హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభానికి ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్లోని టీసీఎస్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థల, వాటిల్లోని ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఈ స్టేషన్ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.5 కోట్లతో ఈ మోడల్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈనెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మూడంతస్తుల భవనంలో అన్ని హంగులతో నిర్మించారు. ఇక్కడ పోలీస్స్టేషన్ ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే ఇబ్రహీంపట్నం వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. భవిష్యత్తులో ఆదిబట్ల ప్రాంతానికి మరిన్ని ఐటీ సంస్థలు రానుండటంతో భద్రత విషయంలో ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటూ ఈ స్టేషన్ను నిర్మించారు.
ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
Published Sun, Jun 11 2017 6:22 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Related news by tags
-
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో ఐదో సీడ్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరోవైపు జర్మనీలో జరుగుతున్న హాంబర్గ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ తొలి రౌండ్లో 1–6, 4–6తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్లో యూకీ ద్వయం
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో ఫెడరికో జెబలాస్–బోరిస్ అరియాస్ (బొలీవియా) జంటను ఓడించింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ జోడీ పది ఏస్లు సంధించడంతోపాటు తమ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి
యెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్ అదితి రెండో రౌండ్ లో, అవనీత్ కౌర్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో... పర్ణీత్ 138–145తో హాన్ సెంగ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. అదితి 142–145తో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా) చేతిలో, అవనీత్ 143–145తో ఒ యుహూన్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్ మూడో రౌండ్లో, అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. సెమీస్లో యూకీ–ఒలివెట్టి జోడీ పారిస్: ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్ అరెండ్స్–మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్లు సంధించింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్కు చెందిన జీవన్ నెడున్జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్జెవ్స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)–మనారినో (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
Related News by category
-
రన్నరప్ సహజ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్లో రన్నరప్గా నిలిచింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఇవాన్స్విల్లె పట్టణంలో ఈ టోర్నీ జరిగింది. డబుల్స్ ఫైనల్లో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ 2–6, 0–6తో అలీసియా లినానా (స్పెయిన్)–మెలానీ క్రివోజ్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 7–5, 2–6, 6–7 (6/8)తో ఇరీనా షమనోవిచ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
‘పంచ్’ పతకం తెచ్చేనా!
వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడాంశంలో భారత్ నుంచి తొలిసారి 1948 లండన్ ఒలింపిక్స్లో ఏకంగా ఏడుగురు బాక్సర్లు పోటీపడ్డారు. ఆ తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్లో నలుగురు భారత బాక్సర్లు బరిలోకి దిగారు. అయితే ఈ రెండు ఒలింపిక్స్లో మన బాక్సర్లు ఆకట్టుకోలేకపోయారు. హెల్సింకి ఒలింపిక్స్ తర్వాత మరో నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం కరువైంది. మళ్లీ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్లో భారత బాక్సర్లు పోటీపడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో విజేందర్ సింగ్ (75 కేజీలు) కాంస్యం రూపంలో భారత్కు బాక్సింగ్లో తొలి పతకాన్ని అందించాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీకోమ్ (51 కేజీలు)... 2020 టోక్యో ఒలింపిక్స్లో లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్కు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత పొందారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు)... మహిళల విభాగంలో నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఆరుగురిలో అమిత్, లవ్లీనాలకు ఇవి రెండో ఒలింపిక్స్కాగా... నిశాంత్, నిఖత్, ప్రీతి, జైస్మిన్ తొలిసారి ఒలింపిక్స్లో ఆడనున్నారు. వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిఖత్ జరీన్పైనే అందరి దృష్టి ఉంది. ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్లో, ఆసియా చాంపియన్షిప్లో పతకాలు నెగ్గిన నిఖత్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టోక్యోలో కాంస్యం నెగ్గిన లవ్లీనా ఈసారి కూడా అద్భుతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్, నిశాంత్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే కాంస్యాలు సాధించే చాన్స్ ఉంది. పారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి. –సాక్షి క్రీడా విభాగం -
241 పరుగులతో నెగ్గిన ఇంగ్లండ్
నాటింగ్హమ్: వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 241 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఇంగ్లండ్ నిర్దేశించిన 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 36.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 248/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 92.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (109; 13 ఫోర్లు), జో రూట్ (122; 10 ఫోర్లు) సెంచరీలు సాధించారు. -
యూకీ–ఒలివెట్టి జోడీకి టైటిల్
స్టాడ్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్ను సాధించాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం విజేతగా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ–ఒలివెట్టి జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో హంబెర్ట్–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. యూకీ–ఒలివెట్టిలకు 30,610 యూరోల (రూ. 27 లక్షల 87 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఆస్కార్కు తొలి ఎఫ్1 విజయం
బుడాపెస్ట్: మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి తన కెరీర్లో తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్ప్రిలో 23 ఏళ్ల ఈ ఆ్రస్టేలియన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని పొందాడు. కెరీర్లో 35వ రేసులో పోటీపడ్డ ఆస్కార్ నిర్ణీత 70 ల్యాప్లను అందరికంటే వేగంగా ఒక గంటా 38 నిమిషాల 01.989 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ దక్కించుకున్నాడు. మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు.హామిల్టన్ (మెర్సిడెస్), లెక్లెర్క్ (ఫెరారీ), వెర్స్టాపెన్ (రెడ్బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. సీజన్లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్ప్రి ఈనెల 28న జరుగుతుంది.