జానారెడ్డిని పరామర్శించిన రేవంత్‌ | Revanth visits Yasodha hospital to console Jana reddy | Sakshi
Sakshi News home page

జానారెడ్డిని పరామర్శించిన రేవంత్‌

Published Tue, Nov 21 2017 1:38 PM | Last Updated on Tue, Nov 21 2017 1:38 PM

Revanth visits Yasodha hospital to console Jana reddy

సాక్షి, హైదరాబాద్‌ : ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని మంగళవారం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా  జానారెడ్డి ప్రస్తుతం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన ...అక్కడే అస్వస్థతకు గురి కావడంతో ...హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి జానారెడ్డి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కోలుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement