నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక | President pranab mukherjee to visit hyderabad today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక

Published Mon, Jun 29 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక

నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక

స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.
 
 ఏటా రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి ‘రెసిడెన్సీ హౌస్’లో విడిది చేయడం ఆనవాయితీ. ఆయన సోమవారం నుంచి జూలై 8 వరకు బసచేయనున్నారు. జూలై 1న రాష్ట్రపతి తిరుపతికి వెళ్లనున్నారు. 3న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు రచిం చిన ‘ఉనికి’ పుస్తకం తొలి ప్రతిని ప్రణబ్ స్వీకరించనున్నారు. జూలై 6న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద నక్షత్ర వాటికను ఆయన ప్రారంభించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement