Nanded Passenger
-
ప్రశాంత్, వరుణ్ పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో గాయపడిన విద్యార్థులలో ప్రశాంత్, వరుణ్ గౌడ్ల పరిస్థితి విషమంగా ఉందని సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై బుధవారం మధ్యాహ్నం వైద్యులు మాట్లాడుతూ... ఆ ఘటనలో గాయపడిన శరత్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దర్శన్గౌడ్, ఫాతిమా, నితూష పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులును డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. -
ఆస్పత్రి నుంచి అభినంద్, శివకుమార్ డిశ్చార్జ్
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను వైద్యలు బుధవారం డిశ్చార్జ్ చేశారు. విద్యార్థులు అభినంద్, శివకుమార్ల ఆరోగ్యం మెరుగుపడటంతో వారిని ఇంటికి పంపిస్తున్నారు. మరోవైపు వరుణ్ గౌడ్, ప్రశాంత్, శరత్ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
ప్రశాంత్, వరుణ్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్ మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై యశోదా ఆస్పత్రి వైద్యులు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అభినంద్, శివకుమార్లు కోలుకున్నారని, వారిని ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఇక ప్రశాంత్, వరుణ్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, శరత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన తరుణ్, వైష్ణవి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. తరుణ్ మృతదేహాన్ని గుండ్రెడ్డిపల్లికి, వైష్ణవి మృతదేహాన్ని ఇస్లాంపూర్కు తరలించారు. విద్యార్థులు కుటుంబ సభ్యులు...కన్నీటితో వారికి అంత్యక్రియలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
-
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో వైష్ణవి (11) అనే విద్యార్థిని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థుల సంఖ్య 18కి చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే. తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్గౌడ్, వైష్ణవి, తరుణ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ గతరాత్రి మృతి చెందాడు. యశోద ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6), వరుణ్గౌడ్ (7)) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. -
మసాయిపేట ఘటన: నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం విద్యార్థుల ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంతి, తరుణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మరో నలుగురు విద్యార్థులను ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. ఎనిమిది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. మరో నలుగురిని సాయంత్రంలోగా సాధారణ వార్డుకు తరలిస్తామన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
హృదయవిదారకం
పిల్లల అవస్థ చూడలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు విషమంగా నలుగురు విద్యార్థుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్పేట్: ‘డాక్టర్ అంకు ల్... నా కాలు కదలడం లేదు. చేయి పైకి రావడం లేదు. తల ఎటూ తిప్ప లేకపోతున్నా. ఒళ్లంతా ఒకటే నొప్పి. ప్లీజ్... నన్ను మా మమ్మీ దగ్గరికి పం పించండి...’ మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ఏసీయూ, ఏఎన్సీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల హృదయ విదారక వేడుకోలు ఇది. పిల్లలు పడుతున్న అవస్థను చూడలేక తల్లిదంద్రులు అక్కడే కుప్పకూలుతున్న దృశ్యాలు అందరితో కంటతడిపెట్టిస్తున్నాయి. నలుగురి పరిస్థితి ఆందోళనకరం... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థుల్లో తరుణ్(7), వైష్ణవి(11), ప్రశాంత్(6), వరుణ్గౌడ్(7)ల పరిస్థితి అత్యంత విషమంగా, శిరీష(8), శ్రావణి(6), శరత్(6)ల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, నితుషా(7), సందీప్(5), శివకుమార్(5), అభినందు(9)ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య, డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వార్డుకు తొమ్మిది మంది తరలింపు... ఇప్పటి వరకు ఏసీయూలో చికిత్స పొందిన సాయిరాం(4), రుచితగౌడ్(8), సాత్విక(6), నబిరా ఫాతి మా(9), హరీష్(7), మిహ పా ల్రెడ్డి(4), సద్భా వనాదాస్(3), దర్శన్ గౌడ్(6), కరుణాకర్(9)లను జనరల్ వార్డుకు తరలించారు. అభినందు (9), శివకుమార్(5), సందీప్(5), నితూష(7)ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఏసీయూ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బాధితుల్లో 16 మందికి భవిష్యత్లో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, బాల్క సుమన్, సీపీఐ నాయకులు నారాయణ, మాజీ మంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు. విషాదంలోనే ఆ గ్రామాలు... గజ్వేల్/తూప్రాన్: రైలు, బస్సు ప్రమాద దుర్ఘటన జరి గి మూడు రోజులు అవుతున్నా ఆ గ్రామాన్ని విషాదం వీడడం లేదు. కొందరు మృతి, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉండడంతో వెంకటాయపల్లి తల్లడిల్లుతోంది. గ్రామానికి చెందిన శివ్వం పేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత కోలుకుంటోం ది. కుమారుడు వరుణ్ ఇంకా స్పృహలోకి రాలేదు. శృతి సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి చేరుకున్నారు. అలాగే మన్నెస్వామి-లావణ్య కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవతా సత్యనారాయణ-గాయత్రి కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక జిన్నారం మండలం కానుకుంటకు చెందిన తప్పెట లక్ష్మణ్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం- నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీ ప్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైన్ వస్తుందని చెబుతూనే ఉన్నా మూడవ సీట్లో కూర్చున్నా. ట్రైన్ వచ్చేది చూశా. డ్రైవర్ అంకుల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంకుల్ ట్రైన్ వస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. పట్టాల మీదకు వచ్చి బస్సు ఆగింది. స్టార్ట్ కాలేదు. అంతలోనే ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. పక్క సీట్లో కూర్చున్న సద్బావన్, మహిపాల్రెడ్డిలను కిటికిలోంచి భయటకు తోసేశా. తమ్ముడు వరుణ్ను తోసేందుకు ప్రయత్నించినా కిటికిలో పట్టలేదు. - రుచిత ఆడుకుంటూ ఉన్నా.. బస్సులో ప్రెండ్స్తో ఆడుకుంటూ ఉన్నా. పట్టాలపైకి వచ్చే సరికి బస్సు ఆగిపోయింది. ట్రైన్ వచ్చి బస్సును గుద్దింది. చేయి విరిగి నొప్పేసింది... మమ్మీ, డాడీ అంటూ ఏడుస్తూ కూర్చున్నా... - సాత్విక ఏమైందో తెలియదు నాలుగవ సీట్లో కూర్చున్నా.పెద్ద శబ్ధం వచ్చింది. చూసేలోపే దెబ్బలు తగిలాయి. ఏమైందో తెలియదు. కిందపడిపోయాను. - సాయిరాం గాల్లో ఎగిరిపడ్డా నేను, మహిపాల్ ఫ్రెండ్స్ ఇద్దరం ఒకే సీట్లో కూర్చున్నాం... పెద్ద శబ్దంతో బస్సు కిందపడిపోయింది... అక్క రుచిత తోసేయడంతో గాల్లో ఎగిరిపోయి బయటపడ్డాను. నా కాలు పోయింది మమ్మీ... అంటూ ఏడుస్తున్నా.... అక్కడ చాలా మంది అంకుల్ వాళ్లు ఉన్నారు... నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు... ఆ స్కూల్కు ఇంక వెళ్లను.... ఇద్దరం ఫ్రెండ్స్ ఊర్లోనే స్కూల్కు వెళతాం. - సద్భావన్దాస్ బ్లడ్తో బట్టలు నిండిపోయాయి.. నాలుగవ సీట్లో త్రిష, నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ట్రైన్ బస్సును ఢీకొట్టింది. గట్టిగా అరుస్తున్నాం. క్షణాల్లో అందరికి దెబ్బలు. బ్లడ్తో బట్టలు నిండిపోయాయి. - నబిరా ఫాతిమా ఆ బస్సు ఎక్కను ఆ బస్సెక్కను.. ఆ బడికి పోను.. అక్కడికి వెళ్లడం వల్లే నా కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఇంటిదగ్గరున్న బడికి పోతా. - మహిపాల్రెడ్డి -
'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమం'
-
'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమం'
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైల్ ఢీ కొన్న ఘటనలో తరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంత్ల పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శరత్, శ్రావణి, శిరీసలను అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. మరో ఎనిమిది మంది విద్యార్థులను సాయంత్రంలోపు జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థుల ఆరోగ్యంపై మరో బులెటన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
-
అయిదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీ కొన్న ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై శనివారం ఉదయం యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మరో 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మరికాసేపట్లో వారందరిని జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
డిప్యూటీ సీఎం రాజయ్య హైదరాబాద్: మాసాయిపేట ఘటనలో క్షతగాత్రులైన విద్యార్థులకు అత్యాధునిక వైద్యసేవలందిస్తున్నామని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన బాధిత కుటుంబాలను, చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. చిన్నారుల చికిత్సకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా శుక్రవారం మంత్రి హారీష్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, విమలక్క బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు కేర్ సిబ్బంది విరాళం సీఎంకు రూ.50లక్షల చెక్ ఇచ్చిన ఆస్పత్రి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: మాసాయిపేట బాధితుల సహాయార్థం కేర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి ఉద్యోగుల విరాళాన్ని (రూ. 50 లక్షలు) చెక్ రూపంలో అందజేశారు. -
మమ్మీ....నొప్పి!
‘యశోద’లో చిన్నారుల ఆక్రందనలు అత్యంత విషమంగా వరుణ్గౌడ్,వైష్ణవి, తరుణ్ల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ‘మమ్మీ.. కాలు కదలడం లేదు.. చేయి లేవట్లేదు.. ఒళ్లంతా నొప్పి.. తట్టుకోలేకపోతున్నా.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. డాడీకి ఫోన్ చేసి రమ్మను...’ ఐసీయూలోకి అడుగు పెట్టిన తల్లులను చూడగానే అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు చేస్తున్న ఆక్రందనలివి. క్షేమంగా తిరిగొస్తాడనుకున్న బిడ్డలు కళ్లముందే మృత్యువుతో పోరాడుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి తట్టుకోలేకపోతున్నారు. లేత శరీరాలపై భారీ కుట్లు చూసి వారి హృదయాలు తట్టుకోలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం తల్లిదండ్రులు, బంధువులు పెద్దసంఖ్య లో శుక్రవారం యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. వైష్ణవి(11), తరుణ్(7), వరుణ్గౌడ్(7)ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. శరత్(6), శ్రావణి(6), శిరీష అలియాస్ త్రిష(8), దర్శన్(6), ప్రశాంత్(6), నితుషా(7)ల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు చెప్పారు. రుతికాగౌడ్(8), ఫాతిమా(9) ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు తెలిపారు. దర్శన్, కరుణాకర్, శివకుమార్, సందీప్, వరున్గౌడ్, ఫాతిమాలకు శస్త్ర చికిత్స చే శారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు. -
నిను మరవలేం బిడ్డా!
నాలుగు గ్రామాల్లో వీడని విషాద ఛాయలు గజ్వేల్/తూప్రాన్: స్కూల్కు టైమ్ అయ్యింది.. టిఫిన్ కూడా తెచ్చిన.. తొందరగా బడికిపోవాలె లేవుండ్రి బిడ్డా! నీకు బ్రెడ్ తెచ్చిన..చాయ్ తెచ్చిన.. ఇప్పుడైనా లేవుండ్రి కన్నా.. అంటూ తమ పిల్లలు ఇక లేరని తెలిసి కూడా ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించని వారు లేరు. మాసాయిపేట దుర్ఘటనలో మరణించిన చిన్నారులు దివ్య-చరణ్లను తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఖననం చేసిన ప్రదేశంలో శుక్రవారం నాటి దృశ్యమిది. వారి తల్లిదండ్రులు జక్కుల సంతోష-యాదగిరి రోదనలతో ఆ ప్రాంతం కంపించింది. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. ఇతర బాధిత కుటుంబాలున్న కిష్టాపూర్, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్ గ్రామాల్లోనూ ఇంకా విషాద ఛాయలే నెలకొన్నాయి. నిన్నటివరకు ఉదయాన్నే స్కూలు బస్సు వద్ద సందడి చేసే పిల్లలంతా ఇక లేరనే నిజం గ్రామస్థుల గుండెలను పిండేస్తూనే ఉంది. కంటికిరెప్పలా చూసుకున్న కన్నబిడ్డలను తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. -
ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు..
ఒక తల్లికి ఆనందం.. ఇంకో తల్లికి గర్భశోకం ‘స్కూలు బస్సు’ మృతుల గుర్తింపులో పొరపాటు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: తమ కనుపాప దూరమైందని తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసి ఆశలు వదిలేసుకున్న ఆ దంపతులు.. తమ బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుని విషాదం నుంచి తేరుకున్నారు. అవును.. పుట్టినరోజు నాడే ‘ధనుష్’ మళ్లీ పుట్టాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన స్కూలు బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడనుకున్న చిన్నారి ధనుష్ అలియాస్ దర్శన్ గౌడ్ బతికే ఉన్నాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భావిస్తున్న మరో పిల్లాడు దత్తు.. ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయినటుతేలింది. దీంతో ఆ కుటుంబాల్లో పరిస్థితి తారుమారైంది. ఒకరింట సంతోషం.. మరో ఇంట విషాదం నెలకొంది. పిల్లలను గుర్తించడంలో పొరపాటు వల్ల ఈ ఉదంతం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన జాలిగామ స్వామిగౌడ్-పుష్ప దంపతులు తమ కొడుకు ధనుష్ను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి గురువారమే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే శుక్రవారం ఉదయం వారికి వైద్యుల నుంచి ఫోన్ వచ్చింది. మీ కొడుకు ధనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, వచ్చి చూడండంటూ కబురందించారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ప్రమాదంలో చనిపోయిన దత్తు మృతదేహాన్ని తమ పిల్లాడిదని పొరబడి తీసుకొచ్చినట్లు వారికి అర్థమైంది. కాగా, ఇదే మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరబాబు-నీరజ దంపతుల కూతురు భువన రైలు పట్టాల మీదే చితికిపోయింది. అదే స్కూలు బస్సులో ఉన్న తమ కొడుకు దత్తు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు భావించారు. కూతురు అంత్యక్రియలు పూర్తి చేసి.. కొడుకైనా మిగిలాడనుకున్నారు. తెల్లారేసరికే ఆ దంపతుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రమాదం జరిగిన రోజే మార్గ మధ్యలో దత్తు చనిపోయాడని అధికారులు గుర్తించడంతో వీరబాబు కుంటుంబం మళ్లీ శోకసంద్రమైంది. తల్లిదండ్రుల పేర్లు చెప్పిన ధనుష్ ప్రమాదంలో ధనుష్(అలియాస్ దర్శన్ గౌడ్) మృతి చెందినట్లు అందరూ భావించారు. అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన (దత్తు)మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారికి తిరిగి అప్పగించారు. గురువారం రాత్రే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన 20 మంది చిన్నారులు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో తీవ్రంగా గాయపడిన ధనుష్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో స్పృహ కోల్పోయి... శుక్రవారం తెల్లవారుజామున తిరిగి స్పృహలోకి వచ్చాడు. అతన్ని ప్రశ్నించిన వైద్యులకు తన తల్లిదండ్రుల పేరు, తన నానమ్మ పేరు చెప్పడంతో జరిగిన పొరపాటును గుర్తించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు సమాచారం అందించారు. బాబును గుర్తించేందుకు కుటుంబసభ్యులు హుటాహూటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి.. తన తండ్రి స్వామిగౌడ్ని చూసి నాన్నా.. అని పిలవడంతో తమ బిడ్డ బతికే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాపం వీరబాబు, నీరజ దంపతులు ఇప్పటికే కూతురు భువనను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన వీరబాబు-నీరజ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. బతికే ఉన్నాడనుకుంటున్న తమ కొడుకు దత్తు కూడా చనిపోయాడని తెలుసుకుని షాక్కు గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న దత్తును సహాయక బృందం హుటాహుటిన కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దత్తు చనిపోయాడు. అయితే దత్తు, ధనుష్ల ఎత్తు, పొడవు, రూపం ఒకే విధంగా ఉండటం, ముక్కు, దవడ భాగం పూర్తిగా చితికిపోయి ఉండటంతో పాటు ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోవడం వల్ల తల్లిదండ్రులు తమ బిడ్డలను సరిగా గుర్తించలేకపోయారు. కూతురు చనిపోయిన బాధలో మునిగిపోయిన వీరబాబు దంపతులు తమ కొడుకు బతికే ఉన్నాడనే భ్రమలో ఉండిపోయారు. అయితే కిష్టాపూర్లో స్వామిగౌడ్ ఖననం చేసింది వారి కుమారుడిని కాదని తేలడంతో... వీరబాబు దంపతులకు అనుమానం వచ్చింది. అయ్యో..! చనిపోయింది తమ బిడ్డ దత్తే కావచ్చునని గుండెలు బాదుకున్నారు. అప్పటికి కొడుకు కోసం ఆసుపత్రిలో ఉన్న ఆ దంపతులు అక్కడే కుప్పకూలిపోయారు. మంత్రి హరీశ్రావు సహా అధికారులు వారిని ఓదార్చే యత్నం చేశారు. వారిని హరీశ్రావు స్వయంగా తన కారులో కిష్టాపూర్లో దత్తు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలానికి తీసుకెళ్లారు. స్థానిక డీఎస్పీ వెంకట్రెడ్డి ఆధ్యర్యంలో పోలీసులు సిబ్బంది, సిద్దిపేట ఆర్డివో ముత్యంరెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఇరు కుటుంబాల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీయించారు. వీరబాబు-నీరజ దంపతులు దత్తును గుర్తించారు. కన్నీరు మున్నీరుమున్నీరుగా విలపించారు. అధికారులు చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇస్లాంపూర్ గ్రామంలో దత్తు మృతదేహానికి మళ్లీ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలనూ కోల్పోయిన వీరబాబు దంపతులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. -
స్పృహలోకి వచ్చిన దర్శన్
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఐదుగురు విద్యార్థులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 40 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 2,3 రోజుల్లో కొందరిని డిశ్చార్జ్ చేస్తామని యశోద వైద్యులు చెప్పారు. విద్యార్థి దర్శన్ గౌడ్ స్పృహలోకి వచ్చాడని తెలిపారు. ఈరోజు దర్శన్ పుట్టినరోజు కావడంతో అతడితో కేక్ కట్ చేయించారు. -
గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో...
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనపై నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు డ్రైవర్ స్పందించాడు. నిన్న ఉదయం 9:15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని 'సాక్షి'తో చెప్పాడు. 300 మీటర్ల నుంచే తాము విజిల్ ఇచ్చామని తెలిపాడు. అయితే బస్సు ఆకస్మాత్తుగా ట్రాక్పైకి బస్సు వచ్చిందని, గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో బస్సును గుర్తించలేకపోయామని వెల్లడించాడు. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించామని కాని రైలు వేగం వల్ల ప్రమాదం జరిగిందని ట్రైన్ డ్రైవర్ వివరించాడు. రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది.. గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం. -
ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్: 'మాసాయిపేట' ఘటనలో గాయపడిన 20 మంది విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు సాయిరామ్, సుచితాగౌడ్, సందీప్, శరత్, సాత్విక, వరుణ్గౌడ్, నభీరా ఫాతిమా, శ్రావణి, హారీశ్, మహిపాల్రెడ్డి, అభినందు, సద్భావన్దాస్, శిరీషా, వైష్ణవి, దర్శన్ అలియాస్ ధనుష్గౌడ్, కరుణాకర్, శివకుమార్, ప్రశాంత్, నితుషా, తరుణ్. మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి! -
దత్తు మృతిపై వీడిన అనుమానాలు
-
మృతదేహాల అప్పగింతలో గందరగోళం
-
దత్తు మృతిపై వీడిన అనుమానాలు
హైదరాబాద్ : విద్యార్థి దత్తు మృతిపై అనుమానాలు వీడాయి. ధనుష్ తల్లితండ్రులు ఖననం చేసింది దత్తు మృతదేహానికేనని గ్రామస్తులు నిర్థారణకు వచ్చారు. ఇప్పటివరకూ బతికే ఉన్నాడనుకున్న దత్తు... మరణవార్త వినటంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. నిన్న జరిగిన దుర్ఘటనలో కుమార్తై భువనను కూడా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు కూడా లేడనే వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు ధనుష్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రమాదంలో గుర్తు పెట్టలేని విధంగా ఉండటం వల్లే తమ కుమారుడి మృతదేహం అనుకుని దత్తు దేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు ధనుష్ తండ్రి తెలిపారు. -
ధనుష్ బ్రతికున్నాడు.. దత్తు ఏమయ్యాడు?
-
ధనుష్ బతికే ఉన్నాడు.... దత్తు ఏమయ్యాడు
మెదక్ : తమ ఇంటి వెలుగు ఆరిపోయిందనుకున్న ఆ తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ ఊపిరినిచ్చింది. అయితే మరో విద్యార్థి తల్లిదండ్రులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఓ విద్యార్థికి తమ బిడ్డ మరణించాడనుకొని మరో విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కిష్ణాపూర్లో దత్తు అనే విద్యార్థికి .....ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. అయితే ధనుష్ బతికే ఉన్నాడంటూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో ధనుష్ తల్లిదండ్రులు పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు దత్తు తల్లిదండ్రులు శుక్రవారం కిష్టాపూర్ వెళ్లారు. ఇక మృతదేహాన్ని పరిశీలించి ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. -
యశోదాలో చిన్నారులకు రాజయ్య పరామర్శ
-
యశోదాలో చిన్నారులకు రాజయ్య పరామర్శ
హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డిప్యూటీ సీఎం, వైద్య, విద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య శుక్రవారం పరామర్శించారు. చికిత్స వివరాలను ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. చిన్నారులకు ఏం కాదని వారి తల్లిదండ్రులకు రాజయ్య ధైర్యం చెప్పారు. 20మంది విద్యార్థులు యశోదాలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా వీరిలో నలుగురి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ఆర్డీవో విచారణ జరుపుతున్నారు. -
ప్రమాద స్థలం వద్ద ఉద్రిక్తత
* బాధితులకు న్యాయం చేయాలని అంబులెన్సులను అడ్డుకున్నఆందోళనకారులు * పోలీసుల లాఠీచార్జి... పలువురికి గాయాలు రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి: రైలు ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతవాసులను కలచివేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు వేలాది మంది సంఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకోసం అంబులెన్సుల్లో తరలిస్తుండగా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తరలించరాదని భారీ ఎత్తున జనం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తుండగా వారు రాళ్లతో దాడిచేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్లను అడ్డుకున్న వందలాదిమంది యువకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో పక్క ఏబీవీపీ విద్యార్థులు కూడా ధర్నాకు దిగారు. దీంతో భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లాఠీచార్జి సందర్భంగా కొందరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. నిరసనకారుల రాళ్లదాడిలో తూప్రాన్ సీఐ సంజయ్కుమార్, గన్మన్ నరేంద్రతోపాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అంబులెన్స్ల అద్దాలు పగిలాయి. తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట, వెల్దుర్తి ఎస్ఐలు నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
‘గేటు’ పెట్టిస్తాం ఓటేయండి.. ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం కోటి మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోరనే విషయం... మాసాయిపేట ప్రమాదం నేపథ్యంలో మరోసారి రుజువైంది. గురువారం ప్రమాదం జరిగిన మాసాయిపేట లెవల్ క్రాసింగ్తోపాటు దానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి, డిల్లాయ్, కూచారం తండాల వ ద్ద కూడా కాపలా లేని క్రాసింగ్లు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు రైల్వే అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవటంతో విసిగిపోయిన ఆ ప్రాంతాల ప్రజలు... గత సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో కంగారుపడ్డ నేతలు... రైల్వే అధికారులను ఒప్పించి మరీ వెంటనే గేట్లు ఏర్పాటు చేయిస్తామని, ఓట్లేయాలని బతిమాలారు. దీంతో ప్రజలు ఓట్లేశారు. కానీ నేతలు మాత్రం తామిచ్చిన హామీని మరచిపోయారు. -
కేంద్రం కంటితుడుపు.. రూ. 2 లక్షల పరిహారం
రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంపై కేంద్రం నామమాత్రంగా స్పందించింది. ఈ ఘటన పై రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్సభలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటన చేశారు. తెలంగాణలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సభకు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే మానవీయకోణంలో ఆలోచించి ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పరిహారం చాలా తక్కువగా ఉందని టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇది సరికాదని, పరిహారం పెంచాలని నిలదీశారు. దీంతో రైల్వే మంత్రి స్పందించారు. ఇది సాధారణంగా ప్రకటించే పరిహారమని, మరింత నష్టపరిహారం, ఇతర సహాయాలను తర్వాత రైల్వే శాఖ చేపడుతుందని వివరణ ఇచ్చారు. కాగా, బాధితులకు రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఇటు లోక్సభలో ఎంపీలు జితేందర్ రెడ్డి, అహ్లూవాలియా కూడా ఇదే డిమాండ్ చేశారు. -
పచ్చడి మెతుకులు.. చితికిన బతుకులు
మాసాయిపేట నుండి సాక్షి ప్రతినిధి: చెల్లాచెదురైన స్కూలు బ్యాగులు...చిందర వందరగా పడి ఉన్న పుస్తకాలు...పాత పలకలు... తెగిపోయిన బూట్లు... పగిలిన టిఫిన్ బాక్స్లు...ఏ టిఫిన్ బాక్స్లో చూసినా పచ్చడి మెతుకులే. మాసాయిపేట ప్రమాదస్థలివద్ద కనిపించిన దృశ్యాలివి. గురువారం ఘటనాస్థలికి వెళ్లిన సాక్షి ప్రతినిధి అక్కడ పడి ఉన్న టిఫిన్ బాక్సుల్లో కొన్నింటిని తెరిచి చూడగా దాదాపుగా అన్నింట్లోనూ పచ్చడి మెతుకులు, కారంతో కలిపిన ముద్దలే కన్పించాయి. ఆ చిన్నారి విద్యార్థుల సామాజిక స్థితి, పేదరికానికి అద్దం పట్టే ఈ దృశ్యాలు అక్కడి వారిని కలచి వేశాయి. పేదరికంతో అల్లాడుతున్నా... ఇంగ్లిష్ చదువులు చదివితే మంచి ఉద్యోగాలొస్తాయని, తద్వారా తలరాతలు మారతాయనే ఆశతోనే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నో స్కూలుకు పంపుతున్నారు. అందుకు స్తోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని కొందరు. అప్పోసొప్పో చేసి మరికొందరు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నారు. అయితే తమ పిల్లల జీవితాలను విధి బలి తీసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అంతులేని వేదన..
* తల్లిదండ్రులకు గర్భశోకం * ఇంటి దీపాలను కోల్పోయి.. ఆశలు బుగ్గిపాలు * దుఃఖసాగరంలో కుటుంబాలు వారంతా కాయకష్టం చేసే బడుగు జీవులు. స్వేదం చిందించైనా తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డారు. కష్టాలు దిగమింగుతూ వేలాదిగా ఫీజులు చెల్లిస్తూ.. కన్న బిడ్డల భవిష్యత్తుపై కలలు కంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కసారిగా విధి కన్నెర్ర జేయడంతో ఆ కుటుంబాలన్నీ పెను విషాదంలో మునిగిపోయాయి. రేపటి పౌరులు అర్ధాంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు తీరని దుఃఖంలో కూరుకుపోయారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మూడు కుటుంబాల్లో ఇద్దరేసి చొప్పున పిల్లలు చనిపోయారు. ఇక ఆసుపత్రుల్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల హృదయ వేదన గుండెలను ద్రవింపజేస్తున్నది. మాసాయిపేట పరిసర గ్రామాల్లోని ఏ ఇంటి ముందు చూసినా విషాద ఛాయలే. భగవంతుడా.. మాకెందుకీ శాపమంటూ బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. టాటా చెప్పి పోయిండు: వంశీతాత మల్లయ్య ‘పొద్దున్నే బువ్వపెట్టి, యూనిఫాం వేసి ముస్తాబు చేసి 8.30 గంటలకు మనవడిని ఎత్తుకుని కోడలితో కలసి రోడ్డుపైకి వచ్చి స్కూలు బస్సు ఎక్కించాను. బస్సు లోపల నుంచి టాటా చెబుతూ గాలిలో ముద్దు(ప్లయింగ్ కిస్) ఇచ్చిండు. గంటలోపలే పిడుగులాంటి వార్త విన్నాం’ అని ఈ దుర్ఘటనలో మృతిచెందిన వంశీ (07) తాత మల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. వెల్దుర్తి మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లయ్య కుమారుడు మల్లేష్, కోడలు హేమలత వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు. వంశీ కాకతీయ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మనవడిని తానే మృత్యుశకటం ఎక్కించానని మల్లయ్య బావురుమన్నాడు. ఒక్క నిమిషం ఆగి ఉంటే.. ఒక్క నిమిషం ఆగి ఉంటే నీరుటి వంశీ ప్రాణాలు దక్కేవి. ఇస్లాంపూర్ ఎంపీటీసీ నీరుటి అమృతాసుదర్శన్కు ఇద్దరు పిల్లలు. కొడుకు వంశీ ఏడో తరగతి, కూతురు వెన్నెల నాలుగో తరగతి చదువుతున్నారు. వంశీ పెదనాన్న మల్లేశానికి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో ఆయన్ను చూడటానికి వంశీ మంగళవారం ఇస్లాంపూర్ వచ్చాడు. గురువారం బడికి వెళ్లేందుకని బయలుదేరగా.. తండ్రి సుదర్శన్ పని మీద అదే గ్రామం వచ్చాడు. పని చూసుకొని వచ్చాక తన బండి మీదనే స్కూలుకు తీసుకుని వెళ్తానని చెప్పి సుదర్శన్ గ్రామంలోకి వెళ్లిపోయాడు. సరే అని చెప్పిన వంశీ.. స్కూలు బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాడు. మరు నిమిషమే సుదర్శన్ అక్కడికి వచ్చాడు. బస్సులో వెళ్లిపోయాడని స్థానికులు చెప్పడంతో ఆయన దాని వెనకాలే బయలుదేరి వెళ్లాడు. కొద్దిసేపటికే ఘోరం చోటు చేసుకుంది. మూడు కుటుంబాల్లో ఇద్దరు మృతి తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో రామాయపల్లి యాదగిరి-సంతోష దంపతులకు ముగ్గురు బిడ్డలు దివ్య, చరణ్, త్రిష ఉన్నారు. యాదగిరి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫీజుల భారం మోస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాడు. గురువారం నాడు రైలు ఢీకొన్న బస్సులోనే ఇతని ముగ్గురు పిల్లలూ ఉన్నారు. వారిలో దివ్య, చరణ్ దుర్మరణం చెందారు. త్రిష చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. గుండ్రెడ్డిపల్లికి చెందిన రాములు-వసంత దంపతుల పిల్లలు సుమన్, విద్య. పేదరికంలో ఉన్నా వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు చిన్నారులిద్దరూ విగత జీవులయ్యారు. తండ్రి గుండె తల్లడిల్లింది కిష్టాపూర్కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ వలి యుద్దీన్, వజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు గౌసియా యూకేజీ, కుమారుడు రశీద్ ఎల్కేజీ చదువుతున్నారు. రైలు ప్రమాదంలో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో విగత జీవులుగా పడి ఉన్న కన్నబిడ్డలను చూసి తండ్రి వలియుద్దీన్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. నా చెల్లికి తీవ్ర గాయాలు: తేజస్విని మా చెల్లి సాత్విక మొదటి తరగతి, నేను తొమ్మిదవ తరగతి ఒకే స్కూల్లో చదువుతున్నాము. ప్రతి రోజు నేను ఆటోలో వెళతాను. చెల్లి మాత్రం బస్సులో వస్తుంది. మేము ముందుగా వెళ్లిపోయాం. తర్వాత ఈ ఘటన జరిగింది. మేమంతా అల్లారుముద్దుగా చూసుకునే మా చెల్లికి దెబ్బలు తగిలాయి. ఒక్కగానొక్క కుమార్తె: సరోజ నా భర్త లేడు. ఒక్కగానొక్క కుమార్తె వైష్ణవే జీవితంగా బతుకుతున్నా. ఆరవ తరగతి చదువుతోంది. ఎంతో సంతోషంగా పాఠశాలకు వెళ్లిన బిడ్డను ఇలా చూస్తే కడుపుతరుక్కుపోతుంది. నా బిడ్డ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నవ్వు ఇంకా కళ్లలోనే: సుజాత నా కొడుకు హరీష్ను నేనే బస్సు దగ్గరకు తీసుకుని వెళ్లి వదలి పెట్టాను. బాయ్ మమ్మీ అంటూ నవ్వుతూ టాటా చెప్పాడు. ఆ నవ్వు కళ్ల ముందు కదులుతూనే ఉంది. అలా వెళ్లిన కొద్ది సేపటికే గాయాలతో ఆస్పత్రికి రావడం చూస్తే కాళ్లూచేతులు ఆడటం లేదు. డాక్టర్లు కాలు విరిగిందని చెప్పారు. బిడ్డకు ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. ఆ 5 రూపాయల కోసం ఆగి ఉంటే.. జక్కుల యాదగిరి, సంతోష దంపతుల కుమారుడు చరణ్ స్కూలుకు వెళ్లే ముందు ఐదు రూపాయలు కావాలని మారాం చేశాడు. అవి తెచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో బస్సు రావడంతో చరణ్ వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత బస్సుతో పాటు తల్లి కొద్దిదూరం పరిగెత్తినా.. డ్రైవర్ గమనించలేదు. ఒకవేళ ఆ 5 రూపాయల కోసం బస్సును ఆపి ఉంటే అందరి ప్రాణాలు నిలిచేవని స్థానికులు చెబుతున్నారు. - సాక్షి నెట్వర్క్ -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి
-
మృతులు, క్షతగాత్రుల వివరాలు
మెదక్: పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన 16 మందిని గుర్తించారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. మృతి చెందిన విద్యార్థులు గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, కిష్టాపూర్ ప్రాంతాలకు చెందిన వారు. క్షతగాత్రుల్లో అల్లీపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చెందిన వారు ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 16 మంది మృతుల వివరాలు... చింతలసుమన్ (12), విద్య (7), చింతల చరణ్(4), దివ్య (7)- గుండ్రెడ్డిపల్లి నీరుడి వంశీ (12), చింతల భువన(6), తుమ్మ వంశీ (13) , గొల్ల మనీష్- ఇస్లాంపూర్ వంశీ (7), శృతి (5)- వెంకటాయపల్లి ఎం.డి.రశీద్ (7), వజియా (4), విశాల్ (6), ధనుష్గౌడ్ (7)- కిష్టాపూర్ బస్సు డ్రైవర్ భిక్షపతి (50) వర్గల్ మండలం వేలూరు గణేష్ గౌడ్ (25), బస్ హెల్పర్, ఘనాపూర్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రశాంత్ (6), శివభూషణ్ (6), రుచికాగౌడ్(6)- వెంకటాయపల్లి సందీప్ (5), సాత్విక (6), శ్రావణి (6), సాయిరామ్(4)- వెంకటాయపల్లి మహిపాల్రెడ్డి (4), వరుణ్గౌడ్ (7), దర్శన్(6)- వెంకటాయపల్లి బి.మితూష (7), వైష్ణవి (7)- ఇస్లాంపూర్ సద్భావన్దాస్(3)- అల్లీపూర్ తరుణ్ (7), కరుణాకర్ (12), శరత్ (6)- గుండ్రెడ్డిపల్లి నబీరాఫాతిమా (9), శిరీష (8), అభినందు (9), హరీష్ (7) గుండ్రెడ్డిపల్లి -
క్షమాపణ కోరిన కాకతీయ గ్రూప్ చైర్మన్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారామిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఘటనలో తమ తప్పులేదని సాక్షితో అన్నారు. రైల్వే తప్పిదమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. స్కూల్ బస్సు పూర్తి కండీషన్లో ఉందని, స్కూల్ను నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని చెప్పారు. అన్నీ స్కూళ్లకు పర్మిషన్లు ఉన్నాయని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థులు తన పిల్లలు లాంటివారని గద్గర స్వరంతో అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. -
చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై సినీ నటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... రైలు ప్రమాద దుర్ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. పిల్లలు సురక్షితంగా స్కూల్ వెళ్లలేని పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నష్టపరిహారంతోనే సరిపెట్టకుండా భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. -
ఆలస్యంగా స్పందించిన స్కూల్ యాజమాన్యం
మెదక్: తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనపై తుప్రాన్ కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా స్పందించింది. స్కూల్కు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. కాకతీయ స్కూల్ గ్రూపునకు చెందిన 96662 22288 నంబరుకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. తుప్రాన్ బ్రాంచ్ను తమ వెబ్సైట్లో ఫ్రాంచైజ్ స్కూల్గా కాకతీయ స్కూల్స్ గ్రూపు పేర్కొంది. మరోవైపు అజ్ఞాతంలోకి కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. ఈ వార్త ప్రసారం కాగానే ఆయన సాక్షి' టీవీకి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలా లేని రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ టెక్నో స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు. -
ఆసుపత్రిలో చిన్నారులకు కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. చిన్నారుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వ భరిస్తుందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా మసాయిపేట వద్ద గురువారం ఉదయం నాందేడ్ ప్యాసింజర్ రైలు స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందారు. ఆ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కోకుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం కింద అందజేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 20 వేల ఇవ్వనున్నట్లు తెలిపింది. -
ప్రజల ప్రాణాలంటే అంత చులకనా?
-
'ఈ ఘటన చాలా బాధాకరం'
-
రాష్ట్ర ప్రభుత్వాలైనా రైల్వేగేట్లు పెట్టించాలి: వైఎస్ జగన్
మెదక్ జిల్లాలో స్కూలుబస్సును రైలు ఢీకొన్న ప్రాంతంలో రైల్వే గేటు కావాలని అక్కడి ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా రైల్వేశాఖ, వాళ్లు చేయకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా ముందుకొచ్చి కాపలా లేని రైల్వేక్రాసింగులు ఉన్నచోటల్లా కాపలాతో కూడిన గేట్లు పెట్టించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దాదాపు 20 మంది చిన్నారులు మరణించిన సంఘటన స్థలం వద్దకు ఆయన గురువారం ఉదయమే వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ''ఇది చాలా బాధాకరం. 20 మంది పిల్లలు మరణించారు. అక్కడకు వెళ్లి చూసినప్పుడు వాళ్ల పుస్తకాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. ఒక పుస్తకం చూస్తే, ఆ పిల్లాడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంతమంది పిల్లలు చనిపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. అక్కడ గేటు కావాలని స్థానికులు మూడుసార్లు ధర్నాలు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి గేటులేని క్రాసింగులు చూస్తే, ఆ ఒక్క సెక్షన్లోనే మూడున్నాయి. రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా చూడాలి. గేటులేని ప్రతిచోటా గేట్లు పెట్టించే కార్యక్రమాలు రైల్వేశాఖ చేస్తుందో లేదో తెలీదు గానీ.. వాళ్లు చేయాలి. లేనిపక్షంలో మనం మన పిల్లలని మనసులో పెట్టుకుని.. అవసరమైతే రెండువేల కోట్లో.. లేదంటే ఎంతోకొంత బడ్జెట్ కేటాయించి ప్రతిచోటా మ్యాన్డ్ గేట్లు పెట్టించాలని, నాలుగు అడుగులు ముందుకేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఎవరినో విమర్శిస్తే ఏమీ లాభం లేదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనమేం చేయాలో ఆలోచించాలి. అక్కడ ఆరేడేళ్ల వయసున్న పిల్లలున్నారు. వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండాప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ భయపడే స్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలి. ఇందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చినట్లు విన్నాను. దాంతో సరిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా నష్టపరిహారం కోసం ప్రయత్నించాలి. ఇక్కడ కూడా పెద్దలైతే 5 లక్షలు సరిపోవచ్చేమో గానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు మరణించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాను. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ప్రభుత్వం కూడా మానవత్వం ప్రదర్శిస్తే మంచిది. పార్టీ తరఫున కూడా చేయాల్సిందంతా చేస్తాం'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు
-
ప్రమాద ఘటనా స్థలంలో వైఎస్ జగన్
-
అక్కాతమ్ముళ్ల మృతి, తండ్రికి గుండెపోటు
కన్నబిడ్డలపైనే ప్రాణాలు పెట్టుకున్న బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ప్రమాద వార్త అశనిపాతంగా మారింది. తమ ఇద్దరు చిన్నారులు రైలు ప్రమాదంలో మృతి చెందిన వార్తను విన్న ఓ తండ్రి గుండెపోటుకు గురయ్యారు. నాందేడ్ ప్యాసింజర్ రైలు.. కాకతీయ స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో కిష్టాపూర్కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ మృతి చెందారు. వీళ్లిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. ఈ సమాచారం తెలియటంతోఆ విద్యార్థుల తండ్రికి గుండెపోటు రావటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడ్డ డ ఓ చిన్నారి అమ్మా... నాకేమయిందమ్మా... అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమాయకంగా అడుగుతున్న ఘటన తల్లితో పాటు, చూసేవారిని కంటతడి పెట్టించింది. మరి కొంతమంది తల్లిదండ్రులు సంఘటన స్థలంలోనే స్పృహతప్పి పడిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ కళ్లముందు కదలాడే కన్నబిడ్డలు ఇక లేరన్న విషయం జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యాలు సంఘటన స్థలంలో ఉన్న వారందరి హృదయాలను కలచివేశాయి. -
స్కూల్ కి వెళ్ళొస్తా, మమ్మీ బై అవే చివరి మాటలు
హైదరాబాద్ : నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం, బాధ్యతా రాహిత్యం ఇవే మెదక్ జిల్లాలో పెను విషాదానికి కారణం. లెవల్ క్రాసింగ్ల దగ్గర గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అజాగ్రత్త 20 మంది విద్యార్ధులను బలిగొన్నాయి. అధికారమే తప్ప బాధ్యత తెలియని అధికారగణం నిర్లక్ష్యానికి అభం, శుభం తెలియని చిన్నారులు మూల్యం చెల్లించుకున్నారు. నాన్న స్కూల్ కి వెళ్శొస్తాను, మమ్మీ బై అన్న పలుకులే చివరి మాటలుగా మారాయి. తమ బిడ్డల ముద్దు ముద్దు మాటలతో మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ...అవే వారి ఆఖరి మాటల కావటంతో బాధితులను ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు. అదే తన చిన్నారి ఆఖరి మాటలు అంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించటం చూసేవారిని కంటతడి పెట్టించింది. కాగా శుక్రవారం మెదక్ జిల్లాలో పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. -
తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
-
మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి!
గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం? తెలుగువారిపై విధి పగబట్టినట్టుగా కన్పిస్తోంది. రెండు నెలల వ్యవధిలో నాలుగు విషాద ఘటనలు దాదాపు వంద మంది తెలుగువారిని పొట్టనపెట్టుకున్నాయి. నీరు, నిప్పుతో పాటు విధి కూడా తెలుగువారిపై కక్ష గట్టినట్టు కనబడుతోంది. మనవారికి జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తుంటే ఈ భావనే కలుగుతోంది. తెలుగు ప్రజలంటే విధికి ఎందుకంత కోపం? మెదక్ జిల్లాలో గురువారం(జూలై 24) జరిగిన ఘోర ప్రమాదం 20 మంది పసివాళ్ల ప్రాణాలు తీసింది. నాందేడ్ ప్యాసిజర్ రైలు రూపంలో వచ్చి మృతువు కాటేసింది. స్కూల్కు వెళ్లాల్సిన చిన్నారులను శవాలుగా మార్చింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను జూన్ 8న బియాస్ నది మింగేసింది. జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో చలరేగిన దావాగ్ని 22 మందిని బుగ్గిచేసింది. నగరం ఘటన జరిగిన మరునాడే చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో 61 మంది శిథిలాల కింద సమాధయ్యారు. మృతుల్లో సగం మందిపైగా తెలుగువారుండడం మరో విషాదం. ఈ నాలుగు విషాద ఘటనలు- పాలకుల నిష్క్రియ, అధికారుల నిర్లక్ష్యాన్ని సజీవ సాక్ష్యాలు. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులు, అధికారులు మొద్దునిద్ర వదలడం లేదు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారు. దయచేసి మేల్కోండి. అమాయకుల ప్రాణాలు కాపాడండి. -
విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ
మెదక్ : కన్నబిడ్డలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో ముగినిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న వారిని జగన్ ఓదార్చారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు గురువారం ఉదయం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును ఢీకొన్న విషయం తెలిసిందే. -
రైల్వే పోలీసులపై రాళ్లదాడి
-
బిడ్డా.. జర భద్రం!!
'బిడ్డా.. జర భద్రం'.. ఇవే ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడిన చివరి మాటలు. పొద్దున్నే లేచి, శుభ్రంగా తయారై బ్యాగు తగిలించుకుని, క్యారేజి పట్టుకుని బస్సు మెట్లు ఎక్కేముందు ఆ మూడు గ్రామాల్లోని దాదాపు 20 మందికి పైగా తల్లులు తమ కన్న బిడ్డలను భద్రంగా వెళ్లి రమ్మంటూ టాటా చెప్పారు. అలా చెప్పి గంట సేపు కూడా గడిచిందో.. లేదో, అంతలోనే వాళ్లు ఎక్కిన బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసింది. ఆ తల్లుల గుండెలు ఝల్లుమన్నాయి. ఉరుకులు పరుగుల మీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడకు వెళ్లేసరికే చిరునవ్వులు చిందించాల్సిన తమ చిన్నారులు రక్తమోడుతూ విగతజీవులుగా కనిపించారు. అంతే.. వాళ్ల గర్భశోకానికి అంతులేదు. చాలామంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. బస్సులో ఆడుతూ పాడుతూ వెళ్తున్న చిన్నారులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు తమ బస్సును ఢీకొనడంతో ఏం జరిగిందో తెలిసేలోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గుండేటిపల్లెకు చెందిన 11 మంది పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. కొన్ని కుటుంబాల్లో వాళ్ల పిల్లలంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుండేటిపల్లెకు చెందిన వరుణ్ -శ్రుతి, కృష్ణాపూర్కు చెందిన రజియా-వహీద్ ఇలా మరణించినవారే. వీరిలో రజియా-వహీద్ల తల్లి తన బిడ్డలు లేరన్న విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించగా, వాళ్ల తండ్రికి కూడా గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు. -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
-
5 లక్షల ఎక్స్గ్రేషియా,వారంలో గేటు ఏర్పాటు
హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. వారం రోజుల్లోగా రైల్వేగేటు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఈ దుర్ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే అమాయక చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ యుద్ధ ప్రాతిపదికపై గేటు ఏర్పాటు చేసి, సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మరోవైపు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. -
రైల్వే పోలీసులపై రాళ్లదాడి
మెదక్ జిల్లాలో ప్రమాదం సంభవించిన స్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి విద్యార్థుల మృతదేహాలను తరలిస్తున్న రైల్వే పోలీసుల వద్ద స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జి చేయడంతో వెంటనే వాళ్లు రాళ్ల దాడి ప్రారంభించారు. ఈ రాళ్లు తగిలి రైల్వే అధికారులతో పాటు అక్కడున్న డీఎస్పీకి, కొంతమంది పోలీసులకు, ప్రమాద ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రమాదాలను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోలేదన్న ఆగ్రహంతోనే స్థానికులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి సున్నితమైన సమయంలో లాఠీ ఛార్జి జరగడంతో మరింత ఆవేశానికి గురై రాళ్లతో దాడి చేశారని అంటున్నారు. -
దుర్ఘటనపై ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శరత్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ప్రమాదం జరిగిన కాకతీయ స్కూల్ బస్సులో మొత్తం 38మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 13మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు నివేదికలో వెల్లడించారు. మరో 15మంది తీవ్రంగా గాయపడగా, ప్రమాదం నుంచి ముగ్గురు విద్యార్థులు మాత్రమే క్షేమంగా బయటపడినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల సఖ్యతో పాటు పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో అందచేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. -
బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
హైదరాబాద్ : ఎప్పుడూ వచ్చే బస్సు డ్రైవర్ విధుల్లోకి రాకపోవటంతో అతని స్థానంలో విద్యార్థులను తీసుకు వచ్చేందుకు స్కూల్ యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ను పంపించినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. రైలు రాదనే ధీమాతో డ్రైవర్ భిక్షపతి బస్సును ముందుకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్కు గుండెపోటు
హైదరాబాద్ : ఘోర రైలు ప్రమాదానికి సంఘటన వార్తతో కాకతీయ టెక్నో స్కూలు ప్రిన్సిపాల్ గుండెపోటుకు గురయ్యారు. కాకతీయ స్కూల్ బస్సు గురువారం ఉదయం 9 గంటల సమయంలో మాసాయిపేట రైల్వేగేట్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38మంది ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా 7వ తరగతిలోపువారే. తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం హోరెత్తింది. ఉదయం ఇంటి నుంచి టాటా చెబుతూ వెళ్లిన తన చిన్నారి విగతజీవిగా చూసిన ఓ తల్లి ఘటనా స్థలంలోనే స్పృహ తప్పిపడిపోయింది. -
మృతి చెందిన విద్యార్థులు వీరే
హైదరాబాద్ : మెదక్ రైలు ఘోర ప్రమాద దుర్ఘటనలో మృతి చెందినవారిలో పలువురు విద్యార్థులను గుర్తించారు. మృతుల వివరాలు: విద్య (గుండేటిపల్లి), వంశీ (ఇస్లాంపూర్),.. చరణ్, దివ్య (గుండేటిపల్లి) అన్నాచెల్లెళ్లు రజియా, వహీద్ (కిష్టాపూర్) అక్కాచెల్లెళ్లు భువన (ఇస్లాంపూర్), వరుణ్, శృతి అన్నాచెల్లెళ్లు విష్ణు, చింతల సుమన్, మహేష్, డ్రైవర్ భిక్షపతిగౌడ్ ఇక క్లీనర్ ఈ ప్రమాదం నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పద్మారావు అక్కడ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
దుర్ఘటనపై 3గంటలకు రైల్వే మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైల్వే ప్రమాద దుర్ఘటనపై రైల్వేమంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు. లోక్సభ సమావేశాల్లో రైలు ప్రమాద వార్తను ఎంపీ జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ సహాయ చర్యలు చేపట్టాల్సింది అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు మధ్యాహ్నం మూడు గంటలకు సభలో తెలుపుతామని రైల్వేమంత్రి పేర్కొన్నారు. -
గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు
-
కాకతీయ స్కూల్ గుర్తింపు రద్దు
హైదరాబాద్ : రైలు ప్రమాదానికి గురై 20మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న కాకతీయ ప్రయివేట్ స్కూల్ గుర్తింపు రద్దు అయ్యింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు మెదక్ డీఈవో రాజేశ్వరరావు గురువారమిక్కడ తెలిపారు. తుప్రాన్లో కాకతీయ ప్రయివేట్ స్కూల్ బస్సు గురువారం ఉదయం విద్యార్థులను తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
మృతి చెందిన విద్యార్థులు వీరే
-
రైలు ఆలస్యం.. అందుకే ప్రమాదం!
మృత్యువు ముంచుకొచ్చింది. రైలు రూపంలో తరుముకుని వచ్చింది. అదే దాదాపు 20 మంది చిన్నారుల ప్రాణాలు బలిగొంది. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ ప్రమాదం జరిగిన సమయానికి రావాల్సింది కాదు. నాలుగు గంటలు ఆలస్యంగా ఆ రైలు నడుస్తోంది. దాదాపు ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లకు రైళ్ల రాకపోకల సమాచారం తెలుస్తూనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో రైళ్లేవీ రావన్న ధైర్యంతోనే బస్సు డ్రైవర్ కూడా మొండిగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్.. బస్సు వస్తున్న విషయాన్ని తెలుసుకునే అవకాశం లేకపోవడం, క్రాసింగ్ వద్దకు రైలు వచ్చేసరికి ఎదురుగా ఉన్నట్టుండి బస్సు కనిపించడంతో రైలు డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైలుకు షడన్ బ్రేకు వేస్తే.. వెనక ఉన్న 14 బోగీలు పట్టాలు తప్పి, మరింత ఘోరమైన ప్రమాదం సంభవిస్తుంది. అందుకే నెమ్మదిగా బ్రేకులు వేస్తూ.. దాదాపు అర కిలోమీటరు దూరం తర్వాతే రైలును ఆపగలిగాడు. దాంతో అంతదూరం పాటు బస్సును రైలు లాక్కుంటూ వెళ్లిపోయింది. బస్సు మీద, రైలు పట్టాల మీద పిల్లల రక్తపు మరకలు పడ్డాయి. -
బాలాజీ ఆస్పత్రిలో 12మంది విద్యార్థులకు చికిత్స
హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు కొంపల్లి బాలాజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 12bమంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని నలుగురిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా తరలించినట్లు సమాచారం. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ .... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమీక్ష నిర్వహించారు. -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు, 16మంది మృతి
మెదక్ : మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
బాధితులంతా 12 ఏళ్ల లోపువారే
మెదక్ జిల్లాలో రైలు ప్రమాదం సంభవించిన మాసాయిపేట చాలా నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో దాదాపు గంటన్నర సేపు ఎవరికీ పిల్లల ఆర్తనాదాలు వినిపించలేదు. పిల్లల్లో చాలామందికి చేతులు విరిగి. కాళ్లు మెలి తిరిగిపోయి పరిస్థితి అంతా హృదయవిదారకంగా ఉంది. బాధితులంతా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారేనని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ఇదే ప్రాంతం మీదుగా బస్సు వెళ్తుందని, కానీ లెవెల్ క్రాసింగ్ వద్ద గేటు మాత్రం ఏర్పాటు చేయట్లేదని ఆయన అన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చిన డ్రైవర్.. తొందరగా వెళ్లాలనే హడావుడిలో రైలు వచ్చేలోగానే ట్రాక్ దాటి వెళ్లిపోవాలనుకున్నాడని, ఈలోపు బస్సు అక్కడ ఇరుక్కుపోయి ఇంజన్ ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మళ్లీ అతడు ఇంజన్ స్టార్ట్ చేసేలోపే రైలు వచ్చి బస్సును ఢీకొందని అన్నారు. అసలు బస్సుతో పాటు వచ్చినది కాకతీయ స్కూలు డ్రైవరేనా లేదా ఎవరైనా ప్రైవేటు డ్రైవర్ వచ్చారా అన్న విషయం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
హైదరాబాద్కు 9 మంది విద్యార్థుల తరలింపు
నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది విద్యార్థులను మూడు అంబులెన్సులలో హైదరాబాద్కు తరలించారు. అయితే, ఎక్కడకు తీసుకెళ్తున్నదీ చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు పిల్లలను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పాలని, చెబితే తాము కూడా వెళ్తామని వారు అంటున్నా, అధికారులు మాత్రం అప్పటికప్పుడు వాళ్లను తరలించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని తరలించేటప్పుడు అంబులెన్సులో ఆక్సిజన్ సహా అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. కానీ, ఇక్కడ అలాంటి అంబులెన్సులు వారికి దొరక్కపోవడంతో సర్వసాధారణ వాహనాల్లోనే పిల్లలను మాసాయిపేట నుంచి హైదరాబాద్కు తరలించారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినా, అధికారులెవ్వరూ వాళ్లకు సమాధానం ఇవ్వలేదు. చివరకు పిల్లలను హైదరాబాద్లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. -
విద్యార్థులంతా ఆ మూడు గ్రామాల వారే
హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఘటనా ప్రాంతం దద్దరిల్లిపోయింది. స్కూల్కు పంపిన తమ చిన్నారులు విగత జీవులుగా మారటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థులు ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గూనేపల్లి గ్రామాలకు చెందినవారు. తుప్రాన్లోని కాకతీయ ప్రయివేట్ స్కూలు బస్సు ....గురువారం ఉదయం ఇస్లాంపూర్ నుంచి విద్యార్థులను తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాందేడ్ ప్యాసింజర్ ...నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటన సమీప గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జేసీబీ సాయంతో విద్యార్థులను బయటకు తీశామని, కొన ఊపిరితో ఉన్నవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతను కూడా మృతి చెందాడు. మొత్తం బస్సులో 38మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు
మెదక్: మసాయిపేట రైల్వే గేట్ వద్ద గతంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు వెల్లడించారు. గత ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కాపాలాదారుడు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైరన్ లేకుండా రైలు రావడం, బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇస్లాంపూర్ నుంచి తుఫ్రాన్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు నుంచి కిలో మీటర్ వరకు బస్సు ఈడ్చుకు వెళ్లినట్టు తెలుస్తోంది. -
కాకతీయ స్కూల్ బస్ను ఢీకొన్న రైలు
-
గుర్తుపట్టలేని విధంగా విద్యార్థుల మృతదేహాలు
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రైలు బస్సును ఢీకొని సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో బస్సులోని 26మంది విద్యార్థులు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాంతో బస్సు నుజ్జు నుజ్జు కాగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు తెలుస్తుంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. మరోవైపు మంత్రి హరీష్ రావు సంఘటనా స్థలానికి బయల్దేరారు. బస్సులో విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.