వేములవాడ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ దర్శించుకున్నారు. ఆయన ఆదివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. కాగా ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.