‘పసుపుకొమ్ములు కట్టుకోవాలి’ వార్త నిజం కాదు | That News is Not True: Ahobila Jeeyar Swamy | Sakshi
Sakshi News home page

చినజీయర్‌ స్వామి అలా చెప్పలేదు

Published Thu, Apr 23 2020 4:49 PM | Last Updated on Thu, Apr 23 2020 5:00 PM

That News is Not True: Ahobila Jeeyar Swamy - Sakshi

సాక్షి, శంషాబాద్‌ రూరల్‌: పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్‌ స్వామి చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారం అవాస్తవమని శ్రీఅహోబిల జీయర్‌ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్‌ స్వామి చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కరోనా వైరస్‌ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని వివరించారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని పేర్కొన్నారు.

‘ఆమె’ అష్టా చమ్మా ఎంత పని చేసిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement