల్, తల్లి పద్మావతి సైతం బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కాగజ్నగర్ రైల్లో సోమవారం ఇంటికి బయల్దేరారు. ప్రాణం తీసిన క్రాసింగ్.. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు క్రాసింగ్ కోసం ఆగడమే విశాల్ ప్రాణాలను తీసిందా.. అనే భావన అందరిలో నెలకొంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు నుంచి దిగిన విశాల్ పక్కనే ఉన్న పట్టాలపైకి వెళ్లిన సమయంలో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు రావడంతో ప్రమాదం జరిగింది. చదవండి: డెలివరీకి డబ్బు కావాలి, డ్రాప్ చేయాలని అడిగింది.. ఆపై బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం -
రెండు రైళ్ల ఢీ.. 32మంది మృతి..
కైరో : రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో 32 మంది మృత్యువాతపడగా 66 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఈజిప్టులోని సోహగ్ ప్రావిన్స్లో శుక్రవారం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టుకున్న వేగానికి చాలా కోచ్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు అందులో ఇరుక్కుపోయారు. దఫల్ అల్ సవమ్, తాహ్త సిటీ మధ్య ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుని సహాయక చర్యలు చేపట్టారు. కోచ్ల మధ్య ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయటానికి చుట్టు పక్కలి గ్రామాల జనం కూడా సహాయపడుతున్నారు. ఇప్పటికే 49 అంబులెన్స్లు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించటంలో సహాయపడుతున్నాయి. మొరగ, తాహ్త, సోహగ్ హాస్పిటల్లలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈజిప్టు రైల్వే శాఖ పని తీరు బాగాలేకపోవటంత కారణంగానే తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో అత్యధికంగా దాదాపు 1,793 ప్రమాదాలు జరిగాయి. 2017 ఆగస్టులో అలెగ్జాండ్రియా సిటీ వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా.. 123 మంది గాయపడ్డారు. చదవండి, చదివించండి : స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు వేలం.. ఎంతో తెలుసా? -
రైలు ప్రమాదంలో గ్రామ వలంటీర్ మృతి
హనుమాన్జంక్షన్ రూరల్: స్థానిక నూజివీడు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గ్రామ వలంటీర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు మండలం మొఖసా నరసన్నపాలెం గ్రామంలో బోయపాటి రవీంద్రకుమార్ (35) వలంటీర్గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రైలు ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న ఏలూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన వలంటీర్ ఐడీ కార్డు ఆధారంగా మొఖసా నరసన్నపాలెం గ్రామ వలంటీర్ బోయపాటి రవీంద్రకుమార్గా గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్రకుమార్ ప్రమాదవశాత్తూ రైలు క్రింద పడి మరణించడా లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు -
రైలుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
లక్నో: స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలెట్లు గుర్తించడంతో కేవలం రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడడంతో పెద్ద ప్రమాదమేమి సంభవించలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. పంజాబ్లోని అమృత్సర్ నుంచి బిహార్లోని జయనగర్కు 4674 షహీద్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో లక్నో సమీపంలోని చర్బాగ్ రైల్వే స్టేషన్లో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అయితే పట్టాలు తప్పిన బోగీల్లో ప్రయాణికులు ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. వెంటనే ఆ ఆ బోగీలలోని ప్రయాణికులను దింపేసి ఇతర బోగీల్లో ఎక్కించి రైలు ప్రయాణం పునరుద్ధరించారు. -
రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!
ఆమ్స్టర్ డ్యామ్: నెదర్లాండ్లో ఒక సబ్వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్ మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్ డామ్ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కిటెక్ట్ స్ట్రూయిజ్స్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి స్ట్రూయిజ్ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు. ఆ సమయంలో లోకో పైలెట్ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: పాపకి ఊహించని గిఫ్ట్.. డాడీ అంటూ.. -
రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, రంగారెడ్డి: వికారాబాద్లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైలు ఇంజన్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తోంది. ఇది గమనించి ఉద్యోగులు అక్కడి నుంచి తప్పుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఇంజన్ ఢీకొని ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిని నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు. -
మానవ తప్పిదం వల్లే
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో నవంబర్ 11న ఎంఎంటీఎస్–ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్ క్రిపాల్ తేల్చారు. సిగ్నల్ను పట్టించుకోకుండా ఎంఎంటీఎస్ లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమా దం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలిలో రెండు రోజుల పాటు పరీక్షించారు. సిగ్నల్ వ్యవస్థ, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. సిబ్బంది, అధికారులను ప్రశ్నించారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణం కాదని తేల్చారు. లోకోపైలట్ చంద్రశేఖరే ప్రమాదానికి కారణమని గుర్తించి రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్కు నివేదిక ఇచ్చారు. కాగా, ఈ ఘటనలో లోకోపైలట్ మృతి చెందగా, రైలు గార్డు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాటి నుంచి ఆయన సెలవులోనే ఉన్నా రు. గార్డు కోలుకున్న తర్వాత దీనిపై ప్రశ్నిం చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
రైలు ప్రమాదంపై కమిటీ విచారణ వేగవంతం
హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రోజుల క్రితం హంద్రీ ఇంటర్సిటీని ఎంఎంటీఎస్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సంఘటనకు సంబంధించి కాచిగూడ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్కృపాల్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. కాగా నేడు విచారణలో భాగంగా స్టేషన్ మేనేజర్ రవీందర్, డివిజన్ రీజనల్ మేనేజర్ ఎన్వీఎస్ ప్రసాద్, అడిషనల్ డివిజన్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్లు రైల్వేసేఫ్టీ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను, ప్రమాద సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని విచారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైల్వే సేఫ్టీ కమీషనర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదస్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ రైల్భవన్లో ఈ ఘటనపై అధికారులను సుదీర్ఘంగా విచారించనున్నారు. చదవండి : కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ.. -
కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ..
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. బుధవారం (13న) ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. కాచిగూడ రైల్వేస్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకో పైలెట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసుల అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే ఎంఎంటీఎస్ రైలును లోకోపైలట్ మూవ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిగ్నల్ను విస్మరించడమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్తోపాటు మరో ఆరుగురి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక, రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్పై కేసులను నమోదు చేశారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
ప్రాణం కాపాడిన ‘100’
సాక్షి, సంగెం(వరంగల్) : రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లిలో ఉపవాస ప్రార్ధనలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సామర్లకోటకు చెందిన మణికంఠ తన భార్య రూపతో కలిసి సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, మణికంఠ అర్థరాత్రి ప్రమాదవశాస్తు రైలు నుంచి జారిపడిపోయాడు. విజయవాడ వరకు రైలు ఎక్కడ ఆగదు. దీంతో ఆయన భార్య రూప వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేసింది. ఎక్కడ పడిపోయాడో తెలియకపోవడంతో సంగెం, గీసుకొండ, నెక్కొండ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. సంగెం పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్కుమార్, కుమారస్వామి, రైల్వే సిబ్బంది సహకారంతో చింతలపల్లి ఎల్గూర్స్టేషన్ల మధ్య వెదికారు. రెండు గంటల పాటు శ్రమించి ఎల్గూర్రంగంపేట రైల్వే గేటుకు కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడిన ఉన్న మణికంఠను గుర్తించి 108కు సమాచారం అందించారు. స్ట్రేచర్పై ప్రధాన రహదారివరకు మోసుకుని వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మణికంఠ భార్య రూపకు సమాచారం అందించడంతో ఆమె ఎంజీఎంకు చేరుకుంది. సరౖఝెన సమయంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల నిండు ప్రాణం కాపాడిన సంగెం కానిస్టేబుళ్లు జగదీష్, కుమారస్వామిలను ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు, మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్చేసి పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ రవిందర్ కోరారు. -
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా: విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్ద ప్యాసింజర్ రైలు, పట్టాలపై ఉన్న గేదెలను ఢీకొట్టడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టం బాగుండి ప్రయాణికులకు ఏంకాలేదు. రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. -
పెళ్లింట విషాదం
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్గా గుర్తించారు. మంగళి కిషోర్కు రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన ‘సీమాంచల్’
సోన్పూర్(బిహార్): బిహార్లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. బిహార్లోని జోగ్బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ‘నంబర్ 12487 జోగ్బనీ–ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ కిషన్గంజ్ జిల్లా జోగ్బనీ నుంచి వస్తుండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో రైలు పట్టాల్లో పగుళ్ల కారణంగా సహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, మూడు స్లీపర్ కోచ్లతోపాటు మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి’ అని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ముజఫర్పూర్, పట్నాలోని ఆస్పత్రులకు తరలించాం. మిగతా వారికి వైశాలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం’ అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పని బోగీలకు మరికొన్నిటిని జత చేసి ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈస్ట్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్ ఖాన్ను రైల్వే శాఖ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. -
పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి
పట్నా: బీహార్లోని హాజీపూర్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువజామున 3.52 గంటల సమయంలో సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు. అజ్మీర్నుంచి జైపూర్ జంక్షన్ వైపు వెళ్తుండగా ఇంజన్ పట్టాలు తప్పి బోల్తా పడిందని సంగనేర్ పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్లైన్ నంబర్లు.. సోన్సూర్ - 06158 221645, హజీపూర్ - 06224 272230, బరౌని- 06279 232222. Rescue and relief operations are on for derailment of 9 coaches of Jogbani-Anand Vihar Terminal Seemanchal express at Sahadai Buzurg, Bihar. Help lines: Sonpur 06158221645 Hajipur 06224272230 Barauni 06279232222 — Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 3, 2019 -
జనగామలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు..
సాక్షి, జనగామ అర్బన్: జనగామ పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైల్లో నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్పల్లి గ్రామానికి చెందిన గంధారి లక్ష్మయ్య (70) హైదరాబాద్ మల్కాజ్గిరిలో కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో నవంబర్ 27న పోసాన్పల్లికి వచ్చిన లక్ష్మయ్య గురువారం రాత్రి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రైల్లో నుంచి జారిపడి మృతి చెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పెంబర్తి రైల్వేస్టేషన్ మాస్టర్ బి. గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించామని తెలిపారు. -
అమృత్సర్ ప్రమాదం : డబ్బులు అడుగుతున్న వైద్యులు
అమృతసర్ : దసరా పండుగ నాడు రావణ దహనం సందర్భంగా పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఆదేశించినప్పటికి లాభం లేకుండా పోయింది. రైలు ప్రమాద బాధితుల పట్ల ప్రైవేట్ ఆస్పత్రుల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటూ ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన జనాలు ప్రమాదం చోటు చేసుకున్న జోడా ఫాటక్ రైల్వే ట్రాక్ మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల వచ్చి నిరసనకారులను శాంతింపచేసి అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అంతేకాక ఎవరైనా బాధితుని వద్ద నుంచి ప్రైవేట్ ఆస్పత్రి వారు డబ్బు వసూలు చేస్తే, దాన్ని తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. శుక్రవారం నుంచి వైద్యం పొందుతున్న రైలు ప్రమాద బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
రావణాసురుడూ మరణించాడు!
రావణాసురుడూ మరణించాడు! ఇతని పేరు దల్బీర్సింగ్. అమృత్సర్ దసరా ఉత్సవాల్లో రావణుడి వేషం కట్టి అందరినీ అలరించాడు. రావణ దహనాన్ని కళ్లారా చూడాలని అనుకున్నాడు. ఆ సందడి, ఆ కోలాహలం బాగా కనిపించాలన్న ఉద్దేశంతో రైల్వే ట్రాక్ ఉన్న వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ వందలాది మంది చేరుకొని చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఉత్సవం చూడటంలో మునిగిపోయారు. అదే సమయంలో సూపర్ స్పీడ్తో రైలు మృత్యు శకటంలా తరుముకొస్తూ ఉండటాన్ని దల్బీర్ గమనించాడు. రైల్వే ట్రాక్ మీదున్న వాళ్లకి ప్రమాదం గురించి హెచ్చరించాలని పరుగులు తీశాడు. కానీ రెప్పపాటులోనే ఘోరం జరిగిపోయింది. రైలు దల్బీర్ను ఢీకొట్టి అతని శరీరాన్ని ఛిద్రం చేసింది. ఒకవైపు రావణుడి దిష్టిబొమ్మ మంటల్లో దగ్ధమవుతుంటే అదే సమయంలో రావణ పాత్రధారి ఇనుప చక్రాల కింద పడి నలిగిపోవడం అందరినీ కలిచివేసింది. రామ్లీలాలో గత పదేళ్లుగా దల్బీర్ సింగ్ వివిధ రకాల పాత్రల్ని పోషిస్తూనే ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు పాత్రధారులకి కూడా మేకప్ తదితర అంశాల్లో సహకరించాడు. కార్యక్రమం పూర్తయి ముగింపు దశకు వచ్చే సమయంలో తోటి వారిని ఆదుకోవడానికి వెళ్లి తానే బలైపోయాడు. దల్బీర్ సింగ్కు భార్య, ఎనిమిదినెలల కొడుకు ఉన్నాడు. అమృత్సర్: ఘోర రైలు ప్రమాదంతో పంజాబ్ అమృత్సర్లోని జోడా ఫాటక్ ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోవైపు అటు రైల్వే, ఇటు అమృత్సర్ నగరపాలక సంస్థ అధికారులు ఈ దుర్ఘటనకు తాము కారణం కాదని వాదిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 61 అని శుక్రవారం చెప్పిన అధికారులు తాజాగా లెక్కను సవరించి ఈ ఘటనలో 59 మంది చనిపోయారనీ, మరో 57 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల బంధువులను పరామర్శించిన అనంతరం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సీఎం ప్రతిపక్షాలను కోరారు. తప్పెవరిదో నాలుగు వారాల్లో విచారణలో తేలుతుందని చెప్పారు. క్షతగాత్రులను శుక్రవారం రాత్రే ఆసుపత్రులకు తరలించిన సిబ్బంది శనివారం ఉదయానికల్లా ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తొలగించారు. చనిపోయిన 59 మందిలో 40 మందిని గుర్తించామనీ, 36 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయని అధికారులు శనివారం చెప్పారు. మరో నలుగురి మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని వారి సొంత ప్రాంతాలకు పంపించామన్నారు. చనిపోయిన వారిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బిహార్లకు చెందిన వలస కూలీలేననీ, వీరంతా జోడా ఫాటక్ చుట్టుపక్కలే నివసించేవారని అధికారులు చెప్పారు. ఆసుపత్రుల వద్ద మృతుల బంధువులు, క్షతగాత్రుల రోదనలతో అమృత్సర్లో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. సమాచారం లేదు.. అనుమతి తీసుకోలేదు ఈ ప్రమాదానికి బాధ్యత తమది కాదనీ, ఇందులో తమ తప్పేమీ లేదని అమృత్సర్ నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదానికి రైల్వే ఎంత మాత్రం కారణం కాదనీ, డ్రైవర్పై విచారణ ఏదీ ఉండదని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. పట్టాలపై మనుషులను చూసిన వెంటనే గంటకు 91 కి.మీ.ల వేగంలో ఉన్న రైలును డ్రైవర్ 68 కి.మీ.లకు తగ్గించగలిగాడని చెప్పారు. రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని మాట్లాడుతూ ‘జోడా ఫాటక్ దగ్గర కార్యక్రమం గురించి రైల్వేకు సమాచారం ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన చోట లెవెల్ క్రాసింగ్ లేదు. ప్రజలే అక్రమంగా పట్టాలపైకి వచ్చారు’ అని చెప్పారు. అయినా డ్రైవర్ అత్యవసరంగా రైలును ఆపేందుకు ప్రయత్నించి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ సోనాలి మాట్లాడుతూ ‘జోడా ఫాటక్ దగ్గర దసరా వేడుకలకు ఎవ్వరూ అనుమతి ఇవ్వలేదు. అసలు మమ్మల్ని ఎవ్వరూ అనుమతి కోరనే లేదు’ అని చెప్పారు. అమృత్సర్లో రైలు ప్రమాద మృతుల సామూహిక అంత్యక్రియల దృశ్యం భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే.. ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. శనివారం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతో అక్కడి ప్రజలు ఘర్షణకు దిగారు. పట్టాల పక్కన అలాంటి వేడుక జరిగేందుకు ఎందుకు అనుమతించారు?’ అని ఓ స్థానికుడు ప్రశ్నించారు. శనివారం ఉదయం స్థానికులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలపడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 37 రైళ్లను రద్దు చేయగా మరో 16 రైళ్లను దారి మళ్లించారు. మరోవైపు ఈ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా రావణ దహన వేడుకలను నిర్వహిస్తున్నందున పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 500 రైళ్లొచ్చినా కదలరు రైల్వే పట్టాల సమీపంలో రావణ దహనం కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారుడు ఆధ్వర్యంలో జరిగింది. వేడుకలకు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చిన వాళ్లు ట్రాక్ మీద నిలబడిన విషయాన్ని కూడా మర్చిపోయారు. దాదాపు 5 వేల మంది ప్రజలు రైల్వే ట్రాక్పై నిలబడ్డారు. 500 రైళ్లు వచ్చినప్పటికీ.. వాళ్లు మాత్రం అక్కడ నుంచి కదలరు’అని కౌర్కు చెప్పాడు. ఘటన జరిగినప్పటి నుంచి కౌన్సిలర్ కొడుకు అదృశ్యమయ్యాడు. రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు నిర్వాహకుడు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని ఇగత్పురి రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా మెయిల్ రైలు ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో పట్టాలు తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానట్లు తెలిసింది. రైల్వే భద్రతా సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే 12 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఏడు రైళ్లను దారి మళ్లించారు. 12809 ముంబై-హౌరా మెయిల్కు సంబంధించి మూడు బోగీలు(కోచ్లు) పట్టాలు తప్పాయని, అవి ఎస్-12, ఎస్-13, పాంట్రీ కారుగా గుర్తించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సునీల్ ఉడాసీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వరంగల్లో మరణమృదంగం
వరంగల్ : ఓరుగల్లులో మూడు ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మూడు సంఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆరుగురు బలవర్మరణాలకు పాల్పడగా.. రోడ్డు ప్రమాదం మరో ఇద్దరిని మింగింది. బావా, మరదళ్ల ఆత్మహత్య రామారంలో బావ, మరదళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకతీయ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ రెడ్డి నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడగా, ఆయన మరదలు రక్షితరెడ్డి ఉరేసుకుని ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి స్వస్థలం రాయికల్ కాగా.. రక్షిత రెడ్డిది జగన్నాథపురం. రైలు కింద పడి నలుగురు.. ఖిల్లా వరంగల్ మండలం చింతల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే రోజు నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వీరు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే మరొక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే ట్రాక్పై తలలు పెట్టడంతో ముగ్గురి తలలు మొండెం నుంచి వేరయ్యాయి. అక్కడ భయంకర వాతావరణం నెలకొంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతని పేరు కొంగ మహేశ్గా గుర్తించారు. చనిపోయింది కొంగ మహేశ్(35), ఆయన తల్లి పూలమ్మ(55), కుమార్తె దర్శిని(10)గా గుర్తించారు. కొంగ మహేశ్ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పేరు సంగీత. కుటుంబంతో కలిసి నిన్ననే హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చారు. ఆయన భార్య సంగీత.. ఖాజీపేటలో ఉంటున్న చెల్లిలి వద్దకు నిన్న వెళ్లింది. వీరంతా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అదృశ్యమయ్యారు. మహేశ్ తను చనిపోయే ముందు స్నేహితులకు, బంధువులకు ‘ఐ మిస్ యూ ఆల్’ అని మెసేజ్ పెట్టారు. దీంతో బంధువులు, స్నేహితులు మహేశ్ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ రోజు ఉదయం రైలు పట్టాలపై మృతదేహాలై కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య సంగీతను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన కాయక సంపత్(29), పల్లె ప్రభాకర్(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వరంగల్ నుంచి స్వగ్రామము వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం
బిక్కవోలు (అనపర్తి) : గ్రామంలోని రాజారావుపేటకు చెందిన సిరికి సత్యవతి(45) రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలైనట్టు బంధువులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున పాస్ట్ప్యాసింజర్ రైలులో సత్యవతి కుటుంబ సభ్యులతో కలసి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల దైవదర్శనానికి వెళ్ళింది. స్వామి దర్శనానంతరం తిరిగి సాయంత్రం కాకినాడ ప్యాసింజర్లో బిక్కవోలు బయలుదేరారు. భీమడోలు స్టేష¯ŒSకు వచ్చిన వారు రద్దీగా ఉన్న రైలు ఎక్కబోతుండగా రైలు కదిలిపోయిందని దీంతో చివరి మెట్టుపై ఉన్న సత్వవతి జారి కిందపడి రైలుకు ప్లాట్ఫాంకు మధ్యలో నుంచి పట్టాల పైకి జారిపోవడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఏలూరు రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు బంధువులు తెలిపారు. -
విద్యార్థి దుర్మరణం
సూళ్లూరుపేట : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ఎస్.సమీర్ (18) స్థానికంగా ఉన్న సత్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గురువారం ఉదయం బహిర్భూకి వెళ్లిన సమీర్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు సమీర్ మృతదేహానికి నివాళులర్పించారు. -
రైలు ఢీకొని నేపాల్ వాసి దుర్మరణం
నాయుడుపేటటౌన్ : ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నేపాల్వాసి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేట రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. నేపాల్ దేశానికి చెందిన మెక్ బహదూర్ (43) స్టేషన్లో రైలు పట్టాలు దాటుతుండగా చెన్నై వైపు నుంచి వెళ్తున్న గోహతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ జానకీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన పర్సులో ఉన్న ఓటర్, పాన్, ఏటీఎం కార్డులతో పాటు నేపాల్ దేశానికి చెందిన కరెన్సీ ఉండడాన్ని గుర్తించారు. ఽఓటరు కార్డులో మెక్ బహదూర్, తండ్రి ఖదక్ బహదూర్ 2/ఎన్ఏ అన్నాసాలై, నాగల్కని, క్రోమ్పేట, చెన్నై అనే వివరాలు ఉండటం అతను చెన్నైలో స్థిర నివాసం ఉంటున్నట్లు భావిస్తున్నారు. అతని పర్సులో నేపాల్కు చెందిన కరెన్సీతో పాటు చెన్నై ఐడీబీఏ బ్యాంక్లో రూ.40 వేలు నగదు జమ చేసినట్లు ఓచర్లు ఉండడాన్ని రైల్వేపోలీసులు గుర్తించారు. రాక్సుల్ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు రైల్వే టికెటు ఉంది. చెన్నైలోని జనరల్ ఇండస్ట్రీయల్ లెదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డు ఉంది. వీటి ఆధారంగా వారికి సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి
నెల్లూరు (క్రైమ్) : ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని (40) వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు సమీప రైలు పట్టాల వద్ద చోటు చేసుకుంది. మృతుడు లేత బ్లూ (స్కైబ్లూ)రంగు ఫుల్హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు కాటన్ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి జేబులో టెస్టర్ ఉంది. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ జోసఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
కావలి అర్బన్ : పట్టాల వైపు బహిర్భూమికి వెళ్లిన యువకుడిని రైలు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన గురువారం స్థానిక వైకుంఠపురం రైల్వే గేటు సమీపంలో జరిగింది. స్థానిక వైకుంఠపురానికి చెందిన వల్లూరు రమణారెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25)పట్టణంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బోయ్గా పని చేస్తున్నాడు. ఉదయం బహిర్భూమికని రైలు పట్టాల వైపు వెళ్లి తిరిగి ఇంటికి ఫోనులో మాట్లాడుతూ వస్తున్న సమయంలో చెన్నై వైపు వెళ్లే రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కీమ్యాన్ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
రైలు కింద పడి యువకుడి మృతి
డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్) : అక్కను చూసి వస్తానంటూ వెళ్లిన చెట్టంత కొడుకు రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. డొంకూరు మత్య్సకార గ్రామానికి చెందిన వీఆర్ఏ బాడాన నూకరాజు రెండవ కుమారుడు బాడాన జగ్గారావు(25) రెండు రోజుల కిందట ఒడిశా రొంపాలో ఉన్న అక్కను చూసి వస్తానంటూ వెళ్లాడు. అక్కతోనే కలసి బుధవారం సాయంత్రం వరకు ఇచ్ఛాపురం బ్యాంకు, మార్కెట్ పనుల్లో సాయమందించిన జగ్గారావు అదే రోజు సాయంత్రం అమ్మమ్మ ఊరు ఒడిశా నోగాం వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడని అక్క నాగమణి తెలిపింది. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీ దరిదాపుల్లో బుధవారం రాత్రి రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం పలాస రైల్వే పోలీసుల నుంచి కబురు రావడంతో కుటుంబ సభ్యులు హతాశుతులయ్యారు. ఎనిమిదేళ్ల కిందట తల్లి మృతి చెందినప్పటి నుంచి జగ్గారావు మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. -
వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఏలూరు అర్బన్ : రెండు వేర్వేరు ప్రమాదాల్లో రైలు నుంచి జారిపడి ఒకరు, రైలు ఢీకొని మరొకరు మృతిచెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గన్బజార్ సెంటర్లో రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుడి చేతిపై రాజేశ్వరి, సీతారామమ్మ అనే పచ్చబొట్టు ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రైల్వేపోలీసులు తెలిపారు. రైలు నుంచి జారిపడి.. భీమడోలు–దెందులూరు మధ్య రాజమండ్రి నుంచి విజయవాడ Ððళ్తున్న పాసింజర్ రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మరణిం చాడు. మృతుని వయసు 45 ఏళ్లు ఉంటుందని, ఐదున్నర అడుగుల ఎత్తు, నలుపు, తెలుపు చారల చొక్కా, ఖాకీ ఫ్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు తమకు తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు. అనారోగ్యంతో యువకుడు హౌరాకు చెందిన రామకృష్ణ సర్దార్ (27) అనే యువకుడు ఆదివారం అనారోగ్యంతో ఏలూరు రైల్వే ప్లాట్ఫాంపై మృతిచెందాడు. ౖÆðల్వే పోలీసుల వివరాల ప్రకారం.. హౌరాకు చెందిన సర్దార్ కోరమాండల్ ఎక్స్ప్రెస్లో స్వగ్రామానికి బయలుదేరాడు. రైలు విజయవాడ దాటిన సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడం గుర్తించిన టీసీ బాధితుడిని వైద్య సహాయం నిమిత్తం ఏలూరు రైల్వేస్టేçÙన్లో దింపి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు లు అతడ్ని ఆస్పత్రికి తరలించే యత్నంలో ఉండగా సర్దార్ కన్నుమూశాడు. -
రైలు ఢీకొని వీఆర్ఏ మృతి
కావలిఅర్బన్ : స్థానిక ముసునూరు రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వీఆర్ఏ చిట్టేటి సుబ్బయ్య (60) దుర్మరణం చెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... ముసునూరుకు చెందిన వీఆర్ఏ సుబ్బయ్య విధి నిర్వహణలో భాగంగా గ్రామ శివారు ప్రాంతానికి Ðð ళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుబ్బయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని పెయింటర్ మృతి
నెల్లూరు (క్రైమ్) : రైలు ఢీకొని పెయింటర్ మృతి చెందిన సంఘటన ఎస్–2 థియేటర్ సమీప రైలు పట్టాలపై శనివారం జరిగింది. చిల్డ్రన్స్పార్కు సమీపంలోని గుర్రాలమడుగుకు చెందిన ఎ.మురళీకృష్ణ (30) పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా ఆయన వ్యసనాలకు బానిసై సంపాదన ఖర్చు చేయసాగాడు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. పలుమార్లు భార్య మమత అతన్ని పద్ధతి మార్చుకోమని సూచించింది. అయినా ప్రవర్తనలో మార్పురాకపోవడంతో ఇటీవల ఆమె తన కుమారుడితో కలిసి వడ్డిపాళెంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మురళీకృష్ణ ఫూటుగా మద్యం సేవించి పనికి వెళ్లడం మానేశాడు. భార్యను కాపురానికి రమ్మన్నాడు. ఆమె రాకపోవడంతో మరింత మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎస్–2 థియేటర్ సమీపంలో చెన్నై వెళ్లే రైలు పట్టాల వద్ద రైలు ఢీకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో లభ్యమైన ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అతను ప్రమాదవశాత్తు మృతి చెందాడా?. ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
ఏలూరు అర్బన్ : రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కొత్తపేటకు చెందిన తాతపూడి రమేష్ (22) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు 15ఏళ్ల కిందటే చనిపోవడంతో బంధువుల వద్ద పెరిగాడు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగి పవర్పేట గేటు వేసి ఉండగా.. తూలుతూ పట్టాలు దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో విశాఖ నుంచి విజయవాడ Ðð ళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి మరో యువకుడు వృుతి చెందాడు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి సుమారు 20ఏళ్ల వయసున్న యువకుడు దెందులూరు మండలం అలుగులగూడెం ప్రాంతంలో బుధవారం రాత్రి రైలు నుంచి జారిపడ్డాడు. అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుని శరీరంపై పసుపు రంగు టీ షర్ట్, నీలం రంగు జీన్స్ప్యాంట్ ఉన్నాయి. సమాచారం తెలిసిన వారు 9440627572 నంబరుకు తెలిజేయాలని పోలీసులు సూచించారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్) : రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. బుజబుజనెల్లూరు భగత్సింగ్ కాలనీకి చెందిన ఎస్కే రియాజ్బాషా (50)కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తాను చనిపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్తో లేఖరాసి అయ్యప్పగుడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలు కిందపడి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ జోసఫ్ విజయ్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకుని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అతని ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా? మరే ఇతర కారణమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. జోసఫ్ విజయకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోంచి జారిపడి మహిళ.. రైల్లోంచి జారిపడి గురుతెలియని మహిళ (50) మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామన మాగుంట లేఅవుట్ సమీపంలోని రామిరెడ్డి డ్రెయిన్ అండర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. ఎరుపు, నలుపు, పసుపు మిళితమైన పూలు కలిగిన చీర, గులాబి రంగు జాకెట్ ధరించి ఉంది. ఘటనా స్థలాన్ని రైల్వే హెడ్కానిస్టేబుల్ వరలక్ష్మి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి
ఏలూరు: రైలు పట్టాలపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం రామకృష్ణాపురం ప్రాంతంలోని రెడ్డి కశాశాల వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆవాల మావూళ్లమ్మ కుమార్(18), మోహన్(18) అనే ఇద్దరు సైకిల్ పై రైలు పట్టాల మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. -
రైలు ఢీకొని యువకుడికి గాయాలు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో రైలు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయమం రైలు పట్టాలపై గాయాలతో పడి ఉన్న యువకుడిని గుర్తించిన స్థానికులు 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పట్టణవాసులు మార్నింగ్ వాక్కు వెళ్లగా వారికి రైలు పట్టాలపై పడి ఉన్న వ్యక్తి కనిపించాడు. తలకు బలమైన గాయాలు కావటంతో అపస్మారక స్థితిలో ఉన్నాడని స్థానికలు తెలిపారు. పట్టాలు దాటుతూ రైలు ఢీకుని ఉంటుందని భావిస్తున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి
-
రైల్వే అధికారులపై కేసులు!
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో రైల్వే అధికారులపై కూడా కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ లెవెల్ క్రాసింగు వద్ద రైల్వే గేటు లేకపోవడమేనని, ట్రాఫిక్ ఎక్కువగా లేదన్న కారణంతోనే ఇంతకుముందు ప్రజలు కోరినా కూడా రైల్వే శాఖ అక్కడ గేటు ఏర్పాటుచేయలేదని ఆయన అన్నారు. ఈ విషయమై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గేటు కావాలంటూ ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు కూడా రైల్వేశాఖ అధికారులదే తప్పని, ఇక్కడ గేటు పెట్టించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. -
ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. చిన్నారుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ భరిస్తుందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా మసాయిపేట వద్ద గురువారం ఉదయం నాందేడ్ ప్యాసింజర్ రైలు స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కోకుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం కింద అందజేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేల ఇవ్వనున్నట్లు తెలిపింది. -
ప్రజల ప్రాణాలంటే అంత చులకనా?
-
'ఈ ఘటన చాలా బాధాకరం'
-
రాష్ట్ర ప్రభుత్వాలైనా రైల్వేగేట్లు పెట్టించాలి: వైఎస్ జగన్
మెదక్ జిల్లాలో స్కూలుబస్సును రైలు ఢీకొన్న ప్రాంతంలో రైల్వే గేటు కావాలని అక్కడి ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా రైల్వేశాఖ, వాళ్లు చేయకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా ముందుకొచ్చి కాపలా లేని రైల్వేక్రాసింగులు ఉన్నచోటల్లా కాపలాతో కూడిన గేట్లు పెట్టించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దాదాపు 20 మంది చిన్నారులు మరణించిన సంఘటన స్థలం వద్దకు ఆయన గురువారం ఉదయమే వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ''ఇది చాలా బాధాకరం. 20 మంది పిల్లలు మరణించారు. అక్కడకు వెళ్లి చూసినప్పుడు వాళ్ల పుస్తకాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. ఒక పుస్తకం చూస్తే, ఆ పిల్లాడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంతమంది పిల్లలు చనిపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. అక్కడ గేటు కావాలని స్థానికులు మూడుసార్లు ధర్నాలు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి గేటులేని క్రాసింగులు చూస్తే, ఆ ఒక్క సెక్షన్లోనే మూడున్నాయి. రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా చూడాలి. గేటులేని ప్రతిచోటా గేట్లు పెట్టించే కార్యక్రమాలు రైల్వేశాఖ చేస్తుందో లేదో తెలీదు గానీ.. వాళ్లు చేయాలి. లేనిపక్షంలో మనం మన పిల్లలని మనసులో పెట్టుకుని.. అవసరమైతే రెండువేల కోట్లో.. లేదంటే ఎంతోకొంత బడ్జెట్ కేటాయించి ప్రతిచోటా మ్యాన్డ్ గేట్లు పెట్టించాలని, నాలుగు అడుగులు ముందుకేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఎవరినో విమర్శిస్తే ఏమీ లాభం లేదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనమేం చేయాలో ఆలోచించాలి. అక్కడ ఆరేడేళ్ల వయసున్న పిల్లలున్నారు. వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండాప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ భయపడే స్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలి. ఇందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చినట్లు విన్నాను. దాంతో సరిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా నష్టపరిహారం కోసం ప్రయత్నించాలి. ఇక్కడ కూడా పెద్దలైతే 5 లక్షలు సరిపోవచ్చేమో గానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు మరణించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాను. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ప్రభుత్వం కూడా మానవత్వం ప్రదర్శిస్తే మంచిది. పార్టీ తరఫున కూడా చేయాల్సిందంతా చేస్తాం'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు
-
ప్రమాద ఘటనా స్థలంలో వైఎస్ జగన్
-
అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు
కన్నబిడ్డలపైనే ప్రాణాలు పెట్టుకున్న బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ప్రమాద వార్త అశనిపాతంగా మారింది. తమ ఇద్దరు చిన్నారులు రైలు ప్రమాదంలో మృతి చెందిన వార్తను విన్న ఓ తండ్రి గుండెపోటుకు గురయ్యారు. నాందేడ్ ప్యాసింజర్ రైలు.. కాకతీయ స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో కిష్టాపూర్కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ మృతి చెందారు. వీళ్లిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. ఈ సమాచారం తెలియటంతోఆ విద్యార్థుల తండ్రికి గుండెపోటు రావటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ డ ఓ చిన్నారి అమ్మా... నాకేమయిందమ్మా... అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమాయకంగా అడుగుతున్న ఘటన తల్లితో పాటు, చూసేవారిని కంటతడి పెట్టించింది. మరి కొంతమంది తల్లిదండ్రులు సంఘటన స్థలంలోనే స్పృహతప్పి పడిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ కళ్లముందు కదలాడే కన్నబిడ్డలు ఇక లేరన్న విషయం జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యాలు సంఘటన స్థలంలో ఉన్న వారందరి హృదయాలను కలచివేశాయి. -
మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!
న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన స్కూల్ విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్ధులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాక్షించారు. మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. The PM prays for the speedy recovery of those injured in the accident in Medak District. — PMO India (@PMOIndia) July 24, 2014 The Prime Minister has expressed his deepest condolences to the families of those who lost their lives in the accident in Medak district. — PMO India (@PMOIndia) July 24, 2014 -
స్కూల్ కి వెళ్ళొస్తా, మమ్మీ బై అవే చివరి మాటలు
హైదరాబాద్ : నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం, బాధ్యతా రాహిత్యం ఇవే మెదక్ జిల్లాలో పెను విషాదానికి కారణం. లెవల్ క్రాసింగ్ల దగ్గర గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అజాగ్రత్త 20 మంది విద్యార్ధులను బలిగొన్నాయి. అధికారమే తప్ప బాధ్యత తెలియని అధికారగణం నిర్లక్ష్యానికి అభం, శుభం తెలియని చిన్నారులు మూల్యం చెల్లించుకున్నారు. నాన్న స్కూల్ కి వెళ్శొస్తాను, మమ్మీ బై అన్న పలుకులే చివరి మాటలుగా మారాయి. తమ బిడ్డల ముద్దు ముద్దు మాటలతో మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ...అవే వారి ఆఖరి మాటల కావటంతో బాధితులను ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు. అదే తన చిన్నారి ఆఖరి మాటలు అంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించటం చూసేవారిని కంటతడి పెట్టించింది. కాగా శుక్రవారం మెదక్ జిల్లాలో పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. -
తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
-
విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
మెదక్ : కన్నబిడ్డలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో ముగినిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న వారిని జగన్ ఓదార్చారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు గురువారం ఉదయం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును ఢీకొన్న విషయం తెలిసిందే. -
రైల్వే పోలీసులపై రాళ్లదాడి
-
బిడ్డా.. జర భద్రం!!
'బిడ్డా.. జర భద్రం'.. ఇవే ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడిన చివరి మాటలు. పొద్దున్నే లేచి, శుభ్రంగా తయారై బ్యాగు తగిలించుకుని, క్యారేజి పట్టుకుని బస్సు మెట్లు ఎక్కేముందు ఆ మూడు గ్రామాల్లోని దాదాపు 20 మందికి పైగా తల్లులు తమ కన్న బిడ్డలను భద్రంగా వెళ్లి రమ్మంటూ టాటా చెప్పారు. అలా చెప్పి గంట సేపు కూడా గడిచిందో.. లేదో, అంతలోనే వాళ్లు ఎక్కిన బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసింది. ఆ తల్లుల గుండెలు ఝల్లుమన్నాయి. ఉరుకులు పరుగుల మీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడకు వెళ్లేసరికే చిరునవ్వులు చిందించాల్సిన తమ చిన్నారులు రక్తమోడుతూ విగతజీవులుగా కనిపించారు. అంతే.. వాళ్ల గర్భశోకానికి అంతులేదు. చాలామంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. బస్సులో ఆడుతూ పాడుతూ వెళ్తున్న చిన్నారులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు తమ బస్సును ఢీకొనడంతో ఏం జరిగిందో తెలిసేలోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గుండేటిపల్లెకు చెందిన 11 మంది పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. కొన్ని కుటుంబాల్లో వాళ్ల పిల్లలంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుండేటిపల్లెకు చెందిన వరుణ్ -శ్రుతి, కృష్ణాపూర్కు చెందిన రజియా-వహీద్ ఇలా మరణించినవారే. వీరిలో రజియా-వహీద్ల తల్లి తన బిడ్డలు లేరన్న విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించగా, వాళ్ల తండ్రికి కూడా గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు. -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
-
5 లక్షల ఎక్స్గ్రేషియా,వారంలో గేటు ఏర్పాటు
హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. వారం రోజుల్లోగా రైల్వేగేటు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఈ దుర్ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే అమాయక చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ యుద్ధ ప్రాతిపదికపై గేటు ఏర్పాటు చేసి, సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మరోవైపు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. -
రైల్వే పోలీసులపై రాళ్లదాడి
మెదక్ జిల్లాలో ప్రమాదం సంభవించిన స్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి విద్యార్థుల మృతదేహాలను తరలిస్తున్న రైల్వే పోలీసుల వద్ద స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జి చేయడంతో వెంటనే వాళ్లు రాళ్ల దాడి ప్రారంభించారు. ఈ రాళ్లు తగిలి రైల్వే అధికారులతో పాటు అక్కడున్న డీఎస్పీకి, కొంతమంది పోలీసులకు, ప్రమాద ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రమాదాలను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోలేదన్న ఆగ్రహంతోనే స్థానికులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి సున్నితమైన సమయంలో లాఠీ ఛార్జి జరగడంతో మరింత ఆవేశానికి గురై రాళ్లతో దాడి చేశారని అంటున్నారు. -
దుర్ఘటనపై ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శరత్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ప్రమాదం జరిగిన కాకతీయ స్కూల్ బస్సులో మొత్తం 38మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 13మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు నివేదికలో వెల్లడించారు. మరో 15మంది తీవ్రంగా గాయపడగా, ప్రమాదం నుంచి ముగ్గురు విద్యార్థులు మాత్రమే క్షేమంగా బయటపడినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల సఖ్యతో పాటు పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో అందచేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
హైదరాబాద్ : ఎప్పుడూ వచ్చే బస్సు డ్రైవర్ విధుల్లోకి రాకపోవటంతో అతని స్థానంలో విద్యార్థులను తీసుకు వచ్చేందుకు స్కూల్ యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ను పంపించినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. రైలు రాదనే ధీమాతో డ్రైవర్ భిక్షపతి బస్సును ముందుకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కాపలా లేని గేట్లు.. మృత్యు ద్వారాలు
మన దేశంలో 12,582 కాపలా లేని రైల్వే క్రాసింగులు ఉన్నాయి. వీటన్నింటి దగ్గరా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంది. ఈ క్రాసింగులన్నీ మృత్యుద్వారాలుగా మారుతూ లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎక్కువ శాతం ప్రమాదాలకు ఇతర వాహనాల డ్రైవర్ల తప్పే కారణం అవుతోంది. మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో జరిగిన కొన్న ఘోర ప్రమాదాలను చూద్దాం.. 2014 మే 19: ఉత్తరప్రదేశ్లోని ఖల్సాహా వద్ద కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆ రాష్ట్ర మంత్రి సతాయ్ రామ్ యాదవ్, మరో ఇద్దరు మరణించారు. 2014 మే 9: గోరఖ్పూర్ వద్ద లెవెల్ క్రాసింగుపై జీపును రైలు ఢీకొనడంతో పెళ్లి బృందానికి చెందిన 13 మంది మృతి చెందారు. 2012 సెప్టెంబర్ 26: బీహార్లోని సివాన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న హౌరా-కేజీ గుడాం బాగ్ ఎక్స్ప్రెస్ రైలు కాలేజి బస్సును ఢీకొనడంతో 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. స్థానికులు ఆగ్రహంతో రైలుకు నిప్పు అంటించారు. 2012 మార్చి 20: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 296 కిలోమీటర్ల దూరంలో ప్రయాణికులతో కిక్కిరిసిన మినీ వ్యాన్ను రైలు ఢీకొనడంతో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2012 ఫిబ్రవరి 3: అసోంలోని కామరూప్ జిల్లాలో ఓ వాహనాన్ని రైలు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు, మరో 50 మంది గాయపడ్డారు. 2012 డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్లోని మెదక్ జిల్లా శంకర్పూర్ వద్ద ఇండోర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు లారీని ఢీకొని 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. చాలామంది గాయపడ్డారు. 2011 జూలై 7: ఉత్తరప్రదేశ్లోని కాన్షీరాం జిల్లా తనగావ్లో కాపలాలేని రైల్వే గేటు వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెళ్లికి వెళ్తున్న బృందంతో కూడిన బస్సును మథుర- చాప్రా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో 38 మంది మరణించగా మరో 30 మంది గాయపడ్డారు. -
కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్కు గుండెపోటు
హైదరాబాద్ : ఘోర రైలు ప్రమాదానికి సంఘటన వార్తతో కాకతీయ టెక్నో స్కూలు ప్రిన్సిపాల్ గుండెపోటుకు గురయ్యారు. కాకతీయ స్కూల్ బస్సు గురువారం ఉదయం 9 గంటల సమయంలో మాసాయిపేట రైల్వేగేట్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38మంది ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా 7వ తరగతిలోపువారే. తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం హోరెత్తింది. ఉదయం ఇంటి నుంచి టాటా చెబుతూ వెళ్లిన తన చిన్నారి విగతజీవిగా చూసిన ఓ తల్లి ఘటనా స్థలంలోనే స్పృహ తప్పిపడిపోయింది. -
మృతి చెందిన విద్యార్థులు వీరే
హైదరాబాద్ : మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు. మృతుల వివరాలు: విద్య (గుండేటిపల్లి), వంశీ (ఇస్లాంపూర్),.. చరణ్, దివ్య (గుండేటిపల్లి) అన్నాచెల్లెళ్లు రజియా, వహీద్ (కిష్టాపూర్) అక్కాచెల్లెళ్లు భువన (ఇస్లాంపూర్), వరుణ్, శృతి అన్నాచెల్లెళ్లు విష్ణు, చింతల సుమన్, మహేష్, డ్రైవర్ భిక్షపతిగౌడ్ ఇక క్లీనర్ ఈ ప్రమాదం నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
దుర్ఘటనపై 3గంటలకు రైల్వే మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైల్వే ప్రమాద దుర్ఘటనపై రైల్వేమంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు. లోక్సభ సమావేశాల్లో రైలు ప్రమాద వార్తను ఎంపీ జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ సహాయ చర్యలు చేపట్టాల్సింది అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు మధ్యాహ్నం మూడు గంటలకు సభలో తెలుపుతామని రైల్వేమంత్రి పేర్కొన్నారు. -
గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు
-
కాకతీయ స్కూల్ గుర్తింపు రద్దు
హైదరాబాద్ : రైలు ప్రమాదానికి గురై 20మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న కాకతీయ ప్రయివేట్ స్కూల్ గుర్తింపు రద్దు అయ్యింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు మెదక్ డీఈవో రాజేశ్వరరావు గురువారమిక్కడ తెలిపారు. తుప్రాన్లో కాకతీయ ప్రయివేట్ స్కూల్ బస్సు గురువారం ఉదయం విద్యార్థులను తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
మృతి చెందిన విద్యార్థులు వీరే
-
రైలు ఆలస్యం.. అందుకే ప్రమాదం!
మృత్యువు ముంచుకొచ్చింది. రైలు రూపంలో తరుముకుని వచ్చింది. అదే దాదాపు 20 మంది చిన్నారుల ప్రాణాలు బలిగొంది. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ ప్రమాదం జరిగిన సమయానికి రావాల్సింది కాదు. నాలుగు గంటలు ఆలస్యంగా ఆ రైలు నడుస్తోంది. దాదాపు ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లకు రైళ్ల రాకపోకల సమాచారం తెలుస్తూనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో రైళ్లేవీ రావన్న ధైర్యంతోనే బస్సు డ్రైవర్ కూడా మొండిగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్.. బస్సు వస్తున్న విషయాన్ని తెలుసుకునే అవకాశం లేకపోవడం, క్రాసింగ్ వద్దకు రైలు వచ్చేసరికి ఎదురుగా ఉన్నట్టుండి బస్సు కనిపించడంతో రైలు డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైలుకు షడన్ బ్రేకు వేస్తే.. వెనక ఉన్న 14 బోగీలు పట్టాలు తప్పి, మరింత ఘోరమైన ప్రమాదం సంభవిస్తుంది. అందుకే నెమ్మదిగా బ్రేకులు వేస్తూ.. దాదాపు అర కిలోమీటరు దూరం తర్వాతే రైలును ఆపగలిగాడు. దాంతో అంతదూరం పాటు బస్సును రైలు లాక్కుంటూ వెళ్లిపోయింది. బస్సు మీద, రైలు పట్టాల మీద పిల్లల రక్తపు మరకలు పడ్డాయి. -
బాలాజీ ఆస్పత్రిలో 12మంది విద్యార్థులకు చికిత్స
హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు కొంపల్లి బాలాజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 12bమంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని నలుగురిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా తరలించినట్లు సమాచారం. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ .... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమీక్ష నిర్వహించారు. -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి
మెదక్ : మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
బాధితులంతా 12 ఏళ్ల లోపువారే
మెదక్ జిల్లాలో రైలు ప్రమాదం సంభవించిన మాసాయిపేట చాలా నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో దాదాపు గంటన్నర సేపు ఎవరికీ పిల్లల ఆర్తనాదాలు వినిపించలేదు. పిల్లల్లో చాలామందికి చేతులు విరిగి. కాళ్లు మెలి తిరిగిపోయి పరిస్థితి అంతా హృదయవిదారకంగా ఉంది. బాధితులంతా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారేనని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ఇదే ప్రాంతం మీదుగా బస్సు వెళ్తుందని, కానీ లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు మాత్రం ఏర్పాటు చేయట్లేదని ఆయన అన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చిన డ్రైవర్.. తొందరగా వెళ్లాలనే హడావుడిలో రైలు వచ్చేలోగానే ట్రాక్ దాటి వెళ్లిపోవాలనుకున్నాడని, ఈలోపు బస్సు అక్కడ ఇరుక్కుపోయి ఇంజన్ ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మళ్లీ అతడు ఇంజన్ స్టార్ట్ చేసేలోపే రైలు వచ్చి బస్సును ఢీకొందని అన్నారు. అసలు బస్సుతో పాటు వచ్చినది కాకతీయ స్కూలు డ్రైవరేనా లేదా ఎవరైనా ప్రైవేటు డ్రైవర్ వచ్చారా అన్న విషయం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.