old Couple
-
చెరువులోకి దూకిన వృద్ధ దంపతులు
-
హతమార్చి.. పోలీసులను ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడటం, ప్రతిఘటించిన వారిని హత్య చేసి పరారయ్యే హంతకుడిని పట్టుకోవడంలో రాచకొండ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య చేసి ఏడాదిన్నర కాలం పాటు పోలీసుల కళ్లగప్పి వారి ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. మరో ఇద్దరిని హత్య చేసి, తనంతట తాను దొరికితే తప్ప విచారణాధికారులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించి తొలి కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే.. ఇద్దరు ప్రాణాలతో మిగిలేవారు. కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగితే అఘాయిత్యమే.. దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ మద్యం మత్తులో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తాగిన మైకంలో ఫామ్ హౌస్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై కన్నేసేవాడు. అదను చూసి మద్యం తాగి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే అక్కడే ఉన్న పదునైన ఆయుధంతో వారిని హత్య చేసి పరారయ్యేవాడు. ఈ ఘటనను ఎవరైనా చూస్తే.. సాక్ష్యం మిగలకుండా వారిని కూడా అంతం చేసేందుకు వెనుకాడేవాడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆధారాల సేకరణలో విఫలం.. దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్లో పనిచేసే శైలజ అనే మహిళపై కన్నేసిన అతను గతేడాది మార్చి 3న ఆమెను హత్య చేశాడు. అనంతరం హతురాలి ఇంట్లో ఉన్న రెండు విదేశీ మద్యం బాటిళ్లు నిందితుడికంట పడ్డాయి. దీంతో ఒక బాటిల్ను తీసుకుని, మరొకటి తీస్తుండగా చేయి జారి కింద పడిపోయింది. పగిలిన బాటిల్పై ఉన్న నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే హతురాలు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారే అయినా పోలీసులు ఊరిలో ఉన్న అనుమానితులను విచారించలేదు. దీంతో నిందితుడు శివ కళ్ల ముందు ఉన్నా గుర్తించలేకపోయారు. అంతే కాకుండా హత్య అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వచి్చన సమయంలోనూ నిందితుడు కూడా అక్కడే ఉండి ఆధారాల సేకరణలో వారికి సహాయపడినట్లు తెలిసింది. వాసన పసిగట్టి డాగ్ స్క్వాడ్ వెంబడిస్తాయని ముందుగానే తెలుసుకున్న నిందితుడు... అవి రాకముందే అక్కడ్నుంచి పరారయ్యేవాడు. శైలజా రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు అదే ఊర్లో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు. మరోసారి మద్యం మత్తులో మ్యాంగో ఆర్చిడ్స్ ఫామ్ హౌస్లో పని చేస్తున్న శాంతమ్మపై అత్యాచారానికి యతి్నంచాడు. ఆమె ప్రతిఘటించడంతో వేట కొడవలితో హత్య చేశాడు. ఇది చూశాడన్న అనుమానంతో ఆమె భర్త మూగ హోసయ్యనూ అంతం చేశాడు. తొలి కేసులోనే పోలీసులు హంతుకుడు శివను పట్టుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలకు దక్కేవని స్థానికులు పేర్కొంటున్నారు.పాత కేసులపై ఆరా.. హత్యలు జరిగిన రెండు ఫామ్ హౌస్లలోనూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా పోలీసుల దర్యాప్తునకు సవాల్గా మారింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకునే యజమానులు, సిబ్బంది భద్రత, రక్షణ కోసం కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సిందని పోలీసులు సూచిస్తున్నారు. ఫామ్ హౌస్లకు వచ్చివెళ్లే దారిలో కూడా ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం నిందితులు ఎలాంటి బెరుకు లేకుండా నేరాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా నిందితుడు సాయంత్రం వేళల్లో మద్యం తాగి, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అడ్డుపడిన వారిపై పదునైన ఆయుధంతో హత్య చేస్తుంటాడు. దీంతో మహేశ్వరం జోన్ పరిధిలో ఇదే తరహాలో ఏమైనా హత్య కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు పునఃసమీక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, ఫామ్ హౌస్లు, గృహాలలో సాయంత్రం వేళల్లో జరిగిన మహిళల హత్య కేసులను ఆరా తీస్తున్నారు. -
గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
AP Police: వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు
హనుమాన్జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. -
30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్.. తాజాగా తాగి వాగేసి.. దొరికేశాడు
ముంబై: లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి వారింట్లో దొంగతనం చేశాడు. తర్వాత ఔరంగాబాద్ కు మకాం మార్చాడు. పరారీలో ఉండి 30 ఏళ్ళు రాజాలా బ్రతికాడు. చివరికి ఒక ఫంక్షన్లో బాగా తాగి ఆ మర్డర్ గురించి వాగి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. లోనావాలాలో చిన్న వ్యాపారం చేసుకునే అవినాష్ పవార్ అనే ఆసామి ఇద్దరు సహచరులతో కలిసి సమీపంలోని ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధ జంటను హత్య చేసి వారింట్లో దొంగతనం చేశారు. తర్వాత పోలీసు విచారణలో మిగతా ఇద్దరు పట్టుబడగా అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. అప్పటికి అవినాష్ వయసు 19 ఏళ్ళు మాత్రమే. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య రాజకీయంగా ఎదగడానికి కూడా తడ్పడ్డాడు. ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగు కాలవలో పడి చనిపోయినట్టు మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఓ పార్టీలో ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను విక్రోలిలో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం గాలిస్తూనే ఉన్నాము. అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడు. ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని గాని తన భార్య తల్లిదండ్రులను గాని చూడటానికి రాలేదు. చివరకు ఇలా విక్రోలీలో పట్టుబడ్డాడని తెలిపారు. -
కూతురు ఇంటి నుంచి సంతోషంగా వెళ్తుంటే..
సాక్షి, మియాపూర్(హైదరాబాద్): కూతురు వద్దకు వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వెళ్తున్న వృద్ధ దంపతులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి గ్రామానికి చెందిన వెంకట్రావు(65), అనంతలక్ష్మీ(60) దంపతులు పదిరోజుల కిందట చిలుకూరులో ఉంటున్న వారి కుమార్తె కుమారి దగ్గరకు వచ్చారు. తిరిగి సొంతూరుకు వెళ్లేందుకు సోమవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చి...సాయంత్రం 5:20 గంటల సమయంలో ఫస్ట్ ప్లాట్పారం నుంచి దిగి రెండవ ప్లాట్పారంకు వెళ్లేందుకు పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా శంకర్పల్లి వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ వీరిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. సాయంత్రం 7:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో నర్సాపూర్ రైలు ఎక్కేందుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. వృద్ధ దంపతులు ఇద్దరు మృతి చెందడంతో బంధువులు విలపించారు. తోటి ప్రయాణికులు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నెత్తురోడిన రహదారులు..రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సాక్షి, కంటోన్మెంట్: నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి చౌరాస్తాలో ఆదివారం చోటు చేసుకుంది.. నిర్మల్ నగరానికి చెందిన తులసీదాస్ (65), రాజమణి (62) దంపతులు నగరంలోని గచ్చిబౌలిలో ఉంటున్న తమ కుమారుడు రామరాజు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం బోయిన్పల్లిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపునకు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు బోయిన్పల్లి చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులు, అధికారులకు కనువిప్పు కలగాలంటూ ఓ పక్క అంబులెన్స్లో మృతదేహాలు, ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం కుషాయిగూడ: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలోని మల్లాపూర్ అశోక్నగర్ కాలనీ మర్రిగూడ హెచ్పీ పెట్రోల్ పంప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్కు చెందిన రాజు మహతో నగరానికి వలసవచ్చి మల్లాపూర్లోని న్యూ నర్సింహనగర్లో కుటుంబంతో సహా నివాసం ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోపుడుబండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుండగా మర్రిగూడ హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచి్చన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి బావ నాగేందర్కుమార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: బంజారాహిల్స్లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి) -
మరణంలోనూ ఒకరికొకరు తోడుగా.. ఒకే సమాధిలో ఇద్దరికీ శాశ్వత విశ్రాంతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ఏరుపల్లికి చెందిన బూసి ధర్మరాజు(82), బూసి వీరమ్మ (72)లది 56 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు కాలం చేశారు. చిన్న కుమార్తె గొల్లపల్లి పార్వతి హసన్బాద గ్రామ సర్పంచ్గా పని చేశారు. ఆమె భర్త గొల్లపల్లి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ ఇటీవల మృతి చెందారు. 56 ఏళ్ల వైవాహిక జీవితంలో ధర్మరాజు, వీరమ్మ ఏనాడూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేదు. కుమార్తెల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇద్దరూ కలిసే వెళ్లి వచ్చేవారు. గ్రామంలో ఒకరికొకరు తోడుగా జీవించేవారు. ధర్మరాజు ఎనిమిది పదుల వయస్సులోనూ సైకిల్ తొక్కుకుంటూ కుమార్తె ఇంటికి వెళ్లేవారు. ఇంటిలోకి కావాల్సిన సరుకులు తానే స్వయంగా తెచ్చుకునేవారు. వీరమ్మ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఇంటి పనులు మొత్తం తానే చక్కబెట్టుకునేది. కొంతకాలంగా ధర్మరాజుకు కాస్త ఆయాసం వస్తూ ఉండేది. దీంతో భర్తకు వేడి మంచినీళ్లు ఇవ్వడం వీరమ్మకు అలవాటుగా మారింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్తకు వేడి నీళ్లు ఇద్దామని పిలవగా స్పందించలేదు. చుట్టుపక్కల వారిని లేపి చూపించగా, వారు పరిశీలించి ధర్మరాజు మృతి చెందాడని చెప్పారు. దీంతో ఆమె రోదిస్తూ కూర్చుంది. చుట్టుపక్కల వారు కుమార్తెల కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్న వీరమ్మ వెక్కిళ్లు వచ్చి, వాంతి చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టింది. నాలుగు రోజుల క్రితం మునిమనవడితో కులాసాగా గడిపిన ఆ వృద్ధ దంపతులు ఒకే రోజు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం క్రిస్టియన్ పద్ధతిలో ఇద్దరినీ ఒకే సమాధిలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ మల్లిమొగ్గల శ్రీధర్, మాజీ సర్పంచ్లు సాక్షి వేణు, చిల్లా గోపాలకృష్ణ, గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య -
నా భర్తకు 89 ఏళ్లు.. రోజూ అదే ధ్యాస.. నన్ను కాపాడండి
గాంధీనగర్: గుజరాత్ వడోదరలో 89ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది 87ఏళ్ల భార్య. వృద్ధ వయసులోనూ ఆయన రోజూ శృంగారం కావాలని తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 181 అభయంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. తన భర్త నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు విని షాక్కు గురైన అభయం టీం వెంటనే రంగంలోకి దిగింది. వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ వయసులో యోగా చేయాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని సూచించింది. వీలైతే సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో సేదతీరాలని చెప్పింది. భార్యను ఇబ్బందిపెట్టవద్దని భర్తకు సూచించి సమస్యను పరిష్కరించింది. తన భర్తకు ఎప్పుడూ అదే ధ్యాస అని, శృంగారానికి ఒప్పుకోకపోతే తనపై కోపపడతాడని భార్య చెప్పింది. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా భర్త పదే పదే బలవంతం చేయడం వల్లే గత్యంతరం లేక ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. చదవండి: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్.. -
ఈ జంటకు సలాం కొట్టాల్సిందే!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
వైరల్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్రం ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ సందడి చేసింది. అయితే.. జెండా ఎగరేసేందుకు ఓ వృద్ధ జంట ప్రయాస పడడంపై ఆనంద్ మహీంద్ర భావోద్వేగమైన పోస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారనే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇక్కడున్న ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప గొప్ప వక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే బెటర్గా మీకు వీళ్లు వివరిస్తారు. జైహింద్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. పైన ఉన్న ఒకావిడ జెండా మీద దృష్టి పెడితే.. ఆమె పడిపోకుండా కింద డ్రమ్మును పట్టుకుని ఉన్నారు ఓ పెద్దాయన. If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳 pic.twitter.com/t6Loy9vjkQ — anand mahindra (@anandmahindra) August 14, 2022 Next level it is! Love this young couple ❤️ — Jhony Bravo (@mahesh_s_savita) August 14, 2022 No word yet only Jai Hind 🙏🙏 — ramaekrisshna (@ramakrishna183) August 14, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. నిజమైన దేశభక్తే ఇదేనంటూ చాలామంది కామెంట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోను మీరూ చూసేయండి. ఇదీ చదవండి: భారత్కు పాక్ మ్యూజిషియన్ ఊహించని కానుక -
పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్ అదాలత్ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్లో చోటు చేసుకుంది. జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్ అదాలత్లో జడ్జి జీఆర్ శెట్టర్ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!) -
ఎంగిలి పేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా
గూడూరు (తిరుపతి జిల్లా): ఎంగిలిపేట్లు కడిగి ఆస్తులు సంపాదించాం. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఆస్తులన్నీ రాసిచ్చాం. వృద్ధాప్యంలో ఆదుకుంటారనుకుంటే చిత్రహింసలు పెడుతున్నారు. పదమూడేళ్లుగా జీవచ్ఛవాళ్లా జీవిస్తున్నాం. బతకడానికి దారి చూపండయ్యా’ అంటూ వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చదవండి: చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా! బాధితుల కథనం మేరకు.. గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతానికి చెందిన కోనేరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ, పిల్లలను ప్రయోజకుల్ని చేశారు. కాయకష్టం చేసి ఆస్తులు కూడబెట్టారు. అందరికీ వివాహాలయ్యాయి. ఉన్న ఆస్తులన్నింటినీ పిల్లల పేర రాసిచ్చేశారు. ఉన్న నగదుతోపాటు, బంగారం కూడా వారికే ఇచ్చేశారు. ఇంతచేసినా ఇంకా ఇవ్వాలంటూ తరచూ తల్లిదండ్రులను కొట్టడంతోపాటు, హింసించడం మొదలు పెట్టారు. ఈ మేరకు వృద్ధదంపతులు నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకూడా అప్పట్లో తల్లిదండ్రులకే అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ పిల్లల్లో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోతున్న సుబ్బయ్యకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే కొడుకులు కొడుతున్నారని వాపోతున్నారు. తమకు బతకడానికి దారి చూపాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ తిరుపతయ్యను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రాత్రి బాగానే ఉన్నారు.. ఏం జరిగిందో ఏమో ఉదయం ఇంట్లో చూస్తే..
జగదేవ్పూర్(గజ్వేల్): ఆదివారం రాత్రి వరకు బాగానే ఉన్న దంపతులు సోమవారం ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరి మెడలకు తాడు ఉండి కింద పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఆస్తి కోసం ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ (65) బాలమణి (58) దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. సత్యానారాయణ గ్రామంలో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా, భార్య బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా వీరికి సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. గజ్వేల్కు చెందిన యువకుడితో పెళ్లి కూడా జరిపించారు. సత్యనారాయణ సోదరుడు బుచ్చయ్యకు కూడా పిల్లలు లేకపోవడంతో అక్కారం గ్రామానికి చెందిన శ్రీను అనే బాలుడిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. మరో సోదరుడు ప్రభాకర్ చిన్నప్పుడే తంగళ్లపల్లిలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం బుచ్చయ్య దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు.అప్పటి నుంచి శ్రీను ఒంటరిగానే ఉంటున్నాడు. సత్యనారాయణ, బుచ్చయ్యకు సంబంధించి 39 గుంటల భూమి ఉండడంతో రెండు నెలల క్రితం రూ. 25 లక్షలకు విక్రయించారు. అప్పటి నుంచి చిన్నపాటి గొడవలు ప్రారంభం అయ్యాయి. సత్యనారాయణ ఇద్దరు చెల్లెళ్లలకు తలా రూ. లక్ష ఇవ్వగా, శ్రీనుకు రూ. 3 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు సత్యనారాయణ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. శ్రీనుకు పెళ్లి కాకపోవడంతో పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 8 గంటలు దాటినా సత్యనారాయణ తలుపులు తీయలేదు. స్థానికుడైన వెంకట్రెడ్డి ఫోన్ చేసినా లేపలేదు. దీంతో ఇంటి వెనకలా తలుపును తట్టి చూడగా ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. వెంటనే అతడు సర్పంచ్ భానుప్రకాష్రావుకు సమాచారం అందించాడు. అనంతరం జగదేవ్పూర్ పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే ఏసీపీ రమేష్, గజ్వేల రూరల్ సీఐ కమలాకర్, ఎస్ఐలు రాజు, పుష్పరాజు ఘటనా స్థలికి చేరుకొని క్లూస్టీం, డాగ్స్క్వాడ్లతో పరిశీలించారు. డాగ్స్క్వాడ్ ఇంటి చుట్టూ తిరిగి పక్కన ఉన్న ఫంక్షన్హాల్ ముందు నుంచి రోడ్డుపై వెళ్లి ఆగింది. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. దంపతుల మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాలెన్నో.. సోదరుడి పొత్తుల భూమి అమ్మగా సత్యనారాయణకు మరో ఎకరన్నర భూమి ఉంది. డబ్బులు, ఉన్న భూమి, ఆస్తి కోసం హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బీరువాను చూడకపోవడం, అందులో సుమారు రూ. 2 లక్షల వరకు డబ్బులు, బంగారు ఆభరణాలు అలాగే ఉండడం, బాలమణి ఒంటిపై నగలుఉన్నాయి. వారి ఒంటిపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
డేటింగ్ యాప్లో పరిచయం.. 70 ప్లస్లో ప్రేమ.. ఆపై పెళ్లి
ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్, ప్రేమకు సరిహద్దులు లేవు... ఈ డైలాగులు అప్పుడప్పుడు సినిమాల్లో మనం వింటూనే ఉంటాం. అయితే ఇద్దరు వృద్ధులు మాత్రం ఏడు పదులు వయసులో కూడా ఆ మాటలను నిజం చేసి చూపించారు. అసలు ఈ 70 ప్లస్ లవ్స్టారీ ఎలా మొదలైందంటే.. పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్కు పెళ్లయిన 38 సంవత్సరాల తర్వాత 2017లో తన భార్యను కోల్పోయాడు. ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో, 78 ఏళ్ల అతను తనకి ఓ తోడు కావాలని నిర్ణయించుకుని 50 ఏళ్లు పైబడిన మహిళ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్లో లాగిన్ అయ్యాడు. అలా తోడు కోసం వెతుకుతున్న ఆడమ్స్కు అనుకోకుండా 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. చివరికి ఒకిరికొకరు నచ్చడంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది ఆ జంట. దీనిపై ఆడ్రీ.. నేను ఆ యాప్ ఉపయోగించిన తక్కువ సమయంలోనే ఆడ్రీని చూశాను. నాతో పరిచయం పెంచుకున్న తర్వాత మేము దగ్గర కావడానికి ఎక్కువ రోజులు కూడా పట్టలేదు. ఎందుకంటే తను కూడా నా లాంటి క్రేజీ పర్సన్ కాబట్టి.. అంటూ తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మార్చుకుంది ఆ వృద్ధ జంట. ప్రస్తుతం నెట్టింట జిమ్, ఆడ్రి పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఆ జంటను చూసిన నెటిజన్లు వారికి ఆల్ ది బెస్ట్ అని కామెంట్ పెడుతున్నారు. పోస్ట్ అప్లోడ్ చేసినప్పటి నుండి 1.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. చదవండి: Viral: ప్రియుడి బాధ చూడలేక ప్రేయసి త్యాగం.. సినిమాల్లో కూడా సాధ్యం కాదేమో ! -
వృద్ధుల కన్నీటి గాథ: ఒక్కగానొక్క కొడుకు మృతి.. కిడ్నీలు ఫెయిల్.. పింఛనే ఆధారం
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది. -
భర్త మరణించిన ఒక్కరోజు వ్యవధిలోనే భార్య కూడా
సేలం: వృద్ధాప్యం వల్ల భర్త మృతి చెందడంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం సేలంలో చోటు చేసుకుంది. సేలం పాత సూరమంగళం వెల్లై కవునర్ వీధికి చెందిన వృద్ధుడు పెరియన్నన్ (98). ఇతని భార్య అన్నమ్మ (90). వీరికి గణేశన్, సుందరం, రాము అనే ముగ్గురు కుమారులు, కుమార్తె కలైసెల్వి ఉన్నారు. వీరిలో గణేశన్, సుందరానికి మాత్రమే వివాహం అయ్యింది. రాము, కలై సెల్విలకు వివాహం చేసుకోలేదు. అయితే, ముగ్గురు కుమారులు, కుమార్తె గత కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. గణేశన్, సుందరం వారివారి కుటుంబాలతో వేరు వేరుగా జీవిస్తూ వస్తున్నారు. దీంతో పెరియన్నన్, అన్నమ్మాల్ తోటలోని ఇంట్లో విడిగా నివసిస్తూ వచ్చారు. ఇక్కడ పొలం పండిస్తూ, పశువులను మేపుతూ పాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ స్థితిలో గత కొన్ని నెలలుగా పెరియన్నన్ అనారోగ్యానికి గురై మంచం పట్టాడు. ఆయనకు అన్నమ్మాల్ సేవలందించారు. ఈ స్థితిలో బుధవారం రాత్రి పెరియన్నన్ మృతి చెందాడు. రాత్రంతా భర్త పెరియన్నన్ మృతదేహం వద్ద ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్న అన్నమ్మాల్ తీవ్ర ఆవేదనతో గురువారం వేకువజామున ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం ఎంత సేపటికి అన్నమ్మాల్ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరు గు వారు వెళ్లి చూడగా పెరియన్నన్ మంచంపై శవంగాను, దూలానికి అన్నమ్మాల్ మృతదేహంగాను వేలాడుతుండడం చూసి సూరమంగళం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అన్నమ్మాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెరియన్నన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అంత్యక్రియలకు డబ్బులిచ్చి.. ఎంతపని చేశారంటే..
తిరువొత్తియూర్(తమిళనాడు): దిండుక్కల్ జిల్లాలో వృద్ధ దంపతులు విషం తాగి.. ఆత్మహత్య చేసుకున్నారు. వీరు తమ అంత్యక్రియలు ముందస్తుగా డబ్బుఇవ్వడం గమనార్హం. వివరాలు.. దిండిగల్ జిల్లా వత్తలగుండు సమీపం కనవాయ్పట్టికి చెందిన తోత్తన్ (65). అతని భార్య వీరాయి (60). వీరికి పిల్లలు లేరు. తొత్తన్ కాఫీ తోటల్లో కూలి కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరాయి 100 రోజుల పనులకు వెళుతూ ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా వీరు పనులకు వెళ్లలేక ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. దీంతో విరక్తి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. గన్నేరు కాయలు నూరి తాగేసి వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని పక్కంటిలో నివాసం ఉండే అంథోని గమనించారు. దీంతో వారు తాము విషం తాగామని, కాపాడడానికి ప్రయత్నం చేయవద్దని, తమ మృతదేహలను ఒకేచోట పాతి పెట్టాలని, అంత్యక్రియల ఖర్చులకు రూ. 40,000 నగదును అంథోనికి చేతికిచ్చారు. తర్వాత కొద్ది సేపటికే వీరాయి, తోత్తన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. -
వృద్ధ దంపతులను తాళ్లతో బంధించి..
టీ.నగర్(తమిళనాడు): వృద్ధ దంపతులను నిర్బంధించి 50 సవర్ల నగలు, వజ్రాలు చోరీ చేసిన ఘటన కారైకుడిలో చోటుచేసుకుంది. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని కండనూరుకు చెందిన దక్షిణామూర్తి (61) రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. భార్య విశాలాక్షి (60). ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లోకి చొరబడిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దక్షిణామూర్తిని కత్తితో బెదిరించి లోపలికి తీసుకెళ్లారు. ఒక గదిలో అతన్ని, భార్యను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బంధించారు. బీరువాలోని 50 సవర్ల బంగారు, 30 కేరట్ వజ్రాల నగలు, కిలో వెండి, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. ఎలాగొల తాళ్లను విప్పుకున్న దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివగంగై ఎస్పీ సెంథిల్కుమార్ విచారణ జరిపారు. సాకోటై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిలువనీడ లేక.. చేరదీసేవారు లేక!
నిర్మల్: మిట్ట మధ్యాహ్నం.. ఎర్రటిఎండ.. నెత్తిన మూటలు, కాలినడకన, ఖాళీ కడుపున వచ్చి ఓ చెట్టు నీడన ముక్కుతూ, మూలుగుతూ గడుపుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఊరికాని ఊరిలో పడరాని పాట్లు పడుతున్నారు. జీవన మలిసంధ్యవేళ సంచార జీవనం గడుపుతున్నారు. ఇదీ నిర్మల్లో ఓ వృద్ధదంపతుల దయనీయస్థితి. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన అల్లకుంట లక్ష్మి, లక్ష్మయ్య అనే వృద్ధ దంపతులకు సంతానం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అదే ఊరిలో ఓ గదిలో అద్దెకుండేవారు. లక్ష్మయ్య ఊళ్లోవారి బర్రెలను కాస్తుండగా, లక్ష్మి వ్యవసాయపనులకు వెళ్లేది. వయసు పైబడటంతో ఆయన ఇంటి పట్టునే ఉంటున్నాడు. నెలనెలా వచ్చే రూ.రెండు వేల పింఛన్తోనే ఆ దంపతులు ఇన్నాళ్లు బతుకు వెళ్లదీస్తూ వచ్చారు. ఇటీవల గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో యజమాని ఈ వృద్ధ దంపతులుంటున్న గదిని ఖాళీ చేయించాడు. దీంతో తమ బట్టలను సంచులలో సర్దుకుని, వాటిని నెత్తిన పెట్టుకుని రోడ్డెంటా బయలుదేరారు. మూడు నెలలుగా పింఛన్ వస్తలేదు... రెండు, మూడు రోజులు ఆ ఊళ్లో, ఈ ఊళ్లో గడిపా రు. లక్ష్మి బంధువుల ఇళ్లలో వారం ఉన్నారు. అక్కడా పరిస్థితి బాగా లేక మళ్లీ బయటకు వచ్చా రు. ఇరవై రోజుల క్రితం నిర్మల్ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడే ఉంటూ.. ఎవరైనా అన్నదానం చేస్తే తింటూ పూట గడుపుతున్నారు. బస్టాండ్ అధికారులు గురువారం బయటకు పంపించడంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఎండలో ప్రధాన రహదారి వెంట నడుస్తూ.. చివరకు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఓ చెట్టు కింద ఆగారు. ‘సుట్టాలున్నా.. మా అసుంటి ముసలోళ్లను ఎన్నాళ్లు ఉంచుకుంటరు బిడ్డా..’అని లక్ష్మి వాపోతోంది. మూణ్నెళ్లుగా పింఛన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ ఉన్నా.. అనాథగానే! వర్ధన్నపేట: భర్త ఉన్నాడు.. బంధువులు ఉన్నారు.. దత్తపుత్రుడు ఉన్నాడు. అయినా ఆమె ఎవరూలేని అనాథలా జీవితం గడుపుతోంది.. అనారోగ్యంతో లేవలేని స్థితిలో బతుకుపోరు సాగిస్తోంది. కరోనా అనుమానంతో ఎవరూ దగ్గరకు రావడంలేదు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట 11వ వార్డుకు చెందిన గబ్బెట విజయ, వెంకటేశ్వర్లు దంపతులు. వెంకటేశ్వర్లు విశ్రాంత ఉపాధ్యాయుడు. సంతానం లేకపోవడంతో విజయను వదిలేసిన ఆయన మరో పెళ్లి చేసుకుని వరంగల్లో కాపురం ఉంటున్నాడు. విజయ ఒంటరిగా వర్ధన్నపేటలో ఉంటూ కొన్నేళ్ల క్రితం ఓ బాలుడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. వారం క్రితం విజయ అస్వస్థతకు గురికాగా దత్తపుత్రుడు ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. మొదట ఆమెను అక్కాచెల్లెళ్లు తీసుకెళ్లారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా సోకిందనే అనుమానంతో వర్ధన్నపేటలోని ఇంట్లో వదిలేశారు. అప్పటి నుంచి ఆమె లేవలేని స్థితిలో తిండి, నీరు లేక నీరసించింది. గురువారం ఆమె స్థితిని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమె భర్తకు ఫోన్ చేయగా తాను కరోనా బారిన పడినందున మీరే ఆస్పత్రిలో చేర్చాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు చెబితే హెల్ప్లైన్ నంబర్కు ఫోన్చేస్తే తప్ప తాము తీసుకెళ్లలేమని చేతులెత్తేశారు. స్థానిక యువకులు మంచినీరు, ఆహారం ఇవ్వాలని ప్రయత్నిం చారు. ఆమె నీళ్లూ తాగలేని పరిస్థితిలో ఉంది. -
కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం..
కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడలో వృద్ధ దంపతులు 24 గంటల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు వదిలిన విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, ఆదివారం భర్త ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. చేనేత వస్త్ర వ్యాపారం చేసే 85 సంవత్సరాల అతని మనుమడికి కరోనా సోకింది. అతడు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ వృద్ధుల మృతదేహాలను చూసేందుకు ఎవరూ సాహసించలేదు. కనీసం శ్మశానానికి తరలించేందుకు బంధువులు కూడా ముందుకు రాకపోవడంతో వారి కుమారుడే రిక్షాలో తల్లిదండ్రుల శ్మశానానికి తరలించి, అంత్యక్రియలు చేశారు. రిక్షాలో మృతదేహాలను తరలించిన హృదయ విదారక దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. చదవండి: జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య -
టీకా వేసుకున్న రోజే భార్య.. ఆ తర్వాత భర్త
నెక్కొండ: జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడే టీకా కూడా వేయించుకున్నారు. అదే రోజు భార్య మృతి చెందగా, ఐదో రోజు భర్త మరణించాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నెక్కొండకు చెందిన పుట్టపాక అంజమ్మ (58), వెంకటయ్య (67) దంపతులు ఈనెల 19న స్థానిక పీహెచ్సీకి కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్లారు. అదే సెంటర్లో కరోనా టీకా సైతం తీసుకున్నారు. కాగా, అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అంజమ్మ మృతి చెందింది. అప్పటినుంచి జ్వరంతో బాధపడుతూ, మనోవేదనకు గురైన భర్త వెంకటయ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. టీకా కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ వేయడంతోనే వృద్ధ దంపతులు మృతిచెందారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమేశ్ను వివరణ కోరగా, వృద్ధాప్యంలో వచ్చే హార్ట్ స్ట్రోక్తో మృతి చెంది ఉండవచ్చనని అభిప్రాయపడ్డారు. చదవండి: విషాదం.. దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే -
ఆమెకు 73.. ఆయనకు 69.. ఓ శుభవార్త
మైసూరు: జీవితం చరమాంకంలో తోడు కావాలని భావించారు. వయసు శరీరానికే కాని మనసు కాదని ఒకరికొకరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో 73 ఏళ్ల వృద్ధురాలిని 69 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకోబోతున్నారు. వివరాలు... మైసూరు నగరంలో నివాసం ఉంటున్న ఓ రిటైర్డు ఉపాధ్యాయురాలు, కొన్నేళ్ల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒంటరి తనంతో ఉన్నఆమెకు తోడు అవసరమని కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించారు. దీంతో వరుడు కావలెను అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే 69 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితమే భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. అతని ప్రోద్బలంతోనే పెళ్లికి అంగీకరించాడు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. చదవండి: పెళ్లి కోసం ఐదేళ్లుగా ఆరాటం: మొత్తానికి నిశ్చితార్థం.. -
కొత్త ఇల్లు కట్టుకున్నాం.. ఇంట్లోకి రానివ్వం
జగిత్యాల: రేకుల షెడ్డు వేస్తామంటూ ఉన్న ఇంటిని కూల్చేసి కొత్తగా ఇల్లు కట్టుకున్న తనయులు.. వృద్ధులైన తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. ఐదు రోజులుగా కొడుకుల ఇంటి ఎదుటే రోడ్డు పక్కన ఆ వృద్ధ దంపతులు నరకయాతన అనుభవిస్తున్నారు. జగిత్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన బుచ్చిరెడ్డి, బుచ్చమ్మ దంపతులు తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని ఇద్దరు కొడుకులకు పంచారు. మరో 1.10 ఎకరాలు తామే సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం వీరికి రేకుల షెడ్డు వేయిస్తామని చెప్పిన కొడుకులు పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు. తల్లిదండ్రులను ఇంట్లోకి రానీయకపోవడంతో ఆ వృద్ధ దంపతులు రెండేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, ఈ మధ్య అద్దె ఇంటి యజమానులు వారిని ఖాళీ చేయించగా.. కుమారులు కూడా ఇళ్లలోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్ధులు గ్రామంలోని జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారి పక్కన సామగ్రి పెట్టుకుని అక్కడే వంట చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. -
దంపతుల డ్యాన్స్.. మనసు దోచేయడం ఖాయం
కోల్కతా: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వైరల్గా మారుతున్నాయి. కొందరు తాము చేస్తున్న పని ద్వారా తమకు తెలియకుండానే ఫేమస్ అయిపోతారు. సరిగ్గా అలాంటి పాపులారిటీనే భారత్కు చెందిన వృద్ధ దంపతులు పొందారు. వివరాలు.. కోల్కతాలోని హార్డ్ రాక్ కెఫే చాలా పురాతనమైనది. కోల్కతాకు ఉన్న మరోపేరు ‘సిటీ ఆఫ్ జాయ్’ మాదిరిగానే.. ప్రతినిత్యం ‘వో చలీ వో చలీ దేఖో ప్యార్ కి గలీ’ పాటను పెట్టి ఇక్కడ వచ్చేవారిని మైమరిచిపోయేలా బ్యాండ్ ఏర్పాటు చేశారు. తాజాగా అదే పాట వింటున్న ఓ వృద్ధ జంట అమాంతం లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. చట్టూ జనం ఉన్నారనే సంగతి మరిచి వీరు చేసిన డ్యాన్స్ అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. కెఫేలో ఉన్న వారంతా వీరి డ్యాన్స్కు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.ఈ వీడియోను దిబొహోబాలిక అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఈ బ్యాండ్ తనను 90 ల్లో తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చిందని, మరెందరికో మరిచిపోలేని అనుభూతులను పంచిపెట్టిందని రాసుకొచ్చారు.ఈ వీడియోను ఇప్పటివరకు 25 వేల మందికి పైగా వీక్షించారు.చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి View this post on Instagram A post shared by Mamta Sharma Das (@thebohobaalika) -
ఒక్క వీడియో జీవితాన్ని మార్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క వీడియో రాత్రికిరాత్రే ఈ వృద్ధ దంపతుల జీవితాన్ని మార్చేసిందే. 40 ఏళ్లుగా ఢిల్లీలో రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కాంటా ప్రసాద్ అనే వృద్ధుడి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాంత ప్రసాద్(90) ఆయన భార్య బాదామి దేవిలు ఢిల్లీలో కాంజీ వడ అమ్ముకుంటున్న వారిని కరోనా కాలం ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నేట్టిసింది. మహమ్మారి కాలంలో వ్యాపారం జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించాలంటూ ఓ ట్విటర్ యూజర్ గత వారం వీడియో షేర్ చేశారు. ఈ హృదయ విదాకర వీడియోకు స్పందించిన నెటిజన్లు వారికి సాయం చేసేందుకు వారి ఇంటి ముందు క్యూ కడుతున్నారు. కరోనా కాలంలో వారి వ్యాపారానికి మద్ధతునిచ్చేందుకు మాల్వియా నగరంలోని ఈ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి మరి ప్రజలు వారి చేతి భోజనం ఆస్వాధిస్తున్నారు. (చదవండి: ‘ప్లీజ్.. ఇలాంటి వారికి సాయం చేయండి’) దీంతో కాంత ప్రసాద్ ‘బాబా కా ధాబా’ అంటే ఢిల్లీలో తెలియని వారంటు లేరు అనేలా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియా వారిని ఇంటర్య్వూ చేసింది. ఇందులో కాంత ప్రాసాద్ వారి చెప్పిన వారి జీవిత కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఉత్తరప్రదేశ్లో అజాంగఢ్లో మా వివాహం జరిగే సమయానికి నాకు 5 ఏళ్లు, బాదామికి 3 ఏళ్లు. అప్పుడు నాకు బాగా గుర్తుండిపోయిన దృశ్యం బాదామికి రబ్బరు బ్యాండ్తో జట్టుపైకి కట్టి ఉంది. ఆమె అప్పుడు అచ్చం రబ్బరు బొమ్మలా కనిపించింది. అది మా వివాహ వేడుక అని తెలియదు. కొత్త బట్టలు ధరించిన ఏదో కార్యక్రమానికి వెళ్లి స్వీట్స్ తిని వచ్చామనుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి: అక్షయ్ సినిమాను బాయ్కాట్ చేయాలి: కేఆర్కే) ‘‘మా వివాహం తర్వాత మేము సంవత్సరానికి ఒకసారి కలిసేవాళ్లం. అప్పుడు పాత స్నేహితులం కలుకున్నట్లుగా అనిపించేది. ఈ నేపథ్యంలో నాకు 21 ఏళ్ల వయసు వచ్చాకే బాదామితో నా వివాహం జరిగిందని తెలిసింది. ఆ తర్వాత ఆమె నాతో కలిసి జీవించడానికి వచ్చింది. మా స్నేహం ప్రేమగా మారింది ఇలా మేము కలిసి పెరిగి ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం’’ అంటూ వివరించారు. ఈ క్రమంలో 1961 మాకు కూతురు పుట్టిన అనంతరం అజాంగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చామని చెప్పారు. మొదట్లో పండ్లు అమ్మేవాడినని ఆ తర్వాత నెమ్మదిగా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లమని చెప్పారు. ఈ క్రమంలో 1990లో బాబా కా ధాబాను ప్రారంభించామ’ని కాంత ప్రసాద్ వివరించారు. (చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..) -
లాక్డౌన్: 40 ఏళ్లుగా ఇదే జీవనోపాధి..
న్యూఢిల్లీ: ఆగ్రాలో రోడ్డు పక్కన వడ స్టాల్ నడుపుతున్న ఓ వృద్దుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు శుక్రవారం షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన కాంత ప్రసాద్ ఆయన భార్య బాదామి దేవిలు 40 ఏళ్లుగా ఆగ్రా సమీపంలో కాంజీ వడ స్టాల్ను నడుపుతూ జీవిస్తున్నారని తన పోస్టులో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా వారి ఉపాధికి గండిపడిందని, వారికి చేయూతను ఇవ్వాలని కోరారు. ఇలాంటి వారు ఎక్కడ కనిపించిన వారికి ఆర్థిక సాయం అందించాలని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన పోస్టుకు ‘కాంజీ వడ వాల మామ. అతను 40 ఏళ్లుగా ఇక్కడే కాంజీ వడా అమ్ముతున్నాడు. ఆయన 90 సంవత్సరాలు. ఈ మహమ్మారి కాలంలో ఆయన సంపాదన తగ్గిపోయింది’ అనే క్యాప్షన్తో షేర్ చేశారు. ‘ఆ స్టాల్ ఢిల్లీలోని ప్రోఫెసర్ కాలనీలోని కమలా నగర్ ఆగ్రాలో ఉందని, ప్రతి రోజు ఆయన సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ ఉంటారు’ అని రాసుకొచ్చారు. (చదవండి: బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్) ఆయన దగ్గర ఈ కాంజీ వడా తినాలని, లేదంటే తోచినంత సాయం చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ వారి గురించి తెలియజేసినందుకు ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘వారికి తప్పకుండా చేతనైన సాయం చేస్తాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆగ్రాలో ఇంకా ఇలాంటి వారు ఎక్కడ కనిపించిన తను తెలపాలని కోరారు. వారందరిని కలిసి సాయం చేయడానికి ప్రయత్నిస్తానని, అలాగే వారి గురించి అందరికి తెలిసేలా చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మహమ్మారి కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలాంటి వారికి సాయం చేయాలని విజ్క్షప్తి చేశారు. ‘అది మీ చూట్టుపక్కల ప్రాంతం నుంచే ప్రారంభించాలని, ఆ తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూడండంటూ’ నెటిజన్లకు ఆమె పిలుపు నిచ్చారు. (చదవండి: సోషల్ మీడియా పోస్టింగ్స్ : వాడీవేడి వాదనలు) View this post on Instagram My kanji bada wale uncle 😁 He has been selling kanji badas for almost 40 years and as of today, he is 90 years old. Because of this pandemic he gets to earn only ₹250-₹300 in a day. His stall is in professors colony, Kamla nagar, Agra, near desire Bakery. I’ve been here earlier also and I hope you guys also come here, eat and help him as much as you can. You’ll find him here everyday, from 5:30pm. Also, if you know such places in Agra, DM me. I will try to meet and help them all and will tell everyone about them. All of us should help those in need. Start from your own area, your city and then see how it all changes and let’s try to highlight every story we are able to. #vocalforlocal #vocal #old #viral #supportlocal #foodvideo #viralvideos A post shared by DHANISHTHA (@a_tastetour) on Oct 8, 2020 at 7:30am PDT -
'గోల్డ్' తరం మోడలింగ్
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను అక్షరాలా నిజం చేసుకుంటున్నారు ఈ తాతమ్మ, తాతయ్యలు. పాత దుస్తులను ధరించి మోడలింగ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పేరు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్న ఈ జంట యువతరం కాదు. మోడల్స్ కానే కాదు. సినిమా తారలు అసలే కాదు. కానీ, పాత దుస్తులతో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ దంపతుల దేశం తైవాన్. వీరికి తైచుంగ్లోని సెంట్రల్ సిటీ సమీపంలో ఓ చిన్న లాండ్రీ ఉంది. 83 ఏళ్ల చెంగ్ వాంజీ, 84 ఏళ్ల సువో షోర్ దంపతులకు ఇన్స్ట్రాగామ్లో ఇప్పుడు 6 లక్షలకు మందికి పైగా ఫాలోవర్స్ అయ్యారు.. మోడలింగ్ చేస్తున్న ఈ జంట ఫోటోలు ఈ తరానికి తెగ నచ్చుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న వీరి లాండ్రీకి రోజూ కస్టమర్లు వచ్చేవారు. కరోనా మహమ్మారి కారణంగా లాండ్రీ మూతపడింది. లాండ్రీ తెరిచే సమయానికి ఇక్కడ బట్టలు ఇచ్చిన కస్టమర్లు వాటిని తిరిగి తీసుకోవడం మర్చిపోయారు. కొంతమంది పట్టణమే వదిలేసి వెళ్లిపోయారు. అలా దాదాపు 400 డ్రెస్సులు వీరి లాండ్రీలోనే ఉండిపోయాయి. ఈ వృద్ధ దంపతులకు 31 ఏళ్ల మనవడు రీఫ్ ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా లాండ్రీ మూసేయడంతో తాత, బామ్మలు తరచూ బాధపడటం చూశాడు. రీఫ్ తమ బామ్మ, తాతయ్యల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆనందంగా మోడలింగ్ ఇంట్లో లాండ్రీకి వచ్చిన పాత బట్టలను ధరించి మోడలింగ్ చేయమని అవ్వాతాతకు సలహా ఇచ్చాడు. ముందు వారు ఒప్పుకోలేదు. కానీ, మనవడి కోసం ఆ డ్రెస్సులను వేసుకున్నారు. ‘వాటిని ధరించినప్పుడు మా వయస్సు ముప్పై సంవత్సరాలకు తగ్గినట్టుగా భావించాన’ని చెంగ్ వాంజీ సంబరంగా చెబుతున్నాడు. రీఫ్ అమ్మమ్మకు బట్టలు అంటే ఇష్టం. దీంతో ఈ అవ్వాతాతలు ఇద్దరూ రకరకాల దుస్తులు ధరించి మోడలింగ్ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. ‘నా వార్డోబ్ర్లో 35 ఏళ్ల క్రితం కొన్న నా డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ధరించడం, ఆ డ్రెస్సుల్లో నన్ను నేను చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను మోడలింగ్ను ఆస్వాదిస్తున్నాను’ అని చెబుతుంది 84 ఏళ్ల సువో షోర్. మనవడు రీఫ్ ఈ జంట ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నాడు. కరోనా కాలంలో ఈ వృద్ధ దంపతులు ప్రజలలో ఆశా కిరణాన్ని సృష్టిస్తున్నారని సోషల్ మీడియా అభిమానులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. ఆరు దశాబ్దాల క్రితం ఈ జంట ఆరు దశాబ్దాల క్రితం తైవాన్లో వివాహం చేసుకుంది. ‘వయసు మీద పడింది, లాండ్రీని మూసేసి విశ్రాంతి తీసుకోవాలని చాలాసార్లు ఆలోచించాను, కానీ మిషనరీ మీద ఈ పని సులభంగా చేయవచ్చులే అని ఆలోచనను మానుకున్నాం. పని మొదలెడితే తక్కువ కష్టమే అనిపిస్తుంది. అందువల్ల లాండ్రీని మూసివేయకూడదనుకున్నాం. వృద్ధాప్యంలో అలసటతో కూర్చోవడానికి బదులు చేతనైన పనులు చేసుకుంటేనే మంచిది. పని చేస్తూ ఉంటే వృద్ధాప్యంలో పుట్టుకొచ్చే అనేక శారీరక మానసిక సమస్యలను నివారించవచ్చ’ని చెంగ్ చెబుతున్నాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు ధరించడం ద్వారా కూడా ఫ్యాషన్ని చూపించవచ్చని నిరూపిస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం వీళ్లు ‘ఎన్విరాన్మెంటల్ ఫ్యాషన్‘ ను ప్రోత్సహించడంలో బిజీగా ఉన్నారు. -
కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే
ఫ్లోరిడా : ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 12లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారీన పడగా.. మృతుల సంఖ్య 65వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన వృద్ధ దంపతులు కరోనా బారీన పడి ఆరు నిమిషాల వ్యవధిలో మృతి చెందడం విషాదాంతంగా మారింది. ఈ విషయాన్ని వారి కొడుకు బడ్డీ బేకర్ ట్విటర్లో షేర్ చేస్తూ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్ల హృదయాన్ని హత్తుకుంటుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన స్టువర్ట్ బేకర్(74), అడ్రియన్ బేకర్(72)లు 51 ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతూ వస్తున్నారు. ఇంతలో కరోనా వారి జీవితాలను తలకిందులు చేసింది. మార్చి మధ్యలో స్టువర్ట్ దంపతులు అస్వస్థతకు గురవడంతో బడ్డీ వారిని హోం క్వారంటైన్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత బడ్డీ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో ఈ విషయం తన తల్లికి చెప్పకుండా స్టువర్ట్ను ఆసుపత్రికి తరలించారు. కాగా స్టువర్ట్ పరిస్థితి విషమంగా మారడంతో బడ్డీ తన తల్లి అండ్రియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అండ్రియా ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించడంతో ఆమెను కూడా వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స కొనసాగించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి శరీరంలో అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో బడ్డీ వెంటనే తన తల్లిని తండ్రి స్టువర్ట్ ఉన్న రూంకు తీసుకొచ్చాడు. వారిద్దరు ప్రశాంతంగా ఉండాలని ఇద్దరికి వెంటిలేటర్ తొలగించారు. స్టువర్ట్, అండ్రియాలు ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్ననిమిషాల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. 2004లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ మూవీ నోట్బుక్లో నోహా, ఎల్లిస్ పాత్రదారులు సినిమా క్లైమాక్స్లో అచ్చం ఇదే తరహాలో 6 నిమిషాల్లోనే మరణిస్తారు. కాగా ఈ వీడియోను బడ్డీ బేకర్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ' మా తల్లిదండ్రులను కోల్పోయాననే విషయాన్ని అంత తేలికగా మరిచిపోలేకపోతున్నా.... కరోనా వైరస్ను ఫ్రాణాంతకంగా భావించి ఎప్పటికప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించండి.. ఇంట్లోనే ఉంటూ మీ ప్రాణాలను కాపాడుకోండి' అంటూ క్యాప్షన్ జత చేశాడు. In loving memory of my mom and dad- please make the tough and right choice and help stop the spreading of this virus. pic.twitter.com/FqVEWjdscq — Buddy Baker (@ESG_Baker) March 31, 2020 -
మనసు చలించింది...
సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్ (సప్తగిరి చిన్న) ఫేస్బుక్లో హలో యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్ ద్వారా చూసిన ఫీడ్ ది హంగర్ ఫర్ కేఎస్కే ఆర్గనైజేషన్ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్ను ఫోన్ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్కే టీమ్ ఎవరు వీరు.. హైదరాబాద్లోని రివ్లోన్ కాస్మోటిక్ కంపెనీలో సౌత్ ట్రైనర్గా కావ్య, సేల్స్ మేనేజర్గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు -
వైభవంగా వృద్ధ జంటకు వివాహం
తిరువనంతపురం : ప్రేమకు, వివాహానికి వయసుతో పనిలేదని మనసులు కలిస్తే మనువాడటంలో తప్పులేదని ఓ వృద్ధ జంట ప్రపంచానికి చాటింది. త్రిసూర్ జిల్లాలోని రామవర్మపురంలోని ఓల్డేజ్ హోం ఈ జంట వివాహానికి వేదికైంది. ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్న కొచానియన్ మేనన్ (67), లక్ష్మీ అమ్మాళ్ (65)ల మధ్య చిగురించిన స్నేహం లేటు వయసులో పరిణయానికి దారితీసింది. కేరళ వ్యవసాయమంత్రి వీఎస్ సునీల్ కుమార్ సమక్షంలో శనివారం వీరు ఒకటయ్యారు. ఎర్ర చీర ధరించి, ఆభరణాలతో లక్ష్మీ అమ్మాళ్ పెళ్లి కుమార్తెగా ముస్తాబు అవగా, కొచానియన్ మేనన్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. వృద్ధ జంటకు వివాహాన్ని వేడుకగా జరిపించామని, శుక్రవారం మెహందీ ఫంక్షన్ కూడా నిర్వహించామని ఓల్డేజ్ హూం సూపరింటెండెంట్ జయాకుమార్ చెప్పారు. వివాహ మంటపాన్ని ఏర్పాటు చేశామని ముహుర్తానికి అనుగుణంగా శనివారం ఉదయం 11 గంటలకు వారు పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అతిధులకు ఘనంగా విందు ఏర్పాట్లు చేపట్టడంతో వివాహ వేడుక ముగిసిందని ఆమె చెప్పుకొచ్చారు. కాగా వీరికి 30 ఏళ్ల నుంచి పరిచయం ఉండగా గత కొన్నేళ్లుగా టచ్లో లేకపోవడం గమనార్హం. 21 ఏళ్ల కింద మరణించిన లక్ష్మీ అమ్మాళ్ భర్త వద్ద కొచానియన్ అసిస్టెంట్గా పనిచేసేవారు. భర్త మరణం అనంతరం బంధువుల వద్ద ఉన్న లక్ష్మీ అమ్మాళ్ రెండేళ్ల కిందట ఓల్డేజ్ హోంలో చేరారు. రెండు నెలల కిందట అదే కేర్ హోంలో కొచానియన్ ఆశ్రయం పొందారు. ఇక లేటు వయసులో తాము వైవాహిక బంధంతో ఒకటవడం ఆనందంగా ఉందని, వయసు మీద పడటంతో తాము ఎంతకాలం కలిసి ఉంటామనేది తెలియకపోయినా ఒకరి కోసం మరొకరు ఉన్నామనే భావనతో ఉన్నంతవరకూ సంతోషంగా జీవిస్తామని లక్ష్మీ అమ్మాళ్ చెప్పారు. -
పనితీరు..ప్చ్ !
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘సారూ.. ఆ ఎస్ఐ మమ్మల్ని పట్టించుకోవడం లేదయ్యా.. తమరే మాకు న్యాయం చేయాలి..’ అంటూ ఓ వృద్ధ దంపతులు మొరపెట్టుకోగా.. ‘ఎస్పీ గారూ.. మా స్థలం కబ్జా చేసినోళ్లకు సీఐ వత్తాసు పలికి, ఫిర్యాదిచ్చిన మా మీదనే బెదిరింపులకు దిగుతున్నాడంటూ...’ మరికొందరు బాధి తులు వాపోతున్న పరిస్థితి. పోలీసులు బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. తక్షణమే వారి సమస్యలపై స్పందించాలని జిల్లా ఎస్పీ పదేపదే నేర సమీక్షల్లో పోలీసు అధికారులకు క్లాస్ పీకుతూనే ఉన్నారు. అయితే, కొన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు మాత్రం కనీసం, చీమకుట్టినట్లైనా ఉండటం లేదు. అచ్చంగా కాసులొచ్చే కేసులపైనే మక్కువ చూపుతూ ... అన్యాయం జరిగిన వారిని సైతం బెదిరిస్తూ పబ్బం గడుపుకోవాలని పలువురు ఎస్ఐలు, సీఐలు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు చేస్తున్న ‘అవినీతి’ వ్యవహారాలు అందరికీ చెడ్డపేరు తెస్తున్నాయని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. మరికొన్ని పోలీస్స్టేషన్లలో అయితే అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తూ అక్రమ దందాకు సహకరిస్తూ భారీ స్థాయి అవినీతికి తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పనితీరు బాగుండని పోలీస్ స్టేషన్ అధికారులపై గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజిలాల్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్లు దశలవారీగా చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయినా క్షేత్రస్థాయిలో íపోలీస్ అధికారుల పనితీరులో మార్పు రాకపోవడంపై ఎస్పీ సీరియస్గా ఉన్నారు. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ‘స్పందన’ కార్యక్రమంలో అవినీతి పోలీస్ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో కొందరు సీఐలకు ఇంకా పాత ప్రభుత్వ వాసనలు పోయినట్లుగా లేవు. ఇప్పటికీ టీడీపీ నేతల అక్రమ దందాలకు సహకరిస్తూనే ఉన్నారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్పీలు, కలెక్టర్లకు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే జిల్లాలో గతంలో మాదిరిగా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. అయితే కొందరు కిందిస్థాయి పోలీస్ అధికారులు మాత్రం అక్రమార్కులతో చేతులు కలిపి భారీ స్థాయి అవినీతికి తెరతీసినట్లు ఎస్పీ దృష్టికి వచ్చింది. జిల్లాలో ఇటీవల వివిధ స్టేషన్ల పరిధిలోని ఎస్సై, సీఐ స్థాయి అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారితో అమర్యాదగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తిస్తూ పోలీస్శాఖకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారులే వాటికి విఘాతం కల్పించేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్న పోలీసు అధికారులపైనే ఉన్నతాధికారులకు అధికంగా ఫిర్యాదులందుతున్నాయి. స్పందన కార్యక్రమంలో ఒకే స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులపై రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. అవినీతి ‘ఛీ’ఐల ఏరివేతకు రంగం సిద్ధం: జిల్లాలో పోలీస్ అధికారుల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. కొందరు సీఐలు అక్రమార్కులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. పోలీస్ స్టేషన్లలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రైటర్లందరిపైనా బదిలీ వేటు వేసిన ఎస్పీ ఇప్పుడు ఎస్సై, సీఐలపై సీరియస్గా దృష్టి సారించారు. చీరాల సబ్డివిజన్ పరిధిలో ఓ సీఐ, ఒంగోలు సబ్డివిజన్ పరిధిలోని ఇద్దరు సీఐలు, దర్శి, మార్కాపురం, కందుకూరు పోలీస్ సబ్డివిజన్ల పరిధిలో ముగ్గురు సీఐలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఎస్పీ రహస్య విచారణలో తేలడంతో అందుకు సంబంధించి ఆధారాలతో సహా నివేదిక సిద్ధం చేసి ఐజీకి పంపేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అక్రమ వ్యవహారాలకు పాల్పడే వారితో కొందరు సీఐలు ముందుగానే మాట్లాడుకుని పోస్టింగ్ల కోసం ప్రయత్నిస్తున్న వైనం ఎస్పీ దృష్టికి రావడంతో అలాంటి వారికి జిల్లాలో ఎక్కడా పోస్టింగ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇటీవల సింగరాయకొండ సర్కిల్ పోస్టింగ్ కోసం నెల్లూరులో పని చేస్తున్న ఓ సీఐ చేసిన ప్రయత్నాలకు పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. తనకు పోస్టింగ్ వేయిస్తే మీరు ఏం చేసినా పట్టించుకోనంటూ సదరు సీఐ కొందరు అక్రమార్కులతో ఒప్పందం చేసుకున్న విషయం ఎస్పీ, ఐజీ దృష్టికి రావడంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సీసీఎస్లో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పోలీస్శాఖ నిర్ణయాలకు సంబంధించిన ఇంటి గుట్టును కొందరు పోలీస్ అధికారులు బయటకు చెబుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ వారిపై రహస్య విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అవినీతికి పాల్పడే వారితోపాటు, పనితీరు బాగాలేని ఎస్సైలు, సీఐల జాబితాను తయారు చేసిన ఎస్పీ వారిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. -
వృద్ధ దంపతుల దారుణహత్య
కర్ణాటక, కృష్ణరాజపురం: ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు దారుణహత్యకు గురైన ఘటన గురువారం మహదేవపుర పరిధిలోని గరుడాచార్యపాళ్యలో వెలుగు చూసింది. మండ్య జిల్లా కేఆర్ పేటకు చెందిన చంద్రేగౌడ(65),లక్ష్మమ్మ(55) చాలాకాలంగా గరుడాచార్యపాళ్యలో నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన చంద్రేగౌడ చీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. దంపతులకు సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు ఇటీవల వివాహం చేశారు.దత్త కుమార్తె మినహా ఎవరూ దంపతులను చూడడానికి రాకపోవడంతో ఒం టరిగానే ఉంటున్నారు.ఈ క్రమంలో గురువారం ఇంట్లో నీటి ట్యాంకు నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నా దంపతులు బయటకు రాకపోవడాన్ని గమనించిన ఇంటి పక్కనున్న వ్యక్తులు కిటికీలోనుంచి చూడగా వారు హత్యకు గురైనట్లు వెలుగుచూసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దంపతుల ఒంటిపై నగలు అలాగే ఉండడం, ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు,నగలు చోరీకి గురి కాకపోవడం, బీరువాలో పత్రాల కోసం వెతికినట్లు ఆధారాలు లభించడంతో ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రేగౌడ ఉంటున్నది సొంతిల్లు కావడం, పైగా ఇంటిపై కట్టిన ఇళ్ల నుంచి ప్రతినెలా వేలాది రూపాయలు అద్దెలు వస్తుండడం, సొంతూరులో కూడా బాగానే ఆస్తులు ఉండడం, చీరల వ్యాపారంలో కూడా ఆదాయం బాగానే ఉన్నట్లు గమనించిన బంధువులు ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ భాస్కర్రావు, వైట్ఫీల్డ్ డీసీపీ అనుచేత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
నీ వెంటే నేను..
నాగేశ్వరరావు, నాగరత్నం దంపతులు. వీరుఅనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఈఎస్ఐఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో భర్త ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయన మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఆర్నాయక్ నగర్లోని నివాసానికి తరలించారు. భర్తను కడసారి చూసేందుకు భార్య ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో వస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఈ ఘటన కుటుంబసభ్యులనుకలచి వేసింది. కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో మృతి చెందిన భర్తను కడసారి చూపు చూసేందుకు అంబులెన్స్లో వస్తూ మార్గమధ్యలోనే భార్య మృతి చెందిన విషాద సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఆర్ నాయక్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (70), నాగరత్నం(65) దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మూడు రోజుల క్రితం భార్యాభర్తలిరువురూ అనారోగ్యానికి గురికావడంతో వారిని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నాగేశ్వరరావు మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్ఆర్ నాయక్నగర్లోని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు కడసారి చూపు కోసం నాగరత్నంను అంబులెన్స్లో ఇంటికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఓ వైపు తండ్రి.. మరో వైపు తల్లి ఒకేసారి కన్నుమూయడంతో వారి కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి చూపు కోసం వస్తున్న ఆమె భర్తను చూడకుండానే కన్ను మూయడంతో ఎస్ఆర్ నాయక్ నగర్లో విషాదం నెలకొంది. సుభాష్నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుని గా కొనసాగుతున్న గుబ్బల లక్ష్మీనారాయ ణ మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలంగౌడ్కు సన్నిహితుడు. వీరి మరణ వార్త విన్నవెంటనే శ్రీశైలంగౌడ్ అక్కడికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఎస్.వాసు, మాజీ కౌన్సిలర్ రంగారావు, పలు పార్టీల నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఆదర్శంగా నిలుస్తోన్న వృద్ధ దంపతులు
ఆడుతూపాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది.. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది.. అంటూ పాత సినిమా పాటలా వారి జీవితం హాయిగా సాగిపోతోంది.. ఎనిమిది పదుల వయసులోనూ వారి దాంపత్యంలో కాసింత కూడా ఆప్యాయత, అనురాగాలు తగ్గలేదు.. అంతేకాదు ఇప్పటికీ తమ రెక్కల కష్టంపైనే జీవిస్తున్నారు. మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.. మొదట్లో సీజనల్ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించారు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడికి వివాహం చేశారు. వారిపై ఆధారపడకూడదని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి : పాలకొల్లు వీవర్స్ కాలనీకి చెందిన బైరి ఆదినారాయణ అతని భార్య సీత మొదట్లో పట్టణంలో పలు కూడళ్లలో సీజనల్ పండ్ల వ్యాపారం చేసేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. వీరిని పెద్ద చేసి వివాహాలు చేశారు. అంతేకాదు వీవర్స్కాలనీలో 50 గజాల స్థలం కొనుగోలు చేసి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత మొక్క జొన్నపొత్తులు కాల్చి అమ్మడం వృత్తిగా చేసుకున్నారు. సీజనల్గా బత్తాకాయలు, సపోటా, రేగిపండ్లు, చిలగడదుంపడలను ఉడకపెట్టి విక్రయించడం, తేగలు అమ్మకాలు చేస్తూ జీవనం సాగించారు. ప్రస్తుతం వయోభారం మీదపడటంతో పొత్తులకే పరిమితం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి మొక్కజొన్న పొత్తులను తీసుకువచ్చి బొగ్గులపై కాల్చి అమ్మకాలు చేస్తూ రోజుకు రూ.400 వరకు సంపాదిస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కుమార్తెలు, కుమారుడిపై ఆధారపడకుండా కాలు చేయి పనిచేసినంత వరకు కష్ట పడుతూ జీవనం సాగించాలని అనుకుంటున్నామని ఆ వృద్ధ దంపతులు చెప్పిన మాటలు పలువురికి ఆదర్శం. ఏ వృత్తిలోనైనా కష్టపడితే ఫలితం నాకు 20వ ఏటలో సీతతో వివాహమయ్యింది. అప్పట్నుంచీ సీజనల్ పండ్ల వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడిని. సీత ప్రతి విషయంలోనూ చేదోడువాదోడుగా ఉంది. ఎవరిపైనా ఆధారపడకుండా కాళ్లు చేతులు పనిచేసేంతవరకు కష్టపడి జీవించాలనేది మా ఇద్దరి ఆలోచన. – బైరి ఆదినారాయణ, మొక్కజొన్నపొత్తుల వ్యాపారి, పాలకొల్లు రెక్కాడితే కాని డొక్కాడదు నాకు ఆదినారాయణతో వివాహమైన తర్వాత మా ఇద్దరి మాట ఒకటే అనుకుని ఆయన పండ్ల వ్యాపారం చేస్తే నేను కూడా చేదోడువాదోడుగా ఉండేదాన్ని. పిల్లలకు వివాహాలు చేశాం. సొంతిల్లు కట్టుకున్నాం. ఇదంతా రెక్కల కష్టమే. నాకు 65 ఏళ్ల వయసు వచ్చింది. ప్రస్తుతం మొక్క జొన్నపొత్తులను అమ్ముకుంటూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నాం. –బర్రె సీత, పాలకొల్లు ఆదినారాయణ, సీత దంపతులు -
సం'రాక్షసులు'
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల అత్తాపూర్కు చెందిన వృద్ధ దంపతులపై.. వారి కారు డ్రైవరే దాడి చేసిహతమార్చడం కలకలంసృష్టించింది. ♦ ఏడాది క్రితం బోడుప్పల్కు చెందిన మరో వృద్ధ దంపతులపై దాడి జరిగింది. ఒంటరిగా ఉంటున్న ఆ దంపతుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తే (కేర్ గివర్) దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆభరణాలు, డబ్బుతో ఉడాయించాడు. ♦ గతంలో మల్కాజిగిరికి చెందిన ఒంటరి దంపతులపై సైతం దొంగలు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. ఇలా తరచూ ఎక్కడో ఒకచోట సీనియర్ సిటిజన్స్పై దాడులుజరుగుతున్నాయి. వయోధికులే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఓవైపు దొంగల స్వైరవిహారం, మరోవైపు కారు డ్రైవర్లుగా, కేర్గివర్స్గా విధుల్లో చేరి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలాంటి చట్టబద్ధత లేని కొన్ని కేర్గివర్స్ ఏజెన్సీలుఒంటరి వృద్ధులు లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవసరాల నిమిత్తం కొడుకులు, కూతుళ్లు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్తుండడంతో ఇళ్లల్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. ఓవైపు వయోభారం వేధిస్తుండగా.. మరోవైపు ఈ తరహా దాడులు వారి భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య కొరవడిన సమన్వయం, వృద్ధుల విషయంలో చిన్నచూపు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వృద్ధుల భద్రత కోసం కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ‘సేవా’ దోపిడీ... గ్రేటర్లో 65 ఏళ్లు దాటిన వయోధికులు సుమారు 20లక్షల వరకు ఉండగా... వారిలో 3లక్షల మందికి పైగా ఒంటరి వృద్ధ దంపతులు, కొన్ని ఇళ్లల్లో భార్యను కోల్పోయిన భర్త లేదా భర్తను కోల్పోయిన భార్య సింగిల్గా ఉంటున్నారు. ఒకప్పుడు ఎంతో బాగా బతికినవాళ్లు, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించి నాలుగు డబ్బులు వెనకేసుకున్నవాళ్లు సైతం వృద్ధాప్యంలో కొద్దిపాటి చేయూత కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సి వస్తోంది. వివిధ రకాల అవసరాలను అందజేసే సంస్థలుగా, ఏజెన్సీలుగా, డ్రైవర్లుగా చలామణి అయ్యే వ్యక్తుల మోసాలకు ఈ ఒంటరితనమే అవకాశంగా మారుతోంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడడం, అమ్మాయిలైతే పెళ్లిళ్లు చేసుకొని అత్తారిళ్లకు వెళ్లిపోవడంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒకవైపు వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆస్తిపాస్తులను కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో వివిధ రకాల సహాయం అందజేసే నెపంతో ఇళ్లల్లో చేరుతున్న వాళ్లు చివరకు డబ్బు, నగల కోసం వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. ఆర్థికంగా మోసాలకు పాల్పడుతున్నా రు. సేవల రూపంలో భారం మోపుతున్నారు. చట్టబద్ధతేదీ? కేర్, అపోలో లాంటి పెద్ద ఆసుపత్రులు, నైటింగేల్ లాంటి కొన్ని సంస్థల ఆధ్వర్యంలో నడిచే కేర్గివర్స్ ఏజెన్సీలు మినహాయించి... నగరంలో పదుల సంఖ్యలో విస్తరించుకున్న చిన్నాచితక ఏజేన్సీలు అనారోగ్యంతో బాధపడుతున్న ఒంటరి వృద్ధులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయి. ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేని కేర్గివర్స్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దండుకుంటున్నాయి. ఒక్కో కేర్గివింగ్ సర్వీసుకు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 పైగా వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఇలాంటి సంస్థలకు ఏవిధమైన చట్టబద్ధత కూడా ఉండదు. వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలోనూ ఎలాంటి రికార్డులు ఉండవు. నిజానికి సొసైటీల చట్టం ప్రకారం నమోదు చేసుకున్న ఏజెన్సీలు, సంస్థలు తాము అందజేసే వివిధ రకాల సర్వీసుల వివరాలను వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు తెలియజేయాలి. అదే సమయంలో వృద్ధుల కోసం నియమించిన కేర్గివర్స్ వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందజేయాలి. కేర్గివర్స్ ఆధార్, ఫొటో, అడ్రస్ తదితర వివరాలను పోలీసులకు ఇవ్వాలి. మరోవైపు పోలీసులు కూడా తమ స్టేషన్ పరిధిలోని ఒంటరి వృద్ధుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకోవాలి. ఇంట్లో ఉండే డ్రైవర్లు, పనివాళ్లు, కేర్గివర్స్ తదితరుల జాబితాను సేకరించాలి. కానీ ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇందుకు కారణం. కొద్ది రోజుల క్రితం వృద్ధుల సంక్షేమం, భద్రతపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు, హెల్పేజ్ ఇండియా సంస్థతో పాటు పోలీసు ఉన్నతాధికారులు వివిధ అంశాలపై చర్చించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు సపర్యలు చేసేందుకు కేర్గివర్స్ ఏజెన్సీలను ఆశ్రయిస్తే పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని... ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేని వాళ్లను నియమించి అక్రమ వసూళ్లకు దిగుతున్నారని పలువురు సీనియర్స్ ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఊరు, పేరు లేని వ్యక్తులు కేర్గివర్స్గా చేరి డబ్బు కోసం వృద్ధులపై దాడులకు తెగబడుతున్నారని పలు సంస్థలు అధికారుల దృష్టికి తీసుకొచ్చాయి. వృద్ధుల భద్రతకు సంబంధించిన అంశాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. నియంత్రణ అవసరం... ♦ కేర్గివర్స్గా చేరేవాళ్లు వృద్ధులకు వేళకు మందులు, ఇంజెక్షన్లుఅవసరమైతే సెలైన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వారికిమెడికల్ పరిజ్ఞానం అవసరం. నర్సింగ్ సేవల్లో కనీసం6 నెలల శిక్షణ ఉండాలి. ♦ కానీ చాలా సంస్థలు ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేని వాళ్లను నియమిస్తున్నాయి. కొద్దిపాటిఅవగాహన కల్పించి పెద్ద ఎత్తున దండుకుంటున్నాయి. ♦ కేర్గివర్స్ ఏజెన్సీలు, వాటిలో పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి రికార్డులు లేవు. చార్జీలపైన నియంత్రణ లేదు. ♦ వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు నియంత్రణ చర్యలు చేపట్టాలి. ♦ గ్రేటర్లోవయోధికులు (65 ఏళ్లకు పైబడినవారు): దాదాపు 20 లక్షలు ♦ మొత్తం జనాభాలో వీరి శాతం: 15శాతం ♦ ఒంటరి వృద్ధులు: 3లక్షలకు పైగా -
సీఎం సారూ.. కనికరించండి
సాక్షి, బంజారాహిల్స్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను.. ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోయింది.. అనేక ఏళ్లుగా ఎలాగోలా బతుకు బండి లాగాను..ఇప్పుడు వృద్ధుడినై పోయా..ఏదో ఒక ఉపాధి చూపండి అని ఓ కుటుంబం సీఎం కోసం తెలంగాణ భవన్ వద్ద కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తోంది. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ వద్ద సీఎం కేసీఆర్ను కలవాలని వచ్చారు. రోడ్లపైనే పడుకుంటున్నారు. తెలంగాణ భవన్లో ఎవరినీ కలవడానికి అక్కడి సిబ్బంది కనికరించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన షేక్ ఖాసిం దీనావస్థ ఇది.. ఆ వివరాలు ఖాసీం మాటల్లోనే..1980 నుంచి 1999 వరకు హోంగార్డుగా విధులు నిర్వహించా. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మెదడు దెబ్బతిని పక్షవాతం వచ్చింది. దీనికి తోడు మూర్ఛవ్యాధి వేధిస్తోంది. అప్పటికి పిల్లలు చిన్నవారు కావడంతో కుటుంబ పోషణ భారమైంది. ఉన్న ఒక్క కుమారుడు యాకుబ్పాషా సరిగ్గా మేజర్ అయ్యే సమయానికి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ ప్రమాదంలోనే తల్లి షేక్ మొగలబికి నడుం విరిగింది. ఉన్న ఒక్క కూతురు షేక్ మీరాబి ఆలనా పాలన చూసుకుంటున్నది. మా కుటుంబం పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతంగా ఉంది. ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో కూతురు మీరాబి తల్లిదండ్రుల పోషణ భారంతో ఒత్తిడికి గురవుతోంది. నా హోంగార్డు ఉద్యోగాన్ని గానీ, పోలీసు శాఖలో లేదా ఏ ఇతర శాఖలోనైనా మరో జాబ్ గానీ కూతురు మీరాబికి ఇవ్వాలని కోరుకుతున్నా. ఈ నెల 8న హోంమంత్రిని కలవడానికి సచివాలయానికి వెళ్లగా కుదరలేదు. అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. తెలంగాణ భవన్లో సీఎంను కలిసేందుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. మాతో పాటు కూతురు మీరాబి తన చిన్నారితో చెట్ల కింద నిద్రించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా స్పందించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు. -
మేం సంపాదించింది తీసుకోండి..మేం వెళ్తున్నాం
సాక్షి, కర్నూలు : ‘‘ మేం సంపాదించింది తీసుకోండి.. అప్పులు కట్టుకోండి.. మా గురించి ఆలోచించకుండా జాగ్రత్తగా జీవించండి..మేం వెళ్తున్నాం’’ అంటూ ఒక రిటైర్డ్ పోస్ట్మాస్టర్, ఆయన సతీమణి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజాచార్యులు..పోస్ట్మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య జయమ్మ గృహిణిగా ఉంటోంది. వీరికి భారతి, విష్ణుప్రియ, సువర్చల, గాయత్రి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వివాహం అయిన తరువాత భర్త మృతి చెందడంతో తల్లిదండ్రులతోనే దుస్తుల దుకాణం ఏర్పాటు చేయించుకొని విష్ణుప్రియ జీవనం సాగిస్తోంది. మిగిలిన ముగ్గురు కుమార్తెలు వారి భర్తల ఇళ్ల దగ్గర ఉన్నారు. విష్ణుప్రియతో శనివారం ఉదయం తెల్లవారు జామున రామాంజాచార్యులు, జయమ్మ దంపతులు గొడవ పడ్డారు. లెటర్ రాసి పెట్టి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. జయమ్మ పుస్తెల గొలుసు సైతం ఇంట్లోనే పెట్టి వెళ్లారు. ఆ పుస్తెల గొలుసు అమ్ముకుని నలుగురు కూతుళ్లు సమానంగా పంచుకోండని లెటర్లో రాశారు. ఎవరెవరికి అప్పు ఇచ్చారో.. అప్పులిచ్చిన వారు ఎవరో లేఖలో పేర్కొన్నారు. తమ పేరు మీద ఉన్న 6 ఎకరాల పొలాన్ని, ఇంటి స్థలాన్ని నలుగురు కుమార్తెలు సమానంగా పంచుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వృద్ధ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కర్నూలు తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వడదెబ్బ తగిలి దంపతులు మృతి
-
25 ఏళ్లు.. జవాన్ జాడ లేదు
నెలమంగల తాలూకా ఇస్లాంపురలో మహమ్మద్ ఖలందర్ ఇంటికెళ్తే తుపాకీ, పోలీస్ యూనిఫాంలో ఉన్న యువకుని ఫోటో, కట్టలకొద్దీ పాత ఉత్తరాలు కనిపిస్తాయి. ఇద్దరు వృద్ధ దంపతులు దీనంగా తమ కొడుకు ఆచూకీ చెప్పడానికి వచ్చారేమో.. అని చూస్తారు. వారు అలా ఎదురుచూడని రోజంటూ లేదు. ఒకటీ రెండు రోజులు కాదు.. ఏకంగా 25 ఏళ్ల నుంచి తప్పిపోయిన చెట్టంత కొడుకు కోసం నిరీక్షిస్తున్నారు. అలాగని అతడు మామూలు వ్యక్తి కూడా కాదు, సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆ పండుటాకులు తెలిపారు. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: దేశసేవ చేస్తానని వెళ్లిన కుమారుడు అదృశ్యమైపోయాడు. కన్నబిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు ఆనాటి నుంచి కన్నీరు పెట్టని రోజు లేదు. వెతికి పెట్టాలని పై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ఇలా ఎదురుచూసి ఎదురుచూసి పాతికేళ్లు గడిచిపోయాయి. బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా ఇస్లాంపురం గ్రామం నివాసులైన మహమ్మద్ ఖలందర్, మెహరున్నిసా దంపతుల దీనగాథ ఇది. నాగాల్యాండ్లో అదృశ్యం వివరాలు.. వారి కుమారుడు మహమ్మద్ రఫి పాతికేళ్లుగా అనూహ్యంగా కనబడకుండాపోయిన జవాన్. మహమ్మద్రఫి 1990లో సీఆర్పీఎఫ్లో ఉద్యోగంలో చేరాడు. 117 బెటాలియన్లో భాగంగా రాజస్థాన్ , పంజాబ్, ఢిల్లీ, కోల్కతా తదితర ప్రాంతాల్లో నాలుగేళ్లు పనిచేశాడు. 1994లో నాగాల్యాండ్లో పనిచేస్తూ కనబడకుండాపోయాడు. ఆనాటి నుంచి కు మారుని గురించి ఎటువంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులకు, కమాండర్లకు ఫిర్యాదుచేసినా ఏం లాభం లేకుండాపోయిందని వృద్ధ దంపతులు బోరుమంటున్నారు. ఉగ్రవాదుల దాడి జరిగి జవాన్లు మరణించిన ప్రతిసారీ ఆ తల్లితండ్రులు కన్నబిడ్డను గుర్తుచేసుకుని రోదిస్తున్నారు. కనీసం తమ బిడ్డ బ్రతికున్నాడో లేడో అనే సమాచారమైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. తమ బిడ్డ డ్యూటీలో ఉండగా రాసిన ఉత్తరాలను చూసుకుంటూ కాలం గడుపుతుంటారు. -
వృద్ధ దంపతులను హతమార్చిన తల్లీ, కొడుకు
సాక్షి, న్యూఢిల్లీ : వృద్ధ దంపతులను డబ్బు కోసం కిరాతకంగా హతమార్చిన తల్లీ కొడుకులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో నివసించే దంపతులను వారి ఇంట్లో పనిచేసే మహిళ, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేసి రూ 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. ఈనెల 26న వృద్ధ దంపతులు వీరేందర్ కుమార్ ఖనేజా (77) సరళ (72)లు కనిపించడం లేదంటూ సమాచారం అందుకున్న పోలీసులు వారి ఫ్లాట్ను బలవంతంగా తెరిచి చూడగా విగత జీవులుగా పడిఉన్నారు. ఫ్లాట్కు లోపలివైపు తాళం వేసిన దుండగులు వృద్ధ దంపతుల ఫోన్లను స్విచాఫ్ చేశారు. బాధిత దంపతుల కుమారుడు డాక్టర్ అమిత్ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా వారి ఇంట్లో పనిచేసే మహిళను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించి వివరాలు రాబట్టారు. నిందితురాలు తన కుమారుడితో కలిసి డబ్బు కోసమే వృద్ధ దంపతులను హతమార్చినట్టు అంగీకరించింది. జనవరి 18న వీరేందర్ ఖనేజా ఇంటి లాకర్లో డబ్బు పెడుతున్నప్పుడు గమనించిన నిందితురాలు అదే రోజు మద్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తన కుమారుడిని ఇంట్లోకి రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఓ సినీమాలాంటి కథ
ఇలాంటి కథని రాస్తే చాలామంది నవ్వుతారు. అలాంటి కథలు రాసి ఒప్పించిన ఇద్దరు మహాను భావులు నాకు గుర్తొస్తారు –థామస్ హార్డీ (ది మేయర్ ఆఫ్ కాస్టర్ బ్రిడ్జ్), ఆంటన్ చెఖోవ్. అయినా ఇది విచిత్రమైన, అనూహ్యమైన కథ. నిజానికి కన్నూరు ప్రాంతంలో జరిగిన ఈ కథని వాళ్ల మేనకోడలు శాంతా కావుంబాయి నవలని రాసింది. అది 1946 ప్రాంతం. బ్రిటిష్ పాలనలో కేరళలో కన్నూరు ప్రాంతంలో భూస్వాముల ఆగడా లను వ్యతిరేకిస్తూ ముమ్మరంగా తిరుగుబాటు జరు గుతున్న సామాజిక–రాజకీయ నేపథ్య విప్లవాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ కథని అతని మేనకోడలు శ్రీమతి శాంత నవలని రాసింది. ఆ తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన ఓ ఉపకథ ఇది. నారాయణన్ పెద్ద విప్లకారుడేం కాదు. కనీసం తన తండ్రిలాగా శాశ్వతమైన కీర్తిని ఆర్జించిన అమ రవీరుడూ కాదు. ఇ.కె. నారాయణన్ నంబియార్ 30 ఏళ్ల వాడు. తండ్రితో పాటు ఈ తిరుగుబాటు ఉద్య మంలోకి దూకాడు ఆవేశంగా. అప్పుడే అతనికి పెళ్ల యింది. భార్య శారద దూరపుబంధువుల అమ్మాయి. అప్పటికి భార్య శారద 13 ఏళ్ల పిల్ల. నిజానికి వాళ్లి ద్దరూ ఆనాటికి నోరిప్పి కబుర్లు చెప్పుకోలేదు– చెప్పుకోవడం తెలీదు కనుక. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరూ విడిపోయారు. అక్కడి రైతులు బ్రిటిష్ యాజమాన్యం, భూకామందులను ఎదిరిస్తూ జరిగే ఈ తిరుగుబాటులో చేతులు కలిపారు. డిసెంబర్ 29న నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్తో కలిసి తాలియన్కి వెళ్లాడు. దూరపు కొండల సమీ పంలో ఉన్న కారాకట్టిడం నాయనార్ అనే భూస్వామి మీద తిరుగుబాటుకి బయలుదేరిన వందలాది మందితో వీరూ ఉన్నారు. భూస్వామి ఆగడాలను తుదముట్టించి, అతని ఆట కట్టించాలని వారి ప్లాను. కానీ వీళ్ల ప్రయత్నం కార్యరూపం దాల్చే లోగా బ్రిటి ష్వారి మలబార్ స్పెషల్ పోలీసు బలగం వీరిని చుట్టుముట్టింది. ఆ తిరుగుబాటుదారుల గుంపుమీద బుల్లెట్ల వర్షం కురిపించింది. అయిదుగురు అక్కడిక క్కడే చనిపోయారు. ఎందరో గాయపడ్డారు. నంబి యార్ తండ్రితో తప్పించుకుని అజ్ఞాతంలోకి మాయ మయ్యాడు.కానీ, పోలీసులు అతని ఇంటిమీద దాడిచేసి, స్త్రీలను హింసించి వారి ఉనికి కూపీ లాగారు. శారద అభం శుభం తెలియని పిల్ల కనుక ఆమెని వదిలి పెట్టారు. ఈ సంఘటన తర్వాత కుటుంబం ఆమెని పుట్టింటికి పంపించేసింది. రెండు నెలలు పోలీసు ఆ కుటుంబాన్ని రాసి రంపానబెట్టి, ఈ యజమానుల ఆచూకీ పట్టుకుని ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సంవత్సరాలు గడిచాక ఈ ఖైదీలను అధికారులు కన్నూరు సెంట్రల్ జైలు నుంచి వియ్యూరు అటు తర్వాత సేలం జైళ్లకు బదిలీ చేశారు.1950 ఫిబ్రవరి 11న రామా నంబియార్ జైల్లోనే జరిగిన కాల్పుల్లో తుపాకీ గుండుకి మరణించాడు. కొడుకు 16 సార్లు ఈ కాల్పులకు గురి అయ్యాడు. అయినా బతికాడు. చచ్చిపోయాడని అంతా నిర్ధారిం చుకున్నారు. కానీ శారదకేమో అతను బతికే ఉంటా డని ఓ నమ్మకం. సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. బంధువులు ఆమెకి బలవంతంగా మరో పెళ్లి చేశారు. మరో ఎనిమిదేళ్లకు నారాయణన్ని విడుదల చేశారు. ఎక్కడా పెళ్లాం ఆచూకీ లేదు. అతనూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే శారద ఎక్కడో ఒకచోట బతికే ఉన్నదని అతని ఊహ. సంవత్సరాల తర్వాత శారదకు కొడుకు పుట్టాడు. పేరు భగవాన్ పరాస్సినిక్కడవు. ఈ కుర్రాడు తన తల్లి ఎప్పుడో తన చిన్నతనంలో జరి గిన సంఘటనల గురించి తల్చుకోవడం విన్నాడు. ఈ మేనకోడలు– అంటే నవలా రచయిత్రి శాంత ఈ కుర్రాడిని కలిసింది. నారాయణన్ గురించి చెప్పింది. వాళ్లిద్దరినీ ఒకసారి కలపాలని భగవాన్ అనుకు న్నాడు. (‘లవకుశ’లాగ ఉన్నదా) ఎన్నాళ్ల తర్వాత? 72 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నారాయణన్ తొంభయ్యో పడిలో ఉన్నాడు. శారద దాదాపు డెబ్బ య్యోపడి. భగవాన్ ఇంట్లో వారిద్దరూ కలిశారు. తమ స్వాధీనంలో లేని కారణాలకి వారిద్దరూ జీవి తాల్లో దూరమయ్యారు. వైవాహిక జీవితాలూ అలాగే సాగాయి. అతని నిస్సహాయత ఆమెకి తెలుసు. ఆమె గురించి అతను జైల్లో అప్పుడప్పుడూ తలచుకుని ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడ్డాడేమో తెలీదు. అయితే ఒకరిమీద ఒకరికి దురభిప్రాయాలు లేవు. ఇద్దరూ జీవితం చేతుల్లో పావులు. వారి సమా గమం మొన్న డిసెంబర్ 26న. 72 సంవత్సరాల తర్వాత దూరమైన ఇద్దరు– ఆనాటి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పటి ఆమె కొడుకుకి నారాయణన్ ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటాడు? మేనకోడలు శాంత ఇప్పుడు మరో కొత్త నవలని రాయాలేమో?! గొల్లపూడి మారుతీరావు -
వృద్ధులను వేధిస్తే చర్యలు
లక్ష్మీపురం(గుంటూరు): తల్లిదండ్రులను వేధిం చడం, ఆస్తి ఇవ్వాలని దాడులకు పాల్పడితే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావు హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వాటిలో కొన్ని ఫిర్యాదులను పరిశీలిస్తే.. డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నారు బ్రిక్స్ వ్యాపారం చేసుకుంటూ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటా. కొరిటిపాడుకు చెందిన పిల్లి నాగేశ్వరరావు నాతో ఏడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆరు నెలల కిందట ఓ చిన్నపాటి వివాదంలో నాపై తప్పుడు నింద వేయడంతో పెద్దల సమక్షంలో మాట రాకుండా ఉండేందుకు వేరే వర్గీయులకు నగదు చెల్లించాను. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని నాగేశ్వరరావుకు కూడా తాను రూ.20లక్షలు వరకు అప్పుగా ఉన్నానని చెప్పి నిత్యం వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి నాగేశ్వరరావు తమ్ముడు మరి కొంత మందిని ఇంటికి తీసుకు వచ్చి రూ.20లక్షలు ఇవ్వాలని లేని పక్షంలోహతమార్చుతామని బెదిరింపులకు దిగాడు. నేను నాగేశ్వరరావుకు డబ్బు ఇవ్వాల్సిన పని లేక పోయినప్పటికి నా నుంచి నగదు బలవంతంగా తీసుకునే యత్నం చేస్తున్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశా. కలిశెటి మోహన్రావు, ఆర్టీసీ కాలనీఉద్యోగం పేరుతో టోకరా నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసి గుంటూరులో ముఠా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గత నెల ఓ పత్రికలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రకటన చూసి ఆ వ్యక్తికి ఫోన్ చేశాను. విజయవాడ ఎనికేపాడులో హెచ్పీఎల్లో ఉద్యోగం ఉందని కార్యాలయానికి రమ్మన్నారు. అక్కడ కాదని ఏలూరు తంగెళమూడి వద్ద ఉన్న కార్యాలయానికి రమ్మని చెప్పారు. వెళితే దరఖాస్తుకు రూ.6వేలు, ఉద్యోగం వచ్చిన తర్వాత రూమ్లో ఉండేందుకు రూ.14వేలు చెల్లించాల్సిందిగా చెప్పారు. దీంతో నగదు కట్టిన తర్వాత అక్టోబర్ ఒకటిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అనుమానం వచ్చి హెచ్పీఎల్ కంపెనీలో విచారణ జరిపితే ఎలాంటి ఉద్యోగాలు లేవని చెప్పారు. దిక్కుతోచక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాను.–నాగేంద్రరెడ్డి, సంగడిగుంట తమ్ముడు.. ఇంటినికాజేయాలని చూస్తున్నాడు పట్టాభిపురంలోని జార్జీ పేటలో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. తాము ఉన్న రేకుల ఇల్లు కారడంతో రేకులను తొలిగించి నూతన ఇంటి నిర్మాణానికి సిద్ధం అయ్యాం. అయితే సొంత తమ్ముడు వీరాస్వామి స్థలం తనదంటూ తమ్ముడు, అతని భార్య, కుమారుడు నిత్యం వేధింపులకు దిగుతూ బెదిరిస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చాను. –ఎం.నాగేంద్రం, తిరుపతి, తల్లి, కూతూరు -
కన్నవారిని గాలికి వదిలేసేవారికి గుణపాఠం
సాక్షి ప్రతినిధి, చెన్నై: జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు, తమకోసం ఏమీ ఉంచుకోకుండా కష్టించి కూడబెట్టిన ఆస్తి యావత్తూ అప్పగించేశారు ఆ వృద్ధ దంపతులు. అన్నీ పుచ్చుకున్న కనికరంలేని ఇద్దరు కుమారులు కన్నవారికి పట్టెడన్నం కూడా పెట్టకుండా కడుపుమాడ్చేశారు. కడుపున పుట్టకపోతేనేం జిల్లా కలెక్టరే కన్నబిడ్డగా మారి వృద్ధదంపతులను ఆదుకున్న ఉదంతం తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా కీళ్పెన్నాత్తూరు గ్రామానికి చెందిన కన్నన్ (75), పూంగావనం (63) దంపతులకు పళని (40), సెల్వం (37) అనే ఇద్దరు కుమారులున్నారు. ప్రభుత్వ బస్సులో కండక్టరుగా పనిచేసే పళని, భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసే సెల్వం వివాహాలు చేసుకుని వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. కన్నన్ తనకు చెందిన ఐదు ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు సరిసమానంగా పంచి రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆస్తులు దక్కగానే తల్లిదండ్రులకు కుమారులిద్దరూ అన్నంపెట్టడం మానివేశారు. అంతేగాక కుమారుడు సెల్వం తండ్రిపై తరచూ భౌతికదాడులకు పాల్పడసాగాడు. తామిచ్చిన ఐదు ఎకరాల నుంచి కనీసం 60 సెంట్ల భూమైనా ఇస్తే సాగుచేసుకుని పొట్టపోసుకుంటామని తల్లిదండ్రులు బతిమాలారు. ఇందుకు కుమారులిద్దరూ నిరాకరించారు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆ వృద్ధదంపతులు వారం రోజుల క్రితం జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రివెన్స్ సెల్కు హాజరై కలెక్టర్ కందస్వామికి మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఉమామహేశ్వరీ కుమారులిద్దరిని పిలిచి విచారించారు. 60 సెంట్ల భూమిని, జీవనా«ధారం కోసం కొంత సొమ్మును ఇచ్చేందుకు పెద్ద కుమారుడు పళని అంగీకరించగా, చిన్న కుమారుడు సెల్వం ససేమిరా అన్నాడు. ఆర్డీఓ నుంచి నివేదిక అందుకున్న జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ, పర్యవేక్షణ చట్టాన్ని ప్రయోగించి కన్నన్ తన కుమారులుకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి రిజిష్ట్రేషన్ను రద్దు చేయించారు. చిన్న కుమారుడు తన వాటాను మరొకరికి అమ్మగా ఆ రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేయించారు. సోమవారం వృద్ధ దంపతులను జిల్లా కలెక్టరేట్కు పిలిపించుకుని సదరు ఐదు ఎకరాల భూమిలో 2.15 ఎకరాలు కన్నన్ పేరున, 2.85 ఎకరాల భూమిని పూంగావనం పేరిట పట్టాగా ఇచ్చారు. కన్నబిడ్డలే నిర్ధాక్షిణ్యంగా వదిలివేయగా ఏ తల్లి కన్నబిడ్డో కలెక్టర్ గారు చొరవతీసుకుని మా కన్నీళ్లు తుడిచారని వృద్ధదంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కందస్వామి మాట్లాడుతూ వృద్ధాప్యానికిచేరుకున్న కన్నవారిని కంటికి రెప్పలా కాపాడడం కన్నబిడ్డల కర్తవ్యమని అన్నారు. కన్నవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి కన్నన్ ఉదంతం ఒక గుణపాఠం కావాలని చెప్పారు. ఇంత ముసలితనంలోనూ 60 సెంట్ల భూమిని సాగుచేసుకుని బతుకేందుకు సిద్ధమైన ఆ దంపతుల మనోధైర్యాన్ని కలెక్టర్ కొనియాడారు. సదురు ఐదెకరాల భూమిని వృద్ధ దంపతులు తమకిష్టమైన వారికి రాసిచ్చే అధికారాన్ని సైతం కట్టబెట్టినట్లు కలెక్టర్ వివరించారు. కన్నన్ దంపతుల్లా ఇంకా ఎవరైనా కష్టపడుతున్నట్లు ఫిర్యాదు అందితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. -
వృద్ధ దంపతులను నరికి చంపిన దుండగులు
-
ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నారు
కర్నూలు: కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాం. ఉన్న ఇంటిని కూడా పంచాలని పెద్ద కుమారుడు రామలింగం తీవ్రంగా కొట్టాడని గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఈరమ్మ, చిన్న ఈరన్న ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 సెల్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. నేరుగా వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామలింగం తీవ్రంగా కొట్టడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 56 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని... ♦ పుసులూరు గ్రామానికి చెందిన ఎర్రగొండ సుబ్బరామయ్య తన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కౌలు సొమ్ము ఇవ్వకుండా ఇబ్బంది పెడున్నాడని నంద్యాల మండలం బాపనపల్లెకు చెందిన వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. కౌలు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ♦ ఎన్ఐసీటీ కంపెనీ మెయిన్ బ్రాంచ్ బెంగుళూరులో ఉందని, సీఎస్పీ ఏజెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.75 వేలు వారి ఖాతాలో కట్టించుకుని మొబైల్ స్విచాఫ్ చేసి మోసగించారని గోనెగండ్లకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ♦ భర్త కృష్ణమూర్తి రెండు నెలల నుంచి కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలిపి కాపురాన్ని చక్కదిద్దాలని దేవనకొండ మండలం సింగపురం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ వేడుకున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి అయ్యిందని, నాటి అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ ఎస్పీ షేక్షావలి, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, హుసేన్పీరా, సీఐ ములకన్న తదితరులు పాల్గొన్నారు. -
మనమడిని చూడాలని..
పెరంబూరు: కొడుకు, కోడలు మనస్పర్థలతో విడిపోయారు. కనీసం మనమడిని చూడలేక వేదనతో తపించిన ఆ వృద్ధ దంపతుల కోరిక పదేళ్ల తరువాత ఎట్టకేలకు తీరింది. వివరాలు.. చెన్నై సమీపం సిట్లపాక్కంకు చెందిన సత్యశీలన్ మారిముత్తుకు 72 ఏళ్లు. ఈయన కొడుకుకు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు, కోడలు మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో కోడలు తన కొడుకును తీసుకుని అమెరికా వెళ్లిపోయింది.కొడుకు కూడా పని నిమిత్తం వేరే ఊరు వెళ్లిపోయాడు. అలా పదేళ్లు గడిచిపోయాయి. సత్యశీలన్మారిముత్తు దంపతులకు మనమడిని ఒక్కసారి చూడాలన్న ఆశ కలిగింది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట మనమడు చెన్నైకి వచ్చినట్లు తెలియడంతో వారి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేరన్న సమాధానంతో ఒక రోజు అంతా అక్కడే మండుటెండను కూడా లెక్క చేయకుండా ఉన్నా ఫలితం లేకపోయింది. దీంతో సత్యశీలన్ దంపతులు చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే.విశ్వనాధన్ను కలిసి తమ మనోవేదనను వెలిబుచ్చుకున్నారు. స్పందించిన పోలీస్ కమిషనర్ జెయింట్థామస్ జాయింట్ కమిషనర్ ముత్తుస్వామికి ఫోన్ చేసి ఎలాగైన సత్యశీలన్ మనమడిని పోలీస్స్టేషన్కు తీసుకురావాలని ఆదేశించారు. వారి కృషి ఫిలించి గురువారం ఆ దంపతుల మనుమడిని, కోడలిని పోలీస్ స్టేషన్కు వచ్చారు. మనవడిని తనివి తీరా చూసుకున్న వృద్ధ దంపతులు పోలీస్ కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాలుడు తన తల్లితో వెళ్లిపోయాడు. -
ఈ వయస్సులో ఆపరేషన్ ఎందుకు?
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: తనయుడు బెదిరిస్తున్నాడంటూ సర్పవరం గ్రామానికి చెందిన పిట్టా అప్పారావు, పిట్టా లక్ష్మి అనే వృద్ధదంపతులు చేసిన ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని సర్పవరం సీఐని ఆదేశించినట్టు ఎస్పీ విశాల్ గున్ని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని వారు కోరలేదన్నారు. పిట్టా అప్పారావుకు కిడ్నీ పాడైనందున ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం రూ.30 లక్షలు అవసరమవుతున్నందున తాను సంపాదించిన ఆస్తిలో కొంత ఆస్తిని అమ్మి వైద్యం చేయించుకోనేందుకు కుమారుడైన పిట్టా రవిని అడుగా ‘‘ఈ వయస్సులో ఆపరేషన్ ఎందుకు? ఇంకా ఎంత కాలం బతుకుతారు’’ అని అవమానపరిచినట్టుగా మాట్లాడాడని ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై వారి పరిస్థితిని అర్థం చేసుకొని చట్టప్రకారం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పవరం సీఐని ఆదేశించినట్టు తెలిపారు. ఆత్మహత్యలకు అనుమతివ్వడం అనే విషయం చట్టపరిధిలోకి రాదని, పైగా ఆత్మహత్య అనేది చట్టప్రకారం నేరమన్నారు. దీనిని ఎవరూ ప్రోత్సహించరని, ప్రోత్సహించినా నేరమేనన్నారు. -
ఆస్తికోసం కుమారుల అమానుషం
తెనాలి: ఆదరించకపోగా, చిత్రహింసలకు గురిచేస్తున్న కుమారుల అమానుషానికి ఓ వృద్ధ జంట భయంతో వణికిపోతోంది. ఉన్న ఇంటిని విక్రయించాలంటూ కొడుతున్న కుమారుల రెండురోజుల క్రితం పారిపోయిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’ సమావేశంలోనూ ఆర్డీఓ జి.నరసింహులుకు తన గోడు విన్నవించారు. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన 64 ఏళ్ల మర్రిపూడి నరసయ్య గతంలో సంగం డెయిరీలో బుల్ అటెండెంట్గా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. దేవతా విగ్రహాల తయారీలో కూలీగా ఒకరు, మరొకరు కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ కష్టార్జితంతో 74 సెంట్ల స్థలంలో కొంత మేర ఇల్లు నిర్మించుకున్నాడు. 2006లో కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం కుమారులను సంప్రదించగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి, వచ్చే డబ్బుతో చెల్లి పెళ్లి చేయాలని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే నరసయ్య తన కుమార్తె పెళ్లి చేశారు. ఉద్యోగవిరమణతో వచ్చిన డబ్బు ఖర్చయ్యాక కొడుకుల నైజం బయటపడింది. అప్పటికే పెళ్లిళ్లయిన ఇద్దరు కొడుకులు ఆ ఇంట్లోనే వేరు వంట ఆరంభించారు. చేసేదిలేక నరసయ్య దంపతులు కూడా వేరుగా వంట చేసుకుంటున్నారు. కొద్దిరోజులకు ఇంటిపైన రేకుల షెడ్డు వేసుకుని అందులోకి వెళ్లిపోయారు. ఇల్లు అమ్మి డబ్బు పంచాలంటూ కొడుకులు చేయిచేసుకొంటున్నారు. వృద్ధ దంపతులు నెలనెలా వచ్చే రూ.1000 పింఛన్ ఖర్చులకుచాలక కుమార్తెకు తెలిసినవాళ్ల దగ్గర అప్పులు తీసుకున్నారు. ఇందుకుగాను ఇల్లు అగ్రిమెంటు రాసి, ఆమె పేరిట తనఖా రిజిస్టరు చేశారు. అప్పట్నుంచి కొడుకులు మరింతగా వేధింపులు ప్రారంభించారు. పెద్ద కొడుకు నరసయ్య ఇంట్లో, రెండో కుమారుడు తెనాలిలో నెలకు రూ.4 వేల అద్దె ఇస్తూ నివసిస్తున్నారు. వారిద్దరూ తల్లిదండ్రులను పట్టించుకోలేదు. నరసయ్య భార్యకు ఆరోగ్యం బాగోలేక చిక్కిశల్యమైంది. బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలోనూ వారిని ఆదుకోగా ఇంటి విషయమై తరచూ గొడవలు పెట్టుకోవటం కొడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కొడుకులను పిలిపించిన పోలీసులు, ఎవరో పెద్దమనిషి ఫోను చేయటంతో కేవలం హెచ్చరికలతో సరిపెట్టి పంపించేశారు. రెండురోజుల క్రితం రెండో కొడుకు, ఇతర బంధువర్గం ఉండగానే పెద్దకొడుకు నరసయ్యపై దాడిచేశాడు. భయంతో పోలీసులను ఆశ్రయించిన నరసయ్య తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాడు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తనను రక్షించాలని కోరారు. తన ఇంటినుంచి బిడ్డలను ఖాళీచేయిస్తే వేరొకరికి అద్దెకు ఇచ్చి, కొంతయినా బాకీలు తీర్చుకుంటామని వేడుకున్నారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
అసలే వృద్ధాప్యం.. ఆపై అనారోగ్యం.. ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించదు. సాకేందుకు కొడుకు లేడు. నిత్యం వ్యవసాయ పనులు చేస్తూ.. వచ్చిన పింఛన్తో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురికి భారం కావద్దని పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నారు. ప్రతిరోజూ సాయినామస్మరణ చేసే ఆ దంపతులు.. బుధవారం రాత్రి కూడా జపించారు. గురువారం తెల్లారి చూసే సరికి విగతజీవులుగా కనిపించారు. ఈ విషాద సంఘటన సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో చోటుచేసుకుంది. సైదాపూర్(హుస్నాబాద్) కరీంనగర్ : వారికి వయస్సు మీద పడింది. ఎటూవెళ్లలేని పరిస్థితి. కనీసం బుక్కెడు వండుకుందామన్నా.. శరీరం సహకరించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఎవరికి భారం కావద్దనుకున్నారో..? ఈ లోకంలో ఇక తమకు పనిలేదనుకున్నారో..? గానీ ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. ప్రతిరోజూ సాయినామస్మరణ చేసే ఆ దంపతులు.. రాత్రికూడా జపం చేసుకుని.. గురువారం తెల్లారేసరికి శవాలై కనిపించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన కస్తూరి వెంకటనర్సయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాయి భక్తుడు కావడంతో కలిసిన ప్రతిఒక్కరినీ ‘సాయిరాం’ అనే పిలిచేవాడు. వీరికి ఒక్కగానొక్క కూతురు స్వరూపారాణి. ఆమెను 30 ఏళ్లక్రితం మేనల్లుడు రమణాచారికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు, బిడ్డను తన ఇంటి వద్దనే ఉంచుకుని తనకున్న భూమిని అప్పగించాడు. ఇన్నాళ్లు వెంకటనర్సయ్య చేతనైన పనులు చేసుకుంటూ.. పింఛన్ డబ్బులతో బతికారు. దంపతులిద్దరూ వృద్ధులయ్యారు. ఇటీవల లక్ష్మినర్సమ్మకు మోకాళ్లనొప్పులు అధికమయ్యాయి. వెంకటనర్సయ్యను భార్య ఆరోగ్యం ఇబ్బందిపెట్టింది. ఈక్రమంలో బుధవారం రాత్రి ఎప్పటిలాగే సాయినామస్మరణ చేసుకున్న దంపతులు వెంకటనర్సయ్య (85), లక్ష్మినర్సమ్మ (78) ఇంటి గడియ పెట్టకుండానే క్రిమిసంహారక మందు తాగారు. ఎప్పటిలాగే ఉదయం స్వరూపారాణి వచ్చిచూసే సరికి విగతజీవులుగా కనిపించారు. దీంతో బంధువుల రోధనలు మిన్నంటాయి. వృద్ధాప్యంలో ఇతరులకు భారం కావొద్దని, అప్పుడప్పుడు సన్నిహితులతో చెప్పిన వెంకటనర్సయ్య.. తాను అలాగే వెళ్లిపోయాడని స్థానికులు చర్చించుకున్నారు. స్వరూపారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైదాపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు. వెంకటనర్సయ్య,లక్ష్మినర్సమ్మ మృతదేహాలు -
వీడని మిస్టరీ !
సాక్షి, మచిలీపట్నం: గుడివాడలో ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. ఇందులో గుడివాడకు చెందిన పాత నేరస్తుడి హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది. అతనితో పాటు మరొకరి ప్రాత ఉందని గుర్తించి నిందితులను తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్లో అదుపులోకి తీసుకుని గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా ముందు హాజరు పర్చారు. నిందితులు దొరికినా హత్య ఎందుకు చేశారు? వీరి వెనుక ఎవరి ప్రమేయం ఉంది ? ఇంకా ఎవరిదైనా ప్రోద్బలం ఉందా ? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం పూర్తి స్థాయి వివరాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు... గుడివాడకు చెందిన పాత నేరస్తుడే.. గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్లో నివాసముంటున్న ప్రముఖ వ్యాపార వేత్త బొప్పన సాయిచౌదరి (70), భార్య నాగమణి (65) దంపతులు శుక్రవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం ఉదయం 8 గంటలకు వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి శనివారం ఉదయం నిందితులు పరారైన సమయంలో ఇంటికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, బంధువులు, ఉదయం వాకింగ్కు వెళ్లిన వారితో విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆధారాలు కనుగొన్న ప్రత్యేక బృందం ఈ హత్య కేసులో గుడివాడకు చెందిన పాత నేరస్తుడు జిల్లెల సురేష్ ప్రమేయం ఉందని గుర్తించారు. ఆయన సెల్ఫోన్ సిగ్నల్స్, తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్లో అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల సురేష్ను తమదైన శైలిలో విచారించగా.. తనతో పాటు సెల్వదొరై అలియాస్ శివ పాత్ర ఉందని చెప్పడంతో ఈ నెల 18వ తేదీ సాయంత్రం పెరంబదూర్లో అదుపులోకి తీసుకున్నారు. హత్యకు బీజం పడిందిలా.. గుడివాడకు చెందిన జిల్లెల సురేష్ తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్లోని ఓ మెకానిక్ షాప్లో పని చేసుకుంటున్నాడు. అతనికి సెల్వదొరై అలియాస్ శివతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సురేష్కు ఆర్థిక ఇబ్బందులున్న విషయాన్ని ఇద్దరూ చర్చించుకున్నారు. వాటి నుంచి గట్టెక్కేందుకు దొంగతనం చేయాలని నిర్దారించుకున్నారు. ఇందులో భాగంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గుడివాడకు వచ్చిన సురేష్ రాజేంద్రనగర్ 4వ లైన్లో ఉన్న బొప్పన సాయి చౌదరి, బొప్పన నాగమణి ఇంట్లో చోరీ చేయాలని భావించారు. అప్పటికే సాయి చౌదరి దంపతులు భోజనం ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించారు. ఇదే అదునుగా భావించిన వీరు రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో నుంచి గ్యాస్ కట్టర్ సహాయంతో కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బులు ఇతర వస్తువులు, టీవీతో పాటు కారును కూడా దొంగిలించారు. అనంతరం వారితో తెచ్చుకున్న ఆయుధాలతో హత్యకు తెగబడ్డారు. అనంతరం విజయవాడ మీదుగా తమిళనాడులోని పెరంబదూర్కి పరారయ్యారు. తమకు దొరికిన క్లూతో ప్రత్యేక బృందంతో తమిళనాడులోని పెరంబదూర్కి పోలీసులు వెళ్లారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. తమిళనాడు పోలీసుల సహాయంతో గుడివాడ టౌన్ సీఐ డీవీ రమణ, సిబ్బంది సహాయంతో పెరంబదుర్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం వారెంట్మీద మచిలీపట్నం తీసుకొచ్చి మీడియా సమావేశం అనంతరం గుడివాడ అడిషనల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు న్యాయమూర్తి ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించారు. నిందుతులు దొరికినా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ ముగియలేదని ? హత్య ఎందుకు చేశారు.? దీని వెనుక ఎవరి ప్రమోయం ఉందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు.ఏఎస్పీ సాయికృష్ణ, గుడివాడ డీఎస్పీ మహేష్, సీఐ తదితరులున్నారు. బంగారు నల్లపూసల దండ, ఐ–ఫోన్, ఐ–ప్యాడ్, టయోటా ఈటాస్ కారు, టీవీ. రూ.30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ముసలోళ్లకు పెళ్లేంటన్నారు..
అదే ఐదారేళ్ల క్రితం అరవై ఏళ్ల వయసులో ఓ మహిళ పెళ్లి చేసుకుంటోంది లేదా మరో వ్యక్తితో కలిసి ఉంటోంది.. అనే విషయం తెలిస్తే నగరం కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకునేవి. ‘ఈ వయసులో ఇదేం పని’.. అంటూ నలుగురి నోళ్లు తిట్టిపోసేవి. అయితే ఇప్పుడుపరిస్థితిలో మార్పు వచ్చింది. ఆశ్చర్యపోవడం తగ్గింది. ఎందుకంటే.. ప్రస్తుతం వృద్ధుల పెళ్లిళ్లు సిటీలో జరుగుతున్నాయి. దీనికి కారణం నిన్నటి దాకా ఒంటరిగా ఉన్న ‘రాజేశ్వరి’ కృషి. జీవితం మలిసంధ్యలో ఒంటిరి జీవితం ఎంత కష్టమో గుర్తెరిగిన ఆమె.. పెద్ద వయసు వారిని ఒక్కటి చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: ‘ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం పెరిగింది. ఇప్పుడు 60 దాటినా ఆరోగ్యంగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అనుకోకుండా హఠాత్తుగా జీవిత భాగస్వామి దూరమైతే మిగిలిన జీవితం అంతా ఒంటరిగా గడపాల్సిందేనా? విడాకులు లేదా ఇంకేదైనా కారణంతో తోడు లేకుండా మిగిలిపోతున్న వారికి తోడు కల్పించడం కోసమే మా ‘తోడు– నీడ’ కృషి చేస్తోంది’ అని చెప్పారు రాజేశ్వరి. పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాజేశ్వరి.. నగరంలో ఒంటరి వృద్ధులకు ‘తోడు’ వెతికిపెట్టే బాధ్యతలను కొన్నేళ్ల క్రితం స్వచ్ఛందంగా తలకెత్తుకున్నారు. అయితే తొలుత చాలా మంది ఆమెను వారించారు. ముసలోళ్లేమిటి? వారికి నువ్వు పెళ్లి చేయడం ఏమిటంటూ ఎగతాళి చేశారు. అయితే రాజేశ్వరి మాత్రం పట్టు వదల్లేదు. ‘వయసు మళ్లిన వారికే తోడు కావాలి. కాని దురదృష్టవశాత్తూ ఒంటరితనం ప్రాప్తించే అవకాశాలూ పెద్ద వయసులోనే ఎక్కువ’ అంటారామె. వృద్ధుల కోసం పెళ్లి చూపులు, గెట్ టు గెదర్ వంటి ఈవెంట్లు, వారికి నాణ్యమైన జీవనాన్ని అందించే కమ్యూనిటీ సెంటర్లు, వృద్ధుల కోసం పిక్నిక్లు నిర్వహిస్తూ.. సిటీలోని సీనియర్ సిటిజన్స్కు పలు విధాలుగా ఆసరా అందిస్తున్నారు. ‘వృద్ధాశ్రమాలు శేష జీవితం గడిపేందుకు ఎంచుకుంటాం. మనకు నచ్చింది తినడానికో, నచ్చినట్టు ఉండడానికో అక్కడ వీలుండదు. కమ్యూనిటీ లివింగ్ ప్లేస్ల ద్వారా అలాంటి కొరత తీరుతుంద’ని చెప్పారు రాజేశ్వరి. లివింగ్ టు గేదర్.. ‘వృద్ధాప్యంలోనే ఒంటరి తనపు సమస్య ఎక్కువ. రెక్కలొచ్చాక పిల్లలు వెళ్లిపోయి, జీవిత భాగస్వామి సైతం దూరమైతే.. ఏకాకిగా రోజులు వెళ్లబెట్టడం కన్నా నరకం మరొకటి లేదు’ అంటారామె. పెళ్లి కావచ్చు లేదా సహజీవనం కావచ్చు.. ఇద్దరు వృద్ధులు ఇష్టపడి కలిసి జీవించాలి అనుకుంటే వారికి తోడు నీడ అండగా ఉంటుంది. వృద్ధుల ఒంటరి తనపు సమస్యను పరిష్కరించే క్రమంలో సంస్థ ప్రారంభించిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దాదాపు 50కి పైగా ఒంటరి జీవితాలను జంటగా మలచామంటూ ఆనందంగా చెబుతారామె. అయితే ఈ క్రమంలో రాజేశ్వరి ఎదుర్కున్న ఒడిదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ‘పెద్దవాళ్లు పిల్లల పెళ్లిళ్లు తమ ఇష్ట్రపకారం జరగాలని ఆశిస్తారని, అలా జరగకపోతే వారిని అదుపు చేయాలని నానా విధాలుగా ప్రయత్నిస్తారని మనకు తెలుసు. కాని తమ ఒంటరి తల్లి/ లేదా తండ్రి మలి వయసులో ఓ తోడు కోసం ఆరాటపడడాన్ని జీర్ణించుకోలేని పిల్లల సంఖ్యాఎక్కువే. నిజానికి ప్రేమించుకున్న పిల్లల పెళ్లి్లకన్నా.. పెద్దల పెళ్లికే అడ్డంకులు ఎక్కువ’ అంటారామె. పిల్లలు ఏదైనా హాలిడే ట్రిప్కు వెళుతుంటే తమను తీసుకువెళితే బాగుణ్నని వృద్ధులు అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో తమంతట తామే సహ వయోజనులతో ట్రిప్స్కు ప్లాన్ చేసుకునేందుకు ఈ సంస్థ అండగా ఉంటోంది. ప్రతి మూడు నెలలకూ ఏదో ప్రాంతానికి టూర్స్ నిర్వహిస్తోంది. యువతకు మాత్రమే పరిమితం అని భావించే న్యూ ఇయర్ పార్టీల నుంచి వాలంటైన్స్డే వరకూ ఇందులో సభ్యులైన పెద్దలు సంబరంగా జరుపుకుంటున్నారు. ‘వృద్ధాప్యం అంటే కృష్ణా రామా అనుకుంటూ గడిపే దశ కాదు. దానికీ కలలూ కోరికలూ సరదాలూ అవసరమే. తమలాంటి పరిస్థితిలోనే ఉన్న మరికొందరితో కలిసి అవి నెరవేర్చుకునే చక్కటి వేదికే ఇది’ అంటున్న రాజేశ్వరి.. ఒంటరి వృద్ధులకు సంబంధించి ఆధునిక కాలంలోనూ పిల్లలు చాలా స్వార్ధంగా, సంకుచితంగా ఆలోచిస్తున్నారని, వారికి ఏ సరదా, ముచ్చటా అవసరం లేదని భావిస్తున్నారంటారు. వారి మలి జీవితం నిస్సారంగా గడచిపోయేందుకు తెలిసో తెలియకో దోహదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. వీలైనంత వరకూ ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యం అంటున్నారు. -
మరణంలోనూ వీడని అనుబంధం
గంగాధరనెల్లూరు : వృద్ధ దంపతులు వారు ...బతికినంతకాలం ఒకొరికొకరు అన్యోన్యంగా ఉన్నారు. చివరకు కూడా విడదీయరాని అనుబంధంతోనే మరణించారు. వృద్ధాప్యంలో తోడునీడగా ఉంటారని ఆశించిన కుమారుడు, కోడలు ఏడాదిన్నర కాలంలోనే ఒకరి తరువాత ఇంకొకరు మరణించడం వారిని కలచివేసింది. ఇక బతకడమెందుకనే నిర్ణయానికి వచ్చి బలవన్మరణానికి ఒడిగట్టారు. పురుగుల మందుతాగి తనువు చాలించారు. సోమవారం జరిగిన ఈ విషాదకర సంఘటనతో గంగాధరనెల్లూరు మండలంలోని బట్టుజంగనపల్లె కన్నీరుమున్నీరవుతోంది. ఆ గ్రామానికి చెందిన ఇరగమరెడ్డి అలియాస్ పెద్దబ్బరెడ్డి (92) ఆదెమ్మ 83) భార్యాభర్తలు. వీరికి అదే గ్రామంలో రెండెరాల పొలం మాత్రమే ఉంది. అయినా ఎంతో తెలివిగా ఎకరా పొలంలో జామతోట సాగుచేశారు. ఆ ఫలసాయంతోనే కుటుంబపోషణ జరుగుతుండేది. వీరి సంతానం ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. పెద్ద కుమారుడు జయరామరెడ్డి(61), కోడలు సరోజమ్మ (58) గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేవారు. అనారోగ్య కారణంతో ఆరు నెలల క్రితం జయరామరెడ్డి,, సంవత్సరం క్రితం సరోజమ్మ మృతిచెందారు. రెండో కుమారుడు భాస్కర్రెడ్డి (51) బెంగళూరులోని ఓ ప్రెవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఫ్యాక్టరీ మూసివేయడంతో ప్రస్తుతం చిన్నపాటి ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మనవడు (జయరామరెడ్డి కుమారుడు)మహేష్రెడ్డి గ్రామంలో ఉంటూ అవ్వ, తాత బాగోగులు చూసుకునేవాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితం మీద విరక్తి చెందిన ఇరగమరెడ్డి, ఆదెమ్మ పురుగుల మందు తాగారు. వాంతులు చేసుకుంటుండగా చుట్టుపక్కలవారు గమనించి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం రాత్రి ఇద్దరూ మృతి చెందారు. కుమారుడు, కోడలు మృతి చెందినప్పట్నుంచి దిగాలుగా ఉంటున్న వారిద్దరూ మృతిచెందడంతో జట్టుజంగనపల్లె శోకసంద్రమైంది. మంగళవారం ఆ వృద్ధజంజకు బంధువులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
కన్నీళ్లకే కన్నీరొచ్చే.. కష్టాలకే కష్టం వేసే..!
కోడూరు మండలం లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన నాగేసు, రజనీరాణి దంపతుల దుస్థితిని చూస్తే కన్నీళ్లకే కన్నీరొస్తుంది. కష్టాలకే కష్టం వేస్తుంది. ఆ దంపతులది 65 ఏళ్లు పైబడిన వయసు. మంచానికే పరిమితమైన కుమార్తె. కర్రసాయమైనా లేనిదే నిలబడలేని కుమారుడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. వృద్ధాప్యంలో బిడ్డలే లోకంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులను చూస్తే ఎవరైనా అయ్యోపాపం ఎంత కష్టం అంటూ జాలిపడతారు. ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లు మంజూరుచేసి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. అయితే ఆ పింఛన్లు ఇవ్వాల్సిన అధికారుల మనసు మాత్రం కఠినంగా మారింది. పింఛన్ డబ్బులు కావాలంటే మండలకేంద్రమైన కోడూరుకు రావాల్సిందేనంటూ భీష్మించారు. చేసేదేమీలేక ఆ వృద్ధదంపతులు పిల్లలిద్దరినీ చక్రాల కుర్చీలపై కూర్చోబెట్టి ఆరు కిలోమీటర్ల దూరం నెట్టుకెళ్లి, తిరిగా రావాల్సి వస్తోంది. కోడూరు(అవనిగడ్డ): మండలంలోని లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన 68 ఏళ్ల నాగేసు, 64 ఏళ్ల రజనీరాణి దంపతులు. వారికి 34ఏళ్ల కుమారుడు వెంకయ్య, 30 ఏళ్ల కుమార్తె ఆశాజ్వోతి ఉన్నారు. ఇద్దరికీ చిన్నప్పుడే పోలియో సోకడంతో ఆశాజ్వోతి మంచానికే పరిమితమైంది. బయటకు వెళ్లాలంటే ఎత్తుకుని తీసుకెళ్లాలి. వెంకయ్య కర్రసాయం లేనిదే లేచి నిలబడలేని పరిస్థితి. వారిద్దరికీ దివ్యాంగ పింఛన్ వస్తోంది. తండ్రి నాగేసు పొలాల్లో కాపలా ఉంటూ రైతులు ఇచ్చే ధాన్యంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆశాజ్యోతి చేతివేలి ముద్రలు సరిగా పడక పోవడంతో నాగేసు వేలిముద్రలను ఆమె పింఛన్కు లింకు చేశారు. కదలలేని పరిస్థితిలో ఉన్న ఆశాజ్యోతి, వెంకయ్యకు ఇంటికొచ్చి పింఛన్ ఇవ్వాల్సి ఉంది. మందపాకలలో ఉన్న బ్యాంకు కరస్పాండెంట్ వారికి పింఛన్ ఇస్తుంటారు. అయితే ఇంటికొచ్చి ఇవ్వకుండా, ప్రతినెలా మందపాకలకు రమ్మనడంతో కదలలేని కుమార్తె, నడవలేని కుమారుడిని వృద్ధ తల్లిదండ్రులు చక్రాల బండిలో రెండున్నర్ర కిలో మీటర్ల దూరం ఉన్న మందపాకలకు తీసుకెళ్తున్నారు. అక్కడా వేలిముద్రలు పడకపోతే మండల కేంద్రమైన కోడూరు ఎస్బీఐ బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. గత నెలలో ఇలాగే గ్రామం నుంచి మందపాకల, అక్కడ నుంచి కోడూరుకు ఐదున్నర్ర కిలోమీటర్లు దూరం చక్రాల బండిలో బ్యాంకు తీసుకెళ్లి వేలిముద్రలు వేసిన తరువాతనే అధికారులు పింఛన్ ఇచ్చారు. సోమవారం వీరిద్దరినీ మందపాకలకు తీసుకెళ్లగా, మళ్లీ కోడూరు వెళ్లాలని చెప్పడంతో వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. తమ పిల్లలను చక్రాల బండిలో తీసుకెళ్లాలంటే ప్రాణం పోతోందని వాపోతున్నారు. ఆశాజ్యోతి నోటి నుంచి సొంగపడుతుందంటూ ఆటో డ్రైవర్లు ఎక్కించుకోవడంలేదని చేసేదేమీలేక చక్రాల కుర్చీల్లో తీసుకెళ్లాల్సి వస్తోందని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటికొచ్చి వచ్చి పింఛన్ ఇచ్చేలా కనికరించండి సారూ అంటూ వారు వేడుకొంటున్నారు. దివ్యాం గులు ఆశాజ్యోతి, వెంకయ్య పింఛను కోసం వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ఎంపీడీఓ బి.వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. పింఛన్ కరస్పాండెంట్తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విజయవాడలో విషాదం
మాయదారి పక్షవాతం వృద్ధ దంపతుల బలవన్మరణానికి కారణమైంది. మంచానికి పరిమితమై నడిచే దారి కనబడక, అయినవారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక భార్యాభర్తలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన విజయవాడలో మంగళవారం జరిగింది. సాక్షి, విజయవాడ: నగరంలోని నక్కల రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు కొంతకాలంగా పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నారు. జబ్బు నయం కాదన్న మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భవానిపురం బ్యాంక్ సెంటర్ నివాసితులైన తుమ్మలపల్లి రామకృష్ణ, నాగసత్యరాణిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ లెటర్ రాశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీళ్లుపెట్టించిన సూసైడ్ నోట్ తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని తుమ్మలపల్లి రామకృష్ణ సూసైడ్ నోట్లో రాశారు. తన జేబులో ఉన్న 8 వేల రూపాయలతో దహన సంస్కారాలు జరిపించాలని అభ్యర్థించారు. -
హాయిగా జీవించాం.. ప్రశాంతంగా చనిపోనివ్వండి!
సాక్షి, ముంబయి: తాము ఇంతకాలం ఎంతో ఆనందంగా జీవించామని ఈ చివరిదశలో అనారోగ్యంతో మంచాన పడి, ఆస్పత్రుల చుట్టూ తిరగలేమని చావును ప్రసాదించాలని కోరుతున్నారు ముంబయికి చెందిన వృద్ధ దంపతులు. కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని తాము దాఖలు చేసిన పిల్పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సాధ్యమైనంత త్వరగా స్పందించాలని దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణ్ లావాటే (88), ఐరావతి లావాటే (78) దంపతులు దక్షిణ ముంబయి, గ్రాంట్ రోడ్డులోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన నారాయణ్ 1989లో రిటైర్ కాగా, ఓ ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసిన ఐరావతి 1997లో పదవీ విరమణ చేశారు. అప్పటినుంచీ స్థానిక గ్రాంట్ రోడ్డులోని తమ ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కానీ భవిష్యత్తులో ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన మొదలైందన్నారు నారాయణ్. ఒకరు లేకుండా మరొకరం బతకలేమని, అదే విధంగా మాలో ఏ ఒక్కరు అనారోగ్యంతో మంచాన పడి కష్టాలు పడుతున్నా చూడటం తమ వల్ల కాదని నారాయణ్ అన్నారు. యాక్టివ్ ఎథనేషియా ద్వారా తమ దంపతులకు కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్) అవకాశం ఇవ్వాలంటున్నారు. ప్రశాంతంగా బతికేందుకు ఎంత హక్కు ఉందో.. ఎలాంటి ఆంక్షలు లేకుండా చనిపోయేందుకు పౌరులకు అంతే హక్కు ఉండాలన్నారు. ఇప్పటికీ చాలా వృద్ధాప్యంలో ఉన్నామని, ప్రస్తుతం ఇక్కడ మెట్రో రైలు పనులు జరుగుతున్నందున బయటకు వెళ్లడానికి చాలా కష్టంగా ఉందన్నారు ఐరావతి. నా భర్తకు వచ్చే పెన్షన్ మాకు సరిపోతుంది కానీ, కష్టాలు, బాధలతో ప్రాణం వదలడం కంటే సుఖమయంగా లోకాన్ని విడిచిపోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియ సూలేలతో పాటుగా రామ్ జెఠ్మలానీ, రాజ్యసభ సభ్యుడు కరణ్ సింగ్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వీలకు కారుణ్య మరణానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆఫ్ బిల్ను పంపించినట్లు నారాయణ్ దంపతులు వివరించారు. ‘మా బంధువులకు చెబితే అలా చేయవద్దని చెప్పారు... ఎందుకంటే వారికి సంతానం ఉన్నారు, బాధ్యతలున్నాయి. మాకు అలాంటి ఏ సమస్యలు, బాధ్యతలు లేవని’ నారాయణ్ దంపతులు అంటున్నారు. కారణ్య మరణాలు అంటే?.. ఎలా చేస్తారు.. కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపుతున్న విషయం విదితమే. -
పోరాడి పట్టించారు
సాక్షి,సిటీబ్యూరో: బైక్పై వెళుతుండగా బంగారు మంగళసూత్రం లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్ను నిలువరించడమేగాక అతడిపై పిడిగుద్దులు కురిపించిన సీనియర్ సిటిజన్ దంపతులను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. సోమవారం మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ,, కుషాయిగూడ ఏసీపీ కష్ణామూర్తితో కలిసి వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన మనోజ్ స్వైన్ చిన్నప్పటి నుంచే చోరీలకు అలవాటు పట్టాడు గతంలో జ్యువనైల్ హోంకు వెళ్లి వచ్చాడు. ఉద్యోగం కోసం నగరంలోని చర్లపల్లికి వచ్చి క్యాటరింగ్ బాయ్గా పనిచేస్తున్న అతడికి అదే ప్రాంతంలో ఉంటూ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన అనిల్, హకీంలతో పరిచయం ఏర్పడింది. విలాసవంతమైన జీవనం గడిపేందుకు స్నాచింగ్లు, చోరీలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి దేశవాళీ తుపాకీ, తూటాలు, కత్తిని కొనుగోలు చేశారు. గత జూన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ నుంచి ఓ బైక్ను దొంగతనం చేసి దానిపై తిరుగుతూ కుషాయిగూడలో రెండు, కీసరలో నాలుగు, లాలాగూడలో ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. చిరునామాలు అడుగుతూ మహిళ మెడల్లోంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవారు. అనిల్, హకీం ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోవడంతో ఈనెల 17న మనోజ్ కొండాపూర్ నుంచి యామ్నాపేటకు బైక్పై వెళుతున్న వృద్ధ దంపతులు దర్శన్, బాలంగిణిలను గుర్తించాడు. కరీమాగూడ సమీపంలో వారి స్కూటర్ను ఢీకొట్టాడు. కిందపడిపోయి న దర్శన్ మెడపై తుపాకీ కవర్తో దాడి చేసి, బాలంగిణి మెడ లోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో తేరుకున్న దర్శన్ దొంగపై రాళ్లతో దాడి చేయడంతో అతను బైక్, చెప్పులు అక్కడే వదిలి పొలాల్లోకి పారిపోయాడు. కీసర పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి చర్లపల్లిలోని బీఎం రెడ్డి కాలనీలో ఉంటున్న మనోజ్ను ఆదివారం అదుపులోకి తీసు కుని 6.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూ ర్లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో తనఖా పెట్టిన మూడు తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ పదునైన కత్తితో దాడిచేయడంతో పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసుకు స్వల్పగాయాలయ్యాయి. దొంగను నిలువరించిన వృద్ధ దంపతులను గుడ్ సిటిజన్ రివార్డుతో, దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు ప్రోత్సహకాలు అందజేశారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
జెన్నారం(మంచిర్యాల): వృద్ధ దంపతులకు కొడుకు మాటలు కంఠ విషంగా మారాయి. కొడుకు మాటలు మింగుట పడని ఆదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో తలెత్తిన వివాదాల్లో కొడుకుతో మనస్పర్థలు రావడంతో.. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగమంత కుటుంబం... ఏకాకి జీవితం...!
-
వృద్ధ దంపతుల అన్యోన్యత వైరల్
అమెరికాకు చెందిన వృద్ధ దంపతుల మధ్య అన్యోన్యత రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ విషయమే వారిని సోషల్ మీడియాలో హైలైట్ చేసింది. పైగా వృద్ధాప్యం దరిచేరినా.. కొత్త దంపతుల మాదిరిగా నేటికీ తమ ఆహార్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఫ్లోరిడాకు చెందిన ఫ్రాన్(74), ఎడ్ గార్గిలా(76)కు 52 ఏళ్ల కిందట వివాహమైంది. భార్యాభర్తలు కలిసి ఉండే రోజులు పెరిగేకొద్ది వాళ్ల మధ్య ప్రేమ మరింత చిగురిస్తుందని ఎన్నో అధ్యాయనాల్లో వెల్లడైంది. ఈ అమెరికన్ వృద్ధ దంపతులు మాత్రం మరో అడుగు ముందుకేశారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత స్క్వేర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఇక అప్పటినుంచి ఇద్దరూ ఒకే రంగు దుస్తువులు ధరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వాళ్ల మనవడు ఆంథోనీ గార్గిలా ట్వీట్ చేశాడు. మా గ్రాండ్ పేరేంట్స్ ను చూడండీ.. వివాహం అయిన 52 ఏళ్ల తర్వాత కూడా వాళ్లు ఒకే కలర్ డ్రెస్సులు, మ్యాచింగ్ ఆహార్యంతో ఉంటున్నారని తెలిపాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ దంపతులు హైలైట్ అయ్యారు. ఈ విషయాన్ని వారికి ఎలా చెబితే అర్థమవుతోందో తనకు తెలియడం లేదని ఆంథోనీ మరో ట్వీట్ చేశాడు. my grandparents have been married for 52 years and they match outfits every day. pic.twitter.com/79nCaNuTuD — Anthony Gargiula (@AnthonyGargiula) 30 August 2016 "So I don't really know how to tell you this, but you've gone viral." pic.twitter.com/B7kLsBcY21 — Anthony Gargiula (@AnthonyGargiula) 30 August 2016 -
కుమార్తె తిట్టిందని తల్లిదండ్రులు ఆత్మహత్య?
విషయాన్ని కప్పిపుచ్చేందుకు తెలుగు మహిళ యత్నం కాకినాడ రూరల్ : కూతురు తమను చీటికీ మాటికీ తిడుతుండడం, ఒక్కోసారి చేయి చేసుకుంటుండడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన తెలుగు మహిళ నాయకురాలు కావడంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం.తూర్పు గోదావరి జిల్లా కాకినాడ– సామర్లకోట రోడ్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తన తల్లిదండ్రులను బుధవారం ఉదయం మందలించి, చేయి చేసుకోవడంతో వారు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి, ఆత్మహత్య కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై టూ టౌన్ పోలీసులను వివరాలు కోరగా తమకు ఆత్మహత్యపై ఎటువంటి సమాచారం లేదని, ఆసుపత్రి నుంచి ఎంఎల్సీ వస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
రుణ మాఫీ చేయిస్తామంటూ..
వృద్ధ దంపతులకు మాయమాటలతో వల నగదుతో ఉడాయించిన అగంతకులు నరసరావుపేట టౌన్: రుణమాఫీ నగదు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఓ ప్రబుద్ధుడు వృద్ధ దంపతులకు టోకరా వేసి నగదుతో ఉడాయించిన ఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. యద్దనపూడి మండలం అనంతారం గ్రామానికి చెందిన రావి వెంకటాద్రికి మెడ భాగంలో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకొనేందుకు శనివారం ప్రకాష్ నగర్ ఓవర్బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న ఓ ప్రై వేటు వైద్యశాలకు భార్య వెంకాయమ్మతో కలసి వచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు వచ్చి అనంతారం గ్రామానికి చెందిన కొంతమందికి రుణమాఫీ నగదు వచ్చాయని తనతోపాటు బ్యాంక్ వద్దకు వస్తే నగదు ఇప్పిస్తానని న మ్మబలికాడు. గ్రామంలోని కొంతమంది పేర్లు చెప్పడంతో నిజమేనని నమ్మిన ఆ దంపతులు అతని వెంట బ్యాంక్కు వెళ్ళేందుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో పాత కన్యల హాస్పటల్ వద్దకు వెళ్ళే సరికి దరఖాస్తు ఫారాలు, స్టాంప్లు కొనుగోలు చేసి తీసుకొస్తాను.. అప్పటి వరకు అక్కడే ఉండమని చెప్పి వారి వద్ద రూ.1,650 నగదు తీసుకొని ఉడాయించాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో దారిన వచ్చేపోయే వారిని నిలిపి ఆ యువకుడి కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు మోసపోయామని గ్రహించారు. వెంట తెచ్చుకొన్న సొమ్ము మొత్తం ఇవ్వడంతో స్వగ్రామం వెళ్ళేందుకు చార్జీకి డబ్బులు లేక లబోదిబోమంటూ రోదించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రామిశెట్టి కొండ విషయం తెలుసుకొని వృద్ధ దంపతులకు తన వంతు సాయంగా రూ. వెయ్యి ఇచ్చి స్వగ్రామం వెళ్ళేందుకు సహకరించారు. -
మరణంలోనూ వీడని బంధం..
కరీంనగర్ : మూడుముళ్లు... ఏడుడగుల బంధంతో ఏకమైన దంపతులు కడదాకా కలిసే పయనించారు. అనారోగ్యంతో మంచం పట్టిన భర్త.. గుండెపోటుతో చికిత్స పొందుతున్న భార్య.. ఇద్దరూ కొన్ని గంటల తేడాలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన గండ్ర గోవిందరావు(95), సత్తమ్మ (85) దంపతులు. గోవిందరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తకు సేవచేస్తూ అతనికి తోడుగా ఉన్న సత్తమ్మ వారంరోజుల క్రితం గుండెపోటుకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. ఈక్రమంలో గోవిందరావు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మరణించిన కొద్ది గంటల్లో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న సత్తమ్మ కూడా కన్నుమూశారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకేరోజు మృతిచెందడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సత్తమ్మ మృతదేహాన్ని కోరుట్లపేటకు తీసుకువచ్చి దంపతులిద్దరినీ ఒకే చితిపైన ఉంచి అంత్యక్రియలు జరిపారు. -
నా అనే వారు లేక నానా అవస్ధలు
-
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
-
వృద్ధ దంపతుల పై అమానుష దాడి
-
దోపిడీ.. వృద్ధ దంపతుల హత్య
నాగులుప్పలపాడు(ప్రకాశం): నగదు, నగల కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఊటుకూరి సూర్యనారాయణ (68), ఆయన భార్య విజయలక్ష్మి (60) గ్రామంలోనే కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకున్న దంపతులు ఇంటికి ముందుభాగంలో ఉన్న తలుపునకు గడియపెట్టి నిద్రపోయారు. అనంతరం ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నాగులుప్పలపాడు ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.15 వేలు సూర్యనారాయణరావు డ్రా చేశాడు. బ్యాంకు నుంచి లక్షల్లో డ్రా చేసి ఉంటాడన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి దుండగులు పాల్పడి ఉంటారేమోనని పోలీసులు భావిస్తున్నారు. -
'ప్రియా నిను చూడలేక...'
న్యూయార్క్: వయస్సు మీద పడుతున్నాకొద్దీ దంపతుల మధ్య ప్రేమ క్షీణిస్తూ వస్తోందని మనమంతా భావిస్తాం. అది ఒట్టి భ్రమేనని, తుది శ్వాస వీడే వరకు అది వెన్నంటే ఉంటుందని ఈ బామ్మ, తాతయ్యలు నిరూపిస్తున్నారు. అమెరికాకు చెందిన 93 ఏళ్ల లారా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. తుది శ్వాస ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఆమె మంచానికి అతుక్కుపోయి ఉంది. 92 ఏళ్ల భర్త హోవర్డ్ ఓ రోజు భార్య మంచం వద్దకు వచ్చి అనునయంగా ఆమె చెంప నిమిరాడు. కళ్లలోకి కళ్లు పెట్టి ఆప్యాయంగా చూశాడు. గత యాభై ఏళ్లుగా తాము యుగళగీతంగా పాడుకుంటున్న రోజ్మేరీ క్లూనీ (హాలివుడ్ నటి, ప్రముఖ కేబరే సింగర్) 1940లో పాడిన ప్రసిద్ధ పాట ‘యూ విల్ నెవర్ నో’ పాటందుకున్నాడు హోవర్డ్. నీడను, వెలుతురును మాత్రమే చూడగలిగిన లారా తదేకంగా భర్తవైపే చూస్తూ గళంలో గళం కలిపేందుకు ప్రయత్నించింది. ‘యు విల్ నెవర్ నో హౌ మచ్ ఐ లవ్ యూ’ అని భర్త పాడుతుంటే ‘ఏ మిలియన్ టైమ్స్ ఆర్ మోర్’ అంటూ అస్పష్టంగా భార్య గొంతు కలిపింది. పాట అనంతరం హోవర్డ్ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ భార్య పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. ‘థాంక్యూ’ అంటూ లారా భర్తను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘ఆల్ వేస్ ఈ లవ్స్ మీ’ అంటూ మంచానికి సమీపంలోవున్న మనవరాలు ఎరిన్ సొలారీని ఉద్దేశించి బామ్మ మాట్లాడింది. ఈ మొత్తం దృశ్యాన్ని ఎరిన్ సొలారీ తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీసి తన ‘ఫేస్బుక్’ పేజీలో పోస్ట్ చేసింది. నేటికి ఈ వీడియో దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. తమ బామ్మ, తాత ఎంతోమందికి ఆదర్శంగా జీవించారని, పెళ్లినాటి ప్రమాణాలను వారు ఎప్పుడూ విస్మరించలేదని ఎరిన్ తెలిపారు. తమ ప్రతి కుటుంబ పార్టీలో వారిద్దరు ‘యు విల్ నెవర్ నో’ పాటను యుగళగీతంగా పాడుతూ వచ్చారని ఆమె చెప్పారు. కాస్త కోలుకోవడంతో బామ్మను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చామని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందని ఎరిన్ ఫేస్బుక్ ద్వారా తెలిపారు. -
చూశారంటే ప్రేమలో పడతారు!
న్యూయార్క్: నేటి రోజుల్లో చాలామంది నిజమైన ప్రేమ లేదనే అంటుంటారు. అంతా అవసరాలు, సౌకర్యాలకోసం ఏర్పాటుచేసుకునే బంధాలే తప్ప బాధ్యతలు, భావోద్వేగాలు వాటిల్లో లేవని అంటుంటారు. కానీ, న్యూయార్క్లో మాత్రం ఓ వృద్ధ జంటను చూస్తే నిజంగా ప్రేమంటే ఇదేరా అనుకోకతప్పదేమో.. అది న్యూయార్క్లోని ఓ విమానాశ్రయప్రాంగణం. అందరూ తమతమవారికోసం ఎదురుచూస్తున్నారు. చేతిలో సెల్ఫోన్ అందులోనే ముఖాలు. కానీ, ఓ పెద్దాయన మాత్రం హుందాగా తయారై చేతిలో పూలబొకే పట్టుకుని ఎంతో ఆత్రంగా ఓపికతో ఏమాత్రం అసహనం లేకుండా ఎయిర్ పోర్ట్ ప్రవేశ ద్వారం వైపు చూస్తున్నాడు. ఇంతలో ఓ సిల్వర్ రంగు జుట్టున్న పెద్దావిడ బయటకు వచ్చింది. ఆయన ముఖంలో చిరునవ్వులు.. ఆమె ముఖంలో చిరునవ్వులు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ ఆయనను చేరి ఒక్కసారిగా హత్తుకుపోయింది. గాఢంగా ముద్దుపెట్టుకొంది. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారంతా వారిని చూసి ఓ క్షణంపాటు కదలకుండా ఉండిపోయి వారిని చూస్తూ నిండైన ప్రేమలో మునిగిపోయారు. ఈ వీడియోను క్రిస్ జీక్యూ పెర్రీ అనే సంగీత దర్శకుడు యూట్యూబ్లో మంగళవారం పెట్టగా ఇప్పటికే దాదాపు 22 మిలియన్ల మంది వీక్షించారు. -
పింఛన్ కోసం పోరాడుతూ వృద్ధుడి మృతి
గుంతకల్లు: పింఛన్ల జాబితా నుంచి తమ పేరు తొలిగింపునకు గురైందన్న ఆవేదనలో మూడురోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధ దంపతుల్లో భర్త ఆదివారం మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శ్రీనివాసులు దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ ఆధారంతోనే జీవిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే పింఛన్లలో భారీ కొతలు విధించిన సంగతి తెలిసిందే. అలా పింఛన్ల జాబితాలో తమ పేర్లు తొలిగింపునకు గురవ్వడంతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు దంపతులు శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి తీవ్రత దృష్ట్యా వారిని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, చికిత్స పొందుతూ శ్రీనివాసులు ఈ రోజు ఉదయం మృతిచెందాడు. అతని భార్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కర్నూలు ఆసుపత్రికి చేరుకున్న గుంతకల్లు పోలీసులు.. వివరాలను సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
అప్పు కట్టకుండా.. దంపతులను హత్య చేశాడు
-
కానిస్టేబుళ్ల దౌర్జన్యకాండ
-
వృద్ధ దంపతుల దారుణహత్య
కృష్ణా : కృష్ణా జిల్లా మోవ్వ మండలం భట్లపెనుమర్రు లో వృద్ధ దంపతులను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. వివరాలు..స్థానిక గ్రామానికి చెందిన దంపతులు చలసాని వీరభద్రరావు(72), వెంకటరత్నం(63) విజయవాడలో జరిగిన వారి మనవడి వివాహానికి హజరై శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు వెంకటరత్నం తలపై కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాకుండా వీరభద్రారావును చంపి , నగ్నంగా వేరొక గదిలో పడేశారు. ఆయన మృతదేహం నగ్నంగా పడి ఉండటం, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దంపతుల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. (మోవ్వ) -
వృద్ధ దంపతుల హత్య
వరంగల్ : ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను గుర్తుతె లియని దుండ గులు హత్యచేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కే.సముద్రంలో జరిగింది. ఉప్పరపల్లి రోడ్డు సమీపంలో నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెంకటరామయ్య(68) ఇంట్లొ ఈ దారుణం జరిగింది. శుక్రవారం భార్య సరస్వతి రెండేళ్లబాబుతో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు బలమైన ఆయుధాలతో మెడ నరికి అతికిరాతకంగా ఇద్దర్ని చంపేశారు. శనివారం ఉదయం బాబు ఏడుస్తున్న శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి తలుపు తీయడంతో ఈ విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులలుఏ కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. (కే.సముద్రం) -
కేసముద్రంలో వృద్ధ దంపతుల హత్య
వరంగల్: వృద్ధ దంపతులు హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఆస్తి కోసం మొదటి భార్య కుమారుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
వృద్ధదంపతుల ఆత్మహత్యాయత్నం, భార్య మృతి
హైదరాబాద్: నగరంలో ఓ విషాదం చోటుచేసుకుంది. రామంతాపూర్ వివేక్నగర్ కాలనీలో వృద్ధదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. భర్తను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు
ఖమ్మం: జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నేలకొండపల్లి సీఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలిద్దరూ తమను చిత్రహింసలు పెడుతున్నారంటూ వారు వాపోతున్నారు. ఎస్ఐ, సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ దంపతులిద్దరూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. -
దంపతులను బంధించి చోరి
-
వృద్ధ దంపతుల దారుణహత్య: బంగారం చోరీ
మహబూబ్నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో కొందరు దుండగులు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. వారి వద్ద నుంచి అయిదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఏటీఎంలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఎవరి వద్ద పెద్దగా డబ్బు ఉండటంలేదు. ఎంత అవసరమో అంతే దగ్గర ఉంచుకుంటున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల వద్దకు వెళ్లి తమకు కావలసిన డబ్బు తెచ్చుకుంటున్నారు. దాంతో బంగారం ఒక్కటే దొంగలకు దోచుకోవడానికి అనువైనదిగా కనిపిస్తోంది. బంగారం కోసం దుండగులు దేనికైనా తెగిస్తున్నారు. హత్యలకు తెగబడుతున్నారు. -
గోడ కూలి వృద్ధదంపతులు మృతి