వరంగల్: వృద్ధ దంపతులు హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఆస్తి కోసం మొదటి భార్య కుమారుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు.