దోపిడీ.. వృద్ధ దంపతుల హత్య | Old couple murdered, robbered | Sakshi
Sakshi News home page

దోపిడీ.. వృద్ధ దంపతుల హత్య

Published Thu, Oct 8 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

నగదు, నగల కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.

నాగులుప్పలపాడు(ప్రకాశం): నగదు, నగల కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఊటుకూరి సూర్యనారాయణ (68), ఆయన భార్య విజయలక్ష్మి (60) గ్రామంలోనే కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకున్న దంపతులు ఇంటికి ముందుభాగంలో ఉన్న తలుపునకు గడియపెట్టి నిద్రపోయారు. అనంతరం ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నాగులుప్పలపాడు ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.15 వేలు సూర్యనారాయణరావు డ్రా చేశాడు. బ్యాంకు నుంచి లక్షల్లో డ్రా చేసి ఉంటాడన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి దుండగులు పాల్పడి ఉంటారేమోనని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement