వరంగల్: భద్రాచలంలోని రాములవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామ శివారులో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన బంగారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి కారులో భద్రాచలం బయలుదేరారు. ఈ క్రమంలో మంగపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి చుంచుపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే.... కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పుష్పమ్మ(68) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు
Published Sun, Jan 24 2016 4:20 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement